
శ్రీరామనవమి
శ్రీరామచంద్రుడు మానవుడు దేవుడిగా మారి భక్తుల మదిలో కొలువై పూజలను అందుకున్నాడు. ఆసేతు హిమాచలం రామాలయం లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు వారు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువూ శ్రీ రాముడిని తమ ఇలవేల్పుగా కొలుస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి, గురువారము రోజు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో జన్మించినాడని నమ్మకం. అంతేకాదు ఈ రోజు సీతారాముల కళ్యాణం జరిగిందని.. శ్రీరాముడు రావణ సంహారం అనంతరం సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు చైత్ర శుద్ధ నవమి అని నమ్మకం. అందుకనే ప్రతి ఏడాది చైత్ర శుక్లపక్ష నవమిని గొప్ప పండగగా జరుపుకుంటారు.
శ్రీరామ నవమి పండుగ రోజున అయోధ్యలో బాల రామయ్యకు జన్మ దిన వేడుకలను నిర్వహిస్తారు. రాముడంటే ఒకటే మాట, ఓకే బాణం..రాముడంటే సీతకు ప్రాణం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే రామాయణం. లోక కళ్యానమే శ్రీ సీతా రాముల కళ్యానం అంటూ యావత్ భరతం అంటే పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చైత్రమాస శుద్ధ నవమి రోజున అంటే 06వ తేదీ ఏప్రిల్ 2025 ఆదివారంన శ్రీ రామ నవమి వేడుకలను జరుపుకోనున్నారు.
ఇప్పటికే శ్రీ రామ నవమి సందడి మొదలైంది. పందిళ్ళు రెడీ అవుతున్నాయి. దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. సీతారాముల కల్యాణం చూడడానికి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున చలిమి పానకం ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తారు.
Shri Sai Baba Temple Shirdi : షిర్డీలో రికార్డు స్థాయి ఆదాయం.. 3 రోజుల్లో రూ.4.26 కోట్లు
మహారాష్ట్రలోని షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయానికి శ్రీరామ నవమి సందర్భంగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ నెల 5 నుండి 7 వరకు జరిగిన శ్రీ రామ నవమి ఉత్సవాల్లో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (SSST) మొత్తం రూ. 4.26 కోట్ల విరాళాలను సేకరించింది. వచ్చిన మొత్తం విరాళాల్లో రూ. 1.67 కోట్లు నగదు రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది.
- Anand T
- Updated on: Apr 10, 2025
- 11:28 am
కనుల పండుగగా దీపోత్సవం.. 2.5లక్షల ప్రమిదలతో దేదీప్యమానంగా వెలిగిపోయిన అయోధ్య
అయోధ్యలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. బాలరాముడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తర్వాత బాలరాముడిని సుందరంగా అలంకరించారు. రామనవమి సందర్భంగా.. బాలరాముడి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అటు శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ నామస్మరణతో మార్మోగింది. ఇటు అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
- Balaraju Goud
- Updated on: Apr 7, 2025
- 1:25 pm
Lasya Manjunath: శ్రీరామనవమి పర్వదినాన.. అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న యాంకర్ లాస్య.. ఫొటోస్ ఇదిగో
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం (ఏప్రిల్ 06) రామలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు, పూజల్లో రామ భక్తులు నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యాంకర్ లాస్య మంజునాథ్ శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను దర్శించుకుంది. అక్కడి బాలరాముడికి ప్రత్యేక పూజలు చేసింది.
- Basha Shek
- Updated on: Apr 7, 2025
- 1:26 pm
తరతరాల ఆచారం ఆగిపోయింది! ఈ సారి చిత్రపటాలతో శ్రీరామనవిమి వేడుకలు..
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురంలోని గిరిజనులు శ్రీరామనవమిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఉత్సవ విగ్రహాలకు బదులుగా, సండ్ర, పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సీతా రామ లక్ష్మణ ఆంజనేయులుగా పూజిస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. కానీ ఈ ఏడాది, చెట్ల కొరత కారణంగా, చిత్రపటాలను ఉపయోగించి కళ్యాణం జరిగింది.
- B Ravi Kumar
- Updated on: Apr 7, 2025
- 1:27 pm
Hyderabad: ప్రారంభం అయిన శ్రీరామనవమి శోభాయాత్ర .. లైవ్ వీక్షించండి
శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరయిన నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. జై శ్రీరామ్ నామాన్ని జపిస్తూ భక్తులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగమవుతున్నారు.
