తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
Hyderabad: మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో నట్టేట ముంచేస్తారు..
అమాయకులే టార్గెట్గా హైదరాబాద్లో భారీ మొత్తంలో మనీ సర్క్యులేషన్ చేస్తున్న ఓ నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో దాడులు చేసి ఈ నెట్వర్క్కు సంబంధించి మొత్తం ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధిచిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..
- Ranjith Muppidi
- Updated on: Jun 11, 2026
- 5:26 pm
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు.. విచారణలో వెలుగులోకి సంచలనాలు!
హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరి ప్రాంతంలో కుటుంబ కలహాలు దారుణ హత్యకు దారితీశాయి. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెను తుపాకీతో కాల్చిచంపిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హత్య అనంతరం పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 11, 2026
- 1:45 pm
పోలీసులను చూసి అటు ఇటు తచ్చాడుతున్న సెక్యూరిటీ గార్డ్.. అనుమానంతో చెక్ చేయగా షాక్..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు నిర్వహించిన దాడుల్లో కీలక విజయం సాధించారు. గంజాయి విక్రయిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 11, 2026
- 11:45 am
వీడు ఖాకీ కాదు కంత్రీ.. హర్యానాలో కేసు ఉందంటూ తీసుకెళ్లి.. సూర్యాపేటలో..
హైదరాబాద్లో నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతూ సొంతంగా సూడో పోలీస్ వ్యవస్థను నడిపిస్తున్న రౌడీ షీటర్ నాగరాజు రఘు వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలో కేసు ఉందంటూ కూకట్పల్లికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.5.26 లక్షలు వసూలు చేసిన ఘటనతో ఈ ముఠా గుట్టురట్టైంది. దర్యాప్తులో నకిలీ గుర్తింపు కార్డులు, పోలీస్ యూనిఫారాలు, ఆయుధాలు, నకిలీ లెటర్ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు సహా భారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 6, 2026
- 8:08 pm
మహిళల భద్రతకు కీలక అడుగు.. బైక్లు, ఆటోలు, క్యాబ్లతో రోడ్డెక్కిన మహిళా డ్రైవర్లు!
మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘స్త్రీ రైడ్ – ఉమెన్ డ్రైవర్స్ ఇనిషియేటివ్’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం పరస్పరం అనుసంధానమైన అంశాలని, వారికి రవాణా రంగంలో గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం ద్వారా సమాజంలో మరింత బలమైన స్థానాన్ని అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 6, 2026
- 8:07 pm
Hyderabad: హైదరాబాద్లో కొత్త మోసం.. చికెన్ సెంటర్ల యజమానులే టార్గెట్! జాగ్రత్త మరీ
ప్రజలను మోసం చేసేందుకు కేటుగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాలు వెతుకుతున్నారు. బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్, ఉద్యోగాలు, సోషల్ మీడియా, ట్రేడింగ్ స్కామ్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వ అధికారుల పేర్లను వాడుకుని దందా మొదలుపెట్టారు. తాజాగా నగరాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నా.. అంటూ ఫోన్ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసే కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా చికెన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, బేకరీలు, ఫుడ్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు బెదిరింపులకు దిగుతున్నాయి.
- Ranjith Muppidi
- Updated on: Jun 6, 2026
- 7:24 pm
హైదరాబాద్లో అక్రమ ఫార్మా నెట్వర్క్ బట్టబయలు.. DCA దాడుల్లో కీలక పత్రాలు, డ్రగ్ సీజ్!
Hyderabad: కూకట్పల్లిలో అక్రమంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (APIలు) వ్యాపారం చేస్తున్న సంస్థపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ భారీ దాడి నిర్వహించింది. లైసెన్స్ లేకుండా APIల కొనుగోలు, విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు యాంటీవైరల్ ఔషధం జిడోవుడిన్తో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DCA హెచ్చరించింది.
- Ranjith Muppidi
- Updated on: Jun 6, 2026
- 1:36 pm
వాటర్ బిల్లు పెండింగ్ ఉందా? CAN నంబర్ అప్డేట్ లింక్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!
హైదరాబాద్ నగరవాసులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. ఈసారి ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు’ (HMWSSB) పేరుతో రంగంలోకి దిగారు. మీటర్ రీడింగ్ అప్డేట్ కాలేదని, CAN నంబర్ ధ్రువీకరణ పెండింగ్లో ఉందంటూ నీటి కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 4, 2026
- 7:44 pm
థాయ్లాండ్ టు హైదరాబాద్.. కోట్ల బిజినెస్కు అలాంటి వాళ్లే టార్గెట్.. 4 రోజుల్లోనే 10 మంది చిక్కారు..
థాయ్లాండ్ నుంచి హైదరాబాద్కు హైడ్రోఫోనిక్ గంజాయి సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఛేదించింది. నెల రోజులపాటు గోప్యంగా నిఘా నిర్వహించిన అధికారులు కీలక సూత్రధారి సహా 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 4, 2026
- 5:22 pm
Hyderabad: ప్రమాదం కాదు పక్కా మర్డర్..! అడ్వొకేట్ హత్య కేసులో సంచలన నిజాలు
హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపిన అడ్వొకేట్ ఖాజా మొయిజుద్దీన్ మృతి కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తొలుత సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక.. పక్కా స్కెచ్తో అమలు చేసిన ఒక భారీ సుపారీ హత్య కుట్ర దాగి ఉందని పోలీసులు తేల్చారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఓ బైక్ స్టంటర్కు రూ. 2 లక్షల సుపారీ ఇచ్చినట్లు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
- Ranjith Muppidi
- Updated on: May 31, 2026
- 8:58 pm
హైదరాబాద్ మెట్రోపై బ్రిటన్ వ్లాగర్ ప్రశంసలు.. న్యూయార్క్ కంటే బెటర్ అంటూ వీడియో..
భాగ్యనగర ప్రజా రవాణా వ్యవస్థ నాణ్యత మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. నిత్యం లక్షలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రో సేవలు.. తాజాగా ఓ అంతర్జాతీయ సెలబ్రిటీ మనసును గెలుచుకున్నాయి. బ్రిటన్కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి, ఇక్కడి పరిశుభ్రత, సౌకర్యాలపై ప్రశంసల జల్లు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
- Ranjith Muppidi
- Updated on: May 31, 2026
- 3:44 pm
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే..
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. కొద్దిరోజుల క్రితమే డిగ్రీ పట్టా అందుకుని కన్నవారి కలలు నిజం చేయాలనుకున్నాడు. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి.. తను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఆ తెలుగు యువకుడు. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Ranjith Muppidi
- Updated on: May 31, 2026
- 2:31 pm