ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
మేడారంలో ఓ దొంగ షాప్లోకి చొరబడి కొంతడబ్బు, షాప్ లో సామాగ్రి అపహరించుకుపోయాడు.. షాప్ లో చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగను పోలీసులు అతి సులభంగా పట్టేశారు.. ఎందుకంటే అతడు పాత నేరస్తుడు..
- G Peddeesh Kumar
- Updated on: Apr 15, 2026
- 11:18 am
Telangana: కోతుల కోసం పెట్టిన విషం లడ్డూ.. తెలియక తినేసిన నాలుగేళ్ల పసివాడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
కోతులను హతమార్చడం విషగుళికలు కలిపి బాలామృతంను లడ్డూగా చేసి పెట్టారు. ఆ విష గుళికలు కలిపిన పదార్థం తిన్న నాలుగేళ్ల బాలుడు నిండుప్రాణాలు కోల్పోగా మరో బాలిక చికిత్స పొందుతుంది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం బోరున వినిపిస్తుంది..
- G Peddeesh Kumar
- Updated on: Apr 13, 2026
- 5:12 pm
ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టుకుంటూ.. వీడియోలు షూట్ చేసిన మానవ మృగాలు..!
మత్తుకు బానిసలు అవుతున్న పోకిరిలు ఉన్మాదులుగా మారుతున్నారు. అత్యంత దారుణాలకు ఒడిగడుతున్నారు. అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. కొందరు కిరాతకులు సోషల్ మీడియా స్టార్స్ కావాలనే పాపపు ఆలోచనతో అమాయక ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వ్యూస్ కోసం ఓ వ్యక్తిని బండరాళ్లతో విచక్షణారహితంగా కొడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటన ఓరుగల్లులో కలకలం రేపింది .
- G Peddeesh Kumar
- Updated on: Apr 12, 2026
- 4:16 pm
Video: అడవిలో నుంచి వెళ్తున్న బస్సు.. బైక్కు సైడ్ ఇవ్వలేదని ఈ మందుబాబు ఏం చేశాడో మీరే చూడండి..
మద్యం మత్తులో ఓ యువకుడు ఆర్టీసీ బస్సుపై వీరంగం సృష్టించాడు. బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదన్న ఆవేశంతో నడిరోడ్డుపై బస్సును అడ్డగించి, రాళ్లతో అద్దాలు ధ్వంసం చేశాడు. జనసంచారం లేని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- G Peddeesh Kumar
- Updated on: Apr 11, 2026
- 2:17 pm
Video: ఈ రైతు ధైర్యానికి దండం పెట్టాల్సిందే.. పొలంలో వరి కోస్తుండగా కనిపించిన కొండచిలవ.. ఏం చేశాడో మీరే చూడండి..
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు అడుగుల పొడవు.. కళ్లముందు అంత పెద్ద కొండచిలువ కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. కానీ ఈ రైతు మాత్రం వెనకడుగు వేయలేదు.ఆ భారీ కొండచిలువను కర్రతో కొట్టి.. అమాంతం తన భుజాలపై వేసుకుని నడుచుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- G Peddeesh Kumar
- Updated on: Apr 11, 2026
- 12:18 pm
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్లో చోరీలు..సీన్ కట్చేస్తే..
వరంగల్ పోలీసులు ఛేదించిన ఈ అంతర్ జిల్లా బ్యాటరీ దొంగల ముఠా ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఈ ముఠాను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు వారి వద్ద 144 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు.. చేపల దొంగతనం నుంచి సెల్ టవర్ బ్యాటరీల చోరీ వరకు సాగిన వీరి ప్రస్థానానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. అదంతా చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే..
- G Peddeesh Kumar
- Updated on: Apr 11, 2026
- 12:04 pm
Watch: టమాటాలతో ఎంపీ చిత్రపటానికి అభిషేకం.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న రైతు..
