ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
Crime News: వారం క్రితం మరణం.. పూడ్చిన శవాన్ని బయటకు తీసి మరీ..
సాధారణంగా ఎవరైనా మరణిస్తే 24 గంటల్లోపు పోస్ట్మార్టం నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈనెల 12వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరిగిన వారం రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. అవును ఖననం చేసిన డెడ్ బాడీని బయటకుతీసి మరీ శవ పరీక్షలు నిర్వహించారు. అసలు ఎందుకు వారం తర్వాత పోస్ట్మార్టం నిర్వహించారో తెలుసుకుందాం పదండి.
- G Peddeesh Kumar
- Updated on: Mar 20, 2026
- 10:14 am
పోలీసులు, న్యాయవాదులను ఉరుకులు పరుగులు పెట్టిన మెయిల్.. అసలేం జరిగిందంటే..?
వరంగల్ జిల్లా కోర్టును ఆకతాయిలు టార్గెట్ చేశారు. బాంబు బెదిరింపు కాల్స్తో న్యాయవాదులు, పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. ఫిబ్రవరి నెల 26వ తేదీన బాంబు పెట్టామని కోర్టులో సిబ్బందిని వణికించిన ఆకతాయిలు తాజాగా మరోసారి అదే బాంబు కాల్తో బెంబేలెత్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు.
- G Peddeesh Kumar
- Updated on: Mar 18, 2026
- 3:05 pm
Telangana: అబ్బ ఏం స్కెచ్ వేశావ్రా.. సైలెంట్గా జారుకుందాం అనుకున్నాడు.. కట్చేస్తే..
హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. రాత్రి భోజనం చేసిన ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కూతురు తెల్లవారేసరికి సజీవదహనం అయ్యారు. వారిని అతికిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పట్టించిన అల్లుడు పిట్టకథ అల్లబోయాడు. బంధువులకు ఫోన్లు చేసి ప్రమాదం అని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అసలు కథ బయటపడింది. అల్లుడే హంతకుడని తేలింది.
- G Peddeesh Kumar
- Updated on: Mar 18, 2026
- 10:05 am
నడిరోడ్డుపై బైక్పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!
వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిల రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మద్యం మత్తులో విన్యాసాలు చేస్తున్న పోకిరీలకు హితబోధ చేసిన పాపానికి వాహనదారులను వెంబడించి విచక్షణారహితంగా దాడి చేశారు. నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టి బీర్ బాటిల్ తో తల పగలగొట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
- G Peddeesh Kumar
- Updated on: Mar 17, 2026
- 3:31 pm
ఐడియా అదుర్స్ కదూ..! బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లు వేయకుండా ఏం చేశారో తెలుసా..?
ఖాళీ గోడలు కనపడితే చాలు వాల్ పోస్టర్లు, రాజకీయ నేతల వాల్ రైటింగ్స్, వ్యాపార సంస్థల రాతలతో ఊదరగొడుతుంటారు. వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్లకు చెక్ పెట్టేందుకు జనగామ మున్సిపాలిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం జనంలో చర్చగా మారింది. పూలతో చేపట్టిన వినూత్న ప్రయత్నం చూసి ప్రతిఒక్కరూ ఐడియా అదుర్స్ అంటున్నారు. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?
- G Peddeesh Kumar
- Updated on: Mar 17, 2026
- 3:02 pm
Ugadi 2026: ఈ ఉగాదికి వేప పువ్వు కరువు.. కీడు సంకేతమేనా? మరి, వేపకు బదులుగా ఏది వాడాలి
ఉగాది పచ్చడిలో వేప పువ్వులను పక్కా వేస్తాము. అది వెయ్యనిదే పచ్చడి పూర్తి కాదు. మరి, ఈ ఏడాది వేపపువ్వు దొరకడమే చాలా కష్టంగా ఉంది. వేప పువ్వుకు ప్రత్యామ్నాయంగా ఉగాది పచ్చడిలో ఏం ఉపయోగించాలన్న దాని పై జనాలు ఆలోచిస్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Mar 17, 2026
- 1:59 pm
Narsampet: వామ్మో.. 6 అడుగుల నాగుపామును పట్టి.. దానికి స్నానం చేయించి.. ఆపై..
వరంగల్ జిల్లా నర్సంపేటలో పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీలో ఆరడుగుల నాగుపాము కనిపించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇంటి పరిసరాల్లోకి వచ్చిన పామును చూసి కాలనీ ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని దాని జాగ్రత్తగా రెస్క్యూ చేశాడు..
- G Peddeesh Kumar
- Updated on: Mar 16, 2026
- 4:54 pm
Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ తో సహా తెగిపడి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో కూలి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బాలుడి ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- G Peddeesh Kumar
- Updated on: Mar 14, 2026
- 10:46 pm
Telangana: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా
రోజూ ఉదయాన్నే ఎవరి పనులకు వాళ్లు వెళ్తున్నారు.. అలా నాలుగు రోడ్ల కూడలి దగ్గరకు చేరుకోగానే.. అక్కడ కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యారు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి హడలిపోయారు. ఇంతకీ ఏం కనిపించిందంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- G Peddeesh Kumar
- Updated on: Mar 12, 2026
- 6:02 pm
Telangana: ఒకే చోట ప్రాణాలు విడిచిన ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు..
మహబూబాబాద్ జిల్లాలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు ప్రాణ స్నేహితులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్కు వెళ్తున్న మరో స్నేహితుడికి సెండ్ ఆఫ్ చెప్పి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- G Peddeesh Kumar
- Updated on: Mar 12, 2026
- 1:56 pm
బతుకైనా చావైనా తన పక్కనే నేను ఉండాలి.. బతికుండగానే ఓ భర్త ఏం చేశాడో తెలుసా?
జీవిత భాగస్వామి చనిపోతే విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడక్కడ చూసి ఉంటాం. కానీ భార్య మరణాన్ని తట్టుకోలేక విగ్రహం ఏర్పాటు చేసిన ఓ భర్త. బతుకైనా చావైనా తన పక్కనే నేను ఉండాలంటూ బతికి ఉండగానే తన విగ్రహం కూడా పెట్టుకుని తన భార్యపై తనకున్న ప్రేమను నేటి సమాజానికి చూపాడు ఓ కురవృద్ధుడు.
- G Peddeesh Kumar
- Updated on: Mar 11, 2026
- 11:15 am
Telangana: అడవిపందుల కోసం కరెంట్ ఫెన్సింగ్.. ఉదయం పొలానికి వెళ్లి చూడగా..
అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవాలని ఒక రైతు వేసిన ఉచ్చు.. మరో రైతు పాలిట మృత్యుపాశంగా మారింది. పక్క పొలం రైతు చేసిన చిన్న నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతు, కరెంటు తీగల రూపంలో పొంచి ఉన్న మృత్యువును గమనించలేకపోయాడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది.
- G Peddeesh Kumar
- Updated on: Mar 10, 2026
- 7:10 pm