తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
భక్తికి కొత్త రూపం.. జెన్జీని ఆకట్టుకుంటున్న భజన క్లబ్బింగ్ ట్రెండ్.. ఇప్పుడు హైదరబాద్లో..
మారుతున్న ఫాస్ట్లైఫ్ కారణంగా చెడు అలవాట్లకు బానిసలవుతున్న యువతను అత్యాథ్మికం వైపు మళ్లిస్తూ.. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న భజన్ క్లబ్బింగ్ ట్రెండ్ ఇప్పుడు మన హైదరాబాద్కు కూడా వచ్చేసింది. సాంప్రదాయ భక్తి సంగీతానికి ఆధునిక బీట్స్ను జోడిస్తూ జెన్జీ యువత తెగ ఆకర్షిస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అసలేంటి ఈ భజన క్లబింగ్ దీని గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
- Ranjith Muppidi
- Updated on: May 19, 2026
- 3:39 pm
ఫ్రీగా ఇంటికి డెలివరీ అయిన ఫోన్.. సిమ్ వేసి కొంతసేపు వాడాక ట్విస్ట్..
ఓటీపీలు, వాట్సాప్ లింకుల మోసాల తర్వాత ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త హైటెక్ స్కామ్కు తెరలేపారు. ఉచితంగా మొబైల్ ఫోన్ పార్శిల్ పంపించి, అందులో ముందుగానే ఎస్ఎంఎస్ ఫార్వార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి బాధితుల బ్యాంక్ ఓటీపీలు తమ చేతుల్లోకి వచ్చేలా చేస్తున్నారు. మాదాపూర్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ మోసానికి బలై రూ.77 లక్షలకుపైగా కోల్పోగా, కేసు నమోదు చేసిన పోలీసులు పశ్చిమ బెంగాల్కు చెందిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
- Ranjith Muppidi
- Updated on: May 18, 2026
- 12:39 pm
నెంబర్ ప్లేట్ మార్చి ‘స్మార్ట్’ అనుకున్నాడు.. సీసీ కెమెరాల ముందు బోల్తా పడ్డాడు..!
హైదరాబాద్లో నిబంధనలు పాటించినా ఓ మహిళకు ట్రాఫిక్ ఫైన్లు రావడం తీవ్ర కలకలం రేపింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక భారీ నకిలీ నంబర్ ప్లేట్ మోసం వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మదీనగూడకు చెందిన కార్తిక జయ (23) అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Ranjith Muppidi
- Updated on: May 16, 2026
- 9:49 pm
Hyderabad: జవహర్నగర్ చోరీ కేసు.. నేపాలీ దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు!
ఎంతో నమ్మకంగా ఇంట్లో పనిమనుషులుగా చేరి యజమానుల నమ్మకాన్ని సంపాదించిన నేపాలీ జంటే ఈ దోపిడీకి సూత్రధారులుగా మారినట్టు విచారణలో వెలుగుచూసింది. ఈ కేసులో నేపాలీ గ్యాంగ్కు చెందిన కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
- Ranjith Muppidi
- Updated on: May 16, 2026
- 6:39 pm
IPL Match: ఫ్యాన్స్కు బిగ్ అలర్ట్.. ఆ టికెట్స్ చెల్లవు.. వారికి మాత్రమే SRH మ్యాచ్కు అనుమతి!
ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే చివరి ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీసులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈ మ్యాచ్ కోసం టికెట్స్కు భారీ డిమాండ్ ఉండడంతో దాన్ని సైబర్ నేరగాళ్లు క్యాచ్ చేసుకుంటున్నారని.. జనాలు అందరూ కేవలం అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లింక్స్పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు.
- Ranjith Muppidi
- Updated on: May 16, 2026
- 12:51 pm
Telangana: జులాయి మూవీ స్టైల్లో స్కెచ్.. పగిలిన ఫోన్తో బండారం బట్టబయలు.. కరీంనగర్ దోపిడీ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..
