ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఈ నెల 3వ తేదిన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. అది రోడ్డు ప్రమాదం కాదని పక్కా స్కెచ్తో చేసిన హత్యని తేలింది. తొలుత రోడ్డు ప్రమాదంగా ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. పక్కా ఆధారలతో ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని పోలీసులు గుర్తించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Apr 5, 2026
- 7:58 pm
Video: బావిలో ఈతకొట్టిన జడ్చర్ల ఎమ్మెల్యే.. యువకులతో కలిసి ఎంజాయ్ చేసిన అనిరుధ్ రెడ్డి..
రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ కామెంట్స్తో సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. ఒక్కసారిగా రూట్ మార్చారు. కాన్వాయ్ను పక్కన పెట్టి, సామాన్య యువకుడిలా బావిలోకి దూకి ఈతకొట్టారు. స్థానిక యువకులతో పోటీ పడుతూ ఆయన చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Apr 2, 2026
- 9:19 pm
వర్తకులు, వ్యాపారులే వారి టార్గెట్… సేవ ట్రస్టులు, అనాథఆశ్రమాల పేరుతో బలవంతపు వసూళ్లు.
సేవ పేరుతో సొమ్ము దోచుకుంటున్న కేటుగాళ్ల గుట్టు రట్టు అయింది. అనాథాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పేరుతో వ్యాపారులను బెదిరించి వేల నుంచి లక్షల వరకు వసూళ్లు చేసిన ముఠాను జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్పే నంబర్తో బయటపడిన మోసం… అసలు సేవ పేరులో దాగిన దోపిడీ కథ ఈ కథనంలో...
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 31, 2026
- 7:41 pm
అంతుచిక్కని వైరస్తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!
అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ రంగంపై విరుచుకుపడింది. ఒకే పౌల్ట్రీ ఫాంలో గత రెండు మూడు రోజులుగా సుమారు 5,000 కోళ్లు మృత్యువాత పడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఈ అకస్మాత్తు మరణలతో రైతులు తీవ్ర ఆందోళన పడుతుండగా, చికెన్ ప్రియులు భయంతో వణికిపోతున్నారు. లక్షల కోళ్లు మరణించటంతో దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 31, 2026
- 5:46 pm
Narayanpet: విద్యార్థినిపై అత్యాచారం కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు వీళ్లు గురువులేనా?
విద్యార్థులకు విద్వాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారారు. అభం, శుభం తెలియని మైనర్ బాలిక జీవితంతో చెలగాటమాడారు. విద్యార్థిని లోబరుచుకొని ఒకరు, రహస్యంగా కెమెరా పెట్టి మరొకరు, వాటిని వైరల్ చేసిన ఇంకొకరు. ముగ్గురు ఉపాధ్యాయుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నేటి బాల బాలికలను భావితరాలకు ఆదర్శంగా నిలపాల్సిన గురువులు చీడపురుగులుగా మారారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 30, 2026
- 8:00 pm
Wanaparthy: చెట్టుపై కనిపించిన అనుమానాస్పద కవర్.. ఏముందా అని ఓపెన్ చేయగా..
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో అనుమానాస్పద పేలుడు కలకలం రేపింది. పశువులు మేపుతున్న ముగ్గురు వ్యక్తులకు చెట్టుపై కవర్ కనిపించడంతో దాన్ని తెరిచి చూడగా గోళాకార పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. వాటిని రాయిపై కొట్టి చూడగా ఒక్కసారిగా పేలిపోవడంతో మేకల శేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 29, 2026
- 10:02 pm
Watch Video: నాగుపాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
పాము పేరు వింటనే కొందరు భయపడిపోతారు. ఇక అది ఎదురైతే ఇంకేమైనా ఉందా.. ఆ చుట్టుపక్కల కూడా కనిపించకుండా పారిపోతారు. అలాంటింది ఇక్కడో వ్యక్తి మాత్రం ఊపిరాడక స్పృహ కోల్పోయిన నాగుపాముకు సీపీఆర్ చేసిమరి బ్రతికించాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 25, 2026
- 4:50 pm
మరో ఇల్లాలి ప్రాణం తీసిన ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులు.. అనాథలుగా మారి చిన్నారులు!
ఇంటి అప్పు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడింది ఓ ఇల్లాలు. గుమ్మం ముందు ఫైనాన్స్ ప్రతినిధుల అవమానాలు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైంది. దీనికి తోడు అప్పు తీర్చే అంశంలో కుటుంబ సహకారం లేదన్న బాధ తోడైంది. దీంతో పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది ఓ ఇల్లాలు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 18, 2026
- 6:15 pm
Kollapur Mangos: కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు.. నాలుగేళ్లుగా వదలని నష్టాలు
తీపి ఫలాలు పండించే కొల్లాపూర్ మామిడి రైతులకు నాలుగేళ్లుగా చేదు ఫలాలు ఎదురవుతున్నాయి. ప్రతికూల వాతావరణం, పలు రకాల తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. కాయలతో నిండుగా కనపించాల్సిన మామిడి చెట్లు వాడిపోయిన పూతలతో దర్శనమిస్తున్నాయి. ఎకరాలకు ఎకరాలు కాత, పూత లేక రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. లక్షలు ఖర్చు చేసి ఏడాదంతా సాగుచేస్తే... చివరకు చీడ, పీడలతో కూడిన చెట్లే మిగిలాయని ఆవేదన చెందుతున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 16, 2026
- 11:28 am
అదిరిందయ్య చంద్రం…మండే ఎండలకు చెక్పెడుతూ కొత్త ఐడియా.. బైక్పై ఇక బిందాస్ డ్రైవింగ్
మండుతున్న ఎండలకు ఎక్కడైనా ప్రయాణించాలంటే అబ్బా అనాల్సిందే. అదే ద్విచక్ర వాహనాదారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎండల వేడికి, వడగాలల ప్రభావం మామూలుగా ఉండదు. అయితే ఎర్రటి ఎండలోనూ సర్రుమంటూ బైక్ పైనే దూసుకెళ్తున్నాడు పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి. తన బైకును ఏకంగా చలవ పందిరి మాదిరిగా ఏర్పాటు చేసుకొని హాయిగా ప్రయాణం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 16, 2026
- 11:28 am
Telangana: ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్చేస్తే.. స్టూడెంట్ చేసిన పనికి అధికారులంతా షాక్
రాష్ట్రంలో పరీక్షల ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయో లేదో.. అప్పుడే పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఇక పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల హడావిడి, పోలీస్ బందోబస్తు, ఇన్విజిలేటర్లతో సందడిగా ఉంటుంది. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం పరీక్ష నిర్వాహాకులకు వింత పరిస్థితి ఎదురయ్యింది. అదేంలో తెలుసుకుందాం పదండి.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 14, 2026
- 9:01 pm
భర్త మాట వినడం లేదని భార్య మనస్థాపం.. అన్యం పుణ్యం ఎరుగని పిల్లలు ఏం చేశారు తల్లీ!
దంపతుల మధ్య గొడవలకు వారి పిల్లలు బలి అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. చేయని తప్పులకు ఏ పాపం తెలియని పిల్లలు బలైపోతున్నారు. ఓ తల్లి క్షణికావేశం ఆమె తోపాటు మరో ఇద్దరు బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంది. భర్త మాట వినడం లేదని పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Mar 13, 2026
- 9:56 am