ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
చీకటి పడితే చాలు వాడు ఊర్లోకి వచ్చేస్తాడు! బిక్కు బిక్కుమంటున్న గ్రామస్తులు..?
హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామాన్ని గత నాలుగు రోజుల నుండి ఎలుగుబంటి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. చీకటి పడగానే గ్రామంలోకి ప్రవేశిస్తున్న ఎలుగుబంటి అక్కడి ప్రజలను వనికిస్తుంది..అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలుగుబంటి దాడిలో ఎవరికి ఎలాంటి హానీ జరగకపోవడంతో ఊరంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఎలాంటి ముప్పుపొంచి ఉందో అనే భయం భయంతో వణికి పోతున్నారు. ఎలుగుబంటి నుండి తమ ప్రాణాలు రక్షించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు..
- G Peddeesh Kumar
- Updated on: Jun 12, 2026
- 10:33 am
సర్కార్ బడిని కాపాడాలనే తపన.. డప్పు భుజానేసుకుని ఊరంతా తిరిగిన పంతులు..!
విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం పొంచి ఉండడంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడం కోసం పంతుల్లకు వింత వేషాలు తప్పడంలేదు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి డెడికేషన్ ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 11, 2026
- 3:17 pm
నాటుకోడి కూర ఎంత పని చేసింది.. తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు..
జనగామ జిల్లా అక్కరాజుపల్లి గ్రామంలో నాటుకోడి కూర విషయంలో ప్రారంభమైన కుటుంబ కలహం విషాదాంతమైంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకున్న కుమారుడు గణేష్, క్షణికావేశంలో తండ్రి రమేష్పై రోకలి బండతో దాడి చేయగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 11, 2026
- 8:56 am
Telangana: మృగశిర కార్తె సందర్భంగా చెరువు లూటీ.. ఖాకీల వేటు..
మృగశిర కార్తె సందర్భంగా చెరువులో చేపల లూటీకి పాల్పడుతున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చేపల కోసం వెళ్లి కటకటాల పాలయ్యారు. 60 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా.. ..
- G Peddeesh Kumar
- Updated on: Jun 8, 2026
- 6:26 pm
ఊళ్ళో దెయ్యాలు – భూతాలను తరిమేస్తామంటూ వచ్చారు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!
ఆ ఊరిలో దెయ్యాలు - భూతాలు, సంచరిస్తున్నాయని... ఎవరో చేతబడి చేశారని నమ్మించి మంత్రాలతో వాటిని తరిమేస్తామని వచ్చారు. గ్రామస్తులకు నమ్మబలికి ఇద్దరు కేటుగాళ్లు కటకటాల పాలయ్యారు.. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో..
- G Peddeesh Kumar
- Updated on: Jun 8, 2026
- 5:02 pm
కోట్లు పెట్టినా దొరకని నిజమైన సంతోషం..ఉపాధి హామీ పనిలోనే వృద్ధ దంపతుల షష్ఠిపూర్తి.. గుండెల్ని హత్తుకుంటున్న వేడుక!
నిజమైన సంతోషం కోట్లు ఖర్చు పెడితే రాదు.. ఆత్మీయుల మధ్య గడిపే ఆనంద క్షణాల్లోనే దొరుకుతుంది. నేటి సమాజంలో పెళ్లిళ్లు, వేడుకలు అంటేనే లక్షల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తూ ఆర్భాటంగా చేసుకునే రోజులివి.. అలాంటి రోజులలో సాధారణ కూలీ దంపతుల షష్టిపూర్తి వేడుక ఎలా ఉంటుంది.! వాళ్ళ కళ్ళలో నిజమైన ఆనందం ఎలా..! మీరే చూడండి
- G Peddeesh Kumar
- Updated on: Jun 8, 2026
- 1:46 pm
మృగశిర కార్తె అయితే.. చేపలు కొనుక్కోవాలి.. లూటీ చేయకూడదు.. చెరువు మీద పడి నిమిషాల్లోనే..
మహబూబాబాద్ జిల్లాలో మృగశిర కార్తెకు ముందే చేపల పండగ వాతావరణం నెలకొంది. గోపాతండా వాసులంతా బంధంకుంట చెరువుపై దండెత్తి చేపలను పట్టుకెళ్లారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం వలలు, చీరలు, లుంగీలతో చేపల వేటలో పాల్గొన్నారు. అయితే లీజుకు తీసుకుని చేపలు పెంచుతున్న మత్స్యకారులు రూ.1.5 లక్షల మేర నష్టం వాటిల్లిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 7, 2026
- 11:09 am
చీ మీ బతుకులు చెడ..! ఆరుగాలం కష్టపడి రైతులు పంట పండిస్తే..
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వచ్చి రైతులు ఆరబోసిన ధాన్యాన్ని లక్ష్యంగా చేసుకున్న యువకుల ముఠా వరుస దొంగతనాలకు పాల్పడింది. కేవలం 10 రోజుల్లో 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లిన ఈ ముఠాలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఉండటం కలకలం రేపుతోంది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 4, 2026
- 8:28 am
టిప్టాప్గా రెడీ అయ్యాడు.. సూట్కేస్లతో బస్ ఎక్కాడు.. అనుమానం వచ్చి చెక్ చేయగా
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని బ్చన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానం రాకుండా నిందితుడు సూట్కేస్లో దాచి తరలిస్తున్న మొత్తం 14 కేజీ గంజాయిని స్వాధీనిం చేసుకున్న పోలీసులు అతన్ని పీఎస్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 2, 2026
- 4:27 pm
Viral Video: ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్.. వీడియో చూసి
వరంగల్ జిల్లాలో ఓ లవ్ స్టోరీ కాస్తా క్రైమ్ స్టోరీగా మారింది. జల్సాల కోసం పెట్రోల్ దొంగతనాలు చేస్తూ ఓ ప్రేమ జంట పోలీసులకు దొరికిపోయింది. హనుమకొండలో ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా ఈ జంట సాగిస్తున్న అర్ధరాత్రి పెట్రోల్ లూటీల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 2, 2026
- 9:00 am
వీధి కుక్కల కోసం మౌన పోరాటం.. ప్లకార్డులతో మూగజీవాల హక్కులపై అవగాహన కల్పిస్తున్న ప్రశాంత్
హనుమకొండకు చెందిన జంతు ప్రేమికుడు సుంకరి ప్రశాంత్ వీధి కుక్కల రక్షణ కోసం వినూత్న మౌన నిరసన చేపట్టారు. ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వీధి కుక్కలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, మూగజీవాల సంక్షేమానికి కేటాయించిన నిధుల వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 1, 2026
- 7:43 pm
కూలీ పనిస్థలమే కళ్యాణ మండపం.. ఉపాధిహామీ దంపతుల షష్టిపూర్తి వేడుకకు ఫిదా అవుతున్న జనం!
మహబూబాబాద్ జిల్లాలో ఉపాధిహామీ కూలి దంపతుల షష్టిపూర్తి వేడుక వినూత్న రీతిలో జరిగింది.పని ప్రదేశంలో తోటి కూలీలే బంధుమిత్రులు, అతిధులు అయ్యారు. అక్కడ పచ్చని చెట్లే కళ్యాణ మండపం అయింది.వారికి వినూత్న రీతిలో షష్టిపూర్తి వేడుక నిర్వహించి మురిసి పోయేలా చేశారు. ఈ వినూత్న షష్టిపూర్తి వేడుక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో జరిగింది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 1, 2026
- 11:17 am