AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Peddeesh Kumar

G Peddeesh Kumar

Staff Reporter - TV9 Telugu

peddeesh.ganji@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్‌గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నాను.

Read More
Video: పోయిన 2 రోజుల తర్వాత ఇంటిముందు ప్రత్యక్షమైన నక్లెస్.. అసలు మ్యాటర్ తెలిస్తే..

Video: పోయిన 2 రోజుల తర్వాత ఇంటిముందు ప్రత్యక్షమైన నక్లెస్.. అసలు మ్యాటర్ తెలిస్తే..

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగిలించబడ్డ బంగారం అనూహ్యంగా ఇంటి ముందు ప్రత్యక్షమైంది. పోలీసుల విచారణ కొనసాగుతున్న క్రమంలో బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమవడం చూసి బాధితులు, ఖాకీలు అంతా షాక్ అయ్యారు. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందోనని తెగ ఆలోచిస్తున్నారు.

Yellow Chili: పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటిని దేనికి వాడుతారు.. ఎందుకంత డిమాండ్!

Yellow Chili: పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటిని దేనికి వాడుతారు.. ఎందుకంత డిమాండ్!

అంతర్జాతీయ మార్కెట్లో మన మిర్చి ఘాటుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. గత ఏడాది ధరలు లేక దిగులతో పట్టుకున్న రైతులు ఈసారి రికార్డులు సృష్టిస్తున్న ధరలు చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. అసలు పచ్చ మిర్చికి ఎందుకంత డిమాండ్. ఆ మిర్చిని ఎక్కడికి ఎగుమతి చేస్తారో తెలుసుకుందాం పదండి.

Medaram Jatara 2026: దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు.. AI టెక్నాలజీతో ఖాకీల మూడో కన్ను

Medaram Jatara 2026: దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు.. AI టెక్నాలజీతో ఖాకీల మూడో కన్ను

మేడారం మహాజాతర నిర్వహణలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధునిక హంగులతో సన్నద్దమవుతోంది. తొలిసారిగా ఎఐ టెక్నాలజీతో భద్రత కల్పించబోతున్నారు. AI టెక్నాలజీ కెమెరాలతో పాటు, 20 డ్రోన్స్ గగనతలం నుంచి డేగ కన్నుతో భద్రత పర్యవేక్షణ చేయబోతున్నారు. మేడారంలో ఏర్పాటుచేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచే చుట్టూ 20 కిలో మీటర్ల మేర ఎఐ టెక్నాలజీతో మూడో కన్ను నిఘా పెట్టారు. మేడారం జాతరలో పోలీస్ భద్రతపై స్పెషల్ రిపోర్ట్..

china manjha: నేలపై పడి తల్లడిల్లిన పావురం.. ప్రాణం పోసిన ట్రాఫిక్ కానిస్టేబుల్

china manjha: నేలపై పడి తల్లడిల్లిన పావురం.. ప్రాణం పోసిన ట్రాఫిక్ కానిస్టేబుల్

వరంగల్ బట్టలబజార్‌లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చైనా మంజా చుట్టుకొని పావురం నేలపై పడింది. పావురం రెక్కలకు మాంజా చుట్టుకొని గాయాలపాలైంది. మృత్యువుతో పోరాడుతున్న ఆ పావురాన్ని హఫీజ్ పాషా అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి.. స్థానికుడు నాగపూరి శ్రీధర్ సహాయంతో ఆ పావురానికి ప్రాణం పోశారు.

అతివల డైరెక్షన్ లో అమ్మల జాతర.. నూతన మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు.. ఎలా ఉందంటే..

అతివల డైరెక్షన్ లో అమ్మల జాతర.. నూతన మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు.. ఎలా ఉందంటే..

ఓరుగల్లు పేరు చెప్పగానే రాని రుద్రమదేవి పౌరుషం గుర్తుకొస్తుంది.. నారీమణుల నవశాఖానికి ఓరుగల్లు ఆడబిడ్డల పౌరుషాన్ని చిహ్నంగా భావిస్తారు.. సమ్మక్క సారక్క దేవతలను వీరవనితలుగా.. ధీరత్వానికి.. పౌరుషానికి.. ప్రతీకలుగా కొలుస్తారు.. పాలకుల ప్రయోగంతో ఓరుగల్లు స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది.. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా అంతా అతివల పాలనలోనే కొనసాగుతుంది..

పరుగెడుతూ బావిలో పడ్డ యువకుడు.. తీవ్ర గాయాలతో రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాటం!

పరుగెడుతూ బావిలో పడ్డ యువకుడు.. తీవ్ర గాయాలతో రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాటం!

గ్రామాలపై ఆకలి దాడులు చేస్తున్న కోతుల గుంపు మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కోతుల గుంపు ఓ యువకుడిని ప్రమాదంలో పడేశాయి. కోతుల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడ్డ ఆ యువకుడు రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాటం చేసి మృత్యుంజయుడయ్యాడు.

ధరణి వద్దని భూ భారతి తీసుకువస్తే.. బయటపడ్డ భారీ స్కామ్.. వెలుగులోకి సంచలనాలు

ధరణి వద్దని భూ భారతి తీసుకువస్తే.. బయటపడ్డ భారీ స్కామ్.. వెలుగులోకి సంచలనాలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 15మంది నిందితులను వరంగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో ముగ్గురిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. దీంతో ధరణి, భూ భారతి స్కామ్‌ డొంక కదుతుతోంది. ఒకవైపు అరెస్టుల పర్వం, మరోవైపు.. కేసు విచారణ బాధ్యతలు ఏకంగా జనగామ ఏసీపీకి అప్పగించడం ఆసక్తిగా మారుతోంది.

