ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. తొలి స్నానం ఆచరించేది ఎవరో తెలుసా..!
సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది.. కాళేశ్వరం త్రివేణ సంగమ తీరం ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ ను తలపిస్తుంది.. రేపు ఉదయం 5.43 నిమిషాలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి..
- G Peddeesh Kumar
- Updated on: May 20, 2026
- 10:30 am
అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ను అతివేగంగా వెనుకనుండి బైక్ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సతీష్ అనే వ్యక్తి కుటుంబ గాధ ప్రతి ఒక్కరికి గుండెలను పిండేసింది.
- G Peddeesh Kumar
- Updated on: May 20, 2026
- 8:31 am
Telangana: ఓరుగల్లు రౌడీషీటర్లకు పోలీసుల వెరైటీ పనిష్మెంట్.. మండుటెండలో ఏం చేశారో వీడియో చూడండి..
ఓరుగల్లు పోలీసులు ఆకు రౌడిలా తోకలు కత్తిరిస్తున్నారు. కేవలం లాఠీకి పని చెప్పడం కాకుండా.. రౌడీషీటర్ల మైండ్సెట్ను మార్చేలా సరికొత్త కౌన్సిలింగ్ పద్ధతులను మొదలుపెట్టారు. అరాచకాలతో రెచ్చిపోతే అడ్రస్ లేకుండా చేస్తామని వార్నింగ్ ఇవ్వడమే కాదు.. మండుటెండలో రౌడీషీటర్ల చేత కవాతు నిర్వహించి పోలీస్ మార్క్ చూపించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- G Peddeesh Kumar
- Updated on: May 18, 2026
- 7:52 pm
మేడారం దారిలో వాహనదారులను పలకరించిన అరుదైన అతిథి.. చూశారా దాని రాజసం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం-మేడారం ప్రధాన రహదారిపై భారీ అడవి దున్నలు సంచరిస్తూ వాహనదారుల్లో భయాందోళనలు రేపాయి. మల్లంపెళ్లి స్టేజి సమీపంలో రోడ్డుదాటుతున్న గౌర్ జాతి అడవి దున్నలను చూసి వాహనాలు నిలిపివేసిన ప్రయాణికులు సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
- G Peddeesh Kumar
- Updated on: May 17, 2026
- 12:03 pm
ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!
ఆయువు గట్టిదైతే చావు అంచుల్లోకి వెళ్లినా ప్రాణాలు దక్కుతాయంటారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఒక విచిత్ర ప్రమాదం సరిగ్గా ఈ మాటను నిజం చేసింది. విధి ఎంత బలీయమైనదో, ఒక్కోసారి అదృష్టం కూడా అంతే బలంగా ప్రాణాలను కాపాడుతుందని ఈ ఘటన నిరూపించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేషెంట్ను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్పై, ఎలాంటి గాలివాన లేకపోయినా అకస్మాత్తుగా ఒక భారీ వృక్షం కూలిపడింది.
- G Peddeesh Kumar
- Updated on: May 16, 2026
- 10:41 pm
పురాతన శిల్పాలకు కాపలాగా 3 శ్వేత నాగులు.. వాటిని తొలగించిన కాసేపటికే ఊహించని సీన్
సాధారణంగా మనం పాములను చాలా సార్లు చూసి ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా శ్వేతనాగును చూశారా.. అవి సినిమాల్లోనే ఉంటాయి. నిజ జీవితంలో ఉండవు అనుకుంటే మీరు పొరపడినట్టే. అవును ఎందుకుంటే తాజాగా పురాతన శిలల కింద నుంచి ఒక కాదు రెండు కాదు ఏకంగా మూడు శ్వేత నాగులు బటయకు వచ్చాయి. వాటిని చూసిన జనం భయంతో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
- G Peddeesh Kumar
- Updated on: May 16, 2026
- 8:19 am
36 రోజుల పాటు శుభముహూర్తాలకు బ్రేక్.. జూన్ 19 తర్వాతే పెళ్లి సందడి!
