G Peddeesh Kumar

G Peddeesh Kumar

Staff Reporter - TV9 Telugu

peddeesh.ganji@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్‌గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నాను.

Read More
Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో భగ్గు మంటున్న వర్గ పోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..

Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో భగ్గు మంటున్న వర్గ పోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..

పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్‎లో గ్రూప్ వర్క్ కాక రేపుతోంది. ఏకంగా రాష్ట్ర మంత్రి.. అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్స్ వార్ ఆడియో ఆసక్తికర చర్చగా మారింది. ఏం దంకీ ఇస్తున్నావా అని ఎమ్మెల్యే మంత్రిని ప్రశ్నిస్తే.. దమ్కీ కాదు తగ్గేదే లే పరకాలలో నా గ్రూపు నీ గ్రూపు తేల్చుకుందాం అని మంత్రి హెచ్చరించడం కాక రేపుతోంది. పార్టీలో చేరికల విషయంలో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావటం తీవ్ర చర్చనీయాంశమైంది.

Telangana: సీసీ కెమెరాకు చిక్కిన దోపిడీ ముఠా.. ఇంతకీ ఏం దొంగిలించారో తెలుసా..?

Telangana: సీసీ కెమెరాకు చిక్కిన దోపిడీ ముఠా.. ఇంతకీ ఏం దొంగిలించారో తెలుసా..?

ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల పంప్‌ హౌస్‌లో భారీ చోరీ జరిగింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని పంప్ హౌజ్‌లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుల దోపిడీకి పాల్పడ్డారు. సబ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కర్రలు, కత్తులతో బెదిరించి దొరికినకాడికీ దోచుకుని పారిపోయారు. దొంగతనాలలో మంచి ఎక్స్ట్‌పర్ట్స్‌లా బిల్డప్ ఇచ్చిన ఈ ముఠా ఏం దొంగిలించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Drinkers Association: మందు బాబులకు అన్యాయం చేస్తే సహించేది లేదు.. తాగుబోతుల సంఘం హెచ్చరిక..

Drinkers Association: మందు బాబులకు అన్యాయం చేస్తే సహించేది లేదు.. తాగుబోతుల సంఘం హెచ్చరిక..

ఒక వ్యక్తి డాబు దర్పంతో హుందాగా కారులో నుంచి హుందాగా దిగారు.. అతనికి అక్కడున్న వారంతా ఘనస్వాగతం పలికారు. ఆయన ఏ రాజకీయపార్టీ నాయకుడు కాదు. తాగుబోతుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కొట్రంగి తరుణ్. ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం కోసం కాదు.. ఆయనకు మందు బాబులు పలికిన స్వాగతం అదో రేంజ్.. ఎన్నికల వేళ వీళ్ళ హడావుడి ఏంటి..! లిక్కర్ దుకాణాలను తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఆకస్మికంగా పరిశీలించి ఏం చేశాడో మీరే చూడండి...

Watch Video: వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి..

Watch Video: వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి..

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. చల్ల బడ్డ వాతావరణంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ వడగండ్లవానలు, పిడుగులు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు ఇద్దరు రైతులు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వాన ఊహించని నష్టాన్ని మిగిల్చింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. చేతికి అందిన పంట నీటి పాలైందని రైతులు రోధిస్తున్నారు. పంటలను కాపాడుకునే ప్రయత్నాల్లో వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు.

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. అంత్యక్రియలు ఎలా నిర్వహించారంటే..

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. అంత్యక్రియలు ఎలా నిర్వహించారంటే..

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో విచిత్ర సంఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ వానరంపై గ్రామస్తులు మమకారాన్నిచాటారు. అచ్చం ఇంటి మనిషి చనిపోతే ఎలా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారో అదే తరహాలో కాలనీవాసులు అంత్యక్రియలు జరిపించారు. ఈ గ్రామస్తుల ఔదార్యం చూసి ప్రతి ఒక్కరూ నివ్వేర పోయారు. అనారోగ్యంతో ఓ వానరం మృతి చెందింది. ఈ క్రమంలో ఆ వానరం పై మానవత్వం ప్రదర్శించిన గ్రామస్తులు మనిషి చనిపోతే ఏవిధంగా అంతిమ సంస్కరణలు చేస్తారో అదే తరహాలో వానరానికి దహన సంస్కారాలు చేపట్టారు.

