AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Peddeesh Kumar

G Peddeesh Kumar

Staff Reporter - TV9 Telugu

peddeesh.ganji@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్‌గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నాను.

Read More
Telangana: ఏడాదికి 9 పంటలు.. రైతులకు కాసుల వర్షం.. కాకతీయుల కోటలో పచ్చటి సిరులు..

Telangana: ఏడాదికి 9 పంటలు.. రైతులకు కాసుల వర్షం.. కాకతీయుల కోటలో పచ్చటి సిరులు..

రాతి కోట గోడల మధ్య పచ్చని పంటల విప్లవం.. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలయమైన ఖిలా వరంగల్‌లో ఇప్పుడు సరికొత్త చరిత్ర మొదలైంది. ఏకశిలా తోరణాల సాక్షిగా రైతులు పండిస్తున్న ఆకుకూరల పంటలు అటు పర్యాటకులను కట్టిపడేస్తుంటే.. ఇటు అన్నదాతల ఇళ్లల్లో సిరులు కురిపిస్తున్నాయి. ఆ రాతి కోటలో చిగురిస్తున్న పచ్చదనం కథను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వెయ్యి రోజుల పాలన.. వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు పంపిణీ!

వెయ్యి రోజుల పాలన.. వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు పంపిణీ!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి వినూత్న కార్యక్రమం చేపట్టారు. వరంగల్ చౌరస్తాలో పేద ప్రజలకు 1000 కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Telangana: పాలకుర్తిలో వినూత్న రక్షాబంధన్: గోవులకు రాఖీలు కట్టి ఆప్యాయత చాటిన మహిళ

Telangana: పాలకుర్తిలో వినూత్న రక్షాబంధన్: గోవులకు రాఖీలు కట్టి ఆప్యాయత చాటిన మహిళ

రక్షాబంధన్ అంటే మానవ సంబంధాలకే పరిమితం కాదని జనగామ జిల్లాకు చెందిన ఓ జంతుప్రేమికురాలి నిరూపించారు. అన్నాతమ్ముళ్లకు మాత్రమే కాదు, నిత్యం మనల్ని కంటికి రెప్పలా చూసుకునే గోమాతలకు కూడా రక్షణ బంధం వేయవచ్చని చాటిచెప్పారు స్థానిక జంతు ప్రేమికురాలు దేవగిరి భార్గవి. వేదమంత్రాల సాక్షిగా సాగిన ఈ వినూత్న రాఖీ వేడుక స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

Telangana: ఇదేందయ్యా ఇదీ.. మరిచెట్టు నుంచి కల్లు.. లొట్టలేసుకుంటూ తాగుతున్న జనాలు.. వీడియో చూడండి..

Telangana: ఇదేందయ్యా ఇదీ.. మరిచెట్టు నుంచి కల్లు.. లొట్టలేసుకుంటూ తాగుతున్న జనాలు.. వీడియో చూడండి..

తాటి చెట్టు, ఈత చెట్టు నుంచి కల్లు కారడం సహజమే.. కానీ ఎప్పుడైనా మర్రిచెట్టు నుంచి కల్లు ధారలా కారడం చూశారా? మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఓ భారీ మర్రిచెట్టు వేరు నుంచి లొట్టినిండా కల్లు కారుతుండటంతో కల్లు ప్రియులు లొట్టలేసుకుంటూ తాగుతున్నారు. అసలు మర్రిచెట్టుకు కల్లు ఎలా వచ్చింది? అనేది తెలుసుకుందాం..

Telangana: పాకాల అడవుల్లో విదేశీ గద్ద హల్‌చల్.. అరుదైన పక్షిని చూసి అవాక్కైన జనం..

Telangana: పాకాల అడవుల్లో విదేశీ గద్ద హల్‌చల్.. అరుదైన పక్షిని చూసి అవాక్కైన జనం..

