గురుకులాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
తెలంగాణలో గురుకులాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. విద్యార్థుల పోషకాహారం, వసతి, సంక్షేమ సదుపాయాల కోసం రూ.221.24 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది.
- Ashok Bheemanapalli
- Updated on: May 18, 2026
- 1:56 pm
Hyderabad: ప్రకృతి రహస్యం ఛేదించిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు.. ఇక పంటలకు వైరస్ భయం లేనట్టే!
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా, మానవజాతిని వేధిస్తున్న మొండి వ్యాధులకు పరిష్కారం చూపేలా హైదరాబాద్ శాస్త్రవేత్తలు ఒక అద్భుత రహస్యాన్ని ఛేదించారు. మొక్కలు వైరస్ల బారి నుంచి తమను తాము ఎలా రక్షించుకుంటాయనే ‘ప్రకృతి రహస్యాన్ని’ సీఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు.
- Ashok Bheemanapalli
- Updated on: May 13, 2026
- 2:58 pm
బీహార్ సాల్వర్ గ్యాంగ్ ‘నీట్’ కుట్ర.. ప్రవేశ పరీక్షలపై మాఫియా నీడలు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్షలపై మరోసారి భారీ అనుమానాలు తలెత్తాయి. బీహార్లోని నలంద జిల్లాలో “సాల్వర్ గ్యాంగ్” పేరుతో పనిచేస్తున్న ఒక పరీక్ష మాఫియాను పోలీసులు ఛేదించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో మెడికల్ ప్రవేశ పరీక్షల భద్రత, పారదర్శకతపై మళ్లీ తీవ్రమైన చర్చ మొదలైంది.
- Ashok Bheemanapalli
- Updated on: May 13, 2026
- 2:47 pm
మన దేశంలో రోజుకు ఎంత బంగారం అమ్ముడవుతుందో తెలుసా? లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే..
Gold Market: భారత్లో బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. అది సంప్రదాయం, పెట్టుబడి, ఆర్థిక భద్రతకు ప్రతీక. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు ఏవైనా బంగారం కొనుగోలు తప్పనిసరి అన్న భావన భారతీయ కుటుంబాల్లో బలంగా ఉంది. ఇదే కారణంగా ప్రపంచంలో అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఎప్పుడూ ముందువరుసలో నిలుస్తోంది.
- Ashok Bheemanapalli
- Updated on: May 13, 2026
- 2:36 pm
సీఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు
తమిళనాడు ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రాజకీయ విభాగానికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పబ్లిక్ డిపార్ట్మెంట్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ..
- Ashok Bheemanapalli
- Updated on: May 13, 2026
- 1:20 pm
Hyderabad: నగర వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్
బాచుపల్లి జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా హెచ్ఎండీఏ నిర్మించిన ఆరు లేన్ల ఫ్లైఓవర్ సిద్ధమైంది. రూ.141 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా.. మియాపూర్, నిజాంపేట్, గండిమైసమ్మ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గనుంది.
- Ashok Bheemanapalli
- Updated on: May 13, 2026
- 11:49 am
ఇంధన సంక్షోభం.. ప్రపంచవ్యాప్తంగా తెరపైకి కొత్త ఆంక్షలు.. ఏ దేశంలో ఎలా ఉన్నాయంటే?
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. చమురు ధరల పెరుగుదల, విద్యుత్ వినియోగాన్ని అదుపు చేసేందుకు వివిధ దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఫ్లైట్ల నిషేధం, వర్క్ ఫ్రమ్ హోమ్, వారంలో పనిదినాల తగ్గింపు, విద్యుత్ పొదుపు ఆంక్షలు వంటివి తెరపైకి తీసుకొస్తున్నాయి. పౌరుల జీవనశైలిలో గణనీయమైన మార్పులు అనివార్యమవుంటున్నాయి.
- Ashok Bheemanapalli
- Updated on: May 13, 2026
- 11:37 am
పేద ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై సూపర్ అప్డేట్..
Indiramma Houses: పేదలకు సొంతింటి కలను దగ్గర చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. జూన్ 2న ఆదిలాబాద్లో రెండో విడత పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇకపై లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5–8 కిలోమీటర్ల పరిధిలోనే ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Ashok Bheemanapalli
- Updated on: May 13, 2026
- 7:28 am
Chicken Rates: సామాన్యులకు చికెన్ షాక్.. అమాంతం పెరిగిన కోడి మాంసం ధరలు.. కేజీ ఎంత ఉందంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.370 వరకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.. కోళ్ల మరణాలు, సరఫరా తగ్గుదలతో మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: May 12, 2026
- 7:20 pm
వెంటాడిన 46 ఏళ్లనాటి మర్డర్ కేసు.. దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే..!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన 46 ఏళ్ల నాటి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రాను కోర్టు దోషిగా తేల్చింది. 1980లో కోర్టు ప్రాంగణంలో జరిగిన హత్య కేసులో విజయ్ మిశ్రాతో పాటు మరో ముగ్గురు నిందితులను కూడా ఎంపీ-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
- Ashok Bheemanapalli
- Updated on: May 12, 2026
- 6:16 pm
జైలు జీవితం ఎలా ఉంటుందో చూడాలని ఉందా..? నేరం చేయకుండానే వెళ్లొచ్చు..!
హైదరాబాద్లోని చంచల్ గూడ సెంట్రల్ జైలు వేదికగా తెలంగాణ కారాగార శాఖ ఒక వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో నేరాల పట్ల అవగాహన కల్పించడానికి, జైలు జీవితంలోని కఠినతలను ప్రజలకు పరిచయం చేయడానికి “ఫీల్ ది జైల్” కార్యక్రమాన్ని, అత్యాధునిక తెలంగాణ జైలు మ్యూజియంను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘనంగా ప్రారంభించారు.
- Ashok Bheemanapalli
- Updated on: May 12, 2026
- 6:44 pm
ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో నిర్ణయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాథన్ పండిట్ వెట్రివేల్ను ముఖ్యమంత్రి కార్యాలయంలో OSDగా నియమిస్తూ తమిళనాడు సీఎం కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
- Ashok Bheemanapalli
- Updated on: May 12, 2026
- 4:37 pm