ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
Viral Video: బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది.. అట్టాంటి ఇట్టాంటి పాము కాదు
వరంగల్ జిల్లా పాకాల అడవుల్లో అరుదైన జాతి పాము ప్రత్యక్షమైంది. తెలంగాణ అడవుల్లో ఈ జాతి పాము ప్రత్యక్షం ఇదే ప్రథమం కాగా అటవీశాఖ అధికారులు ఆ పామును పట్టుకొని సురక్షితంగా అడవుల్లో వదిలేశారు. నలుపు- పచ్చటి చారకలతో ఉన్న ఆ పాముకాటుకు గురైతే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Aug 12, 2026
- 10:48 am
Watch: కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్.. పోతురాజు వేషంలో హల్చల్! అసలు సంగతి ఏమంటే?
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న వేషధారణతో జనం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఆషాడంలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పోతరాజుల వేషం ధరించి ఊళ్ళల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. గంజాయి, మత్తు పదార్థాలు, ఎలా యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయో వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు..
- G Peddeesh Kumar
- Updated on: Aug 11, 2026
- 1:22 pm
పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. 50ఏళ్లలో తొలిసారి అక్కడ రెపరెపలాడిన త్రివర్ణం!
కాలం మారింది.. కర్రెగుట్టల కథ మారింది.. మావోయిస్టుల శకం ముగిసింది.. నిన్నటి బాంబుల జ్ఞాపకాలను చరిపేస్తూ.. ఇప్పుడు అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. కర్రెగుట్టల్లో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది. నిత్యం రక్తం పారిన చోట శాంతికపోతాలను ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర డీజీపీ. ఈ దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు ప్రశాంతత లభించిందని పరవశించారు. అడుగు తీసి అడుగు వేయడం సాహసమైన కర్రెగుట్టల ప్రగతి ప్రయాణం ఎలా సాగుతోంది..!
- G Peddeesh Kumar
- Updated on: Aug 11, 2026
- 12:39 pm
తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు!
Bogatha Waterfalls: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలోని జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ములుగు జిల్లా బొగత జలపాతాలు పాలధారలా జాలువారుతూ మినీ జాతరను తలపిస్తున్నాయి. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన పర్యాటకులు జలపాతాల అందాలను ఆస్వాదిస్తున్నారు. పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
- G Peddeesh Kumar
- Updated on: Aug 9, 2026
- 9:30 pm
ఎట్టకేలకు మేడారంలో జువ్వి చెట్టు.. దశాబ్దాల చరిత్రకు ప్రతీక..! 20 ఏళ్ల వృక్షాన్ని ఎలా నాటరంటే..
కోట్లాది మంది భక్తుల ఇలవేల్పులైన మేడారం సమ్మక్క-సారలమ్మ దేవతల గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ నిర్మాణంలో భాగంగా నూతన రూపు దిద్దుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సకల సౌకర్యాలతో ఆధునికీకరిస్తున్నప్పటికీ, ఆదివాసీల ఆచార వ్యవహారాలు, ప్రకృతి ఆరాధనా సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా సమ్మక్క గద్దె పక్కనే నాగులమ్మ ఆలయం వద్ద దశాబ్దాల తరబడి నిలిచిన పవిత్ర జువ్వి చెట్టును ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతి ద్వారా తిరిగి ప్రతిష్టించారు.
- G Peddeesh Kumar
- Updated on: Aug 8, 2026
- 8:17 am
Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం..
దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం.. కాలేశ్వరం ముక్తేశ్వర క్షేత్రం పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. 47 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ రాజగోపురాలు, ప్రకారం, గర్భగుడి, ఉప ఆలయాలను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఇంతకాలం పూజలు నిర్వహించిన అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు కాళేశ్వర క్షేత్రం కూల్చివేతల సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.
- G Peddeesh Kumar
- Updated on: Aug 7, 2026
- 12:02 pm
ఓర్నాయనో.. మహిళా రైతును అమాంతం మింగబోయిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో పొలం పనులు చేస్తున్న మహిళా రైతుపై 15 అడుగుల భారీ కొండచిలువ దాడి చేసి మింగేందుకు ప్రయత్నించింది. బాధితురాలి అరుపులు విన్న సహచర రైతులు, కూలీలు వెంటనే స్పందించి కొండచిలువను తరిమికొట్టి ఆమె ప్రాణాలు కాపాడారు. అనంతరం పామును గోనె సంచిలో బంధించి బాధితురాలితో కలిసి ఆస్పత్రికి తరలించారు.
- G Peddeesh Kumar
- Updated on: Aug 6, 2026
- 8:00 am
Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!
హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
- G Peddeesh Kumar
- Updated on: Aug 2, 2026
- 8:24 am
Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా?
ములుగు జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి ఊహించని పరిణామం ఎదురైంది. నదిలో చేపలు పడుతుండగా అతని వలకు ఓ అరుదైన వింత చేప చిక్కింది. తెలుపు, నలుపు వలయాలు, రెక్కలతో కనిపించిన ఈ చేప ఆ జాలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- G Peddeesh Kumar
- Updated on: Aug 1, 2026
- 3:18 pm
హాల్ మార్క్ లేకుండానే బంగారం విక్రయాలు.. జ్యూవెలరీ వ్యాపారులకు వణుకు పుట్టిస్తున్న BIS..
హాల్మార్క్ నిబంధనలు పాటించని బంగారు వ్యాపారులపై భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణలోని 13 జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లోనే సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 22, 2026
- 9:06 am
అబ్బ.. పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. బోగత అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బోగత జలపాతాలు భారీ వరదతో మహోగ్రరూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జలపాతాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భద్రత దృష్ట్యా అటవీశాఖ, పోలీసులు జలపాతాల వద్ద పర్యాటకులను ఈత కొలనులోకి అనుమతించడం నిలిపివేసి, భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 21, 2026
- 11:48 am
Viral Video: మార్కెట్లోకి కొత్త మోసం.. మీకు ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చో.. జాగ్రత్త మరీ!
మార్కెట్లోకి కొత్త దొంగలు వచ్చారు.. వీళ్ల రూటే వేరు.. వీళ్లు దొంగతనం చేసే పద్ధతే సపరేటు. వీళ్లు అందరిలా దోచుకోరు.. ఆపదలో ఉన్నట్టు నటిస్తారు.. నమ్మి దగ్గరికి వచ్చిన వారిని నట్టేట ముంచేస్తారు. అసలు వీళ్ల ప్లాన్ ఏంటి.. వీళ్లు ఎలా దోచుకుంటారో క్లారిటీగా తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.
- G Peddeesh Kumar
- Updated on: Jul 20, 2026
- 8:39 am