మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు ఎలా తెలుస్తారంటే..
సనాతనధర్మం...కుంభమేళ పర్వం..మౌని అమవాస్యవేళ పుణ్యస్నానమాచరించడం అద్భుతం..అంటూ భక్తకోటి ప్రయాగ్రాజ్కు క్యూకట్టింది. ఇప్పటికే అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. బుధవారం మౌని అమవాస్య సందర్భంగా 10కోట్లమంది భక్తులు వస్తారని అంచనా. మరి అంతమంది భక్తులు ఒకేరోజు..ఒకే ప్రాంతంలో ఉండే వీలుందా...? ఇందుకు యూపీ సర్కార్ తీసుకున్న చర్యలేంటి...భద్రతాపరంగా చేసిన జాగ్రత్తలేంటి..? ఇంతకూ మౌని అమవాస్య విశిష్టత ఏంటి..ఆరోజు స్నానమాచరిస్తే కలిగే శుభాలేంటి..?
- TV9 Telugu
- Updated on: Jan 28, 2025
- 9:55 pm
Chiranjeevi: చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత..! బీజేపీ పెద్దల మదిలో ఏముంది..?
ఎంత ఎత్తుకు వెళ్లినా.. మనం ఎదిగొచ్చిన మూలాల్ని మర్చిపోకూడదు.. కష్టకాలంలో మనల్ని ఆదుకుని.. గట్టుకు లాగిన చేతుల్ని వదిలిపెట్టొద్దు. ఆప్తా క్యాపిటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్లో ఇటీవల చిరంజీవి చెప్పిన ఇన్స్పిరేషనల్ లైన్స్ ఇవి. అందుకే.. ప్రజారాజ్యం మూసివేత సమయంలో అభయం ఇచ్చిన హస్తం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు మెగాస్టార్. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని వదులుకోలేదు. కానీ.. మరోవైపు నుంచి పిలుపొస్తే.. నువ్వే మాకు ఆపద్బాంధవుడివి అని కాళ్లావేళ్లా పడితే.. ఆ గోల్డెన్ ఛాన్స్ని చిరంజీవి వదులుకుంటారా..? అదేపనిగా తనవైపు కన్నుగీటుతున్న కమలం పార్టీపై చిరంజీవి ఆలోచనేంటి?
- TV9 Telugu
- Updated on: Jan 15, 2025
- 10:12 pm
Health Tips: చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా?
చలికాలంలో చల్లటి వాతావరణం ఉండడం వల్ల అందరూ వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి చాలా మంది తల నుంచి పాదాల వరకు బెడ్షీట్ను కప్పుకుని పడుకుంటారు. ఇది చలి నుంచి కాపాడినా కానీ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బెడ్షీట్తో ముఖం కప్పుకుని నిద్రించడం ఎంత ప్రమాదమో తెలుసుకుందాం...
- TV9 Telugu
- Updated on: Jan 11, 2025
- 4:04 pm
Mohammed Shami IPL Auction 2025: మహమ్మద్ షమీ రూ.10 కోట్లకు దక్కించుకున్న సన్రైజర్స్కు..
Mohammed Shami IPL 2025 Auction Price: సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2025 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్కు రూ.10 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుతంగా రాణించిన షమీ, బౌలింగ్ విభాగంలో అనుభవంతో పాటు వికెట్ల తీసే సామర్థ్యాన్ని జోడించి, జట్టుకు కీలకంగా మారనున్నాడు. 120+ ఐపీఎల్ మ్యాచ్ల అనుభవం కలిగిన షమీ, పవర్ ప్లే, డెత్ ఓవర్లలో సత్తా చాటాడు.
- TV9 Telugu
- Updated on: Nov 24, 2024
- 5:02 pm
ఆంధ్రప్రదేశ్లో అమెజాన్ డేటా సెంటర్..ఆ సంస్థ సీఈవోతో మంత్రి నారా లోకేష్ చర్చలు
దిగ్గజ కంపెనీలతో మీటింగ్.. బడా పారిశ్రామికవేత్తలతో బైఠక్.. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించారు మంత్రి నారా లోకేశ్. టాప్ గ్లోబల్ కంపెనీల ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
- TV9 Telugu
- Updated on: Oct 31, 2024
- 12:32 pm
Hyderabad: రూట్ మార్చిన హైడ్రా.. పడగొట్టుడే కాదు..! మరింత పటిష్టంగా రంగంలోకి..
