ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
ఖర్చు తక్కువ… ప్రచారం ఎక్కువ..! మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కొత్త పంథా ఇదే..!
Municipal elections: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గతంలో అనుసరించే సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకొని స్మార్ట్ క్యాంపెయినింగ్ కు శ్రీకారం చుడుతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ట్గ్రామ్ మొదలగు మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Feb 4, 2026
- 10:36 pm
సారీ అమ్మా.. చనిపోతున్నా.. అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట ప్రాంతానికి చెందిన గుంపు రాజేష్ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ మొత్తాన్ని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. సమాచారం వనపర్తి టౌన్ పోలీసులకు తెలిసింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Feb 3, 2026
- 9:19 am
Telangana: ప్రజలారా జాగ్రత్త.. దొంగలున్నారు అంటూ దగ్గరికి వస్తారు.. ఆ తర్వాత గులకరాళ్లు ఇచ్చి..
మహిళలు, వృద్ధులే వారి టార్గెట్.. తాము పోలీసులం... దొంగలున్నారు జాగ్రత్త.. అంటూ చెబుతారు. బంగారం తీయమంటారు.. కవర్ లో పెట్టిస్తాం అంటారు. గులకరాళ్ళు ఇచ్చి.. పరార్ అవుతారు. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు ఈ దొంగలు.. రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి.. అమాయక ప్రజల పసిడినీ కొట్టేస్తున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 28, 2026
- 7:05 pm
నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మను పరామర్శించేందుకు వచ్చిన ముగ్గురు చిన్నారులు ముచ్చర్లపల్లిలోని వ్యవసాయ నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఆడుకుంటుండగా బంతి గుంతలో పడటంతో దానిని తీసేందుకు వెళ్లి ఈ దుర్ఘటన జరిగింది. ఓ చిన్నారిని రక్షించగా, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 25, 2026
- 10:36 pm
Watch Video: క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది.. ఆయనెవరో గుర్తుపట్టారా?
Minister Vakiti Srihari Journey: క్రికెట్ చూడగానే పోయిన ప్రాణం మళ్లీ తిరుగొచ్చినట్టుంటుంది.. ప్యాడ్స్ కట్టుకుంటే ఇప్పటికీ మంచిగ అడగలుగుతా.. నా దగ్గర ఆ ఆట ఉంది. కానీ బ్యాటు పట్టే శక్తి లేదు" అంటూ భావోద్వేగమైన స్పీచ్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. తన జీవితంలో జరిగిన విషాదకోణాన్ని జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో పంచుకున్నారు. ఒక్క చిన్న సంఘటనతో జరిగే జీవితకాల నష్టాన్ని వివరించి.. వారికి జాగ్రత్తలు, సూచనలు చెప్పారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 18, 2026
- 8:02 pm
Telangana: యువకులు రీల్స్ చేస్తుంటే చూసిన మరో యువకుడు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాకే.. రంగంలోకి పోలీసులు..
అది వనపర్తిలోని రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతం.. అంతా తమ పనుల్లో తామున్నారు. ఇంతలో ఒక్కసారిగా కేకలు, అరుపులు.. పదుల సంఖ్యలో యువకులు వీధుల్లోకి చేరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చూస్తుంటే ఏదో గ్యాంగ్ వార్ జరుగుతోందా అన్నట్లుగా సీన్ మారిపోయింది. అసలు ఈ గొడవకు కారణం ఏంటో తెలసా..?
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 12, 2026
- 9:57 pm
Telangana: భార్యపై కోపం.. ఇద్దరు పిల్లల్ని చంపి కాలువలో పడేసిన తండ్రి! ఆ తర్వాత..
Father Kills Two Children, Attempts Suicide in Narayanpet: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రి కసాయిగా మారి ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. తర్వాత కోయిల్ సాగర్ డిస్టిబ్యూటరీ కాలువలో పడేసి తాను ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 6, 2026
- 6:46 pm
Gadwal: ఈయన ప్రమాదంలో చనిపోయారనుకుంటే హత్య అని తేలింది.. ఆపై నిందితుల విచారణలో మరో ట్విస్ట్
రోడ్డు ప్రమాదంగా అనుకున్న మరణం వెనుక పక్కా ప్లాన్డ్ సుపారీ మర్డర్ బయటపడటంతో జోగులాంబ గద్వాల్ జిల్లాలో సంచలనం నెలకొంది. మాజీ సర్పంచ్ భీమా రాయుడిని హత్య చేసేందుకు ప్రత్యర్థి లక్షల రూపాయల ఒప్పందం చేసుకుని కొత్త బోలేరో వాహనం కొనుగోలు చేసి ఢీ కొట్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను కస్టడీలో విచారించగా ఇదే తరహాలో మరొ రెండు హత్యలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 5, 2026
- 6:32 pm
Andhra: పుట్టింటికి వచ్చిన అక్కతో మాట్లాడదామని వెళ్లాడు.. ఎంతకూ తలుపు తీయలేదు.. కిటికీ ఓపెన్ చేయగా
భర్త లేని జీవితం ఊహించుకోలేకపోయింది ఓ భార్య. తాను, తన పిల్లలు ఎవరికి భారం కాకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నది. పిల్లలపై ప్రేమను చంపుకోలేక.. భర్త మరణశోకం నుంచి బయటకి రాలేక విషాద ఘటనకు కారకురాలైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కన్నీటిపర్యంతం చేస్తోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 2, 2026
- 12:36 pm
Telangana: కొడుకు చేసిన పనికి తండ్రి బలి.. వేటకోడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు..
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలయ్యాడు. వినడానికి ఏదోలా ఉన్నా... జరిగింది మాత్రం అత్యంత దారుణం. ఆ తండ్రిని వేటాడి వెంటాడి వేట కొడవళ్లతో నరికి చంపారు నిందితులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును ఛేదిస్తే కుమారుడిపై పగను తండ్రిని చంపి తీర్చుకునే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 25, 2025
- 8:39 pm
Telangana: జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి కళ్లు బైర్లు కమ్మాయ్
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఓ దినసరి కూలికి విద్యుత్ బిల్లు షాకిచ్చింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 23, 2025
- 11:42 am
Telangana: సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎంబీబీఎస్ స్టూడెంట్
ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో యువ వికాసం విరిసింది. విద్యావంతులు గ్రామ సేవ కోసం క్యూ కట్టారు. తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి. సత్తా చాటారు. వనపర్తి జిల్లాలో ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్పంచ్గా ఎన్నికై సత్తా చాటింది. అటు చదువు.. ఇటు గ్రామాభివృద్ధి గురించి ఆమె కీలక విషయాలు వెల్లడించింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 19, 2025
- 2:04 pm