తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
మృత్యువు ముందు ఓడిన ప్రేమ జంట.. అయోమయంలో మూడు నెలల పాప..!
ప్రేమ జంటను మృత్యువు కదిలించింది.. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట మృత్యును జయించలేకపోయింది.. మృత్యువు ముందు ప్రేమ ఓడిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం ప్రేమ వివాహంతో ఒక్కటైన జంటకు మూడు నెలల పాప పుట్టింది. కుటుంబ సభ్యులు అక్కున చేర్చుకున్న రోజునే భార్యాభర్తలు అనంత లోకాలకు వెళ్లిపోయారు.
- Pvv Satyanarayana
- Updated on: Dec 5, 2025
- 9:29 am
Andhra: జాబ్ ఆఫర్ పోస్టర్ చూసి ఫోన్ చేసిన అమ్మాయి.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
నిరుద్యోగ యువతే వారికి ఆదాయ వనరులు.. వాల్ పోస్టర్లే వారి పెట్టుబడి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను నట్టేట ముంచి లక్ష రూపాయలు గడించడమే వారి దినచర్య.. కాకినాడ జిల్లాలో అనేక ప్రాంతాల్లో అమాయిక యువతను మోసం చేస్తున్న ఘరానా ముఠా గుట్టు రట్టు చేశారు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు..
- Pvv Satyanarayana
- Updated on: Dec 3, 2025
- 6:52 pm
Ravi Teja: చింతూరు ఏజెన్సీలో రవితేజ సినిమా షూటింగ్.. భారీగా తరలివచ్చిన జనాలు.. వీడియో
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు మాస్ మహరాజ రవితేజ. ఇటీవల మాస్ జాతర సినిమాతో మన ముందుకు వచ్చిన ఈ సీనియర్ హీరో ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
- Pvv Satyanarayana
- Updated on: Nov 30, 2025
- 7:56 pm
Andhra: పక్కింట్లో అర్ధరాత్రి ఏవో చప్పుళ్లు.. ఏంటని చూడగా కనిపించిన రెండు ఆకారాలు.. చివరికి.!
కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగతనానికి వచ్చి కారుతో పాటు దొంగలు ఉడాయించారు. కుక్కకు మత్తు మందు ఇచ్చి దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఇదిగో ఇది.
- Pvv Satyanarayana
- Updated on: Nov 30, 2025
- 1:38 pm
Andhra: క్లాసులు జరుగుతుండగా స్కూలు గేటుకు తాళం వేసిన వ్యక్తి.. కారణం తెలిస్తే స్టన్
కొడుకుని తోటి విద్యార్థి ఏడిపించాడని ఏకంగా స్కూల్కే తండ్రి తాళం వేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో జరిగింది. వీర్రాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.అయితే స్కూల్లో జరిగిన గొడవ గురించి తండ్రి చెప్పాడు కొడుకు మదిన్.
- Pvv Satyanarayana
- Updated on: Nov 29, 2025
- 1:14 pm
Andhra Pradesh: ఆ గుడిలో నిద్రిస్తే పిల్లలు పుడతారట.. చాగంటి చెప్పిన తర్వాత పోటెత్తిన భక్తులు..
మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సంతానం లేని దంపతులకు వరప్రదాయినిగా ప్రసిద్ధి చెందింది. సర్పదోష నివారణకు, పిల్లల కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో మహిళలు నిద్రించే ఆచారం ద్వారా అమ్మ అనే పిలుపు సొంతమవుతుందని భక్తులు నమ్ముతారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల తర్వాత ఈ ఆలయ ప్రాముఖ్యత మరింత పెరిగింది.
- Pvv Satyanarayana
- Updated on: Nov 26, 2025
- 3:44 pm
Andhra: ఆంధ్రా టు ఒడిశా.. దూసుకువస్తున్న ఆటో.. ఏంటా అని చెక్ చేయగా..
