ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
మరో ఇల్లాలి ప్రాణం తీసిన ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులు.. అనాథలుగా మారి చిన్నారులు!
ఇంటి అప్పు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడింది ఓ ఇల్లాలు. గుమ్మం ముందు ఫైనాన్స్ ప్రతినిధుల అవమానాలు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైంది. దీనికి తోడు అప్పు తీర్చే అంశంలో కుటుంబ సహకారం లేదన్న బాధ తోడైంది. దీంతో పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది ఓ ఇల్లాలు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 18, 2026
- 6:15 pm
Kollapur Mangos: కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు.. నాలుగేళ్లుగా వదలని నష్టాలు
తీపి ఫలాలు పండించే కొల్లాపూర్ మామిడి రైతులకు నాలుగేళ్లుగా చేదు ఫలాలు ఎదురవుతున్నాయి. ప్రతికూల వాతావరణం, పలు రకాల తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. కాయలతో నిండుగా కనపించాల్సిన మామిడి చెట్లు వాడిపోయిన పూతలతో దర్శనమిస్తున్నాయి. ఎకరాలకు ఎకరాలు కాత, పూత లేక రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. లక్షలు ఖర్చు చేసి ఏడాదంతా సాగుచేస్తే... చివరకు చీడ, పీడలతో కూడిన చెట్లే మిగిలాయని ఆవేదన చెందుతున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 16, 2026
- 11:28 am
అదిరిందయ్య చంద్రం…మండే ఎండలకు చెక్పెడుతూ కొత్త ఐడియా.. బైక్పై ఇక బిందాస్ డ్రైవింగ్
మండుతున్న ఎండలకు ఎక్కడైనా ప్రయాణించాలంటే అబ్బా అనాల్సిందే. అదే ద్విచక్ర వాహనాదారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎండల వేడికి, వడగాలల ప్రభావం మామూలుగా ఉండదు. అయితే ఎర్రటి ఎండలోనూ సర్రుమంటూ బైక్ పైనే దూసుకెళ్తున్నాడు పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి. తన బైకును ఏకంగా చలవ పందిరి మాదిరిగా ఏర్పాటు చేసుకొని హాయిగా ప్రయాణం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 16, 2026
- 11:28 am
Telangana: ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్చేస్తే.. స్టూడెంట్ చేసిన పనికి అధికారులంతా షాక్
రాష్ట్రంలో పరీక్షల ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయో లేదో.. అప్పుడే పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఇక పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల హడావిడి, పోలీస్ బందోబస్తు, ఇన్విజిలేటర్లతో సందడిగా ఉంటుంది. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం పరీక్ష నిర్వాహాకులకు వింత పరిస్థితి ఎదురయ్యింది. అదేంలో తెలుసుకుందాం పదండి.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 14, 2026
- 9:01 pm
భర్త మాట వినడం లేదని భార్య మనస్థాపం.. అన్యం పుణ్యం ఎరుగని పిల్లలు ఏం చేశారు తల్లీ!
దంపతుల మధ్య గొడవలకు వారి పిల్లలు బలి అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. చేయని తప్పులకు ఏ పాపం తెలియని పిల్లలు బలైపోతున్నారు. ఓ తల్లి క్షణికావేశం ఆమె తోపాటు మరో ఇద్దరు బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంది. భర్త మాట వినడం లేదని పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 13, 2026
- 9:56 am
Wanaparthy: సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా అక్కడ
కృష్ణా నదిలో నీరు తగ్గడంతో వనపర్తి జిల్లా అమరచింత మండల పరివాహక గ్రామాల్లో మొసళ్ల సంచారం పెరిగింది. తాజాగా మూలమల్ల గ్రామ చెరువు కట్టపై మొసలి కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం పదండి ...
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 13, 2026
- 8:11 am
Telangana: కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
కన్నతల్లి ప్రేమ ముందు ఏ త్యాగమైనా చిన్నదే అంటారు.. కానీ ఆ తల్లి మాత్రం రెండు నెలల పసికందును బలితీసుకుంది. కనికరం లేకుండా కన్నబిడ్డను నీటి తొట్టిలో పడేసి ప్రాణాలు తీసింది. పైగా ఆ నేరాన్ని భర్తపైకి నెట్టి పోలీసులనే నమ్మించాలని చూసింది. సీన్ కట్ చేస్తే ఖాకీల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 4, 2026
- 11:35 am
Telangana: నిద్ర చేసేందుకు రాత్రి ఆలయానికి వెళ్లారు.. తెల్లారేసరికి తిరిగి ఇంటికి చేరుకోగా..
ఆలయానికి వెళ్లి నిద్ర చేసి వచ్చేసరికి ఇంటిని గుల్ల చేశారు దొంగలు. ఇంట్లో ఉన్న బంగారం, వెండితో పాటు నగదును అపహరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.
- Boorugu Shiva Kumar
- Updated on: Feb 28, 2026
- 8:40 pm
షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. వాటర్ బాటిల్ కావాలని వచ్చాడు.. చివరకు..
జడ్చర్ల స్థానిక కృష్ణారెడ్డి నగర్ లో మంజుల అనే మహిళ లక్ష్మీనరసింహ కిరాణ జనరల్ స్టోర్ తో పాటు లేడీస్ టైలరింగ్ చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మిట్ట మధ్యాహ్నం గం.1.00లకు ముగ్గురు యువకులు బైక్ పై కాలనీలోని లక్ష్మీనరసింహ కిరాణం వద్దకు వచ్చారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Feb 28, 2026
- 1:07 pm
Telangana: అనారోగ్య కారణాలతో బాబా దగ్గరకు వెళ్లారు.. కట్ చేస్తే, క్షుద్రపూజలు, రూ.100 కోట్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఏంట్రా ఇది!
అనారోగ్య సమస్యలతో వెళితే క్షుద్రపూజల పేరుతో భయపెట్టి లక్షలు స్వాహా చేశాడు ఓ నకిలి స్వామిజీ.. గుప్త నిధులున్నాయని వెలికి తీయాలంటూ నమ్మించాడు. తీరా ఓ కంచు విగ్రహం వెలికితీసి దంపతుల కష్టార్జీతాన్ని కాజేశాడు. ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగి.. చివరికి కటకటల పాలయ్యారు ఓ దొంగ బాబా..
- Boorugu Shiva Kumar
- Updated on: Feb 24, 2026
- 3:12 pm
ఖర్చు తక్కువ… ప్రచారం ఎక్కువ..! మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కొత్త పంథా ఇదే..!
Municipal elections: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గతంలో అనుసరించే సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకొని స్మార్ట్ క్యాంపెయినింగ్ కు శ్రీకారం చుడుతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ట్గ్రామ్ మొదలగు మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Feb 4, 2026
- 10:36 pm
సారీ అమ్మా.. చనిపోతున్నా.. అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట ప్రాంతానికి చెందిన గుంపు రాజేష్ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ మొత్తాన్ని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. సమాచారం వనపర్తి టౌన్ పోలీసులకు తెలిసింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Feb 3, 2026
- 9:19 am