తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
Hyderabad: దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్ సూసైడ్ నోట్లో సంచలన విషయాలు!
తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడడం పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 23, 2026
- 2:31 pm
హైదరాబాద్లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయం.. DNA పరీక్షల్లో షాకింగ్ నిజం బయటపడింది!
హైదరాబాద్లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయించిన ఘటనలో DNA పరీక్షలు కీలక నిజాన్ని బయటపెట్టాయి. మటన్గా విక్రయిస్తున్న మాంసంలో గేదె దూడ మాంసం కలిపినట్లు నిర్ధారణ కావడంతో దుకాణ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. అధికారులు ప్రజలు లైసెన్స్ ఉన్న విశ్వసనీయ దుకాణాల నుంచే మాంసం కొనుగోలు చేయాలని సూచించారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 18, 2026
- 1:39 pm
సైబర్ మోసంలో డబ్బు పోయిందా? MRM ద్వారా రీఫండ్ పొందే అవకాశం.. ఇలా అప్లై చేయండి!
Cyber Fraud Refund: సైబర్ మోసాల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన Money Restoration Module (MRM) ద్వారా రీఫండ్ పొందే అవకాశం కల్పించింది. అయితే అధికారిక పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేయాలని, OTPలు లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
- Ranjith Muppidi
- Updated on: Jul 15, 2026
- 5:08 pm
హైదరాబాద్లో మిస్సింగ్.. ఏపీలోని బావిలో డెడ్బాడీ.. ఇన్స్టా రీల్తో
హైదరాబాద్లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ ఆచూకీ పోలీసుల దర్యాప్తుతో కాకుండా కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో బయటపడింది. అయితే అప్పటికే ప్రకాశం జిల్లాలోని ఓ పాడుబడ్డ బావిలో అతని మృతదేహం లభించడం విషాదాన్ని మిగిల్చింది.
- Ranjith Muppidi
- Updated on: Jul 15, 2026
- 3:34 pm
Hyderabad: యూట్యూబ్లో చూసి వైన్ తయారు చేశాడు.. ఆరు నెలల్లో ఎంత సంపాదించాడో తెలిస్తే..
యూట్యూబ్ మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. కానీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ప్రతి పనిని వ్యాపారంగా మార్చేయడం కుదరదు. ముఖ్యంగా చట్టపరమైన అనుమతులు అవసరమైన రంగాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే ప్రశంసలతో మొదలైన ప్రయాణం.. పోలీస్ కేసుతో ముగిసే ప్రమాదం ఉంటుంది. అచ్చం లాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది. యూట్యూబ్ చూసి వైన్ తయారు చేసేందుకు ప్రయత్నించిన యువకుడు చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 14, 2026
- 1:43 pm
Hyderabad: రెండు నెలల నిరీక్షణకు తెర.. ఫిన్లాండ్లో మిస్సైన హైదరాబాద్ యువకుడు మృతి
ఉన్నత చదువుల కోసం కొడుకుని విదేశాలకు పంపిన హైదరాబాద్కు చెందిన తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. పై చదువుల కోసమని ఫిన్లాండ్లో వెళ్లిన మనిదీప్ అనే హయాత్నగర్ చెందిన యువకుడు అదృశ్యమై రెండు నెలల తర్వాత సముద్రంలో శవమై కనిపించాడు. మే 5 నుంచి కనిపించకుండా పోయిన మనిదీప్ కోసం కుటుంబం, పోలీసులు విస్తృతంగా గాలించారు. చివరకు సముద్రంలో మృతదేహం దొరకడంతో ఈ కేసు విషాదకరంగా ముగిసింది.
- Ranjith Muppidi
- Updated on: Jul 11, 2026
- 9:19 pm
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
Hyderabad Crime News: కుటుంబ సమస్య పరిష్కారం కోసం సికింద్రాబాద్కు వచ్చిన 43 ఏళ్ల మహిళను టీవీ కార్యక్రమ నిర్వాహకులను కలిపిస్తామని నమ్మించి ఇద్దరు వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 8, 2026
- 2:09 pm
WhatsApp వాటర్ బిల్లు మెసేజ్తో రూ.4.19 లక్షలు మాయం.. OTP చెప్పకుండానే రిటైర్డ్ ఉద్యోగికి భారీ షాక్!
Water Bill Scam: వాట్సాప్లో వచ్చిన నకిలీ వాటర్ బిల్లు మెసేజ్ను నమ్మిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రూ.4.19 లక్షలు కోల్పోయాడు. OTP చెప్పకపోయినా ఫోన్లో మాల్వేర్ యాప్ ఇన్స్టాల్ చేసి సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు దోచేశారు. ఈ ఘటనపై సైబర్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 8, 2026
- 12:42 pm
Hyderabad: చూడ్డానికి డీసెంట్గా ఉన్నాడని అమాయకుడు అనుకోవద్దు.. ఏం చేశాడో తెలిస్తే ఫ్యూజులెగరాల్సిందే!
పెరుగుతున్న టెక్నాలజీని వాడుకొచి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు కేటాగాళ్లు మాత్రం జనాలను నిండా ముంచుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది. ఏఐ సాయంతో ఆర్మీ అధికారినని చెప్పి ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకూ అతను ఏం చేయాలో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Ranjith Muppidi
- Updated on: Jul 4, 2026
- 4:25 pm
ఈడీ చరిత్రలో సంచలనం.. రూ.792 కోట్ల మోసం కేసులో తొలిసారి ప్రైవేట్ జెట్ వేలం!
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రూ.792 కోట్ల ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న హాకర్ 800ఏ ప్రైవేట్ జెట్ను తొలిసారిగా వేలం వేసి విక్రయించింది. ఇది ఈడీ చరిత్రలోనే మొదటి ఘటనగా నిలిచింది. ఈ వేలం ద్వారా సుమారు రూ.3 కోట్లు సమీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 4, 2026
- 12:47 pm
మాజీ పోలీసు ఉన్నతాధికారులకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. భద్రతా సౌకర్యాలపై కోత
మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, మాజీ ఉన్నతాధికారులు, కొంతమంది వీఐపీలకు కల్పిస్తున్న భద్రతా సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షించింది. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, గన్మెన్ల వంటి భద్రతా ఏర్పాట్లను అవసరం ఉన్నవారికే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- Ranjith Muppidi
- Updated on: Jul 2, 2026
- 8:46 pm
ACB Raids: కళ్లు చెదిరేలా డీఎస్పీ భీమ్రెడ్డి అక్రమాస్తులు
అవినీతి ఆరోపణలపై అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ, కర్ణాటకలో విస్తరించిన విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులు, భారీ నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 20 ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించిన ఏసీబీ, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది.
- Ranjith Muppidi
- Updated on: Jul 2, 2026
- 8:30 pm