AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boorugu Shiva Kumar

Boorugu Shiva Kumar

Correspondent - TV9 Telugu

shivakumar.boorugu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.

Read More
Follow On:
తరాలు మారిన చెరగని ఐక్యత.. 50 ఏళ్లుగా ఒకే గణపతిని ప్రతిష్టిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం!

తరాలు మారిన చెరగని ఐక్యత.. 50 ఏళ్లుగా ఒకే గణపతిని ప్రతిష్టిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం!

కాలంతో పాటు కల్చర్‌ కూడా మారిపోయింది.. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఇప్పుడు వీధివీధిలో వినాయకుడు దర్శనమిస్తున్నారు.. ఐక్యతకు నిదర్శనంగా జరుపుకునే పండగకు అర్థాన్నే మార్చేశారు. ఇలాంటి రోజుల్లోనూ ఓ గ్రామం మాత్రం.. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని అలాగే కొనసాగిస్తోంది.. ఒకే ఊరు, ఒకే గణపతి పేరుతో ప్రతి ఏటా గ్రామంలో కేవలం ఒకే గణపతిని ఏర్పాటు చేసి.. ఊరంతా ఐక్యతో పండగను జరుపుతోంది. ఆ గ్రామం గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: భర్తనే లేకపోతే  ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది.. కట్‌చేస్తే..

Telangana: భర్తనే లేకపోతే ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది.. కట్‌చేస్తే..

అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా సాగిన రాక్షస కాండ.. కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా బతకొచ్చనుకుంది.. దర్గా టూర్ పేరుతో మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్ వేసింది. కానీ పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పెను సంచలనం సృష్టించిన కరీం మర్డర్ కేసు వెనుక ఉన్న ఆ చీకటి కోణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్‌ వినాయకుడు!

పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్‌ వినాయకుడు!

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో వినూత్న గణపతి భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వీర శివాజీ నగర్‌లో స్థానికులు సుమారు 40 కిలోల పసుపు కొమ్ములు, మైదాపిండి, గోనె సంచులతో పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని రూపొందించారు. గత 15 ఏళ్లుగా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌కు దూరంగా ఉంటున్న నిర్వాహకులు ఈసారి కూడా సహజ పదార్థాలతో గణపతిని తీర్చిదిద్దారు. వెదురు తడకలతో మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిమజ్జనం తర్వాత పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు.. పండుగ వేళ ఇదేం తంతు..

పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు.. పండుగ వేళ ఇదేం తంతు..

రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండలం పీర్జాపూర్‌లో వినాయక చవితి వేళ వర్గ విభేదాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆంజనేయస్వామి ఆలయంలో గణేశుడిని ప్రతిష్ఠించి నవరాత్రులు నిర్వహించాలన్న విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఘర్షణలకు అవకాశం లేకుండా పోలీసులు ఆలయంలో ఏ వర్గం విగ్రహాన్ని పెట్టకూడదని సూచించారు. దీంతో అసంతృప్తికి గురైన ఓ వర్గం గణేశుడిని గ్రామ చెరువులో నిమజ్జనం చేసింది. పూజలు, నవరాత్రులు నిర్వహించకుండానే విగ్రహం నిమజ్జనం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

వల వేసేముందు నక్కతోక తొక్కాడో ఏమో.. ఏంది గురూ ఈ చేపలు..

వల వేసేముందు నక్కతోక తొక్కాడో ఏమో.. ఏంది గురూ ఈ చేపలు..

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో చేపల వేటకు వెళ్లిన జోగులాంబ గద్వాల జిల్లా షేక్‌పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్ కృష్ణకు ఊహించని అదృష్టం కలిసొచ్చింది. వల వేయగా ఏకంగా ఐదు భారీ బొచ్చ చేపలు చిక్కాయి. ఒక్కో చేప సుమారు 30 కిలోల బరువు ఉన్నట్లు తోటి మత్స్యకారులు చెబుతున్నారు.

