Prize Money: తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
Ranji Trophy Prize Money: ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా జమ్మూ-కాశ్మీర్కే టైటిల్ దక్కింది. 1959-60లో తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొన్న ఈ జట్టు 67 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 1982-83లో సర్వీసెస్పై తొలి విజయం సాధించిన జమ్మూ-కాశ్మీర్, ఇప్పుడు తొలి టైటిల్ దక్కించుకుంది.

Ranji Trophy Prize Money: రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్ భారత దేశీయ క్రికెట్ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయంగా నిలిచింది. హుబ్లీ లోని KSCA క్రికెట్ గ్రౌండ్లో జమ్మూ-కాశ్మీర్, కర్ణాటక జట్లు తలపడ్డాయి. తొలిసారి రంజీ ఫైనల్కు చేరుకున్న జమ్మూ-కాశ్మీర్ జట్టు.. తొలి ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది. తమ 67 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ట్రోఫీని గెలుచుకుంది.
జమ్మూ-కాశ్మీర్ సంచలనం..
ఈ మ్యాచ్లో జమ్మూ-కాశ్మీర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్లో భారీగా 584 పరుగులు చేసింది. ప్రతిగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 293 పరుగులకే పరిమితమైంది. మయాంక్ అగర్వాల్ అద్భుతంగా 160 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్మన్లు జమ్మూ-కాశ్మీర్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు.
పాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ 5 వికెట్లు తీసి మ్యాచ్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో జమ్మూ-కాశ్మీర్కు 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూ-కాశ్మీర్ రెండో ఇన్నింగ్స్లో కూడా ఆధిపత్యం కొనసాగించి మొత్తం ఆధిక్యాన్ని 477 పరుగులకు పెంచింది. ఇందులో కమ్రాన్ ఇక్బాల్ 94 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా జమ్మూ-కాశ్మీర్కే టైటిల్ దక్కింది. 1959-60లో తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొన్న ఈ జట్టు 67 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 1982-83లో సర్వీసెస్పై తొలి విజయం సాధించిన జమ్మూ-కాశ్మీర్, ఇప్పుడు తొలి టైటిల్ దక్కించుకుంది.
జమ్మూ కాశ్మీర్ కు భారీ నగదు బహుమతి..
రంజీ ట్రోఫీ 2025-26 విజేత జట్టుకు బీసీసీఐ తరఫున 5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్ జట్టుకు కూడా 3 కోట్ల రూపాయల బహుమతి లభిస్తుంది. ఈ భారీ నగదు బహుమతి ఆటగాళ్ల కృషికి గౌరవం ఇచ్చే విధంగా ఉండటంతో పాటు దేశీయ క్రికెట్కు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