Warangal MGM: వరంగల్ ఎంజీఎం మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు.. కుళ్ళిపోతున్న మృతదేహాలు

Warangal MGM: వరంగల్ ఎంజీఎం మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు.. కుళ్ళిపోతున్న మృతదేహాలు

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లోని మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడం లేదు. చల్లదనం కరవై.. ఎండల తీవ్రతకు అందులో ఉంచిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మార్చురీలో పనిచేసే వారి అవస్థ చెప్పనవసరం లేదు. దుర్వాసనకు మార్చురీ బయట ఉన్నవారు సైతం ముక్కుమూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

KCR: భారీ బందోబస్తుతో ఉండే కేసీఆర్.. రోడ్డు పక్కన గుడిసె హోటల్‌లో బజ్జీలు తింటూ కనిపించిన గులాబీ బాస్

KCR: భారీ బందోబస్తుతో ఉండే కేసీఆర్.. రోడ్డు పక్కన గుడిసె హోటల్‌లో బజ్జీలు తింటూ కనిపించిన గులాబీ బాస్

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను చేస్తున్న ఆయన.. ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో ఎల్లంపేట స్టేజ్ తండా దగ్గర తన కాన్వాయ్ ఆపించారు. రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న హోటల్‌లో కాసేపు సేదతీరారు. హోటల్‌లో బజ్జీలు, పకోడి తింటూ టీ తాగుతూ ఆస్వాదించారు.

Road Accident: మరణంలోనూ వీడని స్నేహం.. నలుగురి ప్రాణాలు బలితీసుకున్న అతివేగం..!

Road Accident: మరణంలోనూ వీడని స్నేహం.. నలుగురి ప్రాణాలు బలితీసుకున్న అతివేగం..!

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ద్విచక్ర వాహనం డీ కొట్టిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిర్లక్షం అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Warangal Mayor: గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్‌లో ఉన్నట్టా..? లేనట్లా..?

Warangal Mayor: గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్‌లో ఉన్నట్టా..? లేనట్లా..?

గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఇప్పుడు ఏ పార్టీ..? బీఆర్ఎస్‌లో ఉన్నట్టా..? లేనట్లా..? లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పర్యటనకు ఆమె డుమ్మా కొట్టారు. దీంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు సుధారాణి దూరంగా ఉండటం వెనుక అసలు కారణం ఏమిటి..?

Sub Registrar Taslima: అరెస్టైన నెలరోజులకు తస్లీమా ఇళ్లలో సోదాలు.. ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా?

Sub Registrar Taslima: అరెస్టైన నెలరోజులకు తస్లీమా ఇళ్లలో సోదాలు.. ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా?

మార్చి నెలలో ఓ ప్లాట్​ రిజిస్ట్రేషన్​ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్​ సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదైంది. తస్లీమా ఇంటితో పాటు ఆమె బందువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏకకాలంలో ఆరు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు.

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే..

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే..

ఓరుగల్లులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. అవి పక్కదేశం పాకిస్థాన్ వైపు దూసుకెళ్తున్నాయి. స్టేషన్ ఘన్‎పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి శివమెత్తారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య కడియం శ్రీహరిని భూస్థాపితం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు.

Telangana: తల్లితో గొడవ పడుతుందని నానమ్మను కత్తితో పొడిచిచంపిన మైనర్ బాలుడు..!

Telangana: తల్లితో గొడవ పడుతుందని నానమ్మను కత్తితో పొడిచిచంపిన మైనర్ బాలుడు..!

జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మనవడి చేతిలో నానమ్మ దారుణ హత్యకు గురైంది. తన తల్లితో నిత్యం గొడవ పడుతుందనే అక్కసుతో నానమ్మను కత్తితో పొడిచి చంపాడు 14 ఏళ్ల మైనర్ బాలుడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Latest Articles