AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరె ఏందిరా ఇది.. అది బైకా.. బస్సా..!

అరె ఏందిరా ఇది.. అది బైకా.. బస్సా..!

Samatha J
|

Updated on: Apr 05, 2026 | 5:22 PM

Share

సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయని తెలిసినా కొందరు యువకులు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. తాజాగా, ఒకే బైక్‌పై ఐదుగురు వ్యక్తులు అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణించిన ఘటనలో సైఫాబాద్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

గత నెల మార్చి 29 అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుండి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న ఒక నలుపు రంగు పల్సర్ బైక్ పై ఐదుగురు వ్యక్తులు ప్రయాణించారు. హెల్మెట్ లేకుండా, బైక్ సామర్థ్యానికి మించి ఐదుగురు కూర్చుని వాహనాన్ని నడపడమే కాకుండా, రోడ్డుపై ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దృశ్యాలను ఇతర వాహనాలపై అటుగా వెళ్తున్నవారు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం :

నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ

రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?

హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు

గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం

Published on: Apr 05, 2026 05:22 PM
Follow Us