Hyderabad: ప్రారంభం అయిన శ్రీరామనవమి శోభాయాత్ర .. లైవ్ వీక్షించండి
శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరయిన నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. జై శ్రీరామ్ నామాన్ని జపిస్తూ భక్తులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగమవుతున్నారు.
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ్హాట్ సీతారాంబాగ్ నుంచి సుల్తాన్బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు మూడున్నర కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసు ఉన్నతాధికారులు.
శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ క్రమంలోనే.. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. భద్రతా చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్సింగ్ మాన్.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
డ్రగ్ టెస్ట్లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?
కిరాణా వ్యాపారి ఖతర్నాక్ స్కెచ్..పేదల బంగారం స్వాహా
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

