AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రైలులో 59 మంది సజీవ దహనం.. ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ.. అసలు మిస్ కావొద్దు

ఈ మధ్యన నిజ జీవితంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే.

OTT Movie: రైలులో 59 మంది సజీవ దహనం.. ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ.. అసలు మిస్ కావొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 19, 2025 | 9:10 PM

Share

రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కే సినిమాలకు అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీల్లో వీటికి రికార్డు వ్యూస వస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే పలువురు ఫిల్మ్ మేకర్లు, ఓటీటీ సంస్థలు బయోపిక్స్, రియల్ స్టోరీలంటూ ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే.. గతేడాది నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈమూవీకి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద మంచిగానే వసూళ్లు వచ్చాయి. 2002 లో దేశాన్ని కుదిపేసిన ఒక మారణ హోమం అధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కదులుతున్న రైలులో 59 మంది సజీవ దహనమైన ఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అప్పటివరకు ఈ దారుణ ఘటనపై ఉన్న అపోహలు, అబద్ధాలను ఈ సినిమా చేరిపేసిందంటూ కాంప్లిమెంట్స్ వినిపించాయి. సుమారు 2 గంటల 7 నిమిషాల పాటు సాగే ఈ సినిమాకు IMDb లో 8.2/10 రేటింగ్ కూడా రావడం విశేషం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో ఈ సినిమాను చూసి ‘ అసలు నిజం బయటకొచ్చింది’ అని ట్వీట్ చేసి ప్రశంసించారు కూడా. ఉత్కంఠ రేపే సీన్లతో ఆద్యంతం ఎమోషనల్ గా సాగా ఆ సినిమా పేరు సబర్మతీ రిపోర్ట్.

2002లో దేశాన్ని కుదిపేసిన గోధ్రా రైలు దహన ఘటన సబర్మతీ రిపోర్ట్ ను తెరకెక్కించారు మేకర్స్. ధీరజ్ సర్నా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ో విక్రాంత్ మాస్సీ , రాశి ఖన్నా , రిద్ధి డోగ్రా, బర్కా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, వికిర్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అమూల్ వి. మోహన్, అన్షుల్ మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన సినిమా..

2024 నవంబర్ 15న థియేటర్లలో రిలీజైన ది సబర్మతీ రిపోర్ట్ 2025 జనవరి 10 నుంచి ఓటీటీలోకి వచ్చింది. జీ5 ఓటీటీలో హిందీ, తెలుగు, తమిళ ఆడియోలతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. జియో టీవీలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను