సంక్రాంతి
హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే పండగలలో అతి పెద్ద పండగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ మూడు రోజుల్లో మొదటి పండగ భోగి, భోగ భాగ్యాలను ఇవ్వమంటూ కోరుకోవడమే కాదు.. చెడుని విడిచి మంచిగా బతకమని సూచిస్తూ భోగి మంటలు వేస్తారు. రెండో రోజు సంక్రాంతిపండగను పెద్దల పండగగా, తమ ఇంటికి ధాన్యం చేరుకున్నందుకు ఆనందంతో కొత్త బియ్యంతో పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు కనుమ ఇది రైతుల పండగ.. పశువులను పూజిస్తారు. ధనుర్మాసం మొదలు నెల రోజులపాటు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటాయి. ధనుర్మాస ముగింపును గుర్తు చేస్తూ మకర సంక్రాంతి పండుగ వస్తుంది. కొత్త సంవత్సరంలో జరుపుకునే మొదటి పండగ భోగి పండగ జనవరి 13వ తేదీన, సంక్రాంతిని 14 వ తేదీన , కనుమను 15 వ తేదీన జరుపుకోనున్నారు. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది.
హరిదాసుల సందడి మొదలైంది… వీరు ప్రతి ఇంటికి ఎందుకు వస్తారు..?
పవిత్రమైన "ధనుర్మాసం" ప్రారంభం అయ్యింది. ధనుర్మాసం ప్రారంభంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో నెలరోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరమైనది, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలది. హరిదాసులు "హరిలో రంగ హరి" అంటూ అక్షయపాత్రతో ఇంటింటికి తిరుగుతూ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ధనుర్మాసం ప్రారంభమవ్వగానే హరిదాసుల సందడి మొదలైనట్టే అయితే వీరు ధనుర్మాసంలోనే ఎందుకు వస్తారు.
- B Ravi Kumar
- Updated on: Dec 18, 2025
- 5:34 pm
IRCTC Tour Package: సంక్రాంతికి టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఈ ఛాన్స్ మిస్సవ్వకండి
ఐఆర్సీటీసీ కోస్టల్ కర్ణాటక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో కర్ణాటకలోని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించవచ్చు. కాచిగూడ నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్.. ఐదు రోజుల పాటు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు, ధర ఎంతనేది ఇక్కడ చూద్దాం రండి.
- Venkatrao Lella
- Updated on: Dec 18, 2025
- 4:04 pm
Sankranti 2026: మకర సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలంటే..
సంబరాల సంక్రాంతి త్వరలో వస్తోంది! ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, కొత్త బట్టలతో పల్లెలు, పట్టణాలు పండుగ శోభను సంతరించుకుంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ మకర సంక్రాంతి 2026 జనవరి 15న జరుపుకుంటారు. సూర్యుని పూజించి, నువ్వుల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి, పొంగలి వండి శుభాలు కోరుకుంటారు. ఈ పండుగ సంస్కృతి, సంప్రదాయాల కలయిక.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 5:09 pm
Sankranti Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు!
Indian Railways: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు (విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడ) అలాగే ప్రయాణికులకు..
- Subhash Goud
- Updated on: Dec 12, 2025
- 1:31 pm
సంక్రాంతి హీరోయిన్స్.. పోటీ పిచ్చెక్కిపోతుంది
ఈ సంక్రాంతి పండుగ సినిమాలపై పలువురు స్టార్ హీరోయిన్స్ తమ ఆశలు పెట్టుకున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నయనతార, నిధి అగర్వాల్ వంటి తారలు ఈ బాక్సాఫీస్ పోరులో విజయం సాధించాలని చూస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ వంటి వారు కూడా ఒక పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పండక్కి ఎవరు హిట్ కొట్టి తమ కెరీర్కు ఊపొస్తారో చూడాలి.
- Phani CH
- Updated on: Dec 11, 2025
- 3:55 pm
సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000
సంక్రాంతి పండగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఛార్జీలను అసాధారణంగా పెంచేశాయి. కొన్ని మార్గాల్లో విమాన టికెట్ ధరలను మించి బస్సు ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Nov 29, 2025
- 12:37 pm
ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ డైరెక్టర్దే హవా.. ఎవరు వారంటే?
ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఇప్పటి వరకు ఫెయిల్యూరే లేకుండా దూసుకుపోతున్న జక్కన్న మీద అభిమానుల కంప్లయింట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటారని, హీరోలను ఏళ్ల తరబడి బ్లాక్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఆల్మోస్ట్ రాజమౌళి రేంజ్ సక్సెస్ రేటుతో ఒక్క కంప్లయింట్ కూడా లేని దర్శకుడు కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
- Samatha J
- Updated on: Jan 28, 2025
- 11:14 am
హీరోయిన్స్ విషయంలో వెంకీ మ్యాజిక్.. అప్పడు అంజలి.. ఇప్పుడు ఐశ్వర్యా రాజేష్!
