AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashok Bheemanapalli

Ashok Bheemanapalli

Senior Correspondent - TV9 Telugu

ashok.bheemanapalli@tv9.com
High Court: మెటర్నెటీ లీవ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. ఇకపై వారికి కూడా సెలవులు..

High Court: మెటర్నెటీ లీవ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. ఇకపై వారికి కూడా సెలవులు..

మొదటి ప్రసవంలో కవలలు పుట్టారని చెప్పి.. రెండో గర్భధారణకు ప్రభుత్వ మహిళా ఉద్యోగికి ప్రసూతి సెలవు (మేటర్నిటీ లీవ్) నిరాకరించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మహిళల ఆరోగ్యం, తల్లి-శిశు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలను మానవీయంగా అర్థం చేసుకోవాలని కోర్టు పేర్కొంది.

సాంకేతిక విద్యకు నాంది.. తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలలో హ్యూమనాయిడ్ రోబో టీచర్లు!

సాంకేతిక విద్యకు నాంది.. తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలలో హ్యూమనాయిడ్ రోబో టీచర్లు!

రంగారెడ్డి జిల్లా జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు హ్యూమనాయిడ్ రోబో టీచర్లు త్వరలో బోధన ప్రారంభించనున్నాయి. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక బోధన, మెంటరింగ్, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి, సాంకేతిక ఆధారిత విద్యకు కొత్త దిశ లభించనుంది. దీంతో జన్వాడ ZPHS తెలంగాణలో ఈ సదుపాయం పొందిన తొలి ప్రభుత్వ పాఠశాలగా నిలవనుంది.

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం.. బుసలు కొడుతున్న పిల్ల నాగుల వీడియో ఇదిగో

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం.. బుసలు కొడుతున్న పిల్ల నాగుల వీడియో ఇదిగో

Madhuranagar Police Station: హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మూడు నాగుపాము పిల్లలు కనిపించడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్’ సంస్థకు సమాచారం అందించగా, రెస్క్యూ బృందం సురక్షితంగా పాములను పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించింది. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు.

Weather: తెలంగాణలో ‘మాన్సూన్ బ్రేక్’..? జూలై 12 నుంచి 15 వరకు రాష్ట్రంలో

Weather: తెలంగాణలో ‘మాన్సూన్ బ్రేక్’..? జూలై 12 నుంచి 15 వరకు రాష్ట్రంలో

తెలంగాణలో ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన విధంగా కొనసాగడం లేదు. జూలై 15 వరకు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు బలహీనపడటంతో 'మాన్సూన్ బ్రేక్' పరిస్థితులు ఏర్పడి, పలు జిల్లాల్లో 37-40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

చదువు ఎక్కువ.. జీతం తక్కువ.. GHMC ఐటీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ చూస్తే షాక్!

చదువు ఎక్కువ.. జీతం తక్కువ.. GHMC ఐటీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ చూస్తే షాక్!

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ విడుదల చేసిన తాజా ఐటీ నియామకాల నోటిఫికేషన్ ఇప్పుడు చర్చకు కారణమైంది. మంచి చదువు, అనుభవం ఉన్న ఐటీ నిపుణులను నియమించేందుకు ముందుకొచ్చినా, వారికి ప్రకటించిన నెల జీతాలు చాలా తక్కువగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న శాశ్వత శానిటేషన్ సిబ్బంది జీతాలతో పోలిస్తే ఐటీ ఉద్యోగాలకు నిర్ణయించిన వేతనాలు తక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వర్క్ సైట్ స్కూల్.. తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. ఆ పిల్లలకు వరం!

వర్క్ సైట్ స్కూల్.. తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. ఆ పిల్లలకు వరం!

హైదరాబాద్‌లో వలస కార్మికుల పిల్లల చదువు సమస్యకు తెలంగాణ ప్రభుత్వం 'వర్క్ సైట్ స్కూళ్లతో' వినూత్న పరిష్కారం చూపుతోంది. నిర్మాణ ప్రాంగణాల వద్దే విద్య, భద్రత కల్పిస్తూ నార్సింగిలో తొలి పాఠశాల ప్రారంభమైంది. ఇది పిల్లలకు చదువుతో పాటు సురక్షిత వాతావరణాన్ని అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని క్యాంపుల్లో విస్తరించేందుకు ప్రణాళికలున్నాయి.

