రాఖీ పండగ
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పండగగా జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రాఖీ పండగ. కొని ఏళ్ల క్రితం వరకూ రాఖీ పండగను ఉత్తరాదివారే ఎక్కువగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ ను జరుపుకుంటున్నారు. అమ్మలోని మొదటి అక్షరం అ ని.. నాన్నలోని రెండో అక్షరం న్న ని కలిపి దేవుడి ఇచ్చిన బంధమే అన్న… అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని బాధ్యతను తీసుకునే అన్న జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సోదరమణి మణికట్టుకు కట్టే రక్ష. సోదరసోదరీమణులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రాఖీ పండగ ఈ ఏడాది ఆగస్తు 9 వ తేదీన జరుపుకోనున్నారు. ఇప్పటికే మార్కెట్ లో రకరకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. సోదరీ జీవితానికి ఎప్పుడూ రక్షగా ఉంటాను అని మాట ఇచ్చే రక్షా బంధన్ ను.. ఎప్పుడూ నీ రక్షణలో సోదరుడికి మాట రానీయక నడుస్తాను సోదరి మాట ఇచ్చే రోజు ఈ రక్షాబంధన్ జరుపుకోవడానికి కుల మతాలకు అతీతంగా సోదర సోదరీమణులు రెడీ అవుతున్నారు.
ఇంకా చదవండిసోదరులను మరిచిపోలేక.. విగ్రహాలకు రాఖీలు కట్టిన సోదరీమణులు
రక్షాబంధన్ వేళ ఆదిలాబాద్లో హృదయాలను కదిలించే ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన ఆకాశ్, సంజీవ్ విగ్రహాలకు వారి సోదరీమణులు కన్నీటితో రాఖీలు కట్టి నివాళులర్పించారు. సోదరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- Naresh Gollana
- Updated on: Aug 28, 2026
- 7:32 pm
Viral Video: ఫ్లైట్లో ప్యాసింజర్కు రాఖీ కట్టిన ఎయిర్ హోస్టెస్.. రియాక్షన్స్ మామూలుగా లేవుగా!
రక్షాబంధన్ పండుగను ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఓ విమానంలో జరిగిన రాఖీ వేడుక సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది. Air India విమానంలో క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుడికి రాఖీ కట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
- Balaraju Goud
- Updated on: Aug 28, 2026
- 2:19 pm
దేశవ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్.. చిన్నారులతో రాఖీ కట్టించుకున్న ప్రధాని మోదీ
తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలోని పాఠశాలల చిన్నారులు ప్రధానికి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించి, దేశ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Aug 28, 2026
- 2:23 pm
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అన్నదమ్ములు మీకుంటే అదృష్టమే..!
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ప్రేమ, ఆప్యాయతతో పాటు సోదరులు తమ సోదరీమణుల భద్రత, సంతోషం కోసం ఎప్పుడూ అండగా నిలుస్తుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన అన్నదమ్ములు తమ సోదరీమణుల పట్ల మరింత ప్రేమ, శ్రద్ధ, రక్షణ భావాన్ని కలిగి ఉంటారని నమ్మకం. ఈ మూలాంకాలకు చెందిన సోదరులు జీవితాంతం తమ సోదరీమణులకు రక్షణగా నిలుస్తారని సంఖ్యాశాస్త్ర విశ్వాసాలు చెబుతున్నాయి.
- Janardhan Veluru
- Updated on: Aug 28, 2026
- 1:09 pm
సోదరుడు ఇచ్చిన రాఖీ గిఫ్ట్పై ట్యాక్స్ కట్టాల్సిందేనా..? Income Tax రూల్స్ ఇవే!
రాఖీ బహుమతులపై ఆదాయపు పన్ను నిబంధనలు క్లుప్తంగా: సొంత సోదరులు ఇచ్చే ఏ విలువైన బహుమతిపై అయినా పన్ను ఉండదు. కానీ కజిన్స్ లేదా బంధువులు కాని వారి నుంచి రూ.50,000 మించితే పన్ను వర్తించవచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు బహుమతులు స్వీకరించడానికి బ్యాంకింగ్ మార్గాలు తప్పనిసరి. బహుమతిగా వచ్చిన డబ్బు ద్వారా వచ్చే ఆదాయం (వడ్డీ వంటివి) పన్ను పరిధిలోకి వస్తాయి.
