భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..?
Bhadrachalam Sri Rama Kalyanam 2026: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అతి వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనుండగా, ముఖ్య ఘట్టమైన శ్రీ సీతారాముల వార్షిక కల్యాణం ఈ సంవత్సరం మార్చి 27న జరుగుతుంది. ఇక, భక్తులు రూ.151 చెల్లించి TGSRTC లాజిస్టిక్స్ ద్వారా తలంబ్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.

హిందూ ప్రధాన పండుగలలో ఒకటైన శ్రీరామనవమి సందర్భంగా, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అతి వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనుండగా, ముఖ్య ఘట్టమైన శ్రీ సీతారాముల వార్షిక కల్యాణం ఈ సంవత్సరం మార్చి 27న జరుగుతుంది. భక్తులు ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఆలయ అధికారులు ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేశారు.
టికెట్ బుకింగ్ విధానం
భక్తులు భద్రాచలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ https://bhadradritemple.telangana.gov.in ద్వారా సెక్టార్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో “శ్రీరామనవమి టికెట్” లింక్పై క్లిక్ చేయాలి. కల్యాణం సెక్టార్ లేదా పట్టాభిషేకం సెక్టార్ ఎంపిక చేసుకోవాలి. నిర్ణయించిన ఫీజు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
దూర భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
భద్రాచలానికి రాలేని భక్తులు కూడా ఆన్లైన్ ద్వారా రూ.5,000 లేదా రూ.1,116 టికెట్లు బుక్ చేసి, తమ గోత్ర నామాలతో కల్యాణం నిర్వహించుకునే అవకాశం ఉంది.
ఆన్లైన్ కాకుండా టికెట్లు పొందే కేంద్రాలు (మార్చి 15 నుంచి)
- భద్రాచలం రామాలయం ప్రధాన కౌంటర్
- తానీషా కల్యాణ మండపం
- గోదావరి బ్రిడ్జీ వద్ద దేవస్థానం విచారణ విభాగం
- భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం
ఇంటికే తలంబ్రాలు – ఆర్టీసీ సేవలు
తలంబ్రాల బుకింగ్: భక్తులు రూ.151 చెల్లించి TGSRTC లాజిస్టిక్స్ ద్వారా తలంబ్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సమీప TGSRTC కౌంటర్ల ద్వారా కూడా పొందవచ్చు.
సంప్రదించాల్సిన ఫోన్లు: 040-69440069, 040-23450033
ఇతర ముఖ్య కార్యక్రమాలు
మార్చి 28: శ్రీరాముడి పట్టాభిషేకం. ఈ సంవత్సరం సుమారు 5 లక్షలకు పైగా ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల కోసం సుమారు 2 లక్షల చిన్న లడ్డూలు, 400 గ్రాముల మహా లడ్డూలు (రూ.100) – 3,000 కంటే ఎక్కువ సిద్ధం చేస్తున్నారు. భద్రాచలం దేవస్థానం శ్రీరామనవమి సందర్భంగా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో TGSRTC, APSRTC ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి.
