ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
Telangana: కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న పెద్ద నాగుపాము.. కట్చేస్తే..
ఎప్పటిలాగే ఉదయాన్నే కోళ్లను బయటకు వదులుదామని వెళ్లిన ఆ ఇంటి యజమానికి కోడి కూతకు బదులు భయంకరమైన బుసల శబ్దం వినిపించింది. తీరా లోపలికి వెళ్లి చూస్తే.. పడగ విప్పిన భారీ నాగుపాము.. అయితే అది కదలలేని స్థితిలో ఉండిపోయింది. అప్పటికే కోడిని చంపి, ఏకంగా తొమ్మిది కోడిగుడ్లను మింగేసింది. ఆ తర్వాత జరిగిన హై డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: May 18, 2026
- 9:36 pm
అయ్యో దేవుడా.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో నర్సింగ్ ఆఫీసర్ మృతి.. ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయొద్దు
మహబూబ్నగర్లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ప్రిసిల్లా విధులకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలిపిన కారు డోర్ను డ్రైవర్ అకస్మాత్తుగా తెరవడంతో ఆమె స్కూటీతో పాటు కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందించినా ఫలితం లేక ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
- Boorugu Shiva Kumar
- Updated on: May 18, 2026
- 3:23 pm
ప్రజా సమస్యలు పక్కన పెట్టి మొబైల్స్లో గేమ్స్.. ఆ అధికారుల తీరుకు అందరూ షాక్!
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అపహాస్యం పాలైంది. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఈ సమావేశంలో అధికారులు మొబైల్ గేమ్స్ ఆడుతూ, ఫోన్ కాల్స్తో కాలక్షేపం చేశారు. ఉన్నతాధికారుల గైర్హాజరీ, కిందిస్థాయి సిబ్బందితో కార్యక్రమం మొక్కుబడిగా మారింది. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి లక్ష్యాలను నీరుగార్చకుండా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలి.
- Boorugu Shiva Kumar
- Updated on: May 11, 2026
- 9:15 pm
పాలమూరులో అరుదైన పుంగనూరు లేగదూడ జననం.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
తెలంగాణలోని పాలమూరు (నారాయణపేట) జిల్లాలో కృత్రిమ గర్భధారణ ద్వారా అరుదైన పుంగనూరు లేగదూడ జన్మించింది. రైతు లక్ష్మీపతిరాజు పశువుల కొట్టంలో మూడో తరానికి చెందిన ఈ చిట్టి ఆవు జన్మించడం జిల్లాలోనే మొదటిసారి. ఔషధ గుణాలున్న పాలు ఇచ్చే ఈ జాతిని ప్రధాని మోదీ కూడా పెంచుతున్నారు. ఈ అద్భుత జననం స్థానిక పాడి రైతులకు ఆనందం కలిగించింది.
- Boorugu Shiva Kumar
- Updated on: May 6, 2026
- 7:52 pm
ఏడాదికి ఒక్కసారే వికసించే వింత పుష్పం.. టెర్రస్ గార్డెన్లో కనువిందు చేస్తున్న ఫుట్బాల్ లిల్లీ!
ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు. కొన్ని మొక్కలు నిత్యం పూలు పూస్తే, మరికొన్ని మాత్రం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించి తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. అచ్చం అలాంటి అరుదైన పుష్పమే స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్. దీనిని సాధారణంగా ఫుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అని పిలుస్తుంటారు. తాజాగా నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వార్ల మల్లేశం టెర్రస్ గార్డెన్లో ఈ పుష్పాలు వికసించి అందరినీ అబ్బురపరుస్తున్నాయి.
- Boorugu Shiva Kumar
- Updated on: May 6, 2026
- 9:42 am
May Flower: కరోనా వైరస్లా కనిపించే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
భూగోళంపై జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అలాగే ఏడాదిలో కేవలం ఒకే సారి పూసే అరుదైన మొక్క ఒకటి ఉంది. ఆ మొక్క పుష్పాలు కేవలం మే నెలలోనే వికసించి అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ ఏడాది పూసిన ఆమొక్క ప్రస్తుతం అందిరిని ఆకట్టుకుంటోంది. అది ఎక్కడో చూద్దాం పదండి.