ఇద్దరు వ్యక్తులు.. ఆటో నిండా ఏవో తీసుకుని వస్తున్నారు.. అనుమానం రావడంతో అధికారులు ఆటోను ఆపారు.. పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో వారిని అదుపులోకి చెక్ చేశారు.. ఆటోలో ప్రత్యేక అర ఏర్పాటు చేసుకుని.. తాబేళ్లు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయానికి వచ్చారు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- Pvv Satyanarayana
- Updated on: Nov 25, 2025
- 9:21 am
Andhra Pradesh: మీసం మెలేస్తున్న ఆల్ రొయ్య.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
గచ్చకాయల పోర తీరంలో అరుదైన ఆల్ రొయ్యలు లభించాయి. సాధారణ రొయ్యల కంటే పెద్ద మీసాలు, ఎక్కువ కాళ్లు కలిగి, రుచికరంగా ఉండే వీటిని మాంసప్రియులు ఎంతో ఇష్టపడతారు. మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉండటంతో వేలల్లో ధర పలుకుతున్నాయి. స్థానిక మత్స్యకారులకు ఇవి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.
- Pvv Satyanarayana
- Updated on: Nov 14, 2025
- 2:09 pm
Andhra: ఆయ్.! గోదావరిలో పసుపు రంగు పీతలు దొరికేశాయ్.. రేటు ఎంతో తెలుసా..?
పీతలు.. బాబోయ్.. పీతలు.. ఇక్కడ గంపెడంత పీతలు.. అన్ని రకాలు దొరుకుతాయి. రెండు కేజీల పీత రూ. ౩50 పలుకుతుంది. మరి ఆ ప్లేస్ ఏంటి.? ఎక్కడో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి ఇక్కడ.
- Pvv Satyanarayana
- Updated on: Nov 11, 2025
- 1:32 pm
మీరూ ఆ బీర్లు తాగారా?.. కాలంచెల్లిన మద్యం విక్రయం.. కస్టమర్లు ఏం చేశారంటే?
డబ్బు మోజులో పడిన కొందరు వ్యాపారులు వారి ఉత్పత్తులను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే.. మరికొందరూ కాలం చెల్లిన ఉత్పత్తులను విక్రయిస్తూ జనాల పాలిట యముళ్లుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే యానాంలో వెలుగు చూసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు కాలంచెల్లిన మద్యం విక్రయిస్తున్నాయని కొందరు కస్టమర్లకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Pvv Satyanarayana
- Updated on: Nov 10, 2025
- 4:59 pm
రామచంద్రపురంలో సంచలనం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
హనీ, హనీ అంటూ ముద్దుగా పిలుస్తూ అనురాగాలు పంచాడు.. చివరికి అనురాగానికే హాని చేసాడు. తనకున్న ఆర్ధిక ఇబ్బందులు అతడిని ఇంతటి క్రైమ్ చేసే విధంగా దిగజార్చాయి. నమ్మిన వాడే చిన్నారి ఊపిరిని తీసేసిన హృదయ విధారకరమైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగింది..
- Pvv Satyanarayana
- Updated on: Nov 9, 2025
- 7:12 pm
Andhra News: కలిసి రాని కార్తీకమాసం.. ఒక్క నెలలో బూడిదపాలైన ఏడాది ఎదురు చూపులు!
కార్తీక మాసం తమకు అస్సలు కలిసి రాలేదంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరటి రైతులు. గత కొన్ని రోజులుగా దారుణంగా పడిపోయిన అరటి మార్కెట్.. కార్తీక మాసంతో పెరుగుతుందనుకున్న అరటి రైతులకు ఈసారి కూడా ఎదురు దెబ్బ తగిలింది. తుఫాను ప్రభావంతో అరటి ధరలు అమాంతం పడిపోయాయి. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు.
- Pvv Satyanarayana
- Updated on: Nov 9, 2025
- 5:25 pm