కూచ్బిహార్ నార్త్.. కూచ్ బిహార్ జిల్లా పరిధిలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఎఐఎఫ్బి) ఆక్రమించింది. ఈ నియోజకవర్గంలో గత మూడు పర్యాయల నుంచి ఏఐఎఫ్బీ జెండా ఎగురవేస్తుంది. ప్రస్తుతం నాగేంద్ర నాథ్ రాయ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఆయన్ను రెండోసారి గెలిపించారు. నాగేంద్ర రాయ్ సుమారు 12,000 ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థి పరిమల్ బా ను ఓడించారు. బిజెపికి చెందిన సుకుమార్ రాయ్ 30 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలించారు. ఈ సీటులో టీఎంసీ విజయం సాధించలేదు. కూచ్ బిహార్ పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. దీంతోపాటు ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలు కూడా ఉన్నాయి.