Boorugu Shiva Kumar

Boorugu Shiva Kumar

Correspondent - TV9 Telugu

shivakumar.boorugu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.

Read More
Follow On:
Telangana: ఆపిల్ పండ్లను దొంగిలిస్తున్నాడని.. మరీ ఇంత దారుణమా..?

Telangana: ఆపిల్ పండ్లను దొంగిలిస్తున్నాడని.. మరీ ఇంత దారుణమా..?

నారాయణపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆపిల్ పండ్లు దొగిలిస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు పండ్ల వ్యాపారులు. మృతదేహాన్ని బస్టాండ్ గ్రౌండ్ లో పడేసి పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Telangana: కసాయి కొడుకు.. డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు..

Telangana: కసాయి కొడుకు.. డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు..

మత్తుకు బానిసైన ఓ యువకుడు కన్నతల్లిని కడతేర్చాడు. అడిగితే డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ముళ్లపొదలోకి శవాన్ని ఈడ్చుకెళ్లి పడేసి, పరారయ్యాడు. ఈ దారుణ ఘటన నాగర్‌ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది. మహాదేవునిపేట గ్రామానికి చెందిన లేట్ల ఉత్తయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

Telangana: ఆ ప్రాంతంలో ఖరీదైన కార్లు, బైక్స్ కొంటున్న నిరుద్యోగ యువకులు.. ఏంటా అని ఎంక్వైరీ చేయగా

Telangana: ఆ ప్రాంతంలో ఖరీదైన కార్లు, బైక్స్ కొంటున్న నిరుద్యోగ యువకులు.. ఏంటా అని ఎంక్వైరీ చేయగా

ఎక్కడా చూసినా... విన్నా సైబర్ మోసం పెద్ద సమస్యగా మారింది. రుణాలు, మొబైల్ యాప్స్, పెట్టుబడులు, పార్సిల్స్, డిజిటల్ అరెస్టులు.. ఇలా రకరకాల రూపాల్లో ఖాతాల్లో నగదును క్షణాల్లో లాగేస్తున్నారు కేటుగాళ్లు. ఇన్ని రోజులు ఈ సమస్య ఇతర రాష్ట్రాల వారు చేస్తుండడంతో కొద్దొ గొప్పో ఈ తరహా మోసాలను ముందే గుర్తించి జాగ్రత్త పడేవారు. కానీ కాలం మారింది... మనవాళ్లే మనకు టోకరా వేస్తున్నారు. ఏకంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సైబర్ మోసాలపై శిక్షణ పొంది స్థానికంగా కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు.

నవ్విందనీ విద్యార్థినిపైకి చెప్పు విసిరిన టీచర్‌.. తల్లిదండ్రుల దేహశుద్ధి! విద్యాశాఖ సస్పెన్షన్‌ వేటు

నవ్విందనీ విద్యార్థినిపైకి చెప్పు విసిరిన టీచర్‌.. తల్లిదండ్రుల దేహశుద్ధి! విద్యాశాఖ సస్పెన్షన్‌ వేటు

చదువు చెప్పి, సంస్కారం నేర్పవల్సిన ఓ ఉపాధ్యాయుడు కుసంస్కారిగా ప్రవర్తించాడు. ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రలు పాఠశాలపై దండెత్తి సందరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. అంతేనా విద్యాశాఖకు ఫిర్యాదు అందడంతో.. దెబ్బకు సస్పెండ్‌ చేసిపారేసింది..

Telangana: చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. మరుసటి రోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..

Telangana: చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. మరుసటి రోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..

బైక్.! ఆ బైక్ కీ రెండు కనిపించాయి. చుట్టుపక్కల చూశాడు ఎవరూ లేరు. ఇంకేముంటుంది.. క్షణాల్లో ద్విచక్ర వాహనాన్ని తీసుకొని అక్కడి నుంచి మాయం అయ్యాడు. ఇదంతా రొటీన్..! కానీ ఆ దొంగ మాత్రం అలా చేయలేదు. మరునాడు అదే బైక్‌ను అదే ప్లేస్‌లో వదిలి వెళ్లాడు. వినడానికి కొంత వింతగా ఉన్నా జోగుళాంబ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Telangana: రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని చెక్‌ చేయగా..!

