ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
Telangana: తెలంగాణలో కలకలం.. సామాజికవేత్త రాజలింగమూర్తి దారుణ హత్య..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారింది.. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడిచేసి అత్యంత విచక్షణారహితంగా చంపారు.. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి..
- G Peddeesh Kumar
- Updated on: Feb 20, 2025
- 8:34 am
Warangal: ప్రేమికుల రోజున రైల్వే స్టేషన్లో పాడు పని.. పోలీసుల అదుపులో జంట..
చూడడానికి ఉన్నత కుటుంబాలకు చెందిన వారుగా కనిపించే ఆ దంపతుల దందా తెలిస్తే అబ్బో అనిపిస్తుంది.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఆ కిలాడి దంపతులు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ వరంగల్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు..ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ దంపతులు దురాశతో ప్రేమికుల రోజునే కటకటాల పాలయ్యారు.. వారి నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 20 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు...
- G Peddeesh Kumar
- Updated on: Feb 15, 2025
- 10:22 am
Telangana: ఒళ్ళంతా చెమటల పట్టించి ప్రభుత్వ అధికారులను నిలువు దోపిడీ చేసిన మాయగాళ్లు..!
అధికారుల పేరుతో బెదిరింపులు, వాలంటైన్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ఫేక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్ట్ కార్డులు పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి మాయ వలలో చిక్కుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 14, 2025
- 5:41 pm
Telangana: నాలుగు రోజులుగా తండ్రి శవాన్ని ఇంటి ముందు వదిలేసిన కసాయి పిల్లలు..!
సోదరి పేరిట ఉన్న రెండెకరాల భూమి తిరిగి తనకు రిజిస్ట్రేషన్ చేస్తేనే తలకొరివి పెడతానని మొండిపట్టుపట్టాడు. ఆ కూతురు మెట్టు దిగరానంటుంది. కొడుకు ఆస్తి ఇస్తే తప్ప తలకోరు పెట్టే ప్రసక్తే లేదంటున్నారు. నాలుగు రోజులనుండి ఆ తండ్రి ఆత్మ ఘోషిస్తున్నా కొడుకు, కూతురు కనికరంలేని కసాయి మనసుల్లా వ్యవరిస్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 13, 2025
- 3:55 pm
Medaram Jatara: తెలంగాణ కుంభమేళా.. నేటి నుంచి మేడారం మినీ జాతర షురూ.. విశేషం ఏంటంటే..
సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో మినీ జాతర సందడి మొదలైంది.. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.. మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తున్నారు.. మినీ జాతర విశిష్టత ఏంటి..? ఎలాంటి పూజలు నిర్వహిస్తారు.? నాలుగు రోజుల వేడుక విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
- G Peddeesh Kumar
- Updated on: Feb 12, 2025
- 9:23 am
Telangana: రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. రోజూ అంతే.. అంతు చిక్కని మిస్టరీ
ఇదో విచిత్ర సంఘటన.. చీకటి పడితేచాలు ఆ కాలనీ ప్రజలంతా రాళ్ల భయంతో హడలెత్తిపోతున్మారు.. నలు దిక్కుల నుండి ఇళ్లపై రాళ్ళ వర్షం కురుస్తుండడంతో అక్కడి ప్రజలకు రాత్రంతా జాగారమే.. దెయ్యమో.. భూతమో.. లేక ఎవరైనా చేతబడి చేశారో ఏమో అని తెగ ఆందోళన చెందుతున్నారు.. రాత్రంతా కునుకు లేకుండా గస్తీ నిర్వహిస్తున్నారు.. అక్కడ ఏం జరుగుతుంది... ? ఎవరికీ అంతుచిక్కని ఆ వింత సమస్యను తెలుసుకుందాం పదండి..
- G Peddeesh Kumar
- Updated on: Feb 11, 2025
- 8:22 am
Telangana: గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా
నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికులను అడలెత్తిపోయేలా చేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ క్షుద్రపూజల కలకలం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది.. వరుసగా క్షుద్ర పూజల సంఘటనలతో హడలెత్తిపోతున్న స్థానికులు.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
- G Peddeesh Kumar
- Updated on: Feb 10, 2025
- 9:02 pm
Telangana: ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్న జిల్లా కలెక్టర్.. ఏకంగా 31 మందికి షోకాస్ నోటీసులు..!
సంకేతాలు పెట్టి ఎక్కడకు వెళ్లారు.. ఎందుకు వెళ్లారని వివరాలు సేకరించిన కలెక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై తన మార్కు చూపించారు. వివిధ విభాగాలలో కలిపి మొత్తం 31 మంది రిజిస్టర్ల సంతకం పెట్టుకుని పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లిన వారికి షోకాస్ నోటీసులు జారీ చేశారు. సమయపాలన పాటించని అధికారుల పైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు
- G Peddeesh Kumar
- Updated on: Feb 10, 2025
- 7:37 pm
Kakatiya University: కాకతీయలో గ్యాంగ్ వార్..! 8 మంది జూనియర్, 10 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు
వీళ్లు విద్యార్థులా...? వీధి రౌడీలా..? అనే అనుమానం కలిగేలా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చి పోయారు... సీనియర్ - విద్యార్థుల గ్యాంగ్ వార్ తో ఆ విశ్వవిద్యాలయం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు యూనివర్సిటీలో మళ్లీ ఘర్షణ వేయకుండా ముందస్తుగా మోహరించారు...8 మంది జూనియర్లు, 10 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు..
- G Peddeesh Kumar
- Updated on: Feb 8, 2025
- 8:44 am
Telangana: 42 ఏళ్ల తర్వాత మహత్తర ఘట్టం.. మూడు రోజుల పాటు కాళేశ్వర ముక్తేశ్వరస్వామి క్షేత్రంలో మహా కుంభాభిషేకం
కుంభాభిషేకం జరిగే ఈ మూడు రోజులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. నిర్వాహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యలు కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 7, 2025
- 10:30 am
Telangana: ఇద్దరు పంతులమ్మల మధ్య విభేదాలు.. బాలికలను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్
Telangana: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల పాఠశాలలో జరిగింది. రమాదేవి అనే వైస్ ప్రిన్సిపాల్ ఐదుగురు 9వ తరగతి చదువుతున్న ఐదుగురు బాలికలను చితికబాదింది. చేతులకు వాతలు వచ్చేలా కర్రతో కొట్టింది. టీచర్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు పిల్లలపై చూపడం ఏంటని బాలికల తల్లిదండ్రులు ప్రశ్నించారు..
- G Peddeesh Kumar
- Updated on: Feb 6, 2025
- 7:04 pm
Mini Medaram Jathara: మినీ మేడారం జాతరకు వేళాయే.. వేడుకలు ఎప్పటినుంచంటే..
మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది.. వారం రోజుల ముందు ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే పూజా కార్యక్రమాలు వేడుకలు వైభవంగా నిర్వహించారు.. మేడారంతోపాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార పూజ నిర్వహించారు.. ఆ పూజలు ఎలా ఉంటాయి..? ఏం చేస్తారో తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..
- G Peddeesh Kumar
- Updated on: Feb 5, 2025
- 9:49 pm