Banking Coaching: నిరుద్యోగులకు సూపర్ గుడ్న్యూస్.. ఉచితంగా బ్యాంక్ కోచింగ్.. ఇదిగో పూర్తి వివరాలు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచిత కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రొబేషనరీ ఆఫీసర్లు , క్లర్క్ పోస్టుల కోసం నిర్వహించే ఈ కోచింగ్ కార్యక్రమం మొత్తం 75 రోజుల పాటు కొనసాగుతుంది. మే 20, 2026 నుంచి హైదరాబాద్లోని PETC కేంద్రంలో తరగతులు ప్రారంభమవుతాయి.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 25, 2026
- 4:30 pm
ఇది కదా గుడ్న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదించొచ్చు.. ఎలా అంటే?
రహదారి పక్కన భూమి ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం అదరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాధించే ఛాన్స్ కల్పిస్తోంది. రోజురోజుకూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, TGREDCO రాష్ట్రవ్యాప్తంగా 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూస్వాముల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
- Ashok Bheemanapalli
- Updated on: Apr 25, 2026
- 5:47 pm
Allu Arjun : అల్లు అర్జున్కు ఢిల్లీ హైకోర్టు రక్షణ.. అసలు ఏం జరిగిందంటే..
ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తుంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) రక్షణ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 21, 2026
- 6:10 pm
Hyderabad: ఇలా ఉన్నారేంట్రా.. పోలీస్ ఆఫీసర్కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే..
పగలు అయినా.. రాత్రి అయినా.. ఆకలేస్తే వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టాల్సిందే.. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. ఇలా ఆర్డర్ పెట్టగానే.. అలా వచ్చేస్తుంది.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, ఆ ఫుడ్ సేఫేనా.. అప్పుడే తయారు చేసిందేనా.. లేక ఎప్పటిదోనా.. వాసన, పురుగులు.. బొద్దింకలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటన సంచలనంగా మారింది..
- Ashok Bheemanapalli
- Updated on: Apr 21, 2026
- 6:05 pm
పెరుగు తెచ్చిన తంటా.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య
Hyderabad family incident: రాజేశ్వరి సన్నగా ఉండటంతో, ఆమె ఆరోగ్యం మెరుగుపడాలనే ఉద్దేశంతో శివకుమార్ “కొంచెం పెరుగు తింటే బాగుంటుంది” అని చెప్పాడు. అయితే ఆ వ్యాఖ్యను రాజేశ్వరి భిన్నంగా అర్థం చేసుకుని తీవ్రంగా బాధపడినట్లు తెలుస్తోంది. తనను అవమానించినట్లుగా భావించిన ఆమె.. ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 18, 2026
- 10:20 am
Revanth Reddy: నేషనల్ పాలిటిక్స్లో ‘రేవంత్ మార్క్’.. వ్యూహకర్తగా మారిన తెలంగాణ సీఎం!
తెలంగాణ రాజకీయ యవనికపై ఉవ్వెత్తున ఎగసిన కెరటం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ కెరటం కేవలం గండిపేట పరిధిలోనే ఆగకుండా, యమునా తీరం వరకు తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక 'నేషనల్ బ్రాండ్'గా అవతరించారు.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 15, 2026
- 7:48 pm
చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ దొంగ క్లినిక్లోకి చొరబడబోయి షట్టర్, గోడ మధ్య ఇరుక్కుపోయాడు. రాత్రంతా నరకయాతన అనుభవించి, ఉదయం క్లినిక్ సిబ్బందికి కంటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని షట్టర్ను తొలగించి, ప్రాణాపాయంలో ఉన్న ఆ దొంగను సురక్షితంగా బయటకు తీశారు. చోరీకి వచ్చి చివరకు తానే ఇరుక్కున్న ఈ విచిత్ర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 13, 2026
- 5:04 pm
తెలంగాణ వాసులకు గుడ్న్యూస్.. రూ.700కోట్లతో బయో గ్యాస్ ప్రాజెక్ట్.. 1400 మందికి ఉపాది!
తెలంగాణ క్లీన్ ఎనర్జీలో రోల్ మోడల్గా నిలుస్తోంది రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిద్దిపేటలో రూ.700 కోట్లతో జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. వ్యవసాయ వ్యర్థాలతో బయోఫ్యూయల్ ఉత్పత్తి ద్వారా ఇంధన దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించి, 1400 మందికి ఉపాధి కల్పించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం అని ఆయన తెలిపారు.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 12, 2026
- 7:21 pm
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఒకవేళ మద్యం తాగి దొరికితే..
తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్పై కీలక సూచనలు జారీ చేసింది. మద్యం సేవించి వాహనం నడిపినట్టు నిర్ధారించినా, వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. కేసు నమోదు చేసి, మూడు రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వాహనాన్ని తాగని వ్యక్తికి లేదా బంధువులకు అప్పగించాలని, ఎవరూ లేకుంటేనే పోలీస్ స్టేషన్కు తరలించాలని కోర్టు తెలిపింది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 11, 2026
- 12:55 pm
హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో పూర్తి వివరాలు!
Hyderabad IT Corridor Traffic Alert: హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రయాణించే వాహనదారులకు కీలక అలర్ట్ జారీ అయింది. గచ్చిబౌలి–లింగంపల్లి ప్రధాన రహదారిపై వచ్చే ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 9, 2026
- 1:32 pm
ఫీజుల పేరుతో సర్టిఫికెట్లు ఆపడం చట్ట విరుద్ధం.. ప్రైవేట్ కాలేజీకి తెలంగాణ హైకోర్టు షాక్
Telangana High Court judgment: విద్యార్థి సమర్పించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అతని వ్యక్తిగత ఆస్తి అని కోర్టు స్పష్టం చేసింది. బాకీలు ఉన్నా.. వాటి పేరుతో సర్టిఫికెట్లు నిలిపివేయడం సరైంది కాదని పేర్కొంది. బాకీలు వసూలు చేయాలంటే చట్టబద్ధ మార్గాల్లోనే ముందుకెళ్లాలని సూచించింది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 9, 2026
- 7:23 am
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొత్తం ఫీజును నాలుగున్నర సంవత్సరాలకే పరిమితం చేయాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా వసూలు చేస్తున్నట్లు భావించి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 8, 2026
- 4:29 pm