కోల్కతా మేయర్, పశ్చిమ బెంగాల్ హోంమంత్రిగా పనిచేసిన సుబ్రతా బెనర్జీని టీఎంసీ బలిగంజ్ స్థానం నుంచి పోటీలో దింపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన సుబ్రతా బెనర్జీ 1999లో మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసిలో చేరారు. 2000 నుంచి 2005 వరకు కోల్కతా మేయర్గా పనిచేసిన సుబ్రతా బెనర్జీ.. సిద్ధార్థ్ శంకర్ రే కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం మమతా ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్రతా బెనర్జీ 2011 నుంచి బలిగంజ్లో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరిన సుబ్రతా ముఖర్జీ... 2005లో మమతా బెనర్జీతో విభేదాల కారణంగా.. టీఎంసీని వీడి కాంగ్రెస్లో చేరారు. మళ్లీ ఐదేళ్ల తరువాత టీఎంసీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.