తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
Hyderabad: KBR పార్క్ వద్ద తచ్చాడుతూ అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా
KBR పార్క్ వద్దకు రోజూ ఉదయం, సాయంత్రం వందలాది మంది వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. వారిలో వీఐపీలు కూడా ఉంటారు. ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారు. వారి వాలకం తేడాగా ఉండటంతో.. పోలీసులకు సమాచారం అందింది ...
- Ranjith Muppidi
- Updated on: Nov 13, 2025
- 7:26 pm
Hyderabad: నీ టైం వచ్చేవరకు ఆగాల్సింది కదా బ్రో.. పెళ్లి అవ్వడం లేదని ఎంత పని చేశాడు..
వయసు పెరుగుతున్నా పెళ్లి కుదరకపోవడంతో ఆందోళన చెందిన ఓ యువకుడు జీవితాన్ని ముగించుకున్న ఘటన హైదరాబాద్ ఘట్కేసర్లో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం హనకొండకు చెందిన 32 ఏళ్ల బుర్రా నరేష్ సరైన సంబంధం దొరకక నిరాశకు గురై రైల్వే ట్రాక్పై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
- Ranjith Muppidi
- Updated on: Nov 13, 2025
- 5:30 pm
Hyderabad: మాకు ఆ బైకులంటేనే మోజు.. వీరి పంథా తెలిస్తే మీరు బిత్తరపోవడం ఖాయం
ఈ గ్యాంగు రూటే సెపరేట్. కేవలం టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్స్ మాత్రమే తస్కరిస్తారు. అవి ఎక్కడ కనిపించినా వదిలిపెట్టరు. ఎంత తోపు దొంగలైతే మాత్రం పోలీసులకు చిక్కకుండా ఉంటారా..? వీళ్లు సైతం చిక్కారు.. ఇంతకీ వాళ్లు ఈ బైక్స్ మాత్రమే చోరీ చేయడానికి కారణం ఏంటి.. ?
- Ranjith Muppidi
- Updated on: Nov 11, 2025
- 8:26 pm
ఉగ్ర కుట్రలో హైదరాబాద్ డాక్టర్ బాబు పాత్ర.. దీని వెనుక అసలు సూత్రదారులెవరో?
గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఇటీవల భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నిస్తున్న ఒక నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. మొహియుద్దీన్ తన ఇంటిని ల్యాబ్గా మార్చి ఆముదం గింజలను..
- Ranjith Muppidi
- Updated on: Nov 10, 2025
- 9:08 pm
పుష్పాను మించిన కొత్త టెక్నిక్స్. . గంజాయి ఎలా తరలిస్తున్నారో తెలిస్తే.. మైండ్ బ్లాంక్ అంతే!
వీళ్లవి మాములు తెలివి తేటలు కాదు. పుష్ప డైరెక్టర్ కూడా వీళ్లని చూసి టెక్నిక్స్ నేర్చుకోవాలేమో..! వీళ్ల గురించి ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. వీళ్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న విధానం అలా ఉంది మరీ. వీళ్లు గంజాయిని తరలిస్తున్న తీరును చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారి నుంచి 15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్నారు.
- Ranjith Muppidi
- Updated on: Nov 9, 2025
- 1:42 pm
Hyderabad: వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ఈ దంపతులు ఏం చేశారో తెలుసా..?
బిజినెస్లో నష్టపోయి అప్పుల పాలైన వ్యాపారి యూట్యూబ్ వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ నేర్చుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలుని చేరాడు. ఈ కేసులో అతని భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి ...
- Ranjith Muppidi
- Updated on: Nov 8, 2025
- 9:51 pm
Secunderabad: మీ పార్శిల్ డెలివరీ మళ్లీ ఫెయిల్ అంటూ కొరియర్ కంపెనీ నుంచి లింక్.. ఓపెన్ చేయగానే..
కొరియర్ కంపెనీ పేరుతో వచ్చిన నకిలీ మెసేజ్ను నమ్మి సికింద్రాబాద్ వ్యక్తి రూ.2.47 లక్షలు కోల్పోయాడు. లింక్ క్లిక్ చేసిన క్షణాల్లోనే ఫోన్ హ్యాంగ్ అయి, ఓటీపీలతో ఖాతా ఖాళీ అయ్యింది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ..
- Ranjith Muppidi
- Updated on: Nov 5, 2025
- 6:59 pm
Telangana: డిఫెన్సివ్ డ్రైవింగ్తో ప్రమాదాలకు చెక్.. డ్రైవర్లకు డీజీపీ కీలక సూచనలు..
ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతిని తప్పక పాటించాలని డీజీపీ సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే.. ఇతరుల తప్పుల వల్ల జరిగే ప్రమాదాలను కూడా ముందే గుర్తించి, తప్పించుకునే ఒక మెళకువ. డీజీపీ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై భారీ అవగాహన కార్యక్రమాలు మొదలుకానున్నాయి.
- Ranjith Muppidi
- Updated on: Nov 4, 2025
- 10:40 pm
Hyderabad: మంచి ఫుడ్ బ్రాండ్ అని పోతే.. అసలు సంగతి ఇదీ.. కోర్టు ఆర్డర్తో రంగంలోకి పోలీసులు..
సంతోష్ దాబా పేరుతో అక్రమంగా నడుస్తున్న హోటళ్లపై పోలీసులు చర్యలకు దిగారు. తమ పేరుతో అక్రమంగా దాబాలు నడుపుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంతోష్ దాబా యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు అటుంటి దాబాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది.
- Ranjith Muppidi
- Updated on: Nov 2, 2025
- 10:33 pm
Hyderabad: నమ్మి ప్రేమించడమే.. ఆమె చేసిన పాపమా?.. ప్రియుడు ఏం చేశాడంటే?
హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమపేరుతో యువతికి దగ్గరైన ఒక యువకుడు.. అర్థరాత్రి ఆమె ఉంటున్న ప్లాట్లోకి చొరబడిన.. యువతి స్నేహితులను రూమ్లో బంధించి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెపై కత్తెరతో దాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- Ranjith Muppidi
- Updated on: Oct 30, 2025
- 9:06 pm
ఏం మనుషులురా మీరు.. రూ. 600 కోసం నిండి ప్రాణాన్ని తీశారు కదరా..!
హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన ఇది. కేవలం రూ.600 కోసం ఓ వ్యక్తిపై హోటల్ సిబ్బంది దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన నగరంలోని సరూర్నగర్లో చోటుచేసుకుంది. కర్మన్ఘాట్ ప్రాంతానికి చెందిన విశ్లావత్ శంకర్ (35) అనే వ్యక్తి అక్టోబర్ 22న తన స్నేహితులతో కలిసి కర్మన్ఘాట్లోని ఎన్-7 ఎలైట్ హోటల్లో చెక్ఇన్ అయ్యాడు.
- Ranjith Muppidi
- Updated on: Oct 29, 2025
- 8:58 pm
తప్పు చేస్తే తప్పించుకోలేరు.. లేడీ డాన్కు హైకోర్టులో చుక్కెదురు..!
హైదరాబాద్ లోని ధూల్పేట్ ప్రాంతానికి చెందిన అంగూరి బాయ్పై పీడి యాక్ట్ కేసుపై మంగళవారం (అక్టోబర్ 28) హైకోర్టు బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్పై ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్ స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ లీడర్ రవి కుమార్ లు వాదనలు వినిపించారు. చివరగా అంగూర్ భాయ్ వేసిన వేసిన పీడీ యాక్ట్ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు తీర్పు విలువరించారు.
- Ranjith Muppidi
- Updated on: Oct 28, 2025
- 8:22 pm