ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
Telangana: నీచుడా.. అన్నకు పిల్లనిచ్చారని ఎంత పని చేశావ్రా.. అత్తమామ నిద్రపోయాక అర్థరాత్రి..
ఆస్తికోసం కక్కుర్తి పడ్డ ఓ వ్యక్తి తన అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలకు కరెంట్ షాక్ పెట్టి హతమార్చాలని ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో అత్త అక్కడికక్కడే విద్యుత్ షాక్ తో మృతిచెందగా, మామ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.. ఆ ఉన్మాదిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్య, బంధువులపై కూడా దాడికి పాల్పడ్డాడు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 10, 2026
- 3:57 pm
Watch: ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు జంకుతున్న జనాలు!
వాల్మీడి గ్రామంలో వేలాది కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లు, పంటపొలాలను ధ్వంసం చేస్తూ గ్రామస్తులను భయపెడుతున్నాయి. ఇటీవల రెండు కోతుల గుంపుల మధ్య జరిగిన భీకర పోరాటం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పిల్లలు, పెద్దలు ఒంటరిగా బయటకు రావాలంటే వణికిపోతున్నారు. కిరాణా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కోతుల బెడద నుండి తమను రక్షించాలని గ్రామస్తులు అధికారులును వేడుకుంటున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 8, 2026
- 11:42 am
Watch: నడిరోడ్డుపై కాలిబూడిదైన స్కూల్ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో నలిచిన విద్యార్థుల ప్రాణాలు!
ట్రావెల్స్ బస్సులు మాత్రమే కాదు.. ఈ మధ్య కాలంలో స్కూల్ బస్సులు కూడా అగ్గికి ఆహుతి అవుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులతో వెళ్తునన్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా నడిరోడ్డుపై కాలి బూడిదయింది. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై పిల్లలను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.
- G Peddeesh Kumar
- Updated on: Feb 7, 2026
- 7:35 pm
సమ్మక్క సారక్క మీరే దిక్కు.. మేడారం హుండీ కానుకల్లో చిత్ర విచిత్రాలు.. ఆస్తి కోసం ఒకరు.. ప్రేమకోసం మరొకరు..
మేడారం జాతర ముగిసింది.. హుండీల లెక్కింపు కొనసాగుతుంది. కానుకల లెక్కింపు సందర్భంగా లభ్యమవుతున్న భక్తుల వింత కోరికల లేఖలు సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కరెన్సీ కట్టలకు సమాంతరంగా వింత కోరికలు చూసి అంతా షాక్ అవుతున్నారు.. ఇంతకి ఆ లేఖల్లో ఏముంది..! భక్తుల వింత కోరికలు ఎలా ఉన్నాయో మీరే చూడండి..
- G Peddeesh Kumar
- Updated on: Feb 6, 2026
- 4:58 pm
Telangana: రక్తార్పణమే నైవేద్యం.. ఊరంతా పూనకాలతో ఊగిపోయే సమ్మక్క తమ్ముడి జాతర గురించి తెలుసా..?
ఆ జాతరలో రక్తార్పణమే అతి కీలకం.. గుట్ట పై నుండి బాల కుమారస్వామి ఆగమనం సందర్భంగా ఊరంతా పూనకాలతో ఊగిపోతారు.. ఇంటికో కోడి లేదంటే మేక తల తెగాల్సిందే.. అక్కడి గిరిజన ఆచార సాంప్రదాయాలకు ప్రతిరూపంగా జరిగే బాలా కుమారస్వామి జాతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- G Peddeesh Kumar
- Updated on: Feb 6, 2026
- 10:32 am
మేడారం.. తిరుగువారం పండుగ అంటే ఏంటి..! ఆదివాసులు ఏం చేస్తారో తెలుసా…?
Medaram Thiruguvaaram Pandaga: జాతర ముగిసిన తర్వాత సరిగ్గా వారం రోజులకు మళ్లీ బుధవారం నిర్వహించే వేడుకను తిరుగు వారం పండుగ అంటారు. తిరుగువారం పండుగరోజు గద్దెల ప్రాంగణంతో పాటు సమ్మక్క, సారక్క గుడి.. అటు పగిడిద్దరాజు గోవిందరాజు ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు.. ఆదివాసి పూజారులు సమ్మక్క సారక్క గుడిలోకి వాళ్ళ ఆచార సాంప్రదాయ ప్రకారం పూజా సామాగ్రి తీసుకువెళ్లి వనదేవతలకు పూజలు చేస్తారు. ఆ దేవతలకు ప్రీతికరమైన నైవేద్యంగా జంతుబలిస్తారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 4, 2026
- 9:26 pm
పుర పోరు ప్రచారంలో పదనిసలు.. పిల్లాడికి స్నానం చేయించి తల్లిదండ్రులను ఓటు అడిగిన MLA..!
