తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్కృష్ణారెడ్డికి పోటెన్సీ టెస్ట్.. మరో కీలక అప్డేట్ వచ్చేసింది..
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్కృష్ణారెడ్డి కేసులో మరో కీలక అప్డేట్ వచ్చింది. ఆయనకు పోటెన్సీ టెస్టులు నిర్వహించాలంటూ రాజేంద్రనగర్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
- Ranjith Muppidi
- Updated on: Aug 31, 2026
- 7:51 pm
రాఖీ పండుగ వేళ.. రూ.5వేల బిల్లుకు.. రూ.3 వేల ‘వెయిటింగ్ ఛార్జీ’.. బిల్లు అడిగితే బాదేశారు..!
రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని నారాయణగూడ రెస్టారెంట్లో ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. రూ.5వేల బిల్లుకు రూ.3వేల 'వెయిటింగ్ ఛార్జీ' విధించడాన్ని ప్రశ్నించడంతో వివాదం చెలరేగి, రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్పై దాడి చేశారు. ఆశిష్ పోర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో వాస్తవాలు తేలాల్సి ఉంది.
- Ranjith Muppidi
- Updated on: Aug 31, 2026
- 12:53 pm
నీట్ ఎగ్జామ్కు వచ్చిన విద్యార్థి.. ఒక్కసారిగా గుప్పుమన్న వాసన.. అనుమానంతో చూడగా..
దేశవ్యాప్తంగా NEET PG ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా సుమారు 1,300 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శేరిగూడ నీట్ పీజీ కేంద్రానికి మద్యం మత్తులో వచ్చిన విద్యార్థిని సిబ్బంది అడ్డుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
- Ranjith Muppidi
- Updated on: Aug 31, 2026
- 10:52 am
నేపాల్లో ప్రళయ తాండవం.. తృటిలో తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్రెడ్డి దంపతులు
నేపాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ ప్రకృతి తీవ్ర రూపానికి వందలామంది మంది మృత్యువాత పడ్డారు. ఇంకా అనేకమంది నిరాశ్రయులుగా మారారు. ఇంకా అనేకమంది కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోయివారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు. అయితే ఈ విపత్తు నుంచి DRDO మాజీ చైర్మన్ సతీష్రెడ్డి దంపతులు బయటపడ్డారు.
- Ranjith Muppidi
- Updated on: Aug 30, 2026
- 7:57 pm
Hyderabad: చాక్లెట్ల రూపంలో గంజాయి.. గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు..
హైదరాబాద్లో గంజాయి కలకలం రేపుతోంది. రోజు ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతుంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు ఏదొక రూపంలో గంజాయిని నగరానికి తరలిస్తున్నారు. ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రెండు ఘటనల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Aug 30, 2026
- 3:13 pm
Hyderabad: ‘నా భార్య ఆస్పత్రిలో ఉంది.. ఆర్డర్ ఇచ్చి వెళ్లిపోతా సార్’.. హైదరాబాద్లో వైరల్గా మారిన వీడియో
Hyderabad: ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. చిన్న తప్పిదానికి ఫైన్ వేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని.. కానీ ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అలాగే..
- Ranjith Muppidi
- Updated on: Aug 29, 2026
- 8:19 pm
Telangana: హైస్పీడ్లో హైదరాబాద్ వైపు దూసుకొస్తున్న కారు.. అనుమానం వచ్చి చెక్ చేయగా..
తెలంగాణ పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తుండగా.. పక్కా సమాచారంతో కాపు కాచి పట్టుకున్నారు. పతంగి టోల్ ప్లాజా సమీపంలో అడ్డుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Aug 28, 2026
- 9:36 pm
అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు ఎక్కడ దొరికాడంటే..
అమెరికాలో హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా నుంచి భారత్కు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మను హైదరాబాద్ పోలీసులు ఆగ్రాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థలు అతడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా, అమెరికాలో నమోదైన హత్య కేసుకు సంబంధించి ఆగస్టు 25న కస్టడీలోకి తీసుకున్నారు. నిఖిత హత్య వెనుక ఆర్థిక వివాదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
- Ranjith Muppidi
- Updated on: Aug 28, 2026
- 3:56 pm
డ్రైవర్ను అడ్డం పెట్టుకుని కూతురు అకౌంట్కు లంచాలు.. మైనింగ్ అధికారి గుట్టురట్టు చేసిన ఏసీబీ..
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక కాంట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మైనింగ్ అధికారి జయరాజు గుట్టును ఏసీబీ రట్టు చేసింది. డ్రైవర్ను అడ్డం పెట్టుకుని కుమార్తె బ్యాంక్ ఖాతాకు రూ.లక్షల్లో లంచాలు బదిలీ చేయించిన వ్యవహారం అధికారులనే విస్తుపోయేలా చేసింది. ఏసీబీ సోదాల్లో ఏం బయటపడ్డాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Ranjith Muppidi
- Updated on: Aug 28, 2026
- 1:26 pm
నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు!
నేపాల్ వరదల్లో హైదరాబాద్కు చెందిన 44 ఏళ్ల సుహాసిని రెడ్డి గల్లంతయ్యారు. కైలాష్ మానస సరోవర్ యాత్రలో భాగంగా నేపాల్ వెళ్లిన ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పుట్టినరోజున తల్లి వస్తుందని చిన్న కుమారుడు సమయ్ ఎదురుచూస్తున్నాడు. తెలంగాణ నుంచి 23 మంది పర్యాటకులు కూడా నేపాల్లో చిక్కుకుపోగా, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది.
- Ranjith Muppidi
- Updated on: Aug 28, 2026
- 1:08 pm
Hyderabad: చెరువుల్లోకి చికెన్ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
చికెన్ షాప్ల వద్ద కాసేపు నిల్చుంటేనే.. వాటి వ్యర్థాల నుంచి వచ్చే కంపును బరించలేము.. కానీ అవే వ్యర్థాలు నేరుగా మీరు తినే ప్లేట్లోకి వస్తున్నాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. కాసులకు కక్కుర్తి పడిన కొందరు వ్యాపారు చేసే తప్పుడు దందా కారణంగా చెత్త కుప్పలో పడాల్సిన వ్యార్థాలు చేపల రూపంలో మీ కడుపులోకి వెళ్తున్నాయి. చికెన్ దుకాణాల నుంచి మొదలవుతున్న ఈ అక్రమ దందా ఇప్పుడు కోట్ల మంది ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి ఎలా నెడుతోందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- Ranjith Muppidi
- Updated on: Aug 24, 2026
- 8:16 pm
Telangana: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల అంతు తేల్చేందుకు వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా జరిగిన దాడుల్లో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Aug 21, 2026
- 12:40 pm