నందిగ్రామ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2021

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా చర్చజరుగుతున్న సీటు తూర్పు మెదినిపూర్ జిల్లాలోని నందిగ్రామ్ సీటు. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టిఎంసి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సుబేందు అధికారి పోటీలో ఉన్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీతో చాలా సన్నిహితంగా మెలుగుతూ.. కీలకంగా వ్యవహరించిన సుబేందు అధికారి.. మమతాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తుండం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికారి నందిగ్రామ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1969కి ముందు, నందిగ్రామ్ నార్త్, నందిగ్రామ్ సౌత్ రెండు నియోజకవర్గాలుగా ఉండేవి. అయితే 1969లో డీలిమిటేషన్ తరువాత వీటిని నందిగ్రామ్ సీటుగా మార్చారు. 69 విభజన తరువాత ఈ స్థానంలో సీపీఐ ఐదుసార్లు, సీపీఎం రెండుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు, జనతా పార్టీ ఒకసారి, టీఎంసీ మూడుసార్లు గెలిచింది. 2019 ఓటరు జాబితా ప్రకారం.. ఇక్కడ సుమారు 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ న్నికల 2016 ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • టీఎంసీ అధికారి నీలంజన్1,34,62367%
  • సీపీఐ అబ్దుల్ కబీర్ సేఖ్53,39326%
  • బీజేపీ బీజన్ కుమార్ దాస్10,7135%
  • ఎస్‌యూసీఐసీ బప్పాదిత్య నాయక్8280%
  • బీహెచ్ ఎన్ పీ రామ్ మోహన్ మైటీ7170%
  • అసెంబ్లీ సీటునందిగ్రామ్‌
  • మొత్తం ఓట్లు2,01,552
  • నోటా1,278
  • వ్యత్యాసం81,230

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021 - అభ్యర్థులు

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021 - సీట్లు