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వారి తరఫున ప్రచారం చేస్తున్న నేతల వింత వింత వేషాలు, వింత చేష్టలతో ఓటర్లను అబ్బుర పరుస్తున్నాయి.. సాధారణ ఎన్నికలను మరిపించే తరహాలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాన్ని పాట్లు పడుతున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే ఓ బుడ్డోడికి స్నానం పోయడం అక్కడ చర్చగా మారింది.
- G Peddeesh Kumar
- Updated on: Feb 4, 2026
- 5:08 pm
Chilli Prices: ఈసారి పంట పండినట్లే.. పసిడితో పోటీపడుతున్న ఎర్ర బంగారం ధరలు.. క్వింటా ఎంతంటే..
బులియన్ మార్కెట్లో పసిడి ధరలు దడ పుట్టిస్తుంటే.. వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో రైతులు సంబరపడుతున్నారు. ఎప్పుడూ మిర్చి పంట వేసి నష్టాలను చవిచూస్తున్న రైతన్నలు.. ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఎగబాకుతున్న మిర్చి ధరలు చూసి షాకవుతున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 4, 2026
- 4:47 pm
సందర్శకులతో సరదా ఉండే ఆ తెల్ల బెబ్బులికి ఏమైంది..! మరణానికి కారణాలేంటి..!
వరంగల్ జూ పార్క్ లో సందర్శకులను ఆహ్లాద పరిచిన బెబ్బులి మృతి చెందింది. తెల్ల పులి మరణవార్త జంతు ప్రేమికులను షాక్ అయ్యేలా చేసింది. మరణించిన తెల్ల పులి కళేబరానికి సీనియర్ వెటర్నరీ వైద్యులు, మామునూరులోని వెటర్నరీ కళాశాల వైద్య బృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం చేసిన కీలక నివేదిక సమర్పించారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 4, 2026
- 3:15 pm
IPS Vasundhara Yadav: మేడారంలో మెరిసిన డైనమిక్ ఐపీఎస్ మేడం..! బ్యాగ్రౌండ్ మాత్రం యమ పవర్ఫుల్..
మేడారం జాతర ముగిసింది.. అయితే.. అందం.. అభినయం.. నిబద్ధతతో ఓ మహిళా ఐపీఎస్ అధికారిని నెట్టింట వైరల్ గా మారింది. జాతరలో ఆమె ఎందుకలా హైలెట్ అయ్యారు. ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ గా మారిన ఆ మహిళ ఐపీఎస్ అధికారిని ఎవరు.. ఆమె ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు..! అని.. నిటిజన్లు సెర్చ్ చేస్తున్న ఆ లేడీ సింగం ఫుల్ డిటైల్స్ మీరే చూడండి..
- G Peddeesh Kumar
- Updated on: Feb 3, 2026
- 4:20 pm
మేడారంలో క్రౌడ్ బరస్ట్.. వనం నుంచి జనంలోకి సమ్మక్క.. AK 47 తూటాలతో ఘన స్వాగతం..!
లక్షలాది మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మేడారం వన దేవతల జన ప్రవేశం పూర్తయింది. కన్నెపల్లి నుండి సారలమ్మ, చిలుకలగుట్ట నుండి సమ్మక్క దేవతలు ఇద్దరూ గద్దెలపై ప్రతిష్టాపన చేయడంతో భక్త జనకోటికి దర్శనమిస్తున్నారు. మహిమాన్వితురాలైన సమ్మక్క తల్లి రాకతో మేడారం ప్రాంగణం పులకించిపోయింది. శక్తి పీఠంగా మారిన మేడారం గద్దెల ప్రాంగణానికి భక్తకోటి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jan 30, 2026
- 7:21 am
Medaram Jatara: మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటి.. ఎందుకు జరుపుతారో మీకు తెలుసా?
మేడారం మహాజాతరకు సరిగ్గా వారం రోజుల ముందు నిర్వహించే తొలిఘట్టం మండమేలిగే పండుగ మహా వైభవంగా జరిగింది. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆ కార్యక్రమం నిర్వహించారు. దృష్టశక్తుల చూపు మేడారం వైపు పడకుండా దిగ్బంధం చేసి కోడిపిల్లను బలిచ్చి ఊరుకట్టు నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకతో మేడారం జాతర ప్రారంభమైనట్టే భావిస్తారు. మండమెలిగే పండుగ నుంచి సరిగ్గా వారం రోజులకు అమ్మవార్లు వనం నుండి జనంలోకి వస్తారు.
- G Peddeesh Kumar
- Updated on: Jan 22, 2026
- 2:55 pm