Telangana: రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని చెక్‌ చేయగా..!

ఓ యువకుడు రోజూ బకెట్‌తో నీళ్లు తీసుకెళ్లి స్మశానంలోని సమాధులకు పోస్తున్నాడు. అసలు అతడు అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు.  ఈ యువకుడు మాత్రం ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీళ్లు తీసుకెళ్లి సమాధుల మధ్య పోస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. విషయం పోలీసులకు చేరవేసారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వెళ్లి చూసి షాకయ్యారు.

Telagana: వీడెవడండీ బాబూ..! దొబ్బేసిన చోటే దొరికిపోయాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!

Telagana: వీడెవడండీ బాబూ..! దొబ్బేసిన చోటే దొరికిపోయాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!

వరుస చోరీలతో కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగ నాటకీయంగా పోలీసులకు చిక్కాడు. పోలీసుల నుంచి తప్పించుకుని ఆరేళ్లుగా అడ్రస్ లేకుండా తిరుగుతున్న చాపలి భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ అదే ప్రాంతంలో చోరీకి ప్రయత్నం చేసస్తూ ఖాకీల చేతికి దొరికిపోయాడు. అతని నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు.. కారణం ఏంటంటే..!

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు.. కారణం ఏంటంటే..!

గురుకులాల్లో సమస్యలు విద్యార్థులను అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆహార కల్తీ తో ఆస్పత్రి పాలైన విద్యార్థులు... ఇప్పుడు ఉపాధ్యాయులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ రోడ్డెక్కారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ జిల్లా కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Telangana: భర్త గొర్రెలు కాచేందుకు వెళ్లడం లేదని దారుణం.. అర్థరాత్రి అంతా నిద్రలో ఉండగా భార్య ఏం చేసిందంటే..

Telangana: భర్త గొర్రెలు కాచేందుకు వెళ్లడం లేదని దారుణం.. అర్థరాత్రి అంతా నిద్రలో ఉండగా భార్య ఏం చేసిందంటే..

నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ కుగ్రామం.. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు.. భార్య భర్త గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు.. ఈ క్రమంలో భర్త కల్లుకు బానిసై.. గొర్లు కాచేందుకు వెళ్లడం లేదు.. ఈ విషయంలో భర్తతో భార్య గొడవకు దిగింది.. ఘర్షణ ముగిసిన తర్వాత అందరూ నిద్రపోయారు.. అర్థరాత్రి వేళ భార్య భర్తను కిరాతకంగా చంపడం కలకలం రేపింది.

Telangana: దండిగా చేపల పడతాయని రాత్రే వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా

Telangana: దండిగా చేపల పడతాయని రాత్రే వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా

తెల్లారితే ఆదివారం... మార్కెట్లో చికెన్, మటన్ ధరలు కొండెక్కాయి. దీంతో చేపలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అయితే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఆ మత్స్యకారులకు మాత్రం పెద్ద షాక్ తగిలింది. చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. వారి నిరాశ అంతా ఇంతా కాదు. ఇంతకీ ఏం జరిగింది. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: బహిర్భూమికని వెళ్లి… తిరిగిరాని లోకాలకు విద్యార్థి..

Telangana: బహిర్భూమికని వెళ్లి… తిరిగిరాని లోకాలకు విద్యార్థి..

వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. బహిర్భూమికని స్కూల్ వెనకాలకు వెళ్లి విగత జీవిగా మారిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. ఎదుగుతున్న తనయుడి మృతి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

AP News: పార్క్ చేసిన స్కూటీలో వింత శబ్దాలు.. భయంగానే వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్!

AP News: పార్క్ చేసిన స్కూటీలో వింత శబ్దాలు.. భయంగానే వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్!

సాధారణంగా ఈ రోజుల్లో పాములంటే ఎవరికైనా భయం. అందులోనూ విషపూరితమైనవి అయితే అమ్మ బాబోయ్ అనాల్సిందే. అలాంటి సర్పం ఒకటి పార్క్ చేసిన స్కూటీలో దూరి భయభ్రాంతులకు గురిచేసింది.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..