ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
అమ్రాబాద్ అడవుల్లో అద్భుతం.. తెలంగాణలో అడుగుపెట్టిన భారతదేశపు అతిపెద్ద రెక్కల సుందరి!
తెలంగాణ అటవీ, జీవ వైవిధ్య సంపదలో మరో అరుదైన జీవి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కానీ.. భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోక చిలుకలలో ఒకటైన సరదన్ బర్డ్ వింగ్ తొలిసారి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కనిపించింది. ఈ అరుదైన గుర్తింపు జీవవైవిధ్య పరిరక్షణలో కొత్త అధ్యాయంగా పేర్కోంటున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 28, 2026
- 11:08 pm
పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే… 30 మంది ఆస్పత్రిపాలు
Kaddu Ka Kheer: మహబూబ్నగర్లో పెళ్లి విందులో మిగిలిన కద్దు కా కీర్ పాయసం తిన్న 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందగా, బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై అధికారులు అప్రమత్తమై ఆహార నాణ్యతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 27, 2026
- 10:23 pm
భర్తను లేపేసి ఏం తెలియనట్లు నటించింది.. కట్ చేస్తే ఆ ఆనవాళ్లతో..
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలుకు ఒక్కగానొక్క కూతురు పద్మ. యాదయ్య, అలివేలు ఇద్దరు కూలి పనిచేసుకుంటూ ఎకరన్నర పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం పద్మకు మహబూబ్ నగర్..
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 27, 2026
- 9:33 pm
BrahMos Unit: ఆ జిల్లా వాసులకు అదిరిపోయే గుడ్న్యూస్.. త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
పాలమూరు జిల్లాలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై చర్చ జరగడంతో మిస్సైల్ యూనిట్ ఏర్పాటు ఆశలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే డీఆర్డీవో అధికారుల పర్యటన, తాజాగా చర్చలతో త్వరలోనే సానుకూలమైన ముందడుగు పడుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 26, 2026
- 7:50 pm
తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే
**Telugu Excerpt:** జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో పందుల దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అర్థరాత్రి సాహసోపేతంగా ఛేజ్ చేశారు. బొలెరో వాహనంలో పందులను ఎత్తుకెళ్తున్న దొంగలు పోలీసులపై రాళ్లు, ఖాళీ బీర్ సీసాలు, పందులను విసిరి దాడికి పాల్పడ్డారు. చివరకు తమ వాహనాన్ని వదిలేసి, కోళ్ల ఫారం నుంచి మరో బొలెరోను అపహరించి కర్ణాటకలోని రాయచూర్ వైపు పరారయ్యారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 20, 2026
- 12:33 pm
Watch: బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు.. సీన్ కట్చేస్తే.. ఇది పరిస్థితి!
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో భీకర గాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు ఎండల ప్రభావం కనిపించగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటుగా బలమైన ఈదురు గాలులు విషాదాన్ని మిగిల్చాయి. భారీ వర్షాని గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 18, 2026
- 7:59 am
Telangana: ఒకే ఫ్రేమ్లో ఐదు తరాలు.. వనపర్తి జిల్లాలో అపురూప కుటుంబ సమ్మేళనం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరినొకరు కలుసుకునే సమయమే కరువైంది. జీవన పోరాటంలో, బతుకుదెరువు కోసం ఎంతోమంది బంధువులు, కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నారు. ఒకప్పుడు నిత్యసత్యమైన ఉమ్మడి కుటుంబం అనే మాట.. నేడు కేవలం ఒక కలగా మిగిలిపోతున్న తరుణంలో, వసుధైక కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది ఒక పల్లెటూరి కుటుంబం. ఈ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే ఈ పూర్తి స్టోరీ చదవాల్సిందే.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 9, 2026
- 5:20 pm
నాడు ప్రియుడి కోసం భర్తను చంపింది.. నేడు అతడే యముడయ్యాడు.. మరో ప్రియురాలితో కలిసి..
నాగర్కర్నూల్ జిల్లాలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. 2016లో ప్రియుడు రాములతో కలిసి తన భర్తను హత్య చేసిన పార్వతమ్మ, అనంతరం అదే వ్యక్తితో కలిసి జీవనం సాగించింది. అయితే కాలక్రమంలో రాములు మరో మహిళ లక్ష్మితో సంబంధం పెట్టుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి. పార్వతమ్మను అడ్డుగా భావించిన రాములు, లక్ష్మితో కలిసి పథకం ప్రకారం ఆమెకు మద్యం తాగించి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారు.
- Boorugu Shiva Kumar
- Updated on: May 30, 2026
- 12:45 pm
పానీపూరి లవర్స్కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత! ఏం జరిగిందంటే
రోడ్డు పక్కన పానీపూరి తిన్న 15 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు, నాణ్యతలేని పదార్థాల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు..
- Boorugu Shiva Kumar
- Updated on: May 28, 2026
- 9:50 am
Telangana: అప్పు ఎప్పటికీ ముప్పే.. తీసుకున్న డబ్బు కట్టలేక భార్య పిల్లల్ని చంపి భర్త ఆత్మహత్య!
మహబూబ్నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ, అనారోగ్య కారణాలతో భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులకు తాళ లేక ఘాతుకానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఖిల్లా ఘనపురం మండలం సలికేలపురం గ్రామ శివారులోని మామిడి తోటలో అర్దరాత్రి తర్వాత ఘటన జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- Boorugu Shiva Kumar
- Updated on: May 27, 2026
- 7:01 pm
ఓరి మీ దుంపలు తెగ.. దర్జాగా ఏటీఎంలోకి దూరారు.. చడీచప్పుడు కాకుండా పనికానిచ్చారు
మహబూబ్నగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఏటీఎం సెంటర్లో డబ్బులు దోచుకోవడం కష్టమని భావించిన దొంగల ముఠా.. ఏకంగా మొత్తం ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లింది. తెల్లవారుజామున బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు, ఏటీఎంను పగులగొట్టి వాహనంలో లోడ్ చేసుకుని పరారయ్యారు. పోలీసు హెడ్క్వార్టర్స్, ఎస్పీ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: May 26, 2026
- 1:18 pm
Watch: వీళ్లు కదా నిజమైన పోలీసులు అంటే.. కష్టకాలంలో అన్నదాతకు ఆసరైనా అచ్చంపేట ఖాకీలు
పోలీసులు అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షకులు మాత్రమే కాదు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే పరోపకారులు కూడా అని తాజాగా జరిగిన ఓ సంఘటన నిరూపిస్తోంది. వర్షం కారణంగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కష్టపడుతున్న రైతులను చూసి చలించిపోయిన పోలీసులు వారికి సాయం చేసి అందరి మన్ననలు పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రతస్తుం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Boorugu Shiva Kumar
- Updated on: May 24, 2026
- 2:55 pm