నెలలు గడిచినా.. ఇచ్చిన మాట మర్వలేదు.. విద్యార్థులకు గ్రూప్‌-1 అధికారుల అదిరిపోయే గిఫ్ట్

నెలలు గడిచినా.. ఇచ్చిన మాట మర్వలేదు.. విద్యార్థులకు గ్రూప్‌-1 అధికారుల అదిరిపోయే గిఫ్ట్

నెలలు గడిచినా ఇచ్చిన మాటను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ నెరవేర్చారు గ్రూప్ 1 శిక్షణాధికారులు. గత ఫిబ్రవరిలో ట్రైనింగ్‌ కోసం మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పాఠశాలకు వచ్చిన గ్రూప్ అభ్యర్థులు విద్యార్థుల అభ్యసనలో సాంకేతికతను భాగం చేయాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలకు ప్రొజెక్టర్ అందిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు.

Telangana: మృత్యువులోను వీడని అన్నదమ్ముల అనుబంధం..

Telangana: మృత్యువులోను వీడని అన్నదమ్ముల అనుబంధం..

తమ్ముడి మరణవార్త విన్న అన్న గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెరుమాండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చిన్ననాటి నుంచి కలిసిమెలిసి జీవించిన అన్నదమ్ములు.. చివరకు మరణంలోనూ విడిపోని బంధంగా నిలిచారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా..

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా..

జోగులాంబ గద్వాల జిల్లాలో 21 ఏళ్ల తర్వాత ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఓ వ్యక్తి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. తన కుమారుడికి తండ్రి గుర్తింపు కావాలని డిమాండ్‌ చేసింది. అవసరమైతే DNA పరీక్షకు సిద్ధమని తల్లి, కుమారుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి, కౌన్సిలింగ్ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Telangana: అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన చెల్లెలు.. ఏం జరిగిందంటే..?

Telangana: అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన చెల్లెలు.. ఏం జరిగిందంటే..?

రక్షాబంధన్ వేళ నవ్వులు విరియాల్సిన ఆ ఇంట్లో.. గుండెలు పగిలే రోదనలు మిన్నంటాయి. నిండు నూరేళ్లు తోడుంటాడనుకున్న అన్న చేతికి ఎంతో ముచ్చటపడి కొనిపెట్టుకున్న రాఖీ.. చివరికి ఆయన మృతదేహానికి కట్టాల్సి వస్తుందని ఆ చెల్లెలు కలలో కూడా ఊహించలేదు. షాద్‌నగర్‌లో జరిగిన ఈ విషాదఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రంగంలోకి త్రీఆర్ బూమర్ మిషన్.. SLBC టన్నెల్‌లో ఊపందుకున్న నిర్మాణ పనులు!

రంగంలోకి త్రీఆర్ బూమర్ మిషన్.. SLBC టన్నెల్‌లో ఊపందుకున్న నిర్మాణ పనులు!

శ్రీశైలం లెఫ్ట్ బాంక్ కెనాల్ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ప్రమాదకరమైన షీర్ జోన్‌ విజయవంతంగా దాటి ముందుకు సాగుతున్నారు. మరోవైపు టన్నెల్ తవ్వకాల వేగాన్ని పెంచేందుకు జపాన్ నుంచి అత్యాధునిక యంత్రాన్ని తీసుకొచ్చారు. దీంతో టన్నెల్ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. గతేడాది ప్రమాదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SLBC టన్నెల్ తవ్వకాల్లో ఇంతకీ షీర్ జోన్‌ను ఎలా దాటారు..? కొత్త మిషన్‌తో పనులు ఎంత వేగంగా జరగనున్నాయో తెలుసుకుందాం.

Irumudi : ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా.. చివరకు దిగొచ్చిన థియేటర్ యాజమాన్యం…

Irumudi : ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా.. చివరకు దిగొచ్చిన థియేటర్ యాజమాన్యం…

నారాయణపేట మక్తల్ పట్టణంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజయవంతంగా రన్ అవుతున్న ఇరుముడి సినిమాను థియేటర్ నుంచి అకస్మాత్తుగా తొలగించడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. తిరిగి అదే సినిమాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు

సాధారణంగా వర్షాలు కురవకపోతే గ్రామాల్లోని దేవతలకు పూజలు చేయడం చూసుంటాం. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం వర్షాలు కురవట్లేదని ఏకంగా మూడు నెలల క్రితం పూడ్చిన మృతదేహాన్ని మళ్లీ బయటకు తీశారు గ్రామస్థులు. సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికితీసి దహనం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.