Hyderabad: ప్రారంభం అయిన శ్రీరామనవమి శోభాయాత్ర .. లైవ్ వీక్షించండి
శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరయిన నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. జై శ్రీరామ్ నామాన్ని జపిస్తూ భక్తులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగమవుతున్నారు.
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ్హాట్ సీతారాంబాగ్ నుంచి సుల్తాన్బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు మూడున్నర కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసు ఉన్నతాధికారులు.
శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ క్రమంలోనే.. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. భద్రతా చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్సింగ్ మాన్.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

