ఉద్యోగులకు గుడ్న్యూస్.. రూ.720 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు ₹720 కోట్లు విడుదల చేసింది. గత బకాయిలను తీరుస్తూ, సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్తో పాటు గ్రాట్యుటీ, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు త్వరలో చెల్లించనుంది. 'గ్రీన్ ఛానల్' వ్యవస్థ ద్వారా ప్రతి నెలా ₹700 కోట్లకు పైగా విడుదల అవుతాయి. 3.64% డీఏ పెంపు, సకాలంలో నిధుల చెల్లింపుతో లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి గొప్ప ఆర్థిక ఉపశమనం లభించనుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 5, 2026
- 5:30 pm
Telangana: ఇంటర్ విద్యార్ధులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు సూపర్ గుడ్ న్యూస్ అందించనుంది తెలంగాణ ఇంటర్ సంస్థ. స్టూడెంట్స్కి వెల్ కమ్ కిట్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫైల్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జూన్ 1 నుంచి అమలు చేయాలని చూస్తున్నారు..
- Ashok Bheemanapalli
- Updated on: Feb 4, 2026
- 10:52 am
Telangana: తెలంగాణలో యమపాశంగా మారుతున్న టైఫాయిడ్.. తాజా గణాంకాల్లో షాకింగ్ వివరాలు..!
Telangana: టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం సాల్మొనెల్లా టైఫీ అనే సూక్ష్మజీవి. ఇది ఎక్కువగా అపరిశుభ్రమైన నీరు, ఆహారం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా తాగునీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, పాత పైపులైన్ల లీకేజీలు, మరమ్మతుల సమయంలో మురుగునీరు కలవడం వల్ల ఈ బ్యాక్టీరియా
- Ashok Bheemanapalli
- Updated on: Feb 3, 2026
- 10:31 pm
Chiranjeevi : మెగాస్టార్తో కొండా సురేఖ భేటీ.. ఆ పదం ప్రస్తావనతో కొత్త చర్చ..!
మెగాస్టార్ చిరంజీవితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెళ్లడం అనుకోకుండా ఆసక్తిని రేపింది. చిరంజీవిని కలిసిన సందర్భంగా ఆయనకు అత్యంత అభిమానమైన ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించారు మంత్రి సురేఖ
- Ashok Bheemanapalli
- Updated on: Feb 3, 2026
- 5:26 pm
Constable Soumya: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్-గ్రేషియా ప్రకటించింది. అలాగే ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, సర్వీస్ కాలం వరకు వేతనం ఇచ్చేందుకు నిర్ణయించింది.కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 1, 2026
- 2:54 pm
Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ!
హైదరాబాద్కు చెందిన స్నేహా రాజు రెండుసార్లు కిడ్నీ మార్పిడి చేయించుకుని అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా అంటార్కిటికాలో రాత్రి బస చేసి, అంటార్కిటిక్ సర్కిల్ను దాటిన అవయవ మార్పిడి గ్రహీతగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె చిన్ననాటి అనారోగ్యాన్ని అధిగమించి, పట్టుదలతో ఈ కఠిన ప్రయాణాన్ని పూర్తి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jan 31, 2026
- 11:03 pm
నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!
నాంపల్లి అగ్నిప్రమాదం తర్వాత హైడ్రా అప్రమత్తమైంది. ఫర్నిచర్ షాపులపై దృష్టి సారించి, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల ను సీజ్ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో వ్యాపార సంఘాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jan 31, 2026
- 10:57 pm
GHMC Budget 2026-27: హైదరాబాద్ అభివృద్ధికి భారీ బడ్జెట్.. ఈ సారి ఎన్ని కోట్లంటే?
హైదరాబాద్ అభివృద్దికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ సారి బడ్జెట్లో పెద్దపీట వేసింది. నగర అభవృద్దే లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో రూ.11,460 కోట్ల బడ్జెట్ ముసాయిదాకు కమిటి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బడ్జెట్ గతేదాడి కంటే ఈ సారి కేటాయింపులు పెరిగినట్టు తెలుస్తోంది.
- Ashok Bheemanapalli
- Updated on: Jan 31, 2026
- 7:36 pm
Aadhaar Free Update: తల్లిదండ్రులకు బిగ్ రిలీఫ్.. ఇకపై స్కూల్లోనే ఆధార్ అప్డేట్స్.. ఇదిగో డిటైల్స్..
విద్యార్థులు సహా.. అందరికీ.. ప్రభుత్వానికి సంబంధించి మనకు ఏ సేవ కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. చిన్న చిన్న మార్పు చేయాలన్నా.. ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ముందుగా పేరు నమోదు, ఆ తర్వాత క్యూ, గంటల తరబడి వేచి ఉండటం.. ఈ ప్రక్రియ విద్యార్థులు, తల్లిదండ్రులకు పెద్ద ఇబ్బందిగానే మారింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jan 31, 2026
- 12:10 pm
హైదరాబాదీలకు అద్భుత అవకాశం.. నుమాయిష్లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?
హైదరాబాద్ సహా తెలంగాణ వాసులకు ఇదో గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నగర వాసులు తమ ప్రతిభను బయటపెట్టేందుకు నూమాయిష్ నిర్వాహకులు అవకాశాన్ని కల్పిస్తున్నారు. నూమాయిష్ 2026లో భాగంగా ఈ సారి వంటల పోటీలసు కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 7, శనివారం ఉదయం 11 గంటలకు, నాంపల్లి నుమాయిష్ గ్రౌండ్లోని గాంధీ శతాబ్ది భవన్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవచ్చు.
- Ashok Bheemanapalli
- Updated on: Jan 30, 2026
- 7:33 pm
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అరుదైన కానుక.. విలువ ఎంతో తెలుసా..?
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి మీద తన అపారమైన భక్తిని చాటుకున్నారు హైదరాబాద్కు చెందిన కె. దీపక్ అనే భక్తుడు. గురువారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, విలువైన రాళ్లతో అలంకరించిన జత కర్ణ పత్రములను భక్తితో సమర్పించారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jan 30, 2026
- 5:27 pm
Danam Nagender: రాజీనామా చేయలే.. ఇంకా ఆ పార్టీలోనే ఉన్నా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఊహించని ట్విస్ట్..
తాను బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి రాజీనామా చేయలేదని.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. తన అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఆ పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. పార్టీ మారినట్లు చెబుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jan 28, 2026
- 6:10 pm