హైడ్రా రూటు మార్చింది. ఇకపై కొత్త రూపంలో దర్శనం ఇవ్వబోతుంది. బిల్డింగ్స్ పడగొట్టుడే కాదు.. మరికొన్ని విషయాల్లోనూ తన మార్క్ చూపాలనుకుంటోంది. ఇంతకీ హైడ్రా ఏం చేయబోతుంది.. రంగనాథ్ ముందున్న లక్ష్యాలేంటి?
- TV9 Telugu
- Updated on: Oct 9, 2024
- 9:24 pm
Telangana Politics: ఆపరేషన్ మూసీపై మాటల మంటలు.. సీఎం వర్సెస్ ఈటల సవాళ్లు..!!
ప్రధాని మోదిని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే.. అంతకన్నా ముందు మూసీ నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటల రాజేందర్. అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శెభాష్ అని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు.
- TV9 Telugu
- Updated on: Oct 4, 2024
- 7:58 am
Andhra Pradesh: పవన్ చేతిలో రెడ్బుక్.. ‘వారాహి డిక్లరేషన్’లో ఏముంది..?
ప్రాయశ్చిత్త దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న పవన్.. వారాహి డిక్లరేషన్ ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాశ్రాజ్ అండ్ అదర్స్కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది.
- TV9 Telugu
- Updated on: Oct 3, 2024
- 9:00 am
Anna canteen: ఏపీలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు.. టోకెన్ తీసుకుని భోజనం చేసిన చంద్రబాబు దంపతులు
పేదవాడికి భోజనం పెట్టడం కంటే భాగ్యం ఏముంటుంది? అదే సంకల్పంతో ముందుకు కదులుతోంది చంద్రబాబు సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. గుడివాడలో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం చంద్రబాబు.. సేవాభావంతో ముందుకు రావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
- TV9 Telugu
- Updated on: Aug 15, 2024
- 8:10 pm
పగబట్టిన ప్రకృతి.. వానలు, వరదలతో విధ్వంసం..! ఇంకా ఉందంటూ ఐఎండీ హెచ్చరిక..!
చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న సూత్రం..పర్యావరణానికి కూడా వర్తిస్తుందంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ వరదలకు వాతావరణ మార్పులతో పాటు అటవీ నిర్మూలన, పట్టణీకరణ, మైనింగ్ వంటి మానవ చర్యలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. చివరకు అవి అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి జాతీయ స్థాయిలో అడుగులు పడాలని కోరుతున్నారు..
- TV9 Telugu
- Updated on: Aug 2, 2024
- 9:02 pm
North Korea: వరద కష్టాల్లో కిమ్ రాజ్యం.. దక్షిణ కొరియా ఆఫర్..! కానీ,..
ఉత్తరకొరియాలో భారీ వరదలకు 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రాణ నష్టంపై కిమ్ సర్కారు ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్ ఆదేశించారు.
- TV9 Telugu
- Updated on: Aug 2, 2024
- 6:00 pm
Palasa Cashew Cultivation: తీవ్ర నష్టాల్లో సిక్కోలు జీడి పరిశ్రమ…రోడ్డున పడుతున్న పలాస కూలీలు, కార్మికులు
పండగైనా.. పబ్బమైనా.. ప్రసాదమైనా.. ప్రత్యేక సందర్భమైనా.. ఆఖరుకు పబ్ అయినా.. క్లబ్ అయినా.. ఆ ఐటమ్ ఉండి తీరాల్సిందే.. అంత డిమాండ్ ఉన్నా.. కొనేవారు లేరంటూ ఆ ఐటమ్ను ఉత్పత్తి చేసే పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో అందులో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు.. ఇదంతా కృత్రిమ సంక్షోభమంటూ కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏంటా ఐటమ్? ఏమిటా కష్టాలు?
- TV9 Telugu
- Updated on: Jul 29, 2024
- 8:11 pm