AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boorugu Shiva Kumar

Boorugu Shiva Kumar

Correspondent - TV9 Telugu

shivakumar.boorugu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.

Read More
Follow On:
నాడు ప్రియుడి కోసం భర్తను చంపింది.. నేడు అతడే యముడయ్యాడు.. మరో ప్రియురాలితో కలిసి..

నాడు ప్రియుడి కోసం భర్తను చంపింది.. నేడు అతడే యముడయ్యాడు.. మరో ప్రియురాలితో కలిసి..

నాగర్‌కర్నూల్ జిల్లాలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. 2016లో ప్రియుడు రాములతో కలిసి తన భర్తను హత్య చేసిన పార్వతమ్మ, అనంతరం అదే వ్యక్తితో కలిసి జీవనం సాగించింది. అయితే కాలక్రమంలో రాములు మరో మహిళ లక్ష్మితో సంబంధం పెట్టుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి. పార్వతమ్మను అడ్డుగా భావించిన రాములు, లక్ష్మితో కలిసి పథకం ప్రకారం ఆమెకు మద్యం తాగించి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారు.

పానీపూరి లవర్స్‌కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత! ఏం జరిగిందంటే

పానీపూరి లవర్స్‌కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత! ఏం జరిగిందంటే

రోడ్డు పక్కన పానీపూరి తిన్న 15 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు, నాణ్యతలేని పదార్థాల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు..

Telangana: అప్పు ఎప్పటికీ ముప్పే.. తీసుకున్న డబ్బు కట్టలేక భార్య పిల్లల్ని చంపి భర్త ఆత్మహత్య!

Telangana: అప్పు ఎప్పటికీ ముప్పే.. తీసుకున్న డబ్బు కట్టలేక భార్య పిల్లల్ని చంపి భర్త ఆత్మహత్య!

మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ, అనారోగ్య కారణాలతో భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులకు తాళ లేక ఘాతుకానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఖిల్లా ఘనపురం మండలం సలికేలపురం గ్రామ శివారులోని మామిడి తోటలో అర్దరాత్రి తర్వాత ఘటన జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఓరి మీ దుంపలు తెగ.. దర్జాగా ఏటీఎంలోకి దూరారు.. చడీచప్పుడు కాకుండా పనికానిచ్చారు

ఓరి మీ దుంపలు తెగ.. దర్జాగా ఏటీఎంలోకి దూరారు.. చడీచప్పుడు కాకుండా పనికానిచ్చారు

మహబూబ్‌నగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఏటీఎం సెంటర్‌లో డబ్బులు దోచుకోవడం కష్టమని భావించిన దొంగల ముఠా.. ఏకంగా మొత్తం ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లింది. తెల్లవారుజామున బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు, ఏటీఎంను పగులగొట్టి వాహనంలో లోడ్‌ చేసుకుని పరారయ్యారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, ఎస్పీ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

Watch: వీళ్లు కదా నిజమైన పోలీసులు అంటే.. కష్టకాలంలో అన్నదాతకు ఆసరైనా అచ్చంపేట ఖాకీలు

Watch: వీళ్లు కదా నిజమైన పోలీసులు అంటే.. కష్టకాలంలో అన్నదాతకు ఆసరైనా అచ్చంపేట ఖాకీలు

పోలీసులు అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షకులు మాత్రమే కాదు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే పరోపకారులు కూడా అని తాజాగా జరిగిన ఓ సంఘటన నిరూపిస్తోంది. వర్షం కారణంగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కష్టపడుతున్న రైతులను చూసి చలించిపోయిన పోలీసులు వారికి సాయం చేసి అందరి మన్ననలు పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రతస్తుం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క.. ఎక్కడో కాదు తెలంగాణలోనే.. చూస్తే మైండ్ బ్లాంకే..

Video: వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క.. ఎక్కడో కాదు తెలంగాణలోనే.. చూస్తే మైండ్ బ్లాంకే..

ఇదొక వింతైన మొక్క. ఈ మొక్క దగ్గరకు ఏదైనా పురుగు తన దగ్గరకు వస్తే చాలు లటుక్కున నోరేరి ఆరగించేస్తుంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. కీటకాలనే బిర్యానీలా లాగించేసే ఒక అరుదైన మొక్క ఇప్పుడు తెలంగాణలో ప్రత్యక్షమైంది. పాఠ్యపుస్తకాలకే పరిమితమైన ఆ వింత మొక్క విశేషాలు, అది ఎక్కడుంది? ఎలా కీటకాలను చంపుతుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..

