తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
Telangana: అత్వెల్లిలో మహిళ దారుణ హత్య.. ముక్కు, చెవులు కోసి చంపిన వైనం..
మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు.. ముక్కు, చెవులు కోసి దారుణంగా హత్య చేశారు. ఆపై మృతదేహానికి నిప్పు పెట్టారు. ఇంటి నుంచి పొగలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. మహిళ సగం కాలిపోయిన స్థితిలో కనిపించింది.
- Ranjith Muppidi
- Updated on: May 16, 2025
- 1:36 pm
విడాకులు ఇచ్చానంటూ లేడీ డాక్టర్ను ట్రాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..
పెళ్లాం కాదు.. నా జీవితానికో గొళ్లెం. ఏడడుగులు నడిచిన పాపానికి ఎంత టార్చర్ పెట్టిందో. అందుకే ఆల్రెడీ డైవోర్స్కి అప్లై చేశా. ఇదిగో డాక్యుమెంట్స్. మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని అతను చెబితే.. నిజమేనని నమ్మేసిందా లేడీ డాక్టర్. పెళ్లి చేసుకుందామనేసరికి సర్వస్వం అప్పగించింది. గర్భందాల్చాక పెళ్లి గురించి గట్టిగా అడిగితే బయటపడింది ఆ దగుల్బాజీ నిజస్వరూపం..
- Ranjith Muppidi
- Updated on: May 15, 2025
- 7:55 pm
Hyderabad: బీ అలర్ట్.. ఆ లింక్స్ను క్లిక్ చేయద్దు.. హైదరాబాద్ పోలీసుల కీలక సూచన
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ దాయాది దేశం పలు కుట్రలకు తెరలేపుతోంది. డైరెక్ట్గా భారత సైన్యాన్ని ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా సైబర్ అటాక్స్ చేసి ప్రభుత్వ అధికారిక, ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి
- Ranjith Muppidi
- Updated on: May 10, 2025
- 10:12 pm
Cyber Crimes: సైబర్ నేరాలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి.. లేదంటే మీ డబ్బు తిరిగి రాదు
ఒకప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్కడిది..? అందుకే దొంగలు ఇళ్లను కొల్లగొట్టి వెళ్ళిపోయేవారు. రోడ్డుపైనే దోపిడీలు, గొలుసు దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఈ రకం నేరాలు తగ్గి.. సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇబ్బడి ముబ్బడిగా సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు స్కామర్స్. ఐతే ఇలా సైబర్ నేరాల బారిన పడేవారు.. పెద్దగా ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.
- Ranjith Muppidi
- Updated on: May 4, 2025
- 5:28 pm
Hyderabad: అద్దెకు ఇల్లు కావాలని లోపలికి వచ్చారు.. మహిళ ఒంటరిగా కనిపించడంతో
పార్శిగుట్టలో పారిజాతం అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టారు దుండగులు.. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆమె ఇంటి వద్దకు వచ్చి డోర్ కొట్టారు. ఆమె తలుపు తీయగానే ఇల్లు అద్దె కోసం వచ్చినట్లు చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. లుక్కేయండి.
- Ranjith Muppidi
- Updated on: May 3, 2025
- 10:18 pm
Hyderabad: ఇకపై రాంగ్ రూట్లో వెళ్లేవారికి దబిడి దిబిడే.. సైబరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం!
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రహితంగా మార్చేందుకు హైదరాబాద్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే రాంగ్ రూట్లో వాహనదారులు ప్రయాణించడం వల్ల ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల నివేదికల్లో తేలింది. దీంతో రాంగ్ రూట్లో ప్రయాణించేవారిపై కొరడా ఝులిపించాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.
- Ranjith Muppidi
- Updated on: May 3, 2025
- 6:30 pm
Hyderabad: పాపం ఆన్లైన్లో అవకాడోలు ఆర్డర్ చేద్దామనుకుంటే.. ఇలా అయ్యింది ఏంటి..?
ప్రస్తుతం యాడ చూసినా ఆన్లైన్ మోసాలే. సైబర్ స్కామర్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రకమైన మోసంతో జనాల్ని చీట్ చేస్తున్నారు. అందుకే డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా హైదారాబాద్కు చెందిన ఓ స్టూడెంట్.. అవకాడోలు ఆర్డర్ చేయబోయి స్కామర్స్కు చిక్కాడు.
- Ranjith Muppidi
- Updated on: Apr 26, 2025
- 8:26 pm
Hyderabad: తెల్లగా పొంగుతుంది కల్లు అనుకుని తాగితే జీవితం కల్లాస్..!
తెల్లటివన్నీ పాలు కాదు.. ఇది తెలిసిన ముచ్చటే. ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే.. తెల్లగా నురగలు కక్కేదంతా కల్లు కాదు. అది మిమ్మల్ని మంచాన పడేసే, మరణ శాసనం రాసే విషం కూడా కావొచ్చు..! ఎండాకాలం కాస్త చలువ చేస్తోందని కల్లు తాగితే.. బతుకు షెడ్డూకే అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. తెలంగాణలో కల్తీ కల్లు ప్రవాహం.. విచ్చలవిడిగా సాగుతోంది.
- Ranjith Muppidi
- Updated on: Apr 23, 2025
- 5:47 pm
Hyderabad: సోషల్ మీడియా మాటున చాటుమాటు యవ్వారం.. సీన్ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.!
హైదరాబాద్ మహానగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా మార్చాలని ప్రభుత్వం ముందుకు సాగుతుంటే.. కేటుగాళ్లు మాత్రం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా నగరంలో మరో దందా బట్టబయలు అయ్యింది. పెద్ద ఎత్తున నిషేధిత ఈ-సిగరెట్లను, వేపింగ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Ranjith Muppidi
- Updated on: Apr 22, 2025
- 4:48 pm
Hyderabad: హైదరాబాద్ టూ గోవా.. బస్సు ఎక్కగానే గోల్మాల్ యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!
మామూలుగా గోవాలో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి.! అని అక్కడికి వెళ్ళి వచ్చినా అనుభవం ఉన్నవారు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఇకపై గోవా వెళ్లేందుకు ప్రయాణించే వాహనాల విషయంలో కూడా హెచ్చరికలు చేయాలేమో. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి చూసేయండి.
- Ranjith Muppidi
- Updated on: Apr 19, 2025
- 9:31 pm
Hyderabad: ఒక్క ఫేస్బుక్ రిక్వెస్ట్.. అతన్ని నిండా ముంచేసింది.. ఏం జరిగిందో తెలుస్తే!
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో ఎక్కువగా చదువుకున్న వారు, వ్యాపారవేతలే డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈజీగా మనీ సంపాదించొచ్చని స్కామర్స్ చెప్పిన మాటలకు బోల్తాపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్లోని అమీర్పేర్టో చోటుచేసుకుంది. ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మంచి రాబడి కల్పిస్తామని చెప్పి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.2.6కోట్లు కాజేశారు కేటుగాళ్లు.
- Ranjith Muppidi
- Updated on: Apr 19, 2025
- 3:28 pm
Hyderabad: లచ్చలు.. లచ్చలు పెట్టిస్తాయ్.. కంట్రోల్లోకి వెళ్లారంటే ఖేల్ ఖతం..
బెట్టింగ్ మరొకరిని బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్స్కు అలవాటుపడి ఒకేసారి రూ. లక్ష నష్టపోయిన యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. త్వరలో మంచి ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఇలా..
- Ranjith Muppidi
- Updated on: Apr 18, 2025
- 3:43 pm