ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు.. కృష్ణ నది తీరంలో ఆశ్చర్యకర ఘటన
జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన ఓ మొసలి ఘాట్ సమీపానికి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలికి ఎదురుగా కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు నిర్వహించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Aug 9, 2026
- 7:23 pm
Telangana: ఇన్స్టాగ్రామ్ రీల్తో గలీజ్ దందా.. నాగర్ కర్నూల్లో తీగ లాగితే ఏపీలో కదిలిన డొంక..
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ, సోషల్ మీడియాలో వచ్చిన ఒక రీల్.. వారిని ఏకంగా నకిలీ నోట్ల ముఠాగా మార్చేశాయి. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ నకిలీ కరెన్సీ ముఠా గుట్టును బిజినపల్లి పోలీసులు అత్యంత చాకచక్యంగా రట్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Boorugu Shiva Kumar
- Updated on: Aug 8, 2026
- 1:12 pm
కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
Nagarkurnool RMP Doctor Murder: నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లిలో సంచలనం సృష్టించిన ఆర్ఎంపీ డాక్టర్ బోగిని మల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. పదేళ్లుగా కొనసాగుతున్న భూ వివాదమే ఈ హత్యకు కారణమని తేల్చిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Aug 3, 2026
- 10:53 pm
Viral Video: వ్యవసాయ బావిలో కనిపించిన భారీ ఆకారం.. ఏంటని తొంగి చూడగా..
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ రైతు పొలంలో ఉన్న 80 ఆడుగుల వ్యవసాయ బావీలో భారీ మొసలి ప్రత్యక్షమైంది. ఇటీవల పొలానికి వెళ్లిన రైతుకు బావిలో మొసలి కనిపించడంతో భయపడిపోయిన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్నేక్ క్యాచర్ సహాయంతో మొసలిని సురక్షితంగా రక్షించిన పోలీసులు.. చివరకు దాన్ని కృష్ణా నదిలో వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Aug 3, 2026
- 7:47 pm
వర్షాకాలంలో తప్పక చూడాల్సిన టూరిస్ట్ స్పాట్.. ఒక్కసారి ఇక్కడ చేపలు తింటే రుచి జన్మలో మర్చిపోరు!
Jurala Dam Tourism: వర్షకాలం మొదలైతే చాలు జూరాల జలాశయం కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఒకవైపు ఉప్పొంగుతూ పరవళ్లు తొక్కతున్న కృష్ణమ్మ.. మరోవైపు పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని పంచుతున్న జలాశయ పరిసరాలు సందర్శకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. పాల నురగళ్ల పారుతున్న నది అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీజన్ లో తొలిసారి జూరాల గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Aug 3, 2026
- 3:48 pm
పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన భార్య ప్లాన్ అనూహ్య మలుపు తిరిగింది. భర్త ఇంట్లో లేకపోవడంతో మామనే కిరాతకంగా హత్య చేశారు. వనపర్తి పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 31, 2026
- 7:09 am
Telangana: అత్యంత అరుదైనది.. అందమైనది.. కొంపదీసి తినేరు.. ఖతం అంతే..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అత్యంత అరుదైన "క్లార్కిఇండా ట్రాకోడెస్" (Clarkeinda trachodes) అడవి పుట్టగొడుగు గుర్తించారు. తెలంగాణలో ఈ శిలీంద్ర జాతి నమోదవడం ఇదే తొలిసారి. ఈ పుట్టగొడుగు విషతుల్యమైనదని, దీనిని ఆహారంగా తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 30, 2026
- 7:42 am
పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది?
గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ భారీ బండరాయిపై వినాయకుడి రూపం చెక్కబడి ఉంది. అదే బండరాయి పక్కనే లోతుగా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. తవ్వకాల కోసం పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు. దీనికి తోడు ఘటన స్థలంలో తాయత్తులు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయతో పాటు ఇతర పూజా సామాగ్రి సైతం కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 24, 2026
- 12:22 pm
Telangana: 8 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే..
వివాహేతర సంబంధంతో మొదలైన వైరం.. ఒక హత్యకు దారితీసింది. ఆ హత్యతో రగిలిన పగ.. కొన్నేళ్ల తర్వాత మరో ప్రాణాన్ని బలితీసుకుంది. తండ్రిని హత్య చేసిన వ్యక్తిని ఏళ్ల తరబడి అవకాశం కోసం వేచి చూసిన కుమారులు చివరకు ప్రతికారం తీర్చుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం రేపిన గుంటిపల్లి రాజు అలియాస్ డోజర్ రాజు హత్య కేసు ఛేదనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 17, 2026
- 2:37 pm
నాన్స్టాప్గా గంట సేపు బావిలో ఈత కొట్టిన తెలంగాణ మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
మంత్రి జూపల్లి కృష్ణారావు 'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్న సిద్ధాంతాన్ని ఆచరణలో చూపారు. 70 ఏళ్ల వయసులోనూ గంటపాటు ఈత కొట్టి, సైకిల్పై ప్రచారం నిర్వహించి ఫిట్నెస్ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతి ఒక్కరూ యోగ, ధ్యానం, వ్యాయామం వంటి శారీరక శ్రమను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 5, 2026
- 1:17 pm
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా..?
చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పెంచుకున్న కక్ష ఓ వ్యక్తిని హత్యకు దారితీసింది. నాగర్కర్నూల్ జిల్లా రేవల్లి గ్రామంలో కర్రెల యాదయ్య హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కుటుంబ సమస్యలు, అనారోగ్యానికి యాదయ్యే చేతబడి చేస్తున్నాడని నమ్మిన నిందితుడు పోలే అంజనేయులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రజలు మూఢనమ్మకాలకు బదులుగా శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని సూచించారు.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 1, 2026
- 9:27 am
బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
మన చుట్టుపక్కల ప్రతిరోజు కనిపించే పక్షుల్లో కాకి ఒకటి. అయితే, ఒకరోజు హఠాత్తుగా తలపై ఈకలు లేకుండా, బట్టతలతో ఒక కాకి మీ కళ్లముందు ప్రత్యక్షమైతే? ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు. కొందరైతే ఏదో కీడు శంకిస్తుందని భయపడి, దానిని అపశకునంగా భావిస్తారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. స్థానిక బొటానికల్ గార్డెన్లో ఒక వింత కాకి కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jul 1, 2026
- 8:43 am