AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి.. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భవానీ మాల ధరించిన భక్తులతో సహా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. క్యూ లైన్ లో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

Indrakeeladri: ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి.. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
Indrakeeladri Devotees Rush
Surya Kala
|

Updated on: Oct 04, 2025 | 9:44 AM

Share

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలు ముగిసినా భక్తుల సందడి తగ్గలేదు. నవరాత్రి వేడుకలు ముగిసినప్పటికీ.. అమ్మాలన్న అమ్మ ముగ్గురమ్మల  మూలపుటమ్మ కనక దుర్గ కొలువైన ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా దుర్గమ్మ దర్శనం కోసం భవానీ దీక్షను ధరించిన వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. భవానీ భక్తులు తమ కుటుంబాలతో కలిసి దర్శనం కోసం రావటంతో దేవస్థానం నిండిపోయింది. క్యూలైన్లు భక్తులతో కిటికిటలాడాయి. ఆలయ ప్రాంగణం అమ్మవారి స్మరణతో మారుమ్రోగుతోంది. మరోవైపు ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి ఆదివారం వరకూ ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

విజయవాడ దసరా సంబరాలకు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. గతేడాది పది రోజుల్లో సుమారుగా 8లక్షల 94వేల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారు. అటు భవానీ భక్తులను కూడా కలిపితే మొత్తంగా 12 లక్షల మంది వచ్చినట్లు అధికారుల అంచనా. అయితే ఈసారి మాత్రం నవరాత్రిలో మూలా నక్షత్రం రోజున వచ్చిన భక్తులే సుమారుగా లక్షా 95వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.. మొత్తం దసరా ముగిసే సరికి భక్తుల సంఖ్య 15 లక్షలు దాటింది.. ఇక ఆదివారం రాత్రి వరకు 18 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దసరా వేడుకలు ముగిసినా భక్తుల సందడి తగ్గలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా