ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
Telangana: కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!
వన్యప్రాణులైన జింకలు.. చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. చెంగు చెంగున దూకుతుంటే మరెంతో ముచ్చటేస్తుంది. అలాంటి జింకలు వందల సంఖ్యలో కనిపిస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం రైతులు శాపంగా భావిస్తున్నారు. కృష్ణ నదీ తీరంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న జింకలు పంటలను నాశనం చేస్తున్నాయి.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 25, 2024
- 10:55 am
ఈ ఆటోలో అలా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. ఎక్కడంటే..
ఒంటరి వృద్దులు కనబడితే చాలు.. వారి అభరణాల చోరికి స్కెచ్ వేస్తారు. తోటి ప్రయాణికుల్లా కలిసిపోతారు. మాటలతో మాయ చేసి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తారు. బెదిరించి బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తారు. ఇలా ఐదు కేసుల్లో నిందితులుగా తేలారు పాలమూరులో లవ్ బర్డ్స్. అసలు ఏంటి ఈ కిలాడి జోడి కథ.. ఎక్కడ జరుగుతున్నాయి ఈ దోపిడీలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 24, 2024
- 3:40 pm
Telangana: 700ఏళ్ల చరిత్ర కలిగిన కోనేటిని రాత్రికి రాత్రే పూడ్చేశారు.. బాదేపల్లి గుట్టపై ఏం జరుగుతోంది!
ఆ కోనేరుకు సుమారు 700ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంగా వెలసిన రంగనాయకస్వామి వారి అభిషేక జలాలతో నిత్యం కళకళలాడుతుంది. ఆ కోనేటి జలం భక్తులకు పరమ పవిత్రం. భక్తుల అధ్యాత్మికతతో అనుబంధం ఉన్న కోనేరును అభివృద్ధి పేరిట పూడ్చేశారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 13, 2024
- 4:36 pm
BRS: గెలిచిన ఇద్దరిలో ఒకరు జంప్.. అదే బాటలో మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. పాలమూరులో కారు ఖాళీ..?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న బీఆర్ఎస్.. అనంతర పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, మిగిలిన ఒక్కరు కూడా త్వరలోనే పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 12, 2024
- 8:54 pm
ప్రకృతికి ప్రాణం పోసిన అటవీశాఖ.. శతాబ్ధాల చరిత్రకు పూర్వవైభవం..
పాలమూరు జిల్లా ఈ పేరు వింటేనే మొదట గుర్తొచ్చేది పిల్లలమర్రి మహా వృక్షం. సుమారు 700ఏళ్ల చరిత్ర గల ఈ భారీ బనియన్ ట్రీ పునరుజ్జీవం పోసుకుంది. అటవీశాఖ సంరక్షణలో సరికొత్తగా చిగురిస్తూ ఆకాశమంత ఆకుపచ్చ అందాలను పరిచేసింది. శతాబ్ధాల తన చరిత్ర ఇప్పట్లో ముగిసేది కాదని ఠీవిగా నిలబడింది మహా వృక్షం పిల్లలమర్రి. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన పాలమూరు పిల్లలమర్రి పునర్వైభవానికి సిద్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి మహావృక్షం ఉమ్మడి జిల్లాకే తలమానీకంగా నిలిస్తోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 12, 2024
- 12:41 pm
Telangana: ఈ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు..
సొంత జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పునరావాసం సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల మినహా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పూర్తికి 2025 డిసెంబర్ డెడ్ లైన్ విధించారు సీఎం రేవంత్. పాలమూరు పర్యటనలో.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై సుధీర్ఘంగా సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా.. సాగునీటి ప్రాజెక్ట్లపై ఫోకస్ పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 11, 2024
- 3:17 pm
Medi Kallu: ఇదేం విచింత్రం సామీ..! మేడి చెట్టు నుంచి కల్లు.. ఎగబడుతున్న జనం..!
మనం తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూర కల్లు చూశాం. కానీ మేడిచెట్టు కల్లు ఎప్పుడైనా చూశారా.. అసలు విన్నారా..? మేడి చెట్టు గురించి మనం విన్నదీ.. మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చదువుకున్న వేమన పద్యం గుర్తుంది కానీ, మేడిచెట్టు చూడు తాటి చెట్టు మాదిరై ఉండదు
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 7, 2024
- 6:58 pm
ఒకరు కేబినెట్ బెర్త్, మరొకరు పీసీసీ పగ్గాలు.. కీలక పదవులపై ఆ జిల్లా నేతల ఆశలు..
ఒకరు కేబినెట్ బెర్త్, మరొకరు పీసీసీ పగ్గాలు.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు నేతలు కీలక పదవులు ఆశిస్తున్నారు. ముదిరాజుల కోటాలో మక్తల్ ఎమ్మెల్యే, దళిత కోటాలో సంపత్ కుమార్లు ఆయా పదవుల కోసం పోటీ పడుతున్నారు. అయితే ఎవరికి అదృష్టం వరించినా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతుందని హస్తం క్యాడర్ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు పాలమూరు జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. ఇటీవలే విస్తృత చర్చగా మారిన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు, కెబినెట్ బెర్త్ కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కోరుతున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 3, 2024
- 11:59 am
Telangana: ఎంతపనిచేశావయ్యా..! క్షణికావేశం.. రెండు ప్రాణాలు.. తండ్రిని కాపాడబోయి కూతురు..
క్షణికావేశం ఆ కుటుంబంలో రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన తండ్రిని కాపాడబోయిన కూతురు సైతం దుర్మరణం పొందింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 2, 2024
- 6:22 pm
అలాంటి మహిళలను టార్గెట్ చేసిన సైకో కిల్లర్.. కన్నేస్తే ఖేల్ ఖతం..
పాలమూరు జిల్లాలో సీరియల్ కిల్లర్ కలకలం రేగింది. గత నెల జరిగిన ఓ మహిళ హత్య కేసు దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు ఖంగుతినేలా డొంక దొరికింది. రెండేళ్లుగా సాగిస్తున్న వరుస హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మద్యం, ఇతర అలవాట్లకు బానిసైన ఓ కూలీ.. అత్యాచారం, హత్యలే టార్గెట్గా నేరాలు చేస్తున్నాడు. మొత్తం ఆరు హత్య కేసుల్లో నిందితుడిగా తేలి కటకటాల పాలయ్యాడు. కూలీ అడ్డాలోని ఆడవాళ్లే ఆ దుర్మార్గుడి లక్ష్యం. డబ్బు ఆశ చూపి మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం.. అనంతరం హత్య చేయడం అతనికి పరిపాటిగా మారింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 1, 2024
- 12:52 pm
Telangana: అర్ధరాత్రి ఘోరం.. ఇంటి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులు సహా తల్లి దుర్మరణం..
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులతో సహా తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ వనపట్ల గ్రామంలో జరిగింది.. అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపై భారీ మట్టిదిబ్బలు పడటంతో..
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 1, 2024
- 12:18 pm
ఆ ప్రాజెక్టులో తగ్గుతునన నీటినిల్వలు.. ఆందోళనలో రైతులు.. అసలు కారణం ఇదే..
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయనిగా నిలుస్తున్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ పూడికతో నిండుకుంటోంది. ప్రతీ ఏడాది ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టులో పూడిక పేరుకపోతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో జూరాలపై ఆధారపడిన ఉమ్మడి జిల్లాకు త్రాగు, సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూరాల ప్రాజెక్ట్లో పూడిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు శాపంగా మారుతోంది. జలాశయం ప్రధాన క్రస్ట్ గేట్ల దిగువన స్లూయిజ్లు లేకపోవడంతో ప్రతీ సంవత్సరం పూడిక పేరుకుపోతోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 30, 2024
- 3:04 pm