కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే

19 October 2025

Pic credit - Instagram

5 ఏప్రిల్ 1996న కర్ణాటక రాష్ట్రంలోని విరాజ్‌పేటలో కొడవ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రష్మిక మందన్న.

ఈమె తండ్రి పేరు సుమన్, తల్లి పేరు మదన్ రష్మిక. కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.

బెంగుళూరులోని M.S.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది.

2016లో కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం కిరిక్ పార్టీతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

2018లో నాగ శౌర్య చలోతో హీరోయిన్‎గా తెలుగు తెరకు పరిచయం అయింది.అదే ఏడాది విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందంలో నటించింది. రెండూ మంచి హిట్స్ అందుకున్నాయి.

2020లో మహేష్ సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ చిత్రాల్లోకథానాయకిగా మరో రెండు హిట్స్ అందుకుంది ఈ భామ.

2025లో రష్మిక సల్మాన్ ఖాన్‌తో 'సికిందర్', విక్కీ కౌశల్‌తో 'ఛావా', ధనుష్‌తో 'కుబేర' వంటి భారీ పాన్-ఇండియా సినిమాలు చేసి మెప్పించింది.