AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి

సంక్రాంతి

హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే పండగలలో అతి పెద్ద పండగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ మూడు రోజుల్లో మొదటి పండగ భోగి, భోగ భాగ్యాలను ఇవ్వమంటూ కోరుకోవడమే కాదు.. చెడుని విడిచి మంచిగా బతకమని సూచిస్తూ భోగి మంటలు వేస్తారు. రెండో రోజు సంక్రాంతిపండగను పెద్దల పండగగా, తమ ఇంటికి ధాన్యం చేరుకున్నందుకు ఆనందంతో కొత్త బియ్యంతో పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు కనుమ ఇది రైతుల పండగ.. పశువులను పూజిస్తారు. ధనుర్మాసం మొదలు నెల రోజులపాటు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటాయి. ధనుర్మాస ముగింపును గుర్తు చేస్తూ మకర సంక్రాంతి పండుగ వస్తుంది. కొత్త సంవత్సరంలో జరుపుకునే మొదటి పండగ భోగి పండగ జనవరి 13వ తేదీన, సంక్రాంతిని 14 వ తేదీన , కనుమను 15 వ తేదీన జరుపుకోనున్నారు. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది.

ఇంకా చదవండి

సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సంక్రాంతి పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల తేజ అనే యువకుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. ఇటీవల ఫిట్స్ వచ్చిన తేజకు గుండెపోటు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో తేజ కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

  • Phani CH
  • Updated on: Jan 19, 2026
  • 8:02 pm

‘‘ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే.. రూ.5,000 మీ ఖాతాలో పడతాయి’’ పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ నిజమేనా?

సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడకు పాల్పడుతున్నారు. ‘‘ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000 మీ ఖాతాలో పడతాయి’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. మొదట నమ్మలేదని, కానీ నిజంగానే డబ్బులు వచ్చాయని చెప్పేలా మెసేజ్‌లు ఉండటంతో చాలామంది మోసపోయే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్లు..! ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం-చర్లపల్లి మధ్య నడిచే 08517/08518 ప్రత్యేక రైళ్ల వివరాలు వెల్లడయ్యాయి. జనవరి 18, 19, 2026 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి. పలు స్టేషన్లలో స్టాప్‌లు, కోచ్‌ల వివరాలున్నాయి.

  • SN Pasha
  • Updated on: Jan 16, 2026
  • 9:24 pm

Konaseema: దేశంలో ఇంకా లాంచ్ కానీ టెస్లా ట్రక్ కోనసీమకు వచ్చింది.. అందులో వచ్చింది ఎవరంటే..?

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అరుదైన దృశ్యం కనిపించింది. ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఉన్న టెస్లా సైబర్ ట్రక్ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో సందడి చేసింది. చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య రామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తారింటికి టెస్లా సైబర్ ట్రక్‌లో రావడంతో జనం ఆసక్తిగా తిలకించారు.

రోజా ఇంట భోగి సెలబ్రేషన్స్‌.. సంతోషంలో ఫ్యామిలీ

ఆర్కే రోజా తెలుగు ప్రేక్షకులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి భోగి పండుగను ఆనందంగా జరుపుకున్నట్లు పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, పండగ అంటేనే సంబరంగా ఉండటమని ఆమె తెలియజేశారు. రానున్న ఐదు రోజుల సెలవులను జాలీగా గడిపేందుకు సిద్ధమైనట్లు తెలిపారు.

ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు

కోనసీమలోని రావులపాలెంలో సంక్రాంతి సందడి కోడి పందాలతోపాటు ఘుమఘుమలాడే నాన్ వెజ్ విందులతో పతాక స్థాయికి చేరుకుంది. చికెన్, చేపలు, మటన్, రొయ్యలు, బిర్యానీ వంటి పదుల సంఖ్యలో వంటకాలతో కోనసీమ ఆతిథ్యాన్ని రుచి చూపించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. దూరం నుంచి వచ్చిన వారందరికీ ఈ ప్రత్యేక భోజనం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

కోడి పందేలు, జల్లికట్టు వారసత్వంగా వచ్చినవే.. చిన్నప్పుడు అన్నీ చూశాః చంద్రబాబు

అందరికీ పుట్టిన ఊరు జన్మభూమిపై మమకారం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయని అందుకే పీ4 ను తీసుకొచ్చామన్నారు. 10 లక్షల కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకున్నామన్నారు. సంక్రాంతి రైతుల పండుగని, పెద్దల పండుగ గా పూర్వీకులకు పూజలు చేసుకుని నివాళులు అర్పించాలన్నారు.

కోనసీమలో మొదలైన ప్రభల తీర్థం

కోనసీమలో 400 ఏళ్లకు పైగా కొనసాగుతున్న చారిత్రక ప్రభల తీర్థం ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని తొలిసారి రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనుమ రోజున జరిగే ఈ వేడుకను 160 గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు.

గంగిరెద్దుల ప్రదర్శనను తిలకించిన తాత.. ఎడ్ల బండిపై ఆకట్టుకున్న మనవడు..!

తిరుపతి జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ జోష్ కొనసాగుతోంది. పెద్దపండుగకు నాలుగు రోజులు పాటు నారావారిపల్లిలోనే బసచేసిన నారా-నందమూరి కుటుంబాలు సంక్రాంతిని సందడిగా జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే నారావారిపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

Andhra: నో కోడి పందాలు.. సంక్రాంతికి అక్కడ గుర్రాల పోటీలు స్పెషల్.. వీడియో చూశారా..?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అనకాపల్లిలోని ఆ పల్లెలో గుర్రాలు దౌడు తీస్తాయి. పోటీ పడుతూ పరిగెడతాయి. నువ్వా నేనా అన్నట్టు ముందుకు దూసుకుపోతాయి. రాజసాన్ని ఉట్టిపడేలా ఆ గుర్రాల పరుగులు పెడుతూ ఉంటే జనాల కేరింతలతో ఆ పోటీలు ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి.

కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

పుంజు పంజా విసురుతోంది...! పందెం రాయుళ్లు తగ్గేదేలే అంటున్నారు...! అటు కరెన్సీ కట్టలు చేతులు మారుతుంటే... ఇటు బరుల దగ్గరే వండి పెడుతున్న వంటలు నోరూరిస్తున్నాయి...! నిన్న, ఇవాళ కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు సమాచారం.. మరోవైపు.. కోడి పందేల బరుల దగ్గర మద్యం పరవళ్లు, మాంసాహార విందులు కొనసాగుతున్నాయి.

Hyderabad: మహానగరంలో మట్టివాసన.. ట్రెండ్‌తోపాటు ట్రెడిషన్.. సంక్రాంతికి డబుల్ జోష్

హైదరాబాద్ మహానగరంలో మట్టివాసన.. కేరాఫ్ మాదాపూర్ శిల్పారామం. బ్యాక్ టు బేసిక్స్ అంటూ భాగ్యనగరవాసులు. పల్లెకు పోకుండానే పండగ చూసేద్దామా అంటూ అరుదైన అనుభూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారిక్కడ. ఎందుకంటే.. పండగ సంప్రదాయపు ఒరిజినాలిటీని టేస్ట్ చేసేలా.. పల్లె వాతావరణంతో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.