హైదరాబాద్‌లో మళ్లీ సందడి చేస్తున్న పిచ్చుకలు.. 20 వేల పక్షులను తిరిగి తీసుకొచ్చిన అద్భుత ప్రయత్నం

హైదరాబాద్‌లో మళ్లీ సందడి చేస్తున్న పిచ్చుకలు.. 20 వేల పక్షులను తిరిగి తీసుకొచ్చిన అద్భుత ప్రయత్నం

ఒకప్పుడు ప్రతి ఇంటి ముంగిట, ప్రతి చెట్టు కొమ్మపై కిచకిచలాడే పిచ్చుకలు. ఇప్పుడు కనిపిస్తేనే ఆశ్చర్యపడే పరిస్థితి. వేగంగా పెరిగిన నగరీకరణ, కాంక్రీట్ అడవులు, గూళ్లు కట్టుకునే ప్రదేశాల కొరత, ఆహారం తగ్గిపోవడం, కాలుష్యం.. ఇలా ఎన్నో కారణాలతో హైదరాబాద్‌లో పిచ్చుకల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోయింది.

Wasim Jaffer : హైదరాబాద్ క్రికెట్‌కు అసలోడు వచ్చిండు.. సరికొత్త బాధ్యతల్లో టీమిండియా మాజీ ఓపెనర్

Wasim Jaffer : హైదరాబాద్ క్రికెట్‌కు అసలోడు వచ్చిండు.. సరికొత్త బాధ్యతల్లో టీమిండియా మాజీ ఓపెనర్

Wasim Jaffer : భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెండేళ్ల పాటు మెంటర్‌గా నియమించింది. సీనియర్, ఏజ్‌గ్రూప్ జట్లతో కలిసి పనిచేస్తూ యువ ఆటగాళ్ల అభివృద్ధి, దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

రైతులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ఉచితంగా విత్తనాలు.. ‘రైతు వేదిక’ ద్వారా పంపిణీ!

రైతులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ఉచితంగా విత్తనాలు.. ‘రైతు వేదిక’ ద్వారా పంపిణీ!

తెలంగాణలో పత్తి సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పత్తి ఉత్పాదకతను భారీగా పెంచడంతో పాటు సాగు నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 19 జిల్లాలకు చెందిన రైతులకు పూర్తి ఉచితంగా ‘బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను’ అందించే భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇక సర్కార్ బడి టీచర్లకు డబుల్ బెనిఫిట్స్

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇక సర్కార్ బడి టీచర్లకు డబుల్ బెనిఫిట్స్

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మాత్రమే అందుతున్న ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికీ విస్తరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ-కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది..

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త.. జీతాలపై బిగ్ అప్డేట్..

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త.. జీతాలపై బిగ్ అప్డేట్..

తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. ఇక నుంచి ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు జమ చేయనుంది. ఈ మేరకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు చాలా ఆలస్యంగా జీతాలు జమ అయ్యేవి.

Telangana FLN Tests: పేపర్లతో పనిలేదు.. ఇకపై ఆ విద్యార్థులకు యాప్‌ల ద్వారే పరీక్షల నిర్వహణ!

Telangana FLN Tests: పేపర్లతో పనిలేదు.. ఇకపై ఆ విద్యార్థులకు యాప్‌ల ద్వారే పరీక్షల నిర్వహణ!

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2-5 తరగతుల విద్యార్థుల అభ్యసన స్థాయి (FLN) తెలుసుకునేందుకు ప్రత్యేక బేస్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ పరీక్షలకు 11.90 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. చదవడం, రాయడం, లెక్కల ప్రాథమిక నైపుణ్యాలను అంచనా వేసి, వారి పురోగతిని గుర్తించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.