వరంగల్ ఎంపీ కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా రైతులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. టమాటా రైతు సముద్రాల మధు ఎంపీ చిత్రపటానికి టన్ను టమాటాలతో అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆ టమాటాలను స్తానిక కూలీలు సంచుల్లో నింపుకొని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అభిమానుల సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
- G Peddeesh Kumar
- Updated on: Apr 10, 2026
- 5:26 pm
శివుడి స్పర్శ కోసమేనా..? నంది చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము.. వీడియో వైరల్!
అది మహత్యమో..! యాదృశ్చికమో.! గానీ గతవారం రోజులుగా ఆ ఆలయంలో నాగుపాము హల్చల్ చేస్తోంది. ఏడు అడుగుల నాగుపాము గర్భగుడి ముందు సంచరిస్తూ ఆలయ సిబ్బందిని పరుగులు పెట్టిస్తుంది. శైవక్షేత్రంలో నాగుపాము సంచారం శివుడి మహత్యమే అని ఆలయ పూజారులు భావిస్తున్నారు. ఈ అద్భుత ఘటన జనగామ జిల్లాలో వెలుగు చూసింది.
- G Peddeesh Kumar
- Updated on: Apr 10, 2026
- 4:32 pm
Telangana: 4 ఏళ్ల తర్వాత మళ్లీ బయటకొచ్చిన ర్యాగింగ్ భూతం.. జూనియర్స్ బట్టలు విప్పించి మరీ
రోజురోజుకూ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పెరిగిపోతుంది. తాజాగా వరంగల్లోని కాకాతీయ మెడికల్ కాలేజీలో జూనియర్ల విద్యార్థుల పట్ల సీనియర్స్ దారుణంగా ప్రవర్తించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న కాలేజ్ యాజమాన్యం. ర్యాగింగ్కు పాల్పడిన మొత్తం ఏడుగురు MBBS విద్యార్థులను హాస్టల్స్ నుండి శాశ్వత బహిష్కరణ చేయడంతో పాటు ఏడాది పాటు కాలేజ్ నుండి సస్పెండ్ చేసింది.యాజమాన్యం ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి వాళ్లు ఏం చేశారో తెలుసుకుందాం పదండి.
- G Peddeesh Kumar
- Updated on: Apr 10, 2026
- 1:48 pm
అయ్యో దేవుడా ఎంతపనైంది.. పండగ పూట వండిన మటన్ కర్రీ.. మనిషి ప్రాణం తీసింది..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. దామరవంచ శివారు పిల్లగుండ్లతండాకు చెందిన బానోత్ బిచ్చ (54) అనే రైతు, తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో దుర్గమ్మ పండుగ జరుపుకున్నారు. అందరూ కలిసి సరదాగా సహపంక్తి భోజనాలు చేస్తున్న సమయంలో, ఒక్కసారిగా మాంసం ముక్క ..
- G Peddeesh Kumar
- Updated on: Apr 9, 2026
- 1:26 pm
ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..
జనగామ జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసికందు కిడ్నాప్ కలకలం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంక్యుబేటర్ల వార్డులో చికిత్స పొందుతున్న పసికందును ఓ మాయలేడి కిడ్నాప్ చేసింది. బాలింతలా నటించి ఆ పసికందుకు పాలిస్తానని నమ్మించి.. కొంగులో చుట్టుకుని అపహరించింది.
- G Peddeesh Kumar
- Updated on: Apr 9, 2026
- 9:41 am
ఓరి నాయనో.. పగబట్టిందా ఏందీ.. దాడి చేసి, చేతి వేళ్ళు పీక్కొని పరుగులు పెట్టిన కుక్క..!
వరంగల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు అతని వేళ్ళు పీకేశాయి.. ఎడమచేతి ఉంగరం వేలును కొరికేసిన వీధి కుక్క తెగిపోయిన ఆ వేలుని గ్రామ శివారులో వదిలేసింది.. తీవ్ర అస్వస్థకుగురైన బాధితుడిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమువుతున్నాయి.
- G Peddeesh Kumar
- Updated on: Apr 7, 2026
- 6:57 pm