AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranjith Muppidi

Ranjith Muppidi

Reporter - TV9 Telugu

ranjith.muppidi@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.

Read More
Follow On:
Hyderabad: రెండు నెలల నిరీక్షణకు తెర.. ఫిన్లాండ్‌లో మిస్సైన హైదరాబాద్‌ యువకుడు మృతి

Hyderabad: రెండు నెలల నిరీక్షణకు తెర.. ఫిన్లాండ్‌లో మిస్సైన హైదరాబాద్‌ యువకుడు మృతి

ఉన్నత చదువుల కోసం కొడుకుని విదేశాలకు పంపిన హైదరాబాద్‌కు చెందిన తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. పై చదువుల కోసమని ఫిన్లాండ్‌లో వెళ్లిన మనిదీప్ అనే హయాత్‌నగర్ చెందిన యువకుడు అదృశ్యమై రెండు నెలల తర్వాత సముద్రంలో శవమై కనిపించాడు. మే 5 నుంచి కనిపించకుండా పోయిన మనిదీప్ కోసం కుటుంబం, పోలీసులు విస్తృతంగా గాలించారు. చివరకు సముద్రంలో మృతదేహం దొరకడంతో ఈ కేసు విషాదకరంగా ముగిసింది.

కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..

కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..

Hyderabad Crime News: కుటుంబ సమస్య పరిష్కారం కోసం సికింద్రాబాద్‌కు వచ్చిన 43 ఏళ్ల మహిళను టీవీ కార్యక్రమ నిర్వాహకులను కలిపిస్తామని నమ్మించి ఇద్దరు వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

WhatsApp వాటర్ బిల్లు మెసేజ్‌తో రూ.4.19 లక్షలు మాయం.. OTP చెప్పకుండానే రిటైర్డ్ ఉద్యోగికి భారీ షాక్!

WhatsApp వాటర్ బిల్లు మెసేజ్‌తో రూ.4.19 లక్షలు మాయం.. OTP చెప్పకుండానే రిటైర్డ్ ఉద్యోగికి భారీ షాక్!

Water Bill Scam: వాట్సాప్‌లో వచ్చిన నకిలీ వాటర్ బిల్లు మెసేజ్‌ను నమ్మిన రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి రూ.4.19 లక్షలు కోల్పోయాడు. OTP చెప్పకపోయినా ఫోన్‌లో మాల్వేర్ యాప్ ఇన్‌స్టాల్ చేసి సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు దోచేశారు. ఈ ఘటనపై సైబర్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

Hyderabad: చూడ్డానికి డీసెంట్‌గా ఉన్నాడని అమాయకుడు అనుకోవద్దు.. ఏం చేశాడో తెలిస్తే ఫ్యూజులెగరాల్సిందే!

Hyderabad: చూడ్డానికి డీసెంట్‌గా ఉన్నాడని అమాయకుడు అనుకోవద్దు.. ఏం చేశాడో తెలిస్తే ఫ్యూజులెగరాల్సిందే!

పెరుగుతున్న టెక్నాలజీని వాడుకొచి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు కేటాగాళ్లు మాత్రం జనాలను నిండా ముంచుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఏఐ సాయంతో ఆర్మీ అధికారినని చెప్పి ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకూ అతను ఏం చేయాలో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఈడీ చరిత్రలో సంచలనం.. రూ.792 కోట్ల మోసం కేసులో తొలిసారి ప్రైవేట్ జెట్ వేలం!

ఈడీ చరిత్రలో సంచలనం.. రూ.792 కోట్ల మోసం కేసులో తొలిసారి ప్రైవేట్ జెట్ వేలం!

హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రూ.792 కోట్ల ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న హాకర్ 800ఏ ప్రైవేట్ జెట్‌ను తొలిసారిగా వేలం వేసి విక్రయించింది. ఇది ఈడీ చరిత్రలోనే మొదటి ఘటనగా నిలిచింది. ఈ వేలం ద్వారా సుమారు రూ.3 కోట్లు సమీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

మాజీ పోలీసు ఉన్నతాధికారులకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. భద్రతా సౌకర్యాలపై కోత

మాజీ పోలీసు ఉన్నతాధికారులకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. భద్రతా సౌకర్యాలపై కోత

మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, మాజీ ఉన్నతాధికారులు, కొంతమంది వీఐపీలకు కల్పిస్తున్న భద్రతా సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షించింది. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, గన్‌మెన్‌ల వంటి భద్రతా ఏర్పాట్లను అవసరం ఉన్నవారికే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ACB Raids: కళ్లు చెదిరేలా డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తులు

ACB Raids: కళ్లు చెదిరేలా డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తులు

అవినీతి ఆరోపణలపై అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, కర్ణాటకలో విస్తరించిన విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులు, భారీ నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 20 ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించిన ఏసీబీ, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది.

Hyderabad: డ్రగ్స్ కట్టిడిపై పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి స్కూల్, కాలేజీలో ఏడీసీ కమిటీలు!

Hyderabad: డ్రగ్స్ కట్టిడిపై పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి స్కూల్, కాలేజీలో ఏడీసీ కమిటీలు!

విద్యార్థుల్లో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అన్ని విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను తప్పనిసరి చేశారు. డ్రగ్స్ ప్రమాదాలు, ఎన్‌డీపీఎస్ చట్టంపై అవగాహన కల్పించాలని, అనుమానిత కార్యకలాపాలపై పోలీసులకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఉద్యోగులూ జర భద్రం: బాస్ పేరుతో వచ్చే ‘ఆ ఒక్క క్లిక్’ మీ ఆఫీస్ కొంపముంచేయొచ్చు!

ఉద్యోగులూ జర భద్రం: బాస్ పేరుతో వచ్చే ‘ఆ ఒక్క క్లిక్’ మీ ఆఫీస్ కొంపముంచేయొచ్చు!

సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నారు. సంస్థ అధినేతలు, ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ సందేశాలు పంపిస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నారు. విశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకున్న ఈ మోసాలపై తెలంగాణ సైబర్ భద్రతా విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కాలంలో సంస్థల్లో పనిచేసే సిబ్బందికి అత్యవసర సూచనల పేరుతో సందేశాలు వస్తున్నాయి. అవి సంస్థ అధినేత పంపినట్లే కనిపిస్తున్నాయి.

Hyderabad: లేడీస్ హాస్టల్‌లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..

Hyderabad: లేడీస్ హాస్టల్‌లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..

హైదరాబాద్‌లోని ఓ మహిళల హాస్టల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న యువతి బాత్రూంలో ప్రసవించిన అనంతరం నవజాత శిశువును వెంటిలేటర్‌ ద్వారా బయటకు పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు అక్కడికక్కడే మృతి చెందగా, అస్వస్థతకు గురైన యువతిని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్‌‌.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!

Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్‌‌.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్న చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ముఖ్యంగా ‘ఫ్రీ ఫైర్’, ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి గేమ్స్ కారణంగా పిల్లలు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు ఖర్చు చేయడంతో పాటు, అపరిచితులతో పరిచయాలు పెంచుకుని ప్రమాదాల్లో పడుతున్నారని తెలిపారు. ఇటీవల మైనర్ బాలికల అదృశ్యం ఘటనల్లో కూడా ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు.

ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..

ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..

హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ వైద్యుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన పెంటయ్య అనే వ్యక్తి తనను ఎంబీబీఎస్ వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ, ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన కుత్బుల్లాపూర్ SOT పోలీసులు అతడికి ఎలాంటి వైద్య అర్హతలు లేవని గుర్తించి అరెస్ట్ చేశారు.