AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boorugu Shiva Kumar

Boorugu Shiva Kumar

Correspondent - TV9 Telugu

shivakumar.boorugu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.

Read More
Follow On:
Telangana: మృత్యువులోను వీడని అన్నదమ్ముల అనుబంధం..

Telangana: మృత్యువులోను వీడని అన్నదమ్ముల అనుబంధం..

తమ్ముడి మరణవార్త విన్న అన్న గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెరుమాండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చిన్ననాటి నుంచి కలిసిమెలిసి జీవించిన అన్నదమ్ములు.. చివరకు మరణంలోనూ విడిపోని బంధంగా నిలిచారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా..

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా..

జోగులాంబ గద్వాల జిల్లాలో 21 ఏళ్ల తర్వాత ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఓ వ్యక్తి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. తన కుమారుడికి తండ్రి గుర్తింపు కావాలని డిమాండ్‌ చేసింది. అవసరమైతే DNA పరీక్షకు సిద్ధమని తల్లి, కుమారుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి, కౌన్సిలింగ్ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Telangana: అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన చెల్లెలు.. ఏం జరిగిందంటే..?

Telangana: అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన చెల్లెలు.. ఏం జరిగిందంటే..?

రక్షాబంధన్ వేళ నవ్వులు విరియాల్సిన ఆ ఇంట్లో.. గుండెలు పగిలే రోదనలు మిన్నంటాయి. నిండు నూరేళ్లు తోడుంటాడనుకున్న అన్న చేతికి ఎంతో ముచ్చటపడి కొనిపెట్టుకున్న రాఖీ.. చివరికి ఆయన మృతదేహానికి కట్టాల్సి వస్తుందని ఆ చెల్లెలు కలలో కూడా ఊహించలేదు. షాద్‌నగర్‌లో జరిగిన ఈ విషాదఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రంగంలోకి త్రీఆర్ బూమర్ మిషన్.. SLBC టన్నెల్‌లో ఊపందుకున్న నిర్మాణ పనులు!

రంగంలోకి త్రీఆర్ బూమర్ మిషన్.. SLBC టన్నెల్‌లో ఊపందుకున్న నిర్మాణ పనులు!

శ్రీశైలం లెఫ్ట్ బాంక్ కెనాల్ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ప్రమాదకరమైన షీర్ జోన్‌ విజయవంతంగా దాటి ముందుకు సాగుతున్నారు. మరోవైపు టన్నెల్ తవ్వకాల వేగాన్ని పెంచేందుకు జపాన్ నుంచి అత్యాధునిక యంత్రాన్ని తీసుకొచ్చారు. దీంతో టన్నెల్ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. గతేడాది ప్రమాదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SLBC టన్నెల్ తవ్వకాల్లో ఇంతకీ షీర్ జోన్‌ను ఎలా దాటారు..? కొత్త మిషన్‌తో పనులు ఎంత వేగంగా జరగనున్నాయో తెలుసుకుందాం.

Irumudi : ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా.. చివరకు దిగొచ్చిన థియేటర్ యాజమాన్యం…

Irumudi : ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా.. చివరకు దిగొచ్చిన థియేటర్ యాజమాన్యం…

నారాయణపేట మక్తల్ పట్టణంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజయవంతంగా రన్ అవుతున్న ఇరుముడి సినిమాను థియేటర్ నుంచి అకస్మాత్తుగా తొలగించడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. తిరిగి అదే సినిమాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు

సాధారణంగా వర్షాలు కురవకపోతే గ్రామాల్లోని దేవతలకు పూజలు చేయడం చూసుంటాం. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం వర్షాలు కురవట్లేదని ఏకంగా మూడు నెలల క్రితం పూడ్చిన మృతదేహాన్ని మళ్లీ బయటకు తీశారు గ్రామస్థులు. సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికితీసి దహనం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

రాత్రికి రాత్రే మాయం.. వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు!

రాత్రికి రాత్రే మాయం.. వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు!

పాలమూరు జిల్లాలో ఇసుక దొంగతనం కలకలం రేపుతోంది. సీజ్ చేసిన ఇసుక డంప్ ను వేలానికి సిద్ధమైన ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు ఇద్దరు వ్యక్తులు. వేలానికి ఒకరోజు ముందే ఇసుకను మాయం చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

50 ఏళ్ల వయసులో బైక్‌తో సాహసం.. చరిత్ర సృష్టంచిన తెలంగాణ మహిళా డాక్టర్.. !

50 ఏళ్ల వయసులో బైక్‌తో సాహసం.. చరిత్ర సృష్టంచిన తెలంగాణ మహిళా డాక్టర్.. !

50 ఏళ్ల వయసులో తెలంగాణకు చెందిన డాక్టర్ మంజుల లేహ్-లడఖ్ బైక్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. బాల్య కలను సాకారం చేసుకుంటూ, అత్యంత క్లిష్టమైన పర్వత మార్గాలను అధిగమించారు. బంగీ జంప్ కూడా చేసి, ధైర్యసాహసాలను చాటారు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ మహిళగా రికార్డు సృష్టించి, వయసు కేవలం ఓ అంకె మాత్రమే అని నిరూపించారు. ఆమె మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచారు.

నల్లమలలో నీలి రంగు వింత… ఈ మొక్క గురించి తెలిస్తే ఆశ్చర్యం..

నల్లమలలో నీలి రంగు వింత… ఈ మొక్క గురించి తెలిస్తే ఆశ్చర్యం..

నల్లమల అడవుల్లో అరుదైన వృక్ష, మొక్కల జాతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో రోథెకా సెర్రాటా ప్రత్యేకమైనది. నీలం నుంచి వయొలెట్ రంగుల్లో గుత్తులుగా పూసే పుష్పాలతో ఆకట్టుకునే ఈ మొక్క పర్యావరణపరంగానే కాకుండా సంప్రదాయ ఔషధ ప్రాధాన్యతను కూడా కలిగి ఉంది.

జర్రుంటే ప్రాణం పోయేది..! రాత్రంతా ఫోన్ ఛార్జింగ్.. ఉదయాన్నే ఊహించని సంఘటన..

జర్రుంటే ప్రాణం పోయేది..! రాత్రంతా ఫోన్ ఛార్జింగ్.. ఉదయాన్నే ఊహించని సంఘటన..

రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టిన మొబైల్ ఫోన్ ఉదయం ఒక్కసారిగా పేలిపోయిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫోన్‌ను జేబులో పెట్టుకుని బయటకు వెళ్లగా.. అది విపరీతంగా వేడెక్కింది. వెంటనే జేబులో నుంచి బయటకు తీస్తుండగానే భారీ శబ్ధంతో పేలిపోయింది.

చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక

చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో వినూత్నంగా ‘మిల్లెట్ భారత్’ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలో ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన AEDP కోర్సు అయిన హార్టికల్చర్ విభాగం విద్యార్థులు వివిధ రకాల చిరుధాన్యాలను ఉపయోగించి భారతదేశ పటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.

ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు.. కృష్ణ నది తీరంలో ఆశ్చర్యకర ఘటన

ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు.. కృష్ణ నది తీరంలో ఆశ్చర్యకర ఘటన

జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన ఓ మొసలి ఘాట్ సమీపానికి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలికి ఎదురుగా కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు నిర్వహించారు.