Hyderabad: కోకాపేట్లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే..
కోకాపేట్లో భూముల వేలానికి హెఎండీఏ సిద్ధమైంది. అత్యంత ఖరీదైన నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలో భూములకు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 9 వరకు వేలంలో నిర్వహించనుంది. నియోపోలిస్లో ఎకరం కనీస ధరను రూ.120 కోట్లుగా, గోల్డెన్ మైల్లో రూ.70 కోట్లుగా ఖరారు చేసింది. గతంలోనే భూముల ధరలు రికార్డులు తిరగరాయగా.. ఈసారి అంతుకుమించి అనేలా ఉంది.
- Ashok Bheemanapalli
- Updated on: Aug 11, 2026
- 9:03 pm
Telangana: మీ ఇంట్లో ఖాళీ రూమ్స్ ఉన్నాయా..? బోల్డెంత ఆదాయం మీ సొంతం.. తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్..
మీ ఇంట్లో పర్యాటకులకు వసతి, ఫుడ్ సౌకర్యం ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ మేరకు హోమ్ స్టే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇందుకోసం ముందుగా పర్యాటకశాఖకు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించి మీకు అనుమతి మంజూరు చేస్తారు. ఇది ఎలా పని చేస్తుందంటే..
- Ashok Bheemanapalli
- Updated on: Aug 11, 2026
- 12:54 pm
Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ నరకానికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు భారీ ప్రణాళికతో రంగంలోకి దిగారు. రోడ్లపై పడే అక్రమ పార్కింగ్లపై ఉక్కుపాదం మోపడంతో పాటు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించేందుకు కసరత్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Ashok Bheemanapalli
- Updated on: Aug 6, 2026
- 1:14 pm
తెలంగాణ మహిళలకు భలే గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ఎలక్ట్రిక్ వాహనాలు ఇక కేవలం పర్యావరణ పరిరక్షణకే పరిమితం కావడం లేదు. ఉపాధి కోసం కొత్త అవకాశాలను కూడా తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా ప్రత్యేక రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేందుకు తక్కువ వడ్డీపై రుణాలు పొందేలా ప్రణాళిక రూపొందించారు.
- Ashok Bheemanapalli
- Updated on: Aug 6, 2026
- 12:22 pm
ఇంటి నుంచే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ చేసింది. వాట్సాప్, మీ సేవ వెబ్సైట్, హెల్ప్డెస్క్ల ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, అర్హతలు, చివరి తేదీ, హెల్ప్లైన్ నంబర్లను కూడా ప్రకటించింది. హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ పరిధిలో దరఖాస్తులకు 2026 ఆగస్టు 10 వరకు గడువు ఉంది.
- Ashok Bheemanapalli
- Updated on: Aug 4, 2026
- 12:39 pm
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో భారీ మార్పు.. అందుకోసం హెచ్సీఏ అదిరిపోయే ప్లాన్..!
Uppal Stadium: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేందుకు హెచ్సీఏ కీలక నిర్ణయం తీసుకుంది. వర్షపు నీటిని సేకరించి శుద్ధి చేసే వ్యవస్థ ద్వారా ఏటా 2-3 కోట్ల లీటర్ల నీటిని వినియోగించే ప్రణాళికను ఎన్జీటీకి వివరించింది.
- Ashok Bheemanapalli
- Updated on: Aug 4, 2026
- 12:17 pm
ChatGPTతో ఫేక్ ఫ్లైట్ టికెట్.. గోవా ట్రిప్కు బదులు పోలీస్ స్టేషన్కు!
ChatGPT: ఈ ఘటనపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి, అస్లంకు నోటీసులు జారీ చేశారు. AI సాయంతో రూపొందించిన నకిలీ టికెట్స్, ఇతర డాక్యుమెంట్స్ చట్టపరమైన సమస్యలకు దారి తీస్తాయని, ఇలాంటి చర్యలు సరదాగా చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని..
- Ashok Bheemanapalli
- Updated on: Aug 4, 2026
- 12:05 pm
Hyderabad: ఏఐతో మ్యాజిక్ చేసిన తల్లిదండ్రులు.. వీళ్ల టాలెంట్కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
హైదరాబాద్కు చెందిన ఓ తండ్రీకొడుకులు ఏఐతో మ్యాజిక్ చేశారు. వాయిస్ కమాండ్స్తో పనిచేసే రోబోటిక్ ఆర్మ్ అభివృద్ది చేశారు. వీరి ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు. రోబోటిక్ ఆర్మ్కు 3D డిజైన్ రూపొందించారు. వీళ్లు దీనిని నెటిజన్లతో పంచుకోగా.. వైరల్గా మారింది. ఈ వివరాలు చూస్తే..
- Ashok Bheemanapalli
- Updated on: Aug 3, 2026
- 7:22 pm
Telangana: ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు శుభవార్త.. అక్కడ ఎంట్రీ ఫ్రీ..
ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. హైదరాబాద్లోని సాలార్ జంగ్ మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీఈవోలు ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేశారు.
- Ashok Bheemanapalli
- Updated on: Aug 3, 2026
- 4:46 pm
Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది..
విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కుల మెమోలను మరింత మన్నికగా మార్చే కీలక నిర్ణయం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక నాన్-టియరబుల్ టెక్నాలజీతో రూపొందించిన లాంగ్ మెమోలను అందించనుంది. ఇవి చిరిగిపోకుండా, నీటిలో తడిసినా దెబ్బతినకుండా ఉండేలా ప్రత్యేక సింథటిక్ షీట్పై డిజిటల్ ప్రింటింగ్తో తయారు చేస్తున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Aug 3, 2026
- 4:34 pm
27 సార్లు ఫెయిల్.. అయినా వెనక్కి తగ్గలేదు.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ
ఎన్నిసార్లు రిజెక్షన్స్ ఎదురైనా ప్రయాణం ముగిసిపోదు. లక్ష్యాన్ని చేరేవరకు ప్రయత్నిస్తే విజయం తప్పక సొంతమవుతుందనే విషయాన్ని హైదరాబాద్కు చెందిన సౌమిత్ చింతల జీవిత ప్రయాణం నిరూపించింది. నేడు ఉద్యోగం రాకపోయినా, ఉన్నత విద్యలో అవకాశం దక్కకపోయినా చాలామంది నిరాశకు గురవుతున్నారు. అయితే వరుసగా 27 విద్యాసంస్థలు తిరస్కరించిన యువకుడే నేడు ప్రపంచ AI రంగాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాడు. AI రంగానికి వెన్నెముకగా నిలిచిన పైటార్చ్ అనే ప్రముఖ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్కు ఈయన కో ఫౌండర్. Meta సంస్థలో దాదాపు 11 సంవత్సరాల పాటు పనిచేసిన సౌమిత్.. ప్రస్తుతం Thinking Machines సంస్థలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు..
- Ashok Bheemanapalli
- Updated on: Jul 29, 2026
- 5:29 pm
Telangana: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. ఎంతంటే..?
తెలంగాణలో సామాన్యులకు షాకింగ్ న్యూస్. బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఎల్నివో ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోతుందనే ఆందోళనలు రేకెత్తుతున్నాయి. దీని వల్ల వ్యాపారులు బియ్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఈ కారణంతో ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగాయి.
- Ashok Bheemanapalli
- Updated on: Jul 29, 2026
- 4:19 pm