ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
హాల్ మార్క్ లేకుండానే బంగారం విక్రయాలు.. జ్యూవెలరీ వ్యాపారులకు వణుకు పుట్టిస్తున్న BIS..
హాల్మార్క్ నిబంధనలు పాటించని బంగారు వ్యాపారులపై భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణలోని 13 జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లోనే సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 22, 2026
- 9:06 am
అబ్బ.. పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. బోగత అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బోగత జలపాతాలు భారీ వరదతో మహోగ్రరూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జలపాతాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భద్రత దృష్ట్యా అటవీశాఖ, పోలీసులు జలపాతాల వద్ద పర్యాటకులను ఈత కొలనులోకి అనుమతించడం నిలిపివేసి, భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 21, 2026
- 11:48 am
Viral Video: మార్కెట్లోకి కొత్త మోసం.. మీకు ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చో.. జాగ్రత్త మరీ!
మార్కెట్లోకి కొత్త దొంగలు వచ్చారు.. వీళ్ల రూటే వేరు.. వీళ్లు దొంగతనం చేసే పద్ధతే సపరేటు. వీళ్లు అందరిలా దోచుకోరు.. ఆపదలో ఉన్నట్టు నటిస్తారు.. నమ్మి దగ్గరికి వచ్చిన వారిని నట్టేట ముంచేస్తారు. అసలు వీళ్ల ప్లాన్ ఏంటి.. వీళ్లు ఎలా దోచుకుంటారో క్లారిటీగా తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.
- G Peddeesh Kumar
- Updated on: Jul 20, 2026
- 8:39 am
Telangana: భారతీయ శిల్పకళకు అంతరిక్ష గౌరవం.. సూది రంధ్రంలో ముగ్గురు మహనీయులు!
శనివారం విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విషయం అందరికి తెలిసిందే.. కానీ ఈ ప్రయోగంలో అత్యంత ఆసక్తికరమైన అంశం మరోకటి ఉంది.. ఈ రాకెట్తో పాటు ఒక సూది కూడా అంతరిక్షంలోకి వెళ్లింది! అంతకూ ఆసూదిని ఎందుకు స్పేస్లోకి పంపారు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- G Peddeesh Kumar
- Updated on: Jul 19, 2026
- 12:24 pm
నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావ్.. కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్..
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సోషల్ మీడియా ఇంచార్జ్ అడప మహేష్పై హత్యాయత్నం జరిగింది. మాట్లాడుదామని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించిన రౌడీషీటర్ పత్తి కుమార్, తనపై ఎమ్మెల్యేకు ఏమి చెప్పావంటూ ప్రశ్నించి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 19, 2026
- 8:48 am
Telangana: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం.. కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలకు వేళయింది. నేడు ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి మొదలై 29వ తేదీ ఆషాఢశుద్ధ పౌర్ణమి వరకు అంటే 14 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 14 రోజుల పాటు అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరించి ఆరాధిస్తారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 15, 2026
- 11:42 am
Viral Video: అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. ఉలిక్క పడ్డ జనం.. పరుగో పరుగు
అడవుల్లో ఆహారం కరువై ఈ మధ్య కాలంలో వణ్యప్రాణులు తచరూ జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలానే అడవి నుండి ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి గ్రామస్తులను తీవ్ర భాయందోళనకు గురిచేసింది. జనాలకు రాత్రంతా కంటి మీద కునుకులేకుండా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
- G Peddeesh Kumar
- Updated on: Jul 15, 2026
- 10:52 am
వానదేవుడా కరుణించు..వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేక, కరువు కాటుతో సాగు రంగానికి గడ్డు కాలం నడుస్తోంది. కరువు రక్కసి నుండి తమ గ్రామాలను, పంటలను కాపాడుకోవడం కోసం గ్రామీణ ప్రజలు దిక్కుతోచని స్థితిలో వానదేవుడిని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ పూర్వీకుల నాటి ఆచారాలను పాటిస్తూ వినూత్న పూజలకు తెరతీస్తున్నారు. ములుగు జిల్లా కొత్తూరు గ్రామ పరిధిలో శతాబ్దాల నాటి సాంప్రదాయమైన వరద పాయాసం ఉత్సవం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
- G Peddeesh Kumar
- Updated on: Jul 14, 2026
- 4:57 pm
Watch Video: ఆ బడిలో ఒకే ఒక్కడు.. ఆ ఒక్కడికి టీచర్తో సహా ముగ్గురు సేవలు..!
ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిది విచిత్ర సమస్య... ఆ పంతులు ఉద్యోగం నిలబడాలంటే విద్యార్థి కావాలి.. ప్రస్తుతం ఆ స్కూల్ లో మిగిలిన ఏకైక విద్యార్థిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఉపాధ్యాయుడు తన ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటున్నాడు.. ఆ పాఠశాలలో ఒకే విద్యార్థి ఒకే ఉపాద్యాయుడు... విద్యార్థులు లేక వెలవెలబోతున్న సర్కారు బడి భవితవ్యాన్ని మీరే చూడండి..
- G Peddeesh Kumar
- Updated on: Jul 14, 2026
- 10:28 am
Jangaon: 2 క్వార్టర్స్ తాగాడు.. తిరుపతి వెళ్లడానికి ట్రైన్స్ లేకపోవడంతో..
తిరుపతి వెళ్లాలనుకున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్కు రైళ్లు దొరకకపోవడంతో బస్టాండ్లో పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సునే తీసుకెళ్లాడు. జనగామ నుంచి సూర్యాపేట రూట్లో 21 కిలోమీటర్ల మేర బస్సు నడిపిన అతడు.. టోల్ప్లాజా వద్ద ప్రమాదం చేయడంతో దొరికిపోయాడు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 10, 2026
- 10:08 am
శవయాత్రగా మారుతున్న సరదా యాత్రలు..మాసాలోద్ది జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృతి..
వర్షాకాలం వస్తే చాలు పచ్చని ప్రకృతి, జాలువారే జలపాతాలను చూసేందుకు పర్యాటకులు పరుగులు తీస్తుంటారు. అయితే, అటవీశాఖ ఆంక్షలను, హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్ల పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లాలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సరదాగా గడపడానికి స్నేహితులతో కలిసి వచ్చిన ఆ బాలుడి ప్రాణాలను జలపాతం మింగేసింది.
- G Peddeesh Kumar
- Updated on: Jul 9, 2026
- 1:08 pm
కాకతీయుల కాలం నాటి ఆలయం.. జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు!
రామప్ప ఆలయం పక్కన ఉన్న పాలంపేట ప్రాచీన శివాలయానికి 1958 చట్టం కింద జాతీయ వారసత్వ సంపద హోదా లభించింది. ములుగు జిల్లాలోని ఈ ఆలయం ఇప్పుడు భారత పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చింది. గతంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి చెందనుంది.
- G Peddeesh Kumar
- Updated on: Jul 7, 2026
- 5:41 pm