శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని దర్గాపేట్ ఉప్పర్ బజార్లో రోడ్డు పనుల జాప్యంపై సయ్యద్ నవాజ్ బాషా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పది రోజులుగా రోడ్డు తవ్వి వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరి అనారోగ్య సమస్యలు వస్తుండటంతో, అధికారుల దృష్టిని ఆకర్షించడానికి ఆయన రోడ్డు పైనే గుండు గీయించుకున్నారు. పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.