చరిత్ర సృష్టించిన విరాట్.. వన్డేల్లో సరికొత్త రికార్డ్
25 October 2025
Anand T
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు.
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసి శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశారు.
ఈ మ్యాచ్తో వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఈ ఘనత సాధించడం ద్వారా కోహ్లీ తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ తర్వాత నిలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
452 ఇన్నింగ్స్లలో 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ ,
404 వన్డేల్లో 14,234 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్న సంగక్కర, తాజా రికార్డుతో 293వ వన్డేల్లో 14,255 పరుగులు చేసిన రెండో ప్లేస్కు చేరిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో మ్యాచ్లో 74 పరుగులు చేసి, భారత్కు 9 వికెట్ల విజయాన్ని అందించిన కోహ్లీ
వన్డేల్లో ఇప్పటవరకు 51 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్