హిట్ కాంబో రిపీట్… మరోసారి ఆ దర్శకుడితో నిహారిక కొణిదెల సినిమా
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక నాగబాబు కూతురు నిహారిక కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికాకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే నిహారిక మెల్లగా హీరోయిన్ గా అడుగులేసింది.

గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై భారీ హిట్ సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో మరోసారి రిపీట్ కానుందా! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆడియెన్స్కు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ యదు వంశీ మరోసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెలతో కలిసి మరో సినిమాను రూపొందించటానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ సినిమాతో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. థియేటర్స్లో మూవీ కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. రూ.9 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్గా రూ.18.5 కోట్లు వసూళ్లను రాబడితే, నాన్ థియేట్రికల్గా రూ.6 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తంగా సినిమా రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడదే కాంబోరిపీట్ కావటం సినీ ఇండస్ట్రీలోని ఆసక్తిని కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి : Ramyakrishna: ఇలా ఎలా తల్లి..! రమ్యకృష్ణ నటనకు దండం పెట్టాల్సిందే..
ఇక సినిమా అవార్డుల రేసులో సత్తా చాటింది. సైమా 2025లోబెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సందీప్ సరోజ్కి సైమా అవార్డు వచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెల్చుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అలాగే డైరెక్టర్ యదు వంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్గా అవార్డును సొంతం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్తో డేటింగ్ చేస్తా..! సంచలన కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.లపై అవార్డుల్ని కొల్లగొట్టేస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీకి మంచి గుర్తింపు లభించింది.
ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఓ స్టార్ హీరోకి కాబోయే భార్య.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








