AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్

Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్

Phani CH
|

Updated on: Feb 28, 2026 | 12:56 PM

Share

కర్నూలు చిన్నారి పునర్విక అరుదైన SMA వ్యాధితో బాధపడుతూ ₹16 కోట్ల జోల్జెన్స్మా ఇంజెక్షన్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ₹10 కోట్లు సమకూరగా, మిగిలిన ₹6 కోట్లకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆయన గొప్ప నిర్ణయాన్ని బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ ట్వీట్ ద్వారా ప్రశంసించగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ మానవత్వానికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించింది. ఇటీవల ఆయన తీసుకున్న ఒక నిర్ణయం పై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించిది. ఈమేరకు జాన్వీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక SMA టైప్-1 అనే అత్యంత అరుదైన , ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ జబ్బు సోకిన వారి కండరాలు క్రమంగా బలహీనపడి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. చికిత్స లో భాగంగా పాపకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్జెన్స్మా..Zolgensma అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు . అయితే ఈ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాలా రూ.16 కోట్లు. అంత స్తోమత లేని తల్లిదండ్రులు దాతలను ఆశ్రయించారు. తమ కూతురు చికిత్సకు ఆర్థిక సాయం అందించి కాపాడాలని కోరారు. ఈ క్రమంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ చాలా మంది పునర్విక ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలోనే విరాళాల ద్వారా రూ. 10 కోట్ల సమకూరగా, మరో రూ.6 కోట్లు అవసరమయ్యాయి. ఇక్కడే ఏపీ మంత్రి నారా లోకేశ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. పునర్విక చికిత్స కోసం మిగిలిన రూ. 6 కోట్లు అందేలా చూసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారాయన. ఇలాంటి పరిస్థితిలోనూ పునర్విక పోరాడుతున్న తీరు అభినందనీయమని మంత్రి లోకేశ్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడది నెట్టింట వైరల్ గా మారింది. క్లిష్ట సమయంలో పునర్విక కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేశ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా దీనిపై స్పందించింది. నారా లోకేశ్ చేసిన ట్విట్టర్ పోస్టుకు రిప్లై ఇస్తూ.. ‘మానవత్వం ఇంకా బతికే ఉంది.. ట్రూలీ అప్రిషియేటెడ్‌’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్స్ కూడా నారా లోకేష్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

Follow Us