వావ్.. అమేజింగ్.. కోళ్లు, మేకలు, పాడి పశువులకు అందాల పోటీలు.. సంక్రాంతి సంబురం అదుర్స్..

వావ్.. అమేజింగ్.. కోళ్లు, మేకలు, పాడి పశువులకు అందాల పోటీలు.. సంక్రాంతి సంబురం అదుర్స్..

సంక్రాంతి సందర్భంగా కోడి పుంజుల పందాలు, రంగుల ముగ్గులు, పతంగులు, జాతరలు రెగ్యులర్ గా చూస్తుంటాం.. కానీ రొటీన్ కు భిన్నంగా ఆ ఊర్లో నిర్వహించిన మూగజీవుల అందాల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి.. రైతు జీవిత నేస్తాలుగా తోడ్పడే పాడి గేదెలు, దుక్కిటేద్దులు, ఆవులు, కోళ్లు మేకలతో అందాల పోటీలు నిర్వహించారు..

కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడికి విచిత్ర మొక్కలు.. కోరిక తీరాలంటే ఏం చేస్తారో తెలుసా..?

కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడికి విచిత్ర మొక్కలు.. కోరిక తీరాలంటే ఏం చేస్తారో తెలుసా..?

ఆ దేవుడికి గుమ్మడి కాయలే మహా నైవేద్యం.. అక్కడ గుమ్మడి కాయ సమర్పిస్తే మొక్కు తీరినట్లే..! ఎంతటి వారైనా సరే కోరికలు నెరవేరిన ప్రతిఒక్కరూ నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని కోర మీసాల వీరభద్రుడి వద్దకు క్యూ కట్టాల్సిందే..! ఇంతకీ ఆ గుమ్మడకాయ మొక్కులెంటీ..? ఎక్కడుంది ఆ దేవాలయం..? ఎందుకు గుమ్మడికాయ మొక్కు చెల్లిస్తారు..?

కోరమీసాల మొక్కలు.. శివసత్తుల పూనకాలు, గజ్జల్లాగులు, ఒగ్గు కథలతో దద్దరిల్లిన మల్లన్న క్షేత్రం!

కోరమీసాల మొక్కలు.. శివసత్తుల పూనకాలు, గజ్జల్లాగులు, ఒగ్గు కథలతో దద్దరిల్లిన మల్లన్న క్షేత్రం!

సంక్రాంతి పండుగంటే రంగుల ముగ్గులు, కోడిపుంజుల పందాలే కాదు.. తెలంగాణలో జాతరలు ప్రత్యేకత.. తెలంగాణ జనాన్ని ఐనవోలు మల్లన్న జాతర సంథింగ్ స్పెషల్..! అక్కడ మల్లన్న అవహిస్తే ఎలా పూనకాలతో శివమెత్తిపోతారో తెలుసా..? గజ్జల్లాగులు.. డమరుక నాధాలు.. పట్నం ముగ్గులు, ఒగ్గు డోలి వాయిద్యాలతో దద్ధరిల్లే జానపదుల జాతర ఐనవోలు మల్లన్న జాతర విశిష్టత ఏంటి..? అక్కడ అడుగు పెట్టగానే వారు ఎందుకలా శివమెత్తిపోతారు..? నిజంగానే వారిపై మల్లన్న ఆవహిస్తాడా..? జాతర విశేషాలేంటో చూసొద్దాం రండి..!

మేడారంలో తప్పిపోయిన పాప.. చిన్నారిని స్వయంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన మంత్రి సీతక్క

మేడారంలో తప్పిపోయిన పాప.. చిన్నారిని స్వయంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన మంత్రి సీతక్క

తెలంగాణ కుంభమేళా.. మహాజాతరకు ముందే మేడారంకు భక్తులు పోటెత్తారు. రోజుకు లక్ష మందికి పైగా సమ్మక్క-సారక్క దేవతల దర్శనానికి తరలివస్తున్నారు. ఆదివారం (జనవరి 11) ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా మేడారంకు భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు జనంతో కిక్కిరిసింది. అయితే ఈ వాగులో ఓ బాలిక మిస్సయింది. తప్పిపోయిన ఆ పాప ఏడుస్తూ తిరగడాన్ని గమనించిన మంత్రి సీతక్క ఆ చిన్నారిని చేరదీసి ఎత్తుకున్నారు.

వీడిన యాచకుల పిల్లల కిడ్నాప్ మిస్టరీ.. ఖాకీల గుండెలు కదిలించిన విషాద ఘటన..!

వీడిన యాచకుల పిల్లల కిడ్నాప్ మిస్టరీ.. ఖాకీల గుండెలు కదిలించిన విషాద ఘటన..!

పోలీసులు వారి వృత్తి ధర్మంలో ఎన్నో కేసులు పరిష్కరించి ఉంటారు.. కానీ కొన్ని ఘటనలు అటు ఖాకీలు, ఇటు సామాన్యుల గుండెలను కదిలిస్తాయి. అలాంటి కథనాలు జర్నలిస్టులను కూడా చెల్లించిపోయేలా చేస్తాయి. అలాంటి సంఘటనే ఇది.. యాచకుల వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారులు ఉన్నత కుటుంబాల వద్దకు చేరారు. వాళ్ల జీవితాలు బాగుపడ్డాయి అనుకుంటే.. ఆ కిడ్నాపర్లు ఖాకీలకు చిక్కడంతో వారి తలరాత మళ్ళీ వెనక్కి తిరిగింది.