- Ram Naramaneni
- Updated on: Apr 7, 2025
- 1:31 pm
Telangana: ఒక ఊరిలో నిత్యపూజలు.. మరో ఊరిలో కల్యాణం, బ్రహ్మోత్సవాలు.. ఈ రాములోరు చాలా స్పెషల్
ఏ దేవాలయాల్లోనైనా స్వామి వార్లకు నిత్య పూజలైనా.. పర్వదినాల్లో ప్రత్యేక పూజలైనా.. కళ్యాణం నిర్వహించడమైనా అదే ఆలయంలో జరుగుతాయి. కానీ ఈ దేవుడికి మాత్రం రెండు ఊళ్లలో.. రెండు ఆలయాలు ఉన్నాయి. ఒక గ్రామంలోని ఆలయంలో నిత్య పూజలు జరుగుతుండగా, మరో గ్రామంలోని ఆలయంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం జరగడం విశేషం.
- M Revan Reddy
- Updated on: Apr 7, 2025
- 1:34 pm
Telangana: చుక్కా.. ముక్కతో శ్రీరామనవమి.. ఇక్కడ ప్రతి ఏటా అంతే..
శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది.. రాములోరి కళ్యాణం. దేశమంతటా శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో వేడుకలను వైభోవంగా జరుపుకుంటారు. నవమి రోజున బెల్లం పానకం, పాయసం, పులిహోర వంటకాలను ఆస్వాదిస్తారు. మద్యం, నాన్ వెజ్ జోలికైతే అసలే వెళ్లారు. కానీ ఇక్కడ అందుకు బిన్నంగా శ్రీరామ నవమి వేడుకలను వెరైటీగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి రోజున ప్రతి ఇంట్లో చుక్క, ముక్క ఉండాల్సిందే. అందరూ విందు భోజనాలతో ధావత్ చేసుకోవాల్సిందే. సంప్రదాయానికి భిన్నంగా వెరైటీగా శ్రీరామ నవమిని జరుపుకుంటున్న ఆ గ్రామామేదో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..!
- M Revan Reddy
- Updated on: Apr 6, 2025
- 2:03 pm
Video: నా జన్మ ధన్యమైంది! రామనవమి నాడు అద్భుత దృశ్యాన్ని తిలకించిన ప్రధాని మోదీ!
శ్రీలంక పర్యటన నుండి తిరిగి వస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రామసేతును దర్శించుకున్నారు. ఈ ఘటనను ఆయన స్వయంగా ఎక్స్ వేదికలో ప్రకటించారు. అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఈ దర్శనం జరగడం దైవిక సంఘటనగా ఆయన పేర్కొన్నారు.
- SN Pasha
- Updated on: Apr 6, 2025
- 1:51 pm
శాలిగౌరారంలో వెలసిన మీసాల రాముడికి కల్యాణం…దేశంలో ఎక్కడలేని ప్రత్యేకం..
భరతజాతికి ఇంటి ఇలవేల్పుగా భావించే శ్రీరాముడి రూపం.. అందరి మనసులో నుదుటిపై కస్తూరి తిలకం, పెదాలపై చిరునవ్వు, చేతిలో బాణంతో.. మెదులుతూ ఉంటుంది. కానీ సినీ నటుడు ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో శ్రీరాముడు వెరైటీగా కనిపించాడు. అయితే ఈ సినిమాలో కనిపించిన శ్రీరాముడి రూపంపై పెద్ద చర్చే జరిగింది. కానీ అక్కడక్కడ కొన్ని ఆలయాల్లో శ్రీరాముడు అరుదైన రూపాల్లో కూడా కనిపిస్తుంటాడు. నల్లగొండ జిల్లాలో కనిపించే శ్రీరాముడి అరుదైన రూపం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Apr 7, 2025
- 3:50 pm
Rama Navami 2025 Live: జగమంతా రామమయం.. భద్రాచలం సీతారాముల కల్యాణం.. లైవ్ వీడియో
సీతారామం.. భద్రాచలం.. దేవదేవుడి కల్యాణం.. చూతము రారండి అంటూ లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.. మిధిలా స్టేడియం వేదికగా.. రాములోరి కల్యాణ క్రతువును వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 6, 2025
- 1:07 pm