AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pvv Satyanarayana

Pvv Satyanarayana

Staff Reporter (Kakinada) - TV9 Telugu

vvsatyanarayana.pothuraju@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Andhra Pradesh: ఎన్నో ఏళ్ల చరిత్ర.. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. నేడు పనులకు శ్రీకారం

Andhra Pradesh: ఎన్నో ఏళ్ల చరిత్ర.. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. నేడు పనులకు శ్రీకారం

సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ పనునలు ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న గేట్లు 50 ఏళ్ల నాటివి కావడంతో సర్వీస్ కాలం పూర్తయింది. దీంతో కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.

అమ్మను ఒంటరిగా పంపలేకపోయాడు.. మరణంలోనూ తోడొచ్చిన కన్నకొడుకు..! నిమిషాల వ్యవధిలో..

అమ్మను ఒంటరిగా పంపలేకపోయాడు.. మరణంలోనూ తోడొచ్చిన కన్నకొడుకు..! నిమిషాల వ్యవధిలో..

అమ్మకు అనారోగ్యం.. తన కళ్ల ముందే ఆమె పరిస్థితి విషమించడాన్ని ఆ హృదయం తట్టుకోలేకపోయింది. తల్లికి ఏమవుతుందోనన్న తీవ్ర మనోవేదన, గుండె కోతతో ఆ కన్న కొడుకు నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగి కన్నుమూశాడు. అటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ తల్లి ప్రాణం కూడా అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇలా నిమిషాల వ్యవధిలో తల్లి, కొడుకు ఇద్దరూ మృతి చెందిన అత్యంత దయనీయమైన, గుండెలవిసే ఉదంతం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో చోటుచేసుకుంది.

Yanam: యానాం గోదావరిలో  కానాగంత చేపలకు ఏమైంది.. ఎందుకు ఇలా..

Yanam: యానాం గోదావరిలో కానాగంత చేపలకు ఏమైంది.. ఎందుకు ఇలా..

యానాం గౌతమి గోదావరిలో భారీ సంఖ్యలో కానాగంత చేప పిల్లలు మృతిచెంది ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో గోదావరిలో లవణీయత ఒక్కసారిగా తగ్గి, ఉప్పునీటిలో జీవించే కానాగంత చేపలు మృతిచెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు కారణాలపై స్పష్టత కోసం నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని స్థానికులు, మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.

వానరసేన వేషధారణలో కోటి తలంబ్రాల మహాయజ్ఞం.. రామనామంతో వరి విత్తనాల సాగుకు శ్రీకారం

వానరసేన వేషధారణలో కోటి తలంబ్రాల మహాయజ్ఞం.. రామనామంతో వరి విత్తనాల సాగుకు శ్రీకారం

Crore Talambralu: తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాల మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు తదితర వానరసేన వేషధారణలో భక్తులు రామనామ స్మరణతో వరి విత్తనాలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం, అయోధ్య, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలకు పంపే తలంబ్రాల కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.

Watch: వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో

Watch: వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో పాముల సంచారం తీవ్ర కలకలం రేపింది. వాష్‌రూం, టికెట్ కౌంటర్ సమీపంలో పాములు కనిపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసి, పొదలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Kakinada: హోటల్‌కెళ్లి ఇష్టంగా పునుగులు తిన్నారు.. ఇంటికెళ్లిన కాసేపటికే.. ఇది పరిస్థితి

Kakinada: హోటల్‌కెళ్లి ఇష్టంగా పునుగులు తిన్నారు.. ఇంటికెళ్లిన కాసేపటికే.. ఇది పరిస్థితి

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గ్రామంలోని ఓ హోటల్‌ పునుగులు తిన్న సుమారు 50 మంది గ్రామస్తులు ఫుడ్‌ పాయిజన్ కారణంగా హాస్పిటల్‌కు పాలయ్యారు. హోట్‌లో పునుగులు తిన్న తర్వాత కడుపునొప్పితో బాధపడడంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు చికిత్స అందించారు కుటుంబ సభ్యులు.

Andhra: వాయమ్మో.. చేప రెండు లచ్చలు ఏంది మావ.. అక్కడే ఉంది అసలు కిటుకు..

Andhra: వాయమ్మో.. చేప రెండు లచ్చలు ఏంది మావ.. అక్కడే ఉంది అసలు కిటుకు..

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన 25 కిలోల కచిడి చేప చిక్కింది. రెండు నెలల వేట విరామం అనంతరం లభించిన ఈ చేపను హార్బర్‌లో జరిగిన వేలంలో పాలకొల్లుకు చెందిన వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు.

అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా మృతి చెందిన ముగ్గురు.. అసలేంజరిగిందంటే?

అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా మృతి చెందిన ముగ్గురు.. అసలేంజరిగిందంటే?

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు- రంగంపేట మధ్య ఘోర ప్రమాదం జరిగింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ టాటాఎస్ వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూళీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారీని హాస్పిటిల్‌కు తరలించారు.

Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

రెండు నెలల వేట విరామం అనంతరం సముద్రంలోకి వెళ్లిన అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. హార్బర్‌లో జరిగిన వేలంలో స్థానిక వ్యాపారి వాటిని రూ.1.50 లక్షలకు కొనుగోలు చేయగా, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత బాడీకి రీపోస్ట్‌మార్టం.. సంచలనం సృష్టిస్తున్న కేసు

పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత బాడీకి రీపోస్ట్‌మార్టం.. సంచలనం సృష్టిస్తున్న కేసు

తూర్పుగోదావరి జిల్లాలో రెండు నెలల క్రితం మరణించిన ఓ గర్భిణీ మృతి కేసు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా మరణానికి ముందు భర్తతో జరిగిన ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్లు వెలుగులోకి రావడంతో ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషంపై వారు పోలీసులను ఆశ్రయించగా.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని సైతం వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. దీంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..

Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..

నాలుగు రోజులయింది.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి. ఎక్కడ ఉందో.. ఎలా ఉందోనని.. తల