HMDA E-Auction: హైదరాబాద్లో రియల్ భూమ్.. ఆ ప్రాంతంలో రూ.80వేలు పలికిన గజం భూమి ధర!
హైదరాబాద్లో భూముల రేట్ల కళ్లేంలేని గుర్రంలా దూసుకుపోతున్నాయి. తాజాగా మేడిపల్లి రెసిడెన్షియల్ లేఅవుట్లో HMDA నిర్వహించిన మూడో విడత ఈ-వేలం ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. అక్కడ ఒక్క గజం భూమి ఏకంగా రూ.80వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలంలో మొత్తం 63 ప్లాట్ల విక్రయించిన HMDA రూ.120 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. తూర్పు హైదరాబాద్లో నివాస స్థలాలకు ఉన్న అధిక డిమాండ్ను ఇది స్పష్టం చేసింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 25, 2026
- 4:50 pm
Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్లో రైతు భరోసా నిధులు..
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వానాకాలం సీజన్ రైతు భరోసా ఆర్థిక సాయం విడుదలకు ముహూర్తం ఖరారైంది. డిప్యూటీ సీఎం భట్టి ఇలాక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 18, 2026
- 3:33 pm
Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్గా హైదరాబాద్ టెక్కీ..
హైదరాబాద్కు చెందిన కుమార్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసిన ఆయన, మంచి జీతం ఉన్నప్పటికీ ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్గా మారారు. డ్రైవింగ్పై ఉన్న ఆసక్తిని వృత్తిగా ఎంచుకుని, 2014 నుంచి ఇప్పటివరకు 23,600కు పైగా ట్రిప్పులు పూర్తి చేశారు. ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలవడం, వారి అనుభవాలు తెలుసుకోవడం తనకు ఆనందాన్ని ఇస్తోందని కుమార్ చెబుతున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 17, 2026
- 11:56 am
Telangana: ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. ఈ క్యాంపస్ ప్రత్యేక ఏంటో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆరుట్లలో నిర్మించిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ రిబ్బన్ కట్ చేసి స్టార్ట్ చేశారు సీఎం రేవంత్. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్యను అందించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 17, 2026
- 10:39 am
High Court: విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు హైకోర్టు వార్నింగ్
రాష్ట్రంలోని విద్యార్థులకు ఇదో బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికేజ్ జారీ చేసే విషయంపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదనే సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ తమ వద్దే ఉంచుకునే ప్రైవేటు సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 12, 2026
- 2:52 pm
Hyderabad: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hyderabad: డబుల్ బెడ్రూం కాలనీల్లో నివసించే కుటుంబాలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మినీ రైతు బజార్లు, షాపింగ్ కాంప్లెక్సులు, నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న కొన్ని దుకాణాలను వేలం వేసిన..
- Ashok Bheemanapalli
- Updated on: Jun 12, 2026
- 1:19 pm
Telangana: ఫ్యాన్సీ నెంబర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక 30 కాదు 60 రోజులు
కొత్త వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోవాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఫ్యాన్సీ నంబర్ ఎంపిక కోసం ఇప్పటివరకు ఉన్న 30 రోజుల గడువును 60 రోజులకు పెంచింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన తేదీ నుంచి రెండు నెలలలోపు వాహన యజమానులు తమకు నచ్చిన నంబర్ను బుక్ చేసుకోవచ్చు.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 12, 2026
- 11:58 am
హైదరాబాద్ రియల్ ధమాకా.. బంజారాహిల్స్ టు మోకిలా.. మరో మెగా ల్యాండ్ వేలానికి సిద్ధమైన HMDA!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన ప్రభుత్వ భూముల వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల రికార్డు ధర పలకడంతో ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు మరో మెగా ఈ-వేలానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని అత్యంత విలువైన ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లోని భూములను మార్కెట్లోకి తీసుకురానుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 10, 2026
- 12:32 pm
Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట.. ఆ కేసులపై హైకోర్టు కీలక ఆదేశాలు
2018లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 354ఏ, 504, 506, 509తో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 67 కింద రామ్ గోపాల్ వర్మ మీద కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడీ కేసుకు సంబంధించే తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 18, 2026
- 10:56 pm
హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..
చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి జిల్లా విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 10, 2026
- 9:56 am
Osmania University: కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి భారీ విరాళం
కన్న తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో.. చదువు నేర్పిన అమ్మలాంటి విశ్వవిద్యాలయానికి ఆపన్నహస్తం అందిస్తూ ఓ మాజీ విద్యార్థి తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి తెల్ల గోపాలరావు.. తన 'టెల్లా సకమోటో ఫౌండేషన్' ద్వారా ఓయూకు రూ.95లక్షలు విరాళం అందించారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 9, 2026
- 3:28 pm
Hyderabad: రెండేళ్లుగా వేధించిన అధిక రక్తపోటుకు చెక్.. గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
Rare Surgery Successfully: హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల ఆమె పరిస్థితి మరింత విషమించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించగా, ఆమెకు "ఫియోక్రోమోసైటోమా" (Pheochromocytoma) అనే అత్యంత..
- Ashok Bheemanapalli
- Updated on: Jun 7, 2026
- 11:14 am