- Boorugu Shiva Kumar
- Updated on: May 5, 2026
- 7:34 pm
ఇదేం పనిరా.. కోరిక తీర్చాలంటూ వదిన వెంట పడ్డాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..
తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. తన లైంగిక వాంఛ తీర్చేందుకు ఆయన భార్య ఒప్పుకోలేదు. వెరసి కిరాతకమైన ప్లాన్ వేసి.. అడ్డంగా దొరికాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్ లో జరిగిన ఓ హత్య కేసులో మిస్టరీని చేధిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూసాయి. హత్య చేసి ఏమి ఎరగనట్టు అమాయకంగా నటిస్తూ కుటుంబ సభ్యులు, పోలీసుల వెంట విచారణకు తిరిగాడు. సీన్ కట్ చేస్తే అసలు నిందితుడని తేలడంతో కటకటాల వెనక్కి నెట్టారు ఖాకీలు.
- Boorugu Shiva Kumar
- Updated on: May 2, 2026
- 2:09 pm
బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతుందా..? పంది కడుపులో ఏనుగు పిల్ల.. ఇదిగో వీడియో
పంది కడుపులో పందే పుడుతుందన్న వెటకారంగా చెప్పే మాటలు విన్నాం.. కానీ పంది కడుపులో అచ్చం ఏనుగు పిల్ల ఆకారంలో ఓ పంది పిల్ల పుడితే. ఇంకేముంటుంది అది ఓ వింత ఘటనే అవుతుంది. తొండం, భారీ చెవులతో ఓ పంది ఏనుగు ఆకారంలో ఉన్న పిల్లకు జన్మనివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Apr 19, 2026
- 6:50 pm
విందులో విషాదం.. చిన్న మాంసం ముక్క.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది!
మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఒక చిన్న మాంసం ముక్క ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించరు. ఆ దురదృష్టకర సంఘటన మూసాపేట మండలం సంకలమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. విందు భోజనం ఒక వ్యక్తి పాలిట మృత్యుపాశంగా మారింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Apr 17, 2026
- 5:14 pm
Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఈ నెల 3వ తేదిన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. అది రోడ్డు ప్రమాదం కాదని పక్కా స్కెచ్తో చేసిన హత్యని తేలింది. తొలుత రోడ్డు ప్రమాదంగా ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. పక్కా ఆధారలతో ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని పోలీసులు గుర్తించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Apr 5, 2026
- 7:58 pm
Video: బావిలో ఈతకొట్టిన జడ్చర్ల ఎమ్మెల్యే.. యువకులతో కలిసి ఎంజాయ్ చేసిన అనిరుధ్ రెడ్డి..
రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ కామెంట్స్తో సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. ఒక్కసారిగా రూట్ మార్చారు. కాన్వాయ్ను పక్కన పెట్టి, సామాన్య యువకుడిలా బావిలోకి దూకి ఈతకొట్టారు. స్థానిక యువకులతో పోటీ పడుతూ ఆయన చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Apr 2, 2026
- 9:19 pm
వర్తకులు, వ్యాపారులే వారి టార్గెట్… సేవ ట్రస్టులు, అనాథఆశ్రమాల పేరుతో బలవంతపు వసూళ్లు.
సేవ పేరుతో సొమ్ము దోచుకుంటున్న కేటుగాళ్ల గుట్టు రట్టు అయింది. అనాథాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పేరుతో వ్యాపారులను బెదిరించి వేల నుంచి లక్షల వరకు వసూళ్లు చేసిన ముఠాను జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్పే నంబర్తో బయటపడిన మోసం… అసలు సేవ పేరులో దాగిన దోపిడీ కథ ఈ కథనంలో...
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 31, 2026
- 7:41 pm