పంటను చూసి.. వయసు మరచి..! పల్టీలు కొడుతూ అన్నదాత సంబురం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఇదే

పంటను చూసి.. వయసు మరచి..! పల్టీలు కొడుతూ అన్నదాత సంబురం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఇదే

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది.. అంతేకాకుండా భారీ దిగుబడి రావడంతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ, కోత గడ్డిపై పల్టీలు కొడుతూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన రైతు బుడ్డ మల్లయ్య ఆనందకేళి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడు మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే టార్గెట్ ఫిక్స్.. పగలు రెక్కీ.. రాత్రికి చోరీ.. ‘కట్టర్’ దొంగ ఖేల్‌ఖతం!

వీడు మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే టార్గెట్ ఫిక్స్.. పగలు రెక్కీ.. రాత్రికి చోరీ.. ‘కట్టర్’ దొంగ ఖేల్‌ఖతం!

వరుస దొంగతనాలు చేసిన ముసుగు దొంగ ఆట కట్టించారు నారాయణపేట జిల్లా పోలీసులు. గత కొన్ని రోజులుగా సుమారు 10 దొంగతనాలు చేసి ఖాకీల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తెల్లవారుజామున తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించి పోలీసులకు చిక్కాడు. దీంతో దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Telangana: కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న పెద్ద నాగుపాము.. కట్‌చేస్తే..

Telangana: కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న పెద్ద నాగుపాము.. కట్‌చేస్తే..

ఎప్పటిలాగే ఉదయాన్నే కోళ్లను బయటకు వదులుదామని వెళ్లిన ఆ ఇంటి యజమానికి కోడి కూతకు బదులు భయంకరమైన బుసల శబ్దం వినిపించింది. తీరా లోపలికి వెళ్లి చూస్తే.. పడగ విప్పిన భారీ నాగుపాము.. అయితే అది కదలలేని స్థితిలో ఉండిపోయింది. అప్పటికే కోడిని చంపి, ఏకంగా తొమ్మిది కోడిగుడ్లను మింగేసింది. ఆ తర్వాత జరిగిన హై డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయ్యో దేవుడా.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో నర్సింగ్ ఆఫీసర్ మృతి.. ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయొద్దు

అయ్యో దేవుడా.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో నర్సింగ్ ఆఫీసర్ మృతి.. ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయొద్దు

మహబూబ్‌నగర్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రిసిల్లా విధులకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలిపిన కారు డోర్‌ను డ్రైవర్ అకస్మాత్తుగా తెరవడంతో ఆమె స్కూటీతో పాటు కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించినా ఫలితం లేక ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ప్రజా సమస్యలు పక్కన పెట్టి మొబైల్స్‌లో గేమ్స్.. ఆ అధికారుల తీరుకు అందరూ షాక్!

ప్రజా సమస్యలు పక్కన పెట్టి మొబైల్స్‌లో గేమ్స్.. ఆ అధికారుల తీరుకు అందరూ షాక్!

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అపహాస్యం పాలైంది. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఈ సమావేశంలో అధికారులు మొబైల్ గేమ్స్ ఆడుతూ, ఫోన్ కాల్స్‌తో కాలక్షేపం చేశారు. ఉన్నతాధికారుల గైర్హాజరీ, కిందిస్థాయి సిబ్బందితో కార్యక్రమం మొక్కుబడిగా మారింది. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి లక్ష్యాలను నీరుగార్చకుండా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలి.

పాలమూరులో అరుదైన పుంగనూరు లేగదూడ జననం.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

పాలమూరులో అరుదైన పుంగనూరు లేగదూడ జననం.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

తెలంగాణలోని పాలమూరు (నారాయణపేట) జిల్లాలో కృత్రిమ గర్భధారణ ద్వారా అరుదైన పుంగనూరు లేగదూడ జన్మించింది. రైతు లక్ష్మీపతిరాజు పశువుల కొట్టంలో మూడో తరానికి చెందిన ఈ చిట్టి ఆవు జన్మించడం జిల్లాలోనే మొదటిసారి. ఔషధ గుణాలున్న పాలు ఇచ్చే ఈ జాతిని ప్రధాని మోదీ కూడా పెంచుతున్నారు. ఈ అద్భుత జననం స్థానిక పాడి రైతులకు ఆనందం కలిగించింది.