వెంకీ గ్యారేజ్.. ఇచ్చట తెలుగమ్మాయిలకు బ్రేక్ ఇవ్వబడును..! ఏంటిది అనుకుంటున్నారా..? చూడ్డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జరుగుతుందిప్పుడు ఇండస్ట్రీలో. ఎప్పట్నుంచో పక్క ఇండస్ట్రీలో ఉండి బ్రేక్ కోసం చూస్తున్న తెలుగమ్మాయిలకు వెంకటేష్ బ్రేక్ ఇస్తున్నారు. పుష్కరం కింద జరిగిన సీనే మళ్లీ రిపీట్ అయిందిప్పుడు. మరి ఈ మ్యాజిక్ ఏంటో చూద్దామా..?
- Samatha J
- Updated on: Jan 27, 2025
- 2:24 pm
రికార్డ్ క్రియేట్ చేసిన సంక్రాంతి.. కలెక్షన్స్లో సునామీ సృష్టించిన సినిమాలివే!
ఈ సంక్రాంతి టాలీవుడ్కు మోర్ అండ్ మోర్ స్పెషల్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సాధారణంగా ఎంత పెద్ద సీజన్ అయినా రిలీజ్ అయిన అన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధించటం కష్టం. కానీ ఈ సంక్రాంతి మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. రిలీజ్ అయిన అన్ని సినిమాలు బిగ్ నెంబర్స్ను రికార్డ్ చేసి టాలీవుడ్ స్క్రీన్కు కొత్త జోష్ తీసుకువచ్చాయి.
- Samatha J
- Updated on: Jan 24, 2025
- 2:45 pm
జంధ్యాలను గుర్తు చేస్తున్న అనిల్ రావిపూడి!
తెలుగు తెరపై హాస్యాన్ని పండించిన దర్శకులలో జంధ్యాల స్థానం ప్రత్యేకం. అంతకుముందు సినిమాల్లో హాస్యం ఒక భాగంగా ఉండేది. హాస్యాన్నే ప్రధాన రసంగా తీసుకుని, నాన్ స్టాప్ గా నవ్వించిన దర్శకుడిగా జంధ్యాల పేరే అందరికీ గుర్తుంటుంది. జంధ్యాల తరువాత ఈవీవీ కొంతవరకూ ఆ మార్క్ ను కొనసాగించారు. ఇక ఆ ఇద్దరూ తనకి ఎంతో ఇష్టమని చెబుతూ వస్తున్న అనిల్ రావిపూడి, తన సినిమాల్లో కామెడీ ఫ్లేవర్ను జొప్పించి సక్సెస్ అవుతున్నాడు. జంధ్యాల సినిమాల్లో ప్రతి పాత్రకి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత నుంచే ఆయన కావాల్సినంత కామెడీ పంచేవారు.
- Samatha J
- Updated on: Jan 19, 2025
- 1:45 pm
ఆ విషయంలో జక్కన్నను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్న బాలీవుడ్ మేకర్స్!
మేకింగ్ మాత్రమే కాదు... ఆ సినిమాను ఆడియన్స్ వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మాదే అంటున్నారు ఈ జనరేషన్ డైరెక్టర్. ఏదో సినిమా చేసేసి పక్కన పెట్టేయటం కాకుండా... ప్రమోషన్స్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలా అంతా తామే అయి సినిమాలను ముందుకు తీసుకెళుతున్న వారికే భారీ విజయాలు దక్కుతున్నాయి.
- Samatha J
- Updated on: Jan 18, 2025
- 6:33 pm
Andhra News: పందెంలో చచ్చిన కోడిపుంజుకు వేలం.. ఎంత ధర పలికిందో తెలిస్తే బిత్తరపోతారు
పందెంలో ఓడి పోయిన కోడి ఏమవుతుంది..? చనిపోతుంది.. లేదా.. తీవ్రగాయాల పాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.. చనిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయితే.. అలా చనిపోయిన కోడి పుంజు మాంసం ఖరీదు ఎంత ఉంటుంది.. అటు ఇటుగా గరిష్టంగా కే.జీకి వెయ్యి రూపాయల నుంచి రెండు మూడు వేల వరకు ఇవ్వవచ్చు.. అయితే, వేలం పాటలో ఓ చనిపోయిన కోడి పుంజు రికార్డు ధర పలికింది.
- B Ravi Kumar
- Updated on: Jan 18, 2025
- 2:20 pm