తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
ఎవర్రా బాబు నువ్వు.. ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన ఓ వ్యక్తిని చెక్ చేయగా అతని బ్యాగులో కోతి పుర్రె కనిపించడం కలకలం రేపింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Aug 12, 2026
- 2:32 pm
Telangana: బాల్యానికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు!
ఒక చిన్నారి బడికి వెళ్లకుండా పనిలోకి వెళ్తున్నాడంటే.. అది ఆ కుటుంబ సమస్య మాత్రమే కాదు, సమాజం సాధించిన వైఫల్యం! అలాంటి వైఫల్యాన్ని అధిగమిస్తూ, బాల్యాన్ని బానిసత్వం నుంచి కాపాడేందుకు తెలంగాణ మహిళా భద్రత తన పెట్టి ఓ బృహత్తర కార్యం.. ఏకంగా 6,307 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది. బానిసత్వం నుంచి భవిష్యత్తువైపు అడుగులు వేసేలా చేసింది.
- Ranjith Muppidi
- Updated on: Aug 1, 2026
- 8:55 pm
Telangana: ఇక ఈ కోర్సు పూర్తిచేస్తేనే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్!
లెర్నర్ లైసెన్స్ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై రోడ్డు భద్రతా కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ రాసే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ నియమాలు, సురక్షిత డ్రైవింగ్పై వీడియోలతో కూడిన ఈ శిక్షణను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 31, 2026
- 9:44 pm
రానున్న రెండు రోజులు జాగ్రత్త.. హైదరాబాద్ వాసులకు కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ట్రాఫిక్ సూచనలు, ఐఎండీ హెచ్చరికలను పాటించాలని కోరారు. మూతలేని మ్యాన్హోల్స్, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 31, 2026
- 11:29 am
Traffic Fines: వాహనదారులకు బ్యాడ్న్యూస్.. ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
Traffic Fines: ప్రతి జంక్షన్ వద్ద భారీగా పోలీసు సిబ్బందిని మోహరించాల్సిన అవసరం తగ్గడంతో పాటు, చలానాల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుంది. ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు హైదరాబాద్లోని నాలుగు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల పాటు పైలట్ ప్రాజెక్ట్..
- Ranjith Muppidi
- Updated on: Jul 24, 2026
- 10:37 pm
హైదరాబాద్ నగరవాసుల నుంచి సైబర్ నేరగాళ్లు గంటకు ఎంత దోచేస్తున్నారు అంటే
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో పెట్టుబడులు, హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పేరుతో ఎక్కువ మోసాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసినవారు, జీవితకాల పొదుపులు ఉన్నవారు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన థర్డ్ పార్టీ సంస్థల ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ కావడం కూడా ఈ మోసాలకు దోహదపడుతున్నట్లు దర్యాప్తులో తేలుతోంది.
- Ranjith Muppidi
- Updated on: Jul 24, 2026
- 8:49 pm
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ..! అసలేం జరిగిందంటే..
హైదరాబాద్లోని చాదర్ఘాట్ వంతెనపై ఒక మైనర్ బాలుడు ఆటో నడుపుతూ, తన ఒడిలో ఒక మహిళను కూర్చోబెట్టుకున్న పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. అయితే, ఇది తాజాగా జరిగిన ఘటన కాదని చాదర్ఘాట్ పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకారం..
- Ranjith Muppidi
- Updated on: Jul 24, 2026
- 4:26 pm
Hyderabad: డూప్లికేట్ విమాన టికెట్లతో దుబాయ్ వెళ్లేందుకు నేపాలీల యత్నం.. ఎలా దొరికారంటే..?
Shamshabad Airport News: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డూప్లికేట్ విమాన టికెట్లతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు నేపాలీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్లైన్ సిబ్బంది తనిఖీల్లో నకిలీ టికెట్లు గుర్తించడంతో వారిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ట్రావెల్ ఏజెంట్లు లేదా మోసగాళ్ల ముఠాల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 24, 2026
- 2:24 pm
ఆ ఒక్క క్లిక్ జీవితకాల కష్టార్జితం ఖతం.. బ్యాంకు ఖాతాలో సొమ్ము క్షణాల్లో మాయం!
"మీ పేరుతో వచ్చిన పార్శిల్ను డెలివరీ చేయలేకపోయాం. చిరునామా తప్పుగా ఉంది. రూ.22 చెల్లించి వివరాలు ధృవీకరిస్తే వెంటనే డెలివరీని రీ షెడ్యూల్ చేస్తాం" అని ఇండియా పోస్ట్ పేరుతో వచ్చిన ఒక ఎస్ఎంఎస్. అందులో ఉన్న లింక్ కూడా అధికారిక వెబ్సైట్లాగే కనిపించడంతో చాలామంది ఎలాంటి అనుమానం లేకుండా దానిపై క్లిక్ చేస్తున్నారు. కానీ ఆ ఒక్క క్లిక్ వారి బ్యాంకు ఖాతాలోని జీవితకాల సేవింగ్స్ను క్షణాల్లో మాయం చేసే ఉచ్చుగా మారుతోంది.
- Ranjith Muppidi
- Updated on: Jul 24, 2026
- 12:34 pm
Hyderabad: దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్ సూసైడ్ నోట్లో సంచలన విషయాలు!
తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడడం పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 23, 2026
- 2:31 pm
హైదరాబాద్లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయం.. DNA పరీక్షల్లో షాకింగ్ నిజం బయటపడింది!
హైదరాబాద్లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయించిన ఘటనలో DNA పరీక్షలు కీలక నిజాన్ని బయటపెట్టాయి. మటన్గా విక్రయిస్తున్న మాంసంలో గేదె దూడ మాంసం కలిపినట్లు నిర్ధారణ కావడంతో దుకాణ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. అధికారులు ప్రజలు లైసెన్స్ ఉన్న విశ్వసనీయ దుకాణాల నుంచే మాంసం కొనుగోలు చేయాలని సూచించారు.
- Ranjith Muppidi
- Updated on: Jul 18, 2026
- 1:39 pm
సైబర్ మోసంలో డబ్బు పోయిందా? MRM ద్వారా రీఫండ్ పొందే అవకాశం.. ఇలా అప్లై చేయండి!
Cyber Fraud Refund: సైబర్ మోసాల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన Money Restoration Module (MRM) ద్వారా రీఫండ్ పొందే అవకాశం కల్పించింది. అయితే అధికారిక పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేయాలని, OTPలు లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
- Ranjith Muppidi
- Updated on: Jul 15, 2026
- 5:08 pm