తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
కోడలిపై అఘాయిత్యం.. బాధను దిగమింగిన వివాహిత.. ఆపై కోర్టు సంచలన తీర్పు..
వావి వరసలు తప్పి కొడలు వరసయ్యే మహిళపై రేప్ అటెంప్ట్ చేసిన ఓ ప్రబుద్దిడికి 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది ఆసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్టు. అంతేకాదు రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ముకుందరావు తనకు కోడలి వరస అయ్యే వివాహితపై కన్నేశాడు. ఆమె ఒంటిరిగా ఉన్నప్పుడు తప్పుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు.
- Ranjith Muppidi
- Updated on: Jun 22, 2024
- 8:57 pm
Hyderabad: మీ పిల్లలు రాత్రుళ్లు ఎక్కడికి వెళ్తున్నారో గమనించండి.. అలా చేస్తే పేరెంట్స్ జైలుకే..
బైక్ రేసింగులకు పాల్పడే ఆకతాయులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. రాత్రివేళ్లలో ఐటీ కారిడార్లపై.. రేసింగ్స్ చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైస్పీడ్, జిగ్ జాగ్ డ్రైవింగ్, రేసింగ్స్, భారీ శబ్ధకాలుష్యంతో కటింగ్స్ ఇస్తే.. జైల్లో వేస్తామని మాదాపూర్ ఏసీపీ సీహెచ్.శ్రీకాంత్ తెలిపారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 22, 2024
- 8:30 pm
Hyderabad: బస్సు కింద పడుకొని యువకుడి రీల్.. అసలు విషయం చెప్పిన TGRTC ఎండీ సజ్జనార్
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. లైక్స్, షేర్స్ మాయలో పడి.. చట్టాలను అతిక్రమిస్తున్నారు. ఈ మధ్య ప్రాంకుల కోసం పిచ్చి వేషాలు వేస్తున్నవారిని చూస్తున్నాం. ఇన్స్టాలో రీల్స్ చేసేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిని చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు తరుచుగా రోజూ ఏదో మూలన వెలుగు చూస్తూనే ఉన్నాం...
- Ranjith Muppidi
- Updated on: Jun 22, 2024
- 5:54 pm
Hyderabad: హాస్టల్లో ఉండలేక అర్థరాత్రి గోడ దూకేందుకు ప్రయత్నించాడు.. కానీ
ఆంధ్రాలోని తెనాలికి చెందిన కర్రీ విజయ్కుమార్, చాముండేశ్వరి దంపతులు సిటీకి వచ్చి ఈస్ట్ మారేడుపల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు గిరీష్ కుమార్ ఇటీవల టెన్త్ కంప్లీట్ అవ్వంతో.. ఈ నెల 12న హయత్నగర్ సమీపంలోని కోహెడలో గల ఓ ప్రవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేశారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 22, 2024
- 1:59 pm
Hyderabad: బీ అలెర్ట్… రాంగ్రూట్లో డ్రైవ్ చేస్తే.. ఇకపై జైలుకే..
ఇటీవలి కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే కావడంతో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. పట్టుపడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపనున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 22, 2024
- 1:49 pm
Thunderbolt: పిడుగులు అంటే ఏమిటి ? ఎలా ఏర్పడతాయి
ఆవర్తన ద్రోణి కారణంగా.. ఆదివారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేసింది. వచ్చే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.
- Ranjith Muppidi
- Updated on: Jun 15, 2024
- 9:31 pm
Telangana: అసలు వీడు అసలు మనిషేనా.. కేవలం మూడున్నర తులాల బంగారం కోసం..!
సమాజంలో మనషి అన్న వాడే మాయమవుతున్నాడు. బంధాలకు విలువలేదు. దైవం అంటే భక్తి లేదు. కన్న తల్లిదండ్రులపై ప్రేమ, గౌరవం అనేవి కనిపించడం లేదు. ఇవన్నీ లేకపోగా అమ్మా నాన్నలను వేధించడం, రోడ్డున వదలేయడం, కొట్టడం, చంపడం వంటి దారుణాలు కూడా చూస్తున్నాం. తాజాగా అలాంటి అమానుష ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
- Ranjith Muppidi
- Updated on: Jun 15, 2024
- 9:52 pm
ఈ దొంగోడి వద్ద కేజీ బంగారం.. దొంగతనాల్లో మాములు తోపు కాదు
తాజాగా అతని పాపం పండింది. RGI పోలీసులు ఈ కేటగాడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకంగా కేజీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. 110 రోజుల వ్యవధిలో 200 సార్లు ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తే.. మహిళల నుంచి బంగారం కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ప్రెస్మీట్ పెట్టి
- Ranjith Muppidi
- Updated on: Jun 15, 2024
- 8:33 pm
Telangana: మందుబాబులకు కీలక అలెర్ట్.. ఇక అలా చేస్తే జైలుకే
మందుబాబులకు బిగ్ అలర్ట్. అయితే బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా. అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. డ్యూటీ మగించుకుని ఇంటికి వెళ్తూనో.. స్నేహితులతో సరదాగా రోడ్డు పక్కన మందు తాగుదామని అనుకుంటున్నారా.. అయితే మీకే ఈ అలెర్ట్....
- Ranjith Muppidi
- Updated on: Jun 15, 2024
- 6:05 pm
మైనర్ బాలిక మిస్సింగ్.. ఇంటికి కూతవేడు దూరం ఊహించని పరిణామం..
మియాపూర్లో 12 ఏళ్ల బాలిక కనిపించికుండా పోయినట్లు ఇటీవల మిస్సింగ్ కంప్లైంట్ నమోదయింది. అయితే ఆ బాలిక విగతజీవిగా ఇంటికి సమీపంలో గుర్తించడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. పొట్టకూటికోసం బాలిక తల్లిదండ్రులు నరేశ్, శారదలు నెల క్రితమే నగరానికి వచ్చారు. నడిగడ్డ తండాలో నివాసం ఉంటూ.. కూలి పనులకు వెళ్తున్నారు. అయితే జూన్ 7 ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక.. మళ్లీ తిరిగిరాలేదు. పనులు ముగించుకుని రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 15, 2024
- 8:26 am
చేప ప్రసాదం పంపిణీలో తీవ్ర విషాదం.. క్యూలైన్ తోపులాటలో వ్యక్తి మృతి
మృగశిర కార్తె నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప పంపిణీ కార్యక్రమం మొదలైంది. బత్తిని కుటుంబ సభ్యులు జూన్ 8న ఉదయం నుంచి.. చేప ప్రసాదం పంపిణీ షురూ చేశారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలున్న రోగులు తరలివచ్చారు.
- Ranjith Muppidi
- Updated on: Jun 8, 2024
- 11:03 pm
సిటీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ బస్ పాస్ ధర భారీగా తగ్గింపు
మీరు హైదరాబాద్ సిటీ బస్సుల్లో నిత్యం ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీకే ఈ గుడ్ న్యూస్. ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆ బస్సుల నెలవారీ బస్ పాస్ రేటును భారీగా తగ్గించింది. కేవలం 1900 రూపాయలకే ఈ బస్ పాస్ను అందజేస్తోంది. గతంలో ఈ బస్ పాస్ ధర రూ.2530 ఉండగా.. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు తాజాగా రూ.630 తగ్గించింది.
- Ranjith Muppidi
- Updated on: Jun 8, 2024
- 10:24 pm