తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
Hyderabad: ఇన్స్టాలో క్లాస్మేట్ వేధింపులు.. పదో తరగతి విద్యార్థిని చేసిన పనికి అంతా షాక్
హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థి వేధింపులకు తట్టుకోలేక 10వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంఘటన తీవ్ర స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Apr 10, 2026
- 3:14 pm
Hyderabad: చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
దొంగ ఎంత తెలివైన వాడైనా.. ఏదో ఒక చిన్న ఆధారంతో దొరికిపోక తప్పదు. జూబ్లీహిల్స్లో దొంగతనం చేసిన ఒక కేటుగాడు,, పోలీసుల కళ్లు గప్పి రూ. 14 లక్షల విలువైన సొత్తును ఎక్కడ దాచాడో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. పది రోజుల పాటు పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన ఆ దొంగ మాయమాటలు.. చివరికి చెత్తలో దొరికిన ఒక డైమండ్ రింగ్తో బట్టబయలయ్యాయి.
- Ranjith Muppidi
- Updated on: Apr 10, 2026
- 1:54 pm
సినిమాలో తండ్రి.. ఇక్కడ ప్రియుడు.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కట్చేస్తే యువతి..
ప్రేమ పేరుతో ఉన్మాదం.. కక్షతో చేసిన అరాచకం.. చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లి నిరాకరించిందని హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన కిరాతకుడి చర్యకు, 24 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. రోగంతో కంటే ఆ అవమానం భరించలేక.. తనకేమవుతుందోనన్న భయంతో రమణి తీసుకున్న కఠిన నిర్ణయం తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది.
- Ranjith Muppidi
- Updated on: Apr 10, 2026
- 1:47 pm
Hyderabad: దొంగ ఇంట్లో సోదాలు చేస్తుండగా చెత్త కుప్పలో కనిపించినవి చూసి కళ్లు జిగేల్..
చెత్తలో దాచిన చోరీ సొత్తు… చివరికి పోలీసుల కళ్లకు చిక్కింది. జూబ్లీహిల్స్లో దొంగ తెలివిగా ప్లాన్ చేసినా, ఇంటి సోదాలో బయటపడిన డైమండ్ రింగ్స్ కేసుకు కీలక మలుపు తీసుకువచ్చాయి. రూ.14 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు… గ్యాంగ్ లింకులపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
- Ranjith Muppidi
- Updated on: Apr 10, 2026
- 1:35 pm
Hyderabad: పిల్లి పోయిందని పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళ.. సీసీ ఫుటేజ్ చూసి అంతా షాక్.. కట్చేస్తే..
హైదరాబాద్లో చిన్న విషయమే పెద్ద చర్చగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన పెంపుడు పిల్లి విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం, చినికి, చినికి గాలివానగా మారింది. అది కాస్తా చివరికి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. అక్కడ కూడా ఇరువురి మధ్య సుమారు గంటల పాటు జరిగిన చర్చల తర్వాత సమస్య సద్దుమణిగింది. ఇంతకూ అక్కడ జరిగిన సీన్ ఏంటో తెలుసుకుందాం పదండి.
- Ranjith Muppidi
- Updated on: Apr 10, 2026
- 12:06 pm
Viral News: ఇంటర్నెట్ తెగ వాడేస్తున్నారా?.. జాగ్రత్త ఇంట్లో స్పైను పెట్టుకున్నట్టే!
ఇటీవలే వెలువడి ఓ కొత్త పరిశోధన ప్రకారం, ఇళ్లలో ఉపయోగించే ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా శబ్దాలను రికార్డ్ చేయవచ్చని తెలుస్తోంది. గాలిలోని శబ్దాల వల్ల కేబుల్లో వచ్చే సూక్ష్మ కంపనాలను గుర్తించి, వాటిని ఆడియోగా మార్చడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది మన ప్రైవసీకి తీవ్రమైన ముప్పుని వారు చెబుతున్నారు. ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Apr 9, 2026
- 5:27 pm
Hyderabad: వాటర్ ప్యాకెట్ తీసుకుంటున్నారా..? వామ్మో.. ఇలాంటి కల్తీతో జాగ్రత్త
హైదరాబాద్లో కల్తీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ప్రతీ వస్తువును కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఏది నిజమైనదో.. ఏది నకిలీదో తెలుసుకోవడం కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా మరో కల్తీ ముఠా గుట్టురట్టయింది. నీటి ప్యాకెట్ల కల్తీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Apr 9, 2026
- 7:15 am
Hyderabad: కాసుల కోసం కంత్రీ స్కెచ్ వేశారు.. కానీ భలే చిక్కారు..
శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లో లంచం వ్యవహారం బట్టబయలైంది. కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ఇద్దరు పోలీస్ అధికారులు ACB ట్రాప్లో చిక్కారు. సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్ రెడ్హ్యాండెడ్గా పట్టుబడటం కలకలం రేపింది.
- Ranjith Muppidi
- Updated on: Apr 8, 2026
- 1:31 pm
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం.. ఇదిగో వీడియో
హైదరాబాద్ శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మాదాపూర్ పరిధిలోని మైండ్ స్పేస్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మినీ ట్రక్, స్కూటీపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం సూటీని సుమారు 5కిలో మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే మరణించింది. భర్త మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
- Ranjith Muppidi
- Updated on: Apr 6, 2026
- 7:24 pm
Telangana: అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా ఊడ్చుకొచ్చి..
డబ్బు డబుల్ అవుతుంది.. గుప్తపూజలు చేస్తే కోట్లు కురుస్తాయి.. ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నా, అమాయకులు మాత్రం ఇంకా జాదూగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా షాద్నగర్లో జరిగిన ఒక దారుణ దోపిడీ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తిని నమ్మించి.. రూ. 9 లక్షలు ఎలా దోచుకున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు
- Ranjith Muppidi
- Updated on: Apr 6, 2026
- 2:26 pm
నగరంలో నయా దళారులు.. సాఫ్ట్వేర్, రైల్వే ఉద్యోగుల మత్తు దందా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, నిత్యం ఏదో ఒక మూల మత్తు పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా మొకిల పోలీసులు ఒక పక్కా సమాచారంతో దాడి చేసి, సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ దందాలో ఎలా నిమగ్నమయ్యారో బయటపెట్టారు. పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు చదువుకున్న వారు, బాగా స్థిరపడిన వృత్తుల్లో ఉన్నవారు కావడం గమనార్హం.
- Ranjith Muppidi
- Updated on: Mar 30, 2026
- 8:19 pm
Telangana: కేవైసీ అప్డేట్ అంటూ కాల్, లేదా మెసేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త టార్గెట్ మీరే
పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే.. గ్యాస్ లేక చాలా రాష్ట్రాల్లో హోటల్లు, రెస్టారెంట్స్లు మూతపడ్డాయి. కొన్ని రెస్టారెంట్లు మాత్ర అదిక ధరలు వెచ్చించి కూడా గ్యాస్ కొంటున్నారు. సరిగ్గా ఇదే అవకాశాన్ని కొందరు కేటుగాళ్లు క్యాచ్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Mar 28, 2026
- 7:05 pm