తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
మాజీ పోలీసు ఉన్నతాధికారులకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. భద్రతా సౌకర్యాలపై కోత
మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, మాజీ ఉన్నతాధికారులు, కొంతమంది వీఐపీలకు కల్పిస్తున్న భద్రతా సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షించింది. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, గన్మెన్ల వంటి భద్రతా ఏర్పాట్లను అవసరం ఉన్నవారికే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- Ranjith Muppidi
- Updated on: Jul 2, 2026
- 8:46 pm
ACB Raids: కళ్లు చెదిరేలా డీఎస్పీ భీమ్రెడ్డి అక్రమాస్తులు
అవినీతి ఆరోపణలపై అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ, కర్ణాటకలో విస్తరించిన విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులు, భారీ నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 20 ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించిన ఏసీబీ, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది.
- Ranjith Muppidi
- Updated on: Jul 2, 2026
- 8:30 pm
Hyderabad: డ్రగ్స్ కట్టిడిపై పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి స్కూల్, కాలేజీలో ఏడీసీ కమిటీలు!
విద్యార్థుల్లో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అన్ని విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను తప్పనిసరి చేశారు. డ్రగ్స్ ప్రమాదాలు, ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన కల్పించాలని, అనుమానిత కార్యకలాపాలపై పోలీసులకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 26, 2026
- 9:19 pm
ఉద్యోగులూ జర భద్రం: బాస్ పేరుతో వచ్చే ‘ఆ ఒక్క క్లిక్’ మీ ఆఫీస్ కొంపముంచేయొచ్చు!
సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నారు. సంస్థ అధినేతలు, ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ సందేశాలు పంపిస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నారు. విశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకున్న ఈ మోసాలపై తెలంగాణ సైబర్ భద్రతా విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కాలంలో సంస్థల్లో పనిచేసే సిబ్బందికి అత్యవసర సూచనల పేరుతో సందేశాలు వస్తున్నాయి. అవి సంస్థ అధినేత పంపినట్లే కనిపిస్తున్నాయి.
- Ranjith Muppidi
- Updated on: Jun 24, 2026
- 7:35 pm
Hyderabad: లేడీస్ హాస్టల్లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..
హైదరాబాద్లోని ఓ మహిళల హాస్టల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటున్న యువతి బాత్రూంలో ప్రసవించిన అనంతరం నవజాత శిశువును వెంటిలేటర్ ద్వారా బయటకు పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు అక్కడికక్కడే మృతి చెందగా, అస్వస్థతకు గురైన యువతిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 24, 2026
- 9:59 pm
Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!
ఆన్లైన్ గేమ్స్కు బానిసలవుతున్న చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ముఖ్యంగా ‘ఫ్రీ ఫైర్’, ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి గేమ్స్ కారణంగా పిల్లలు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు ఖర్చు చేయడంతో పాటు, అపరిచితులతో పరిచయాలు పెంచుకుని ప్రమాదాల్లో పడుతున్నారని తెలిపారు. ఇటీవల మైనర్ బాలికల అదృశ్యం ఘటనల్లో కూడా ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 24, 2026
- 5:59 pm
ఇంజెక్షన్తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ వైద్యుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్కు చెందిన పెంటయ్య అనే వ్యక్తి తనను ఎంబీబీఎస్ వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ, ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన కుత్బుల్లాపూర్ SOT పోలీసులు అతడికి ఎలాంటి వైద్య అర్హతలు లేవని గుర్తించి అరెస్ట్ చేశారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 23, 2026
- 11:53 am
ఫేస్వాష్ కావాలంటూ షాప్లోకి వచ్చాడు.. ఇచ్చేందుకు వెనక్కి తిరిగిన మహిళ.. అంతే వెనుక నుంచి..
ఉప్పల్లోని ఓ కాస్మొటిక్ దుకాణంలో కస్టమర్గా నటిస్తూ ఓ యువకుడు మహిళ మెడలోని 37 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. బాధితురాలు, మరో కస్టమర్తో పాటు స్థానికుల అప్రమత్తత, తక్షణ స్పందనతో నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చోరీకి గురైన మంగళసూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని, దొంగను రిమాండ్కు తరలించారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 20, 2026
- 11:50 am
మొదలైన చదువులు.. స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!
పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో, విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నియంత్రణపై విద్యాసంస్థలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మైనర్లు వాహనాలు నడపడం, పాఠశాల బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంపై తీవ్ర హెచ్చరికలు చేశారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మార్షల్స్ ఏర్పాటు, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అసెంబ్లీల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 19, 2026
- 8:20 pm
Telangana: ఫిన్లాండ్లో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు!
హైదరాబాద్లో వనస్థలిపురంలో విషాదం నెలకొంది. వైదేహీ నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి అనే యువకుడు ఉన్నత చదువుల కోసమని ఫిన్ల్యాండ్కు వెళ్లగా.. తన నెల రోజుల నుంచి మణిదీప్ ఆచూకీ తెలియడం లేదు. దీంతో తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని పేరెంట్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహయం కోరుతున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 19, 2026
- 12:27 pm
ORRపై లగ్జరీ కారు నడిపిన బాలుడు.. సీన్ కట్చేస్తే.. తండ్రికి ఊహించని షాక్.. ఇదిగో వీడియో
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తన కొడుకుతో కార్ డ్రైవింగ్ చేయించిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసుల దృష్టికి చేరడంతో ఓఆర్ఆర్పై మైనర్తో డ్రైవింగ్ చేయించినందుకు కాను అతనిపై ఎమ్వీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
- Ranjith Muppidi
- Updated on: Jun 19, 2026
- 11:57 am
పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
మియాపూర్లో ఓ మహిళ తన ఆరు నెలల చిన్నారితో కలిసి అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రెండో బిడ్డ జననం తర్వాత తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్న ఈషా సాహు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 13, 2026
- 7:36 pm