AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి బ్రేక్‌ దర్శనం పేరిట బురిడీ.. కేసు నమోదు చేసిన టీటీడీ విజిలెన్స్‌ పోలీసులు

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం పేరుతో భక్తుల్ని దళారీ ముఠా బురిడీ కొట్టించింది. హైదరాబాద్ కు చెందిన వేణు అనే భక్తుడు అభిషేక్ ముఠా చేతిలో దారుణంగా మోసపోయాడు. అయితే టీటీడీ విజిలెన్స్‌ పోలీసులు కనిపెట్టడంతో 4 బ్రేక్ దర్శనం టికెట్ల కోసం రూ. 11 వేలు నగదు వసూలు చేసిన ఆ దళారి ముఠా తిరుమలలోఅడ్డంగా బుక్కైంది.

Tirumala: తిరుమల శ్రీవారి బ్రేక్‌ దర్శనం పేరిట బురిడీ.. కేసు నమోదు చేసిన టీటీడీ విజిలెన్స్‌ పోలీసులు
Tirumala Tirupati
Raju M P R
| Edited By: |

Updated on: Jul 05, 2023 | 6:41 PM

Share

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం పేరుతో భక్తుల్ని దళారీ ముఠా బురిడీ కొట్టించింది. హైదరాబాద్ కు చెందిన వేణు అనే భక్తుడు అభిషేక్ ముఠా చేతిలో దారుణంగా మోసపోయాడు. అయితే టీటీడీ విజిలెన్స్‌ పోలీసులు కనిపెట్టడంతో 4 బ్రేక్ దర్శనం టికెట్ల కోసం రూ. 11 వేలు నగదు వసూలు చేసిన ఆ దళారి ముఠా తిరుమలలోఅడ్డంగా బుక్కైంది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ కి చెందిన ఫోటోగ్రాఫర్ కామిశెట్టి వేణు కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు రావాలని అనుకుంది. ఆన్ లైన్ లో దర్శనం టికెట్ల కోసం ప్రయత్నించింది. దొరకకపోవడంతో తిరుపతికి చెందిన అభిషేక్ అనే దళారిని సంప్రదించింది.వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కోసం అభిషేక్‌తో కామిశెట్టి వేణుకు బేరం కుదిరింది. ఇక దర్శనం అవుతుందని తిరుపతికి వచ్చింది. ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వేణు ఈ నెల2న తిరుమలకు వచ్చారు. అభిషేక్ కు నగదు ట్రాన్స్ ఫర్ చేసిన వేణు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోసం ఫోన్ లో సంప్రదించాడు. అభిషేక్ శీను అనే మరో దళారి ని రంగంలోకి దింపి తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద టికెట్లను కలెక్ట్ తీసుకోవాలని చెప్పడంతో అక్కడికి చేరుకున్న వేణు అతని స్నేహితులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కట్టబెట్టారు. స్కానింగ్ కౌంటర్ లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ సంస్థలో పనిచేసే శివ నారాయణ ఉంటాడని, దగ్గరుండి దర్శనానికి అనుమతి ఇస్తారని చెప్పారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న వేణుకు అనుమానం వచ్చింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి తాము డబ్బు చెల్లిస్తే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఉందని అనుమానం వచ్చిన వేణు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది దళారీ మోసం వ్యవహారం.

ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శంకర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుమల 2 టౌన్ పోలీసులు ఇప్పటికీ ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. శ్రీవారి దర్శనం చాటున దళారీ సాగిస్తున్న వ్యాపారం రట్టయింది. అదే రోజు దాదాపు 30 మందిని వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో స్పెషల్ ఎంట్రీ టికెట్ల స్కాన్ చేసి పంపినట్లు గుర్తించిన పోలీసులు దళారీ ముఠా గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు. ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పీఎఫ్ అకౌంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం..? వారికి కూడా బెనిఫిట్..
పీఎఫ్ అకౌంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం..? వారికి కూడా బెనిఫిట్..
ఇకపై స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌ ! విద్యార్థులతో కలిసి IAS
ఇకపై స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌ ! విద్యార్థులతో కలిసి IAS
డాక్టర్ లావణ్య కేసులో అసలు ట్విస్ట్.. ఆమె ఇలా చేసింది అందుకే..
డాక్టర్ లావణ్య కేసులో అసలు ట్విస్ట్.. ఆమె ఇలా చేసింది అందుకే..
గ్లామర్ పాటలతో గత్తరలేపుతున్న హీరోయిన్.. 6 నిమిషాలుక 6 కోట్లా..?
గ్లామర్ పాటలతో గత్తరలేపుతున్న హీరోయిన్.. 6 నిమిషాలుక 6 కోట్లా..?
తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్
తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్
పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి
పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..
వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా
వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా