ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
Telangana: 8 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే..
వివాహేతర సంబంధంతో మొదలైన వైరం.. ఒక హత్యకు దారితీసింది. ఆ హత్యతో రగిలిన పగ.. కొన్నేళ్ల తర్వాత మరో ప్రాణాన్ని బలితీసుకుంది. తండ్రిని హత్య చేసిన వ్యక్తిని ఏళ్ల తరబడి అవకాశం కోసం వేచి చూసిన కుమారులు చివరకు ప్రతికారం తీర్చుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం రేపిన గుంటిపల్లి రాజు అలియాస్ డోజర్ రాజు హత్య కేసు ఛేదనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 17, 2026
- 2:37 pm
నాన్స్టాప్గా గంట సేపు బావిలో ఈత కొట్టిన తెలంగాణ మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
మంత్రి జూపల్లి కృష్ణారావు 'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్న సిద్ధాంతాన్ని ఆచరణలో చూపారు. 70 ఏళ్ల వయసులోనూ గంటపాటు ఈత కొట్టి, సైకిల్పై ప్రచారం నిర్వహించి ఫిట్నెస్ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతి ఒక్కరూ యోగ, ధ్యానం, వ్యాయామం వంటి శారీరక శ్రమను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 5, 2026
- 1:17 pm
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా..?
చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పెంచుకున్న కక్ష ఓ వ్యక్తిని హత్యకు దారితీసింది. నాగర్కర్నూల్ జిల్లా రేవల్లి గ్రామంలో కర్రెల యాదయ్య హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కుటుంబ సమస్యలు, అనారోగ్యానికి యాదయ్యే చేతబడి చేస్తున్నాడని నమ్మిన నిందితుడు పోలే అంజనేయులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రజలు మూఢనమ్మకాలకు బదులుగా శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని సూచించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 1, 2026
- 9:27 am
బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
మన చుట్టుపక్కల ప్రతిరోజు కనిపించే పక్షుల్లో కాకి ఒకటి. అయితే, ఒకరోజు హఠాత్తుగా తలపై ఈకలు లేకుండా, బట్టతలతో ఒక కాకి మీ కళ్లముందు ప్రత్యక్షమైతే? ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు. కొందరైతే ఏదో కీడు శంకిస్తుందని భయపడి, దానిని అపశకునంగా భావిస్తారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. స్థానిక బొటానికల్ గార్డెన్లో ఒక వింత కాకి కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 1, 2026
- 8:43 am
Telangana: నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్లో టైగర్ సఫారీ బంద్.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే?
నల్లమల అడవుల అందాలను ఆస్వాదిస్తూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో సఫారీ రైడ్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ ప్రయాణాన్ని కాస్త వాయిదా వేసుకోవాల్సిందే.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో సఫారీ సేవలను మూడు నెలల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎందుకో తెలుసా..?
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 30, 2026
- 12:05 pm
అమ్రాబాద్ అడవుల్లో అద్భుతం.. తెలంగాణలో అడుగుపెట్టిన భారతదేశపు అతిపెద్ద రెక్కల సుందరి!
తెలంగాణ అటవీ, జీవ వైవిధ్య సంపదలో మరో అరుదైన జీవి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కానీ.. భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోక చిలుకలలో ఒకటైన సరదన్ బర్డ్ వింగ్ తొలిసారి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కనిపించింది. ఈ అరుదైన గుర్తింపు జీవవైవిధ్య పరిరక్షణలో కొత్త అధ్యాయంగా పేర్కోంటున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 28, 2026
- 11:08 pm
పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే… 30 మంది ఆస్పత్రిపాలు
Kaddu Ka Kheer: మహబూబ్నగర్లో పెళ్లి విందులో మిగిలిన కద్దు కా కీర్ పాయసం తిన్న 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందగా, బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై అధికారులు అప్రమత్తమై ఆహార నాణ్యతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 27, 2026
- 10:23 pm
భర్తను లేపేసి ఏం తెలియనట్లు నటించింది.. కట్ చేస్తే ఆ ఆనవాళ్లతో..
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలుకు ఒక్కగానొక్క కూతురు పద్మ. యాదయ్య, అలివేలు ఇద్దరు కూలి పనిచేసుకుంటూ ఎకరన్నర పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం పద్మకు మహబూబ్ నగర్..
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 27, 2026
- 9:33 pm
BrahMos Unit: ఆ జిల్లా వాసులకు అదిరిపోయే గుడ్న్యూస్.. త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
పాలమూరు జిల్లాలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై చర్చ జరగడంతో మిస్సైల్ యూనిట్ ఏర్పాటు ఆశలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే డీఆర్డీవో అధికారుల పర్యటన, తాజాగా చర్చలతో త్వరలోనే సానుకూలమైన ముందడుగు పడుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 26, 2026
- 7:50 pm
తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే
**Telugu Excerpt:** జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో పందుల దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అర్థరాత్రి సాహసోపేతంగా ఛేజ్ చేశారు. బొలెరో వాహనంలో పందులను ఎత్తుకెళ్తున్న దొంగలు పోలీసులపై రాళ్లు, ఖాళీ బీర్ సీసాలు, పందులను విసిరి దాడికి పాల్పడ్డారు. చివరకు తమ వాహనాన్ని వదిలేసి, కోళ్ల ఫారం నుంచి మరో బొలెరోను అపహరించి కర్ణాటకలోని రాయచూర్ వైపు పరారయ్యారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 20, 2026
- 12:33 pm
Watch: బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు.. సీన్ కట్చేస్తే.. ఇది పరిస్థితి!
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో భీకర గాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు ఎండల ప్రభావం కనిపించగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటుగా బలమైన ఈదురు గాలులు విషాదాన్ని మిగిల్చాయి. భారీ వర్షాని గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 18, 2026
- 7:59 am
Telangana: ఒకే ఫ్రేమ్లో ఐదు తరాలు.. వనపర్తి జిల్లాలో అపురూప కుటుంబ సమ్మేళనం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరినొకరు కలుసుకునే సమయమే కరువైంది. జీవన పోరాటంలో, బతుకుదెరువు కోసం ఎంతోమంది బంధువులు, కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నారు. ఒకప్పుడు నిత్యసత్యమైన ఉమ్మడి కుటుంబం అనే మాట.. నేడు కేవలం ఒక కలగా మిగిలిపోతున్న తరుణంలో, వసుధైక కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది ఒక పల్లెటూరి కుటుంబం. ఈ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే ఈ పూర్తి స్టోరీ చదవాల్సిందే.
- Boorugu Shiva Kumar
- Updated on: Jun 9, 2026
- 5:20 pm