పాకాల అభయారణ్యంలో సరికొత్త సందడి నెలకొంది. దట్టమైన అడవులు, విశాలమైన సరస్సుకు నిలయమైన ఖానాపూర్ బయోడైవర్సిటీ పార్కులో అత్యంత అరుదైన విదేశీ జాతి పక్షి సందర్శకులను కట్టిపడేసింది. భారీ ఆకారం, విలక్షణమైన రూపంతో కనువిందు చేసిన గ్రే హెడెడ్ ఫిష్ ఈగిల్ రాకపై ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే

అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే

చరిత్రకు సజీవ సాక్ష్యం.. చెక్కు చెదరని జ్ఞాపకం.. ఆ కలెక్టర్ బంగ్లాకు 140 ఏళ్లు నిండాయి.. గంటగంటకు అలారంతో అలెర్ట్ చేస్తూ 140 ఏళ్లుగా ఎన్నో జ్ఞాపకాలను మోసుకొస్తున్న ఆ వాల్ క్లాక్ ఆ బంగ్లా చరిత్రకు మౌన సాక్షి.. ఓరుగల్లుకు ఐకాన్‌గా నిలిచిన ఆ వారసత్వ సంపద ఇప్పుడు కొత్తరూపు దిద్దుకుంటుంది.. త్వరలో ఆ కలెక్టర్ బంగ్లాలోకి మనం కూడా వెళ్లొచ్చు.. ఇప్పటివరకు 57 మంది కలెక్టర్లు క్యాంపు కార్యాలయంగా ఉపయోగించిన ఆ హెరిటేజ్ బంగ్లా గురించి తెలుసుకుందాం..

ఎద్దుకు అంతిమ సంస్కారాలు.. బోరున ఏడ్చిన రైతు

ఎద్దుకు అంతిమ సంస్కారాలు.. బోరున ఏడ్చిన రైతు

అన్నదాతకు కన్నీళ్లు మిగిలిచ్చింది ఓ దుక్కిటెడ్డు. ఎద్దు పాముకాటుకు గురై మరణించింది. దీంతో రైతు బోరున విలపిస్తున్నాడు. వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పశువైద్య సిబ్బంది బ్రతికించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు చూస్తే..

Telangana: కారు డిక్కీలో మూట.. ఓపెన్ చేసి చూస్తే అంతా షాక్ అయ్యే సీన్..

Telangana: కారు డిక్కీలో మూట.. ఓపెన్ చేసి చూస్తే అంతా షాక్ అయ్యే సీన్..

కరీంనగర్ - వరంగల్ మధ్య రహదారిపై దారుణం చోటుచేసుకుంది. కారు డిక్కీలో మహిళ మృతదేహాం కలకలం రేపింది. మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. మూడు రోజుల తర్వాత మహిళ మృతదేహాం బయటపడింది. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను గుర్తించి విచారణ చేపడుతున్నారు.

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో

మహబూబాబాద్ జిల్లాలో భారీ కొండచిలువ కలకలం రేపింది. తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో తెల్లవారుజామున సుమారు 12 అడుగుల పొడవైన కొండచిలువ నడిరోడ్డుపై ప్రత్యక్షమైంది. రోడ్డు దాటుతూ కొద్దిసేపు అక్కడే హల్చల్ చేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, బాటసారులు భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ రోడ్డుపై సంచరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డు కాగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐదొద్దుల రోజు ఆగమాగం.. కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!

ఐదొద్దుల రోజు ఆగమాగం.. కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!

మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. కులపెద్దతో ఘర్షణ పడ్డాడనే ఆగ్రహంతో ఒక వ్యక్తిని తోటి కులస్తులే అత్యంత దారుణంగా రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!

Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!

గ్రామ దేవతలకు మొక్కులు సమర్పించడం తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా గ్రామదేవతలకు భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ముత్యాలమ్మ దేవతకు ఓ భక్తుడు మొక్కు చెల్లించుకున్న తీరు స్థానిక భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అందరికీ భిన్నంగా ఆ భక్తుడు కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మద్యం సీసా వేసి.. మేళతాళాల నడుమ ఊరేగిస్తూ అమ్మవారికి మొక్కు సమర్పించాడు.

ఇంత చిన్న జెండా ఎప్పుడైనా చూశారా? చాక్‌పీస్‌పై జాతీయ పతాకం చెక్కిన కళాకారుడు!

ఇంత చిన్న జెండా ఎప్పుడైనా చూశారా? చాక్‌పీస్‌పై జాతీయ పతాకం చెక్కిన కళాకారుడు!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేశభక్తిని చాటుకుంటున్నారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మైక్రో ఆర్టిస్ట్ వినూతరీతిలో జాతీయ పతాకం పై తన అభిమానాన్ని చాటాడు.. అతిసూక్ష్మ పరిమాణంలో చాక్ పీస్ తో జాతీయ జెండాను తయారుచేసి ప్రతిఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నాడు