- Balaraju Goud
- Updated on: Aug 28, 2026
- 12:22 pm
రాఖీ కడుతున్నప్పుడు అది తెగిపోవడం అశుభమా?
ఆగస్టు 28 శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే ప్రతి సోదరీ తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అయితే కొన్ని సార్లు అనుకోకుండా రాఖీ కట్టే సమయంలో అది తెగిపోతుంది. మరి ఇలా రాఖీ తెగిపోవడం అశుభమా? దీని గురించి అసలు పండితులు ఏం చెబుతున్నారో చూసేద్దాం.
- Samatha J
- Updated on: Aug 28, 2026
- 10:40 am
రక్షాబంధన్ ఏఐ ప్రాంప్ట్స్.. మీ సాధారణ సెల్ఫీని ఇలా అందంగా మార్చేయండి
రక్షా బంధన్ అంటే అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీక. అందుకే, ఈరోజు ప్రతి సోదరుడూ తన సోదరీతో ఒక అందమైన జ్ఞాపకం ఏర్పుచుకుంటాడు. తనతో సరదాగా గడపడం, ఇష్టంగా సెల్ఫీలు తీసుకోవడం. తమకు నచ్చి బహుమతులను ఇవ్వడం ఇలా ఏదో ఒక రకంగా తమ సోదరీమణులను ఆశ్చర్య పరుస్తూ ఆనందంగా ఉండేలా చేస్తాడు.
- Samatha J
- Updated on: Aug 28, 2026
- 9:48 am
వివాదం తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్మెంట్..!
మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
- Balaraju Goud
- Updated on: Aug 28, 2026
- 9:15 am
Raksha Bandhan: రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? రాఖీ విశిష్టత, సంప్రదాయాలు ఇవే!
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పౌర్ణమి. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని క్షేమం, సంతోషం కోరుకోవడం.. సోదరుడు ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగలో ప్రధాన భావన. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో, భిన్నమైన ఆచారాలతో ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పౌర్ణమిని ఎంతో ఆనందంగా నిర్వహిస్తారు.
- Balaraju Goud
- Updated on: Aug 28, 2026
- 8:00 am
Raksha Bandhan 2026: మొదటి రాఖీ ఎవరికి కట్టాలి అన్నకా.. తమ్ముడికా? అసలు సంప్రదాయం ఏం చెబుతోంది?
రక్షా బంధన్ అంటే కేవలం సోదరుడి చేతికి రాఖీ కట్టడం మాత్రమే కాదు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, అనుబంధం, ఆప్యాయతను గుర్తుచేసే ప్రత్యేకమైన పండుగ. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. 2026లో రక్షా బంధన్ను ఆగస్టు 28న జరుపుకుంటున్నారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల క్షేమం, ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తూ రాఖీ కడతారు. అయితే ఒక ఇంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఉంటే.. ముందుగా ఎవరికి రాఖీ కట్టాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది.
- Bhavani
- Updated on: Aug 27, 2026
- 9:08 pm
Ragi Laddoo Recipe: కొండలను పిండి చేసే బలం కావాలా?.. ఈ లడ్డూ రోజుకు ఒక్కటి తినండి చాలు..
రాఖీ పండుగ వచ్చేసింది.. మీ అన్నయ్య లేదా తమ్ముడికి రాఖీ కట్టి ఏం స్వీట్ ఇవ్వాలో అని ఆలోచిస్తున్నారా?.. అయితే ఇంట్లోనే తయారు చేసే రుచిరమైన ఈ రాగీ లడ్డూను ఇవ్వండి. ఇది మీ సోదరులకు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ స్పెషల్ లడ్డూ మీ రాఖీ పండగను మరింత స్పెషల్గా మారుస్తుంది.
- Anand T
- Updated on: Aug 27, 2026
- 8:30 pm
Raksha Bandhan: రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
Rakhi Purnima 2026: రాఖీ పౌర్ణమి 2026 పండుగను ఆగస్టు 28న జరుపుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. ఆగస్టు 28 ఉదయం 5:57 నుంచి 9:48 గంటల వరకు రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తంగా చెబుతున్నారు. ఉదయం వీలు కానివారు మధ్యాహ్నం 1:46 నుంచి 4:20 గంటల మధ్య కూడా రాఖీ కట్టుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు
- Phani CH
- Updated on: Aug 27, 2026
- 7:31 pm