తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
కోనసీమలో మూకుడు రొట్టెకు పెరిగిన డిమాండ్
Gas shortage : గ్యాస్ కొరత వల్ల చాలా మంది కట్టెలను అడవుల నుంచి తెచ్చి ఆహారాలను తయారు చేసుకుంటున్నారు. పాత రోజుల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేసే వాళ్ళు. మళ్ళీ, ఇన్నాళ్ళకు పుల్లల తెచ్చి పొయ్యి మీద అన్నం, కూర వండుతున్నారు.
- Pvv Satyanarayana
- Updated on: Mar 18, 2026
- 4:49 pm
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
అమలాపురం రూరల్ మండలం సాకుర్రులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేగ దూడల అందాల పోటీలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాధారణంగా అందాల పోటీలు అంటే యువతులు పాల్గొనే ఫ్యాషన్ షోలు గుర్తుకు వస్తాయి. కానీ, ఇక్కడ ఆవు దూడలకు పోటీలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుంగనూరు, జెర్సీ, కపిల, దేశావళీ వంటి రకాలకు చెందిన లేగ దూడలను రైతులు అందంగా అలంకరించి ఈ పోటీల్లో ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
- Pvv Satyanarayana
- Updated on: Mar 15, 2026
- 7:11 am
మహిళా దినోత్సవం నాడు మరణ శాసనం రాసుకున్న ఓ అభాగ్యురాలు… మూడేళ్ల కొడుకుతో కలిసి
తమ్మయ్య చెరువులో మృతదేహాలు తేలడంతో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
- Pvv Satyanarayana
- Updated on: Mar 10, 2026
- 8:40 pm
Andhra News: మధ్యాహ్న భోజనంలో గుడ్డు తినబోయిన విద్యార్ధి.. పొట్టు తీయగా కనిపించింది చూసి..
ఓ పక్క కల్తీ ఆహారాలతో వ్యాపారులు జనాల ప్రాణాలతో ఆడుకుంటుంటే, కొందరు నిర్వాహకులు డబ్బులకు ఆశపడి పాడపోయిన ఆహారాన్ని సరఫరా చేస్తూ జనాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఓ నిర్వాహకుడు కాలులకు ఆశపడి అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేయడం మొదలు పెట్టాడు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టనట్టుగా అదే మాదిరి గుడ్లను సరఫరా చేయడంతో ఈ ఉదంత వెలుగులోకి వచ్చింది.
- Pvv Satyanarayana
- Updated on: Mar 9, 2026
- 5:58 pm
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ రూరల్ మండలం కరప లో శ్రీశ్రీ శ్రీ వారాహి మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. చిక్కాల బ్రదర్స్,సీనియర్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో భారతదేశంలో కాశీలో ఎలాగైతే వారాహి అమ్మవారు ఉన్నారో, అలాగే భారతదేశంలో రెండవ వారాహి మాత అమ్మవారి విగ్రహం చేయించి భారీ ఎత్తులో శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహం ప్రాణ ప్రతిష్ట చేశారు.
- Pvv Satyanarayana
- Updated on: Mar 7, 2026
- 10:15 pm
Andhra Pradesh: బాహుబలి బీట్రూట్.. ఒక్కోటి ఎన్ని కిలోలు ఉన్నాయో తెలిస్తే అవాక్కే.. వీడియో వైరల్..
Viral Video: బీట్రూట్ అంటే గరిష్టంగా అర కిలో ఉంటుంది.. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ దుంపలను చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.. ఒక్కోటి ఏకంగా రెండున్నర కిలోల బరువుతో, చిన్న సైజు కొబ్బరి బొండాలను తలపిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో ఈ బాహుబలి బీట్రూట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
- Pvv Satyanarayana
- Updated on: Mar 6, 2026
- 11:24 am
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణ సమయంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూ సివేస్తారు. శ్రీకాళహస్తి ఆలయంతోపాటు దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లా పిఠా పురంలోని పాదగయ క్షేత్రాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు. గ్రహణం వేళ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగా సూర్య,చంద్ర గ్రహణ సమయాల్లో పాదగయలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామి ఆలయంతో పాటు అన్ని ఉపాలయాలను తెరిచే ఉంచుతారు.
- Pvv Satyanarayana
- Updated on: Mar 3, 2026
- 6:06 pm
Andhra News: పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి
శనివారం కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ప్రమాదంలో గుడపర్తి వీధిలో నివాసం ఉంటున్న ఓకే కుటుంబంలో చెందిన అన్నదమ్ములు ముగ్గురు చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
- Pvv Satyanarayana
- Updated on: Mar 1, 2026
- 3:38 pm
Andhra Pradesh: పాలే కాలకూటం విషంలా మారాయా? అస్వస్థతకు కలుషిత నీళ్లే కారణమా?
రాజమండ్రి పరిధిలోని .లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ , వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాధితుల్లో చాలా మందికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. మూడేళ్ల చిన్నారికి డయాలిసిస్ చేయాల్సి వచ్చింది. అస్వస్థతకు అసలు కారణాలేంటి? నీటి కాలుష్యమా? కల్తీ పాలే కారణమా?
- Pvv Satyanarayana
- Updated on: Feb 23, 2026
- 8:26 am
Andhra News: కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతున్న క్షణికావేశాలు.. పేరెంట్స్ తిట్టారని బాలికలు ఏం చేశారంటే?
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోలో ఒకే రోజు రెండు విషాద ఘటనలు వెలుగు చూశాయి. స్థానికంగా టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మిస్ అవ్వగా, మరొకరు చెరువులో పడి మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. అమలాపురంలో పదవ తరగతి అమ్మాయి(14) మిస్ అయిన కొన్ని గంటల్లోనే పి.గన్నవరంలోని చెరువులో పడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
- Pvv Satyanarayana
- Updated on: Feb 20, 2026
- 6:32 pm
అందరూ టీవీ సీరియల్ చూస్తున్న సమయంలో.. ఇంటి దొంగ చేతివాటం! ఆ తర్వాత సీన్ ఇదే..
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని సామెతను సాకుగా చేసుకుని సర్పంచ్ ఇంటిలోనే దఫా దఫాలుగా దొంగతనం చేస్తున్న యువకుడిని సీసీ కెమెరా పట్టించింది. అది ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు కోడళ్లతో నిత్యం హడావుడిగా తిరిగే ఆ ఇల్లు.. డ్రైవర్ గా వచ్చి ఆడవాళ్ళ వీక్నెస్ పట్టుకుని, సీరియల్ టైమ్ కు ఇంట్లోనే రెక్కీ చేసేవాడు..
- Pvv Satyanarayana
- Updated on: Feb 19, 2026
- 7:39 pm
Video: పెద్దపులి బోనులో నుంచి అడవిలోకి దూసుకెళ్తే.. ఎట్టా ఉంటదో తెలుసా..? వీడియో ఇదిగో..
వారం రోజుల ఉత్కంఠ.. వందల మంది అటవీ శాఖ సిబ్బంది గాలింపు.. మూడు రాష్ట్రాలను వణికించిన ఆ క్రూర మృగం కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ పెద్దపులిని అధికారులు పట్టుకుని పాపికొండల అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Pvv Satyanarayana
- Updated on: Feb 19, 2026
- 1:15 pm