శుభముహూర్తాలకు విరామం కార్డు పడింది వచ్చే నెల 18వ తేదీ వరకు ఇక ముహూర్తాలు లేవని పండితులు సూచిస్తున్నారు.. పరాభవ నామ సంవత్సరంలో శుభ ముహూర్తాల ప్రభావంతో పెళ్లి వేడుకలు, గృహప్రవేశాలకు బ్రేక్ పడింది.. అధిక జ్యేష్ట మాసం ప్రభావంతో 36 రోజులపాటు ముహూర్తాలు లేవట.. రెండు నెలలపాటు పెళ్లి వేడుకలు, భాజా భజంత్రీలతో కళకళలాడిన కళ్యాణ మండపాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.
- G Peddeesh Kumar
- Updated on: May 15, 2026
- 3:10 pm
ప్రయాగ్రాజ్ను తలపిస్తున్న కాళేశ్వరం త్రివేణీ సంగమం.. సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
Saraswati Anthya Pushkaralu: మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో ప్రాంతం కొత్త రూపు దాల్చి, ప్రయాగరాజును తలపిస్తోంది. గత ఏడాది ప్రారంభ పుష్కరాలు జరిగిన తర్వాత, ఇప్పుడు అంత్య పుష్కరాల కోసం అధికారులు అద్భుతమైన సెట్టింగ్స్తో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: May 15, 2026
- 2:42 pm
Telangana: గ్యాస్ సిలిండర్ వాహనాలకు పోలీస్ ఎస్కార్ట్.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
ముందో పోలీస్ వాహనం.. వెనుకో పోలీస్ వాహనం.. ఎస్ఐ స్థాయి అధికారులతో ఎస్కార్ట్... అక్కడ సీన్ చూస్తే ఎవరో మంత్రికో లేక అంతకంటే ముఖ్యమైన వారికి పోలీస్ ఎస్కార్ట్ అనిపిస్తుంది. కానీ అసలు సీన్ చూస్తే అవాక్కవాల్సిందే.. ఆ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల వాహనాలకు పోలీసులు కల్పిస్తున్న అసాధారణ భద్రత చూసి జనమంతా నివ్వేరబోతున్నారు.. గ్యాస్ వాహనాలకు పోలీసులు భద్రత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- G Peddeesh Kumar
- Updated on: May 15, 2026
- 7:40 am
తండ్రి కళ్లెదుటే విషాదం.. గొర్రెపిల్లను కాపాడి.. ప్రాణాలు వదిలిన 11 ఏళ్ల బాలుడు..!
వరంగల్ జిల్లాలో అత్యంత హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. మూగజీవాన్ని కాపాడాలనే ఆ చిన్నారి తాపత్రయం, ఆ కుటుంబంలో ఎన్నటికీ తీరని ఘోర విషాదాన్ని నింపింది. వ్యవసాయ బావిలో పడ్డ గొర్రెపిల్లను రక్షించే క్రమంలో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఖానాపురం మండలం రంగాపురం గ్రామంలో జరిగింది ఈ ఘటన.
- G Peddeesh Kumar
- Updated on: May 14, 2026
- 4:25 pm
Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
ఎల్కతుర్తిలో ఒక కల్లుగీత కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే, నిత్యం కల్లు గీసే చోటే విజయ్ కళ్యాణ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు మరో వ్యక్తి. అసలు వీరిద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి? పద్ధతి మార్చుకోవాలని నెల రోజుల క్రితమే హెచ్చరించినా వినకపోవడంతోనే ఈ దారుణం జరిగిందా? వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలితీసుకుందో తెలుసుకుందాం..
- G Peddeesh Kumar
- Updated on: May 14, 2026
- 2:11 pm
మగవాళ్ళను కూడా వదలడం లేదు.. బీకేర్ఫుల్.. ఇంటి బయట కూర్చొని ఉంటే వెనుక నుంచి వచ్చి..
వరంగల్లో చైన్ స్నాచర్లు బరితెగిస్తున్నారు. మహిళలతో పాటు మగవారినీ టార్గెట్ చేస్తూ బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. ఒక్కరోజులో మూడు చోట్ల జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. న్యాయవాది మెడలోని గొలుసును సినీ ఫక్కీలో తెంచుకుపోయిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
- G Peddeesh Kumar
- Updated on: May 12, 2026
- 5:38 pm