కరీంనగర్ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జులాయి సినిమాలో మాదిరిగానే ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులను కలిపి, వేర్వేరు రాష్ట్రాల నుంచి రప్పించి మాస్టర్ స్కెచ్ వేసిన వైనం పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది. నిందితులు తమ ఆనవాళ్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చిన్నారులకు దొరికిన ఒక పగిలిన సెల్ఫోన్ ఇప్పుడు ఈ కరడుగట్టిన గ్యాంగ్ గుట్టు విప్పే కీలకాధారంగా మారింది.
- Ranjith Muppidi
- Updated on: May 14, 2026
- 1:47 pm
ఐపీఎల్ క్రేజ్ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఐపీఎల్ అంటే కేవలం పరుగుల వరద, వికెట్ల వేట మాత్రమే కాదు.. అదో భారీ వ్యాపార సామ్రాజ్యం. ఈ క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకుని కొందరు అక్రమార్కులు సామాన్య అభిమానులను మోసం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ, ఏకంగా దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లనే వాడుకుని, క్రికెట్ బోర్డులనే బురిడీ కొట్టించిన ఒక భారీ స్కామ్ ఇప్పుడు హైదరాబాద్లో కలకలం రేపింది.
- Ranjith Muppidi
- Updated on: May 9, 2026
- 9:05 pm
Traffic Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఆదివారం ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని మోదీ సభ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్టు తెలిపారు. కాబట్టి వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
- Ranjith Muppidi
- Updated on: May 10, 2026
- 5:58 am
వ్యాపార సంస్థలకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్లో కొత్త తరహా మోసాలు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే..
ఈజీ మనీ కోసం అలవాటు పడిన కేటుగాళ్లు జనాలను మోసం చేసేందుకు రోజురోజుకూ కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. జనాలు కూడా వాటిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈడీ అధికారులమంటూ డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు పట్టుకున్నారు.
- Ranjith Muppidi
- Updated on: May 9, 2026
- 8:37 pm
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు!
హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ కర్ణాటక మహిళ తన విలువైన ఆభరణాలు, డబ్బును తాను ఎక్కిన ఆటోలో మర్చిపోయింది. ఆ తర్వాత గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తులు ఆమె ప్రయాణించిన ఆటో డ్రైవర్ను గుర్తించారు. అయితే, అతడు తన ఆటోలో ఉన్న ప్రయాణికురాలి బంగారు ఆభరణాలు, నగదు తిరిగిచ్చేశాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అభినందించారు.
- Ranjith Muppidi
- Updated on: Apr 24, 2026
- 10:55 pm
Hyderabad: నీది ఫేక్ బంగారం అంటే నీది ఫేక్.. గోల్డ్ మెన్ల మధ్య లొల్లి.. ఇంటిపై దాడి..
హైదరాబాద్లో మరోసారి బంగారు యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో మొదలైన మాటల తూటాలు.. ఇప్పుడు నేరుగా దాడుల వరకు వెళ్లడం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్లు సూర్య భాయ్, దర్గా చిన్న పహిల్వాన్ మధ్య మొదలైన అసలు వర్సెస్ నకిలీ పోరు ఇప్పుడు హింసాత్మక మలుపు తీసుకుంది. ఈ వివాదం కాస్త ఇళ్లపై దాడుల వరకు వెళ్లింది. అసలేం జరిగిందంటే..?
- Ranjith Muppidi
- Updated on: Apr 24, 2026
- 8:55 pm
జీవితానికి DRS ఉండదు జాగ్రత్త.. వాహనదారులకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక!
ఐపీఎల్ క్రేజ్ దేశాన్ని ఊపేస్తున్న తరుణంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. క్రికెట్ లైవ్ షోను మొబైల్ ఫోన్లో చూస్తూ వెళ్లే వాహనదారులకు ఇచ్చిన హెచ్చరిక ఆలోచింపజేసేలా ఉంది. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది.
- Ranjith Muppidi
- Updated on: Apr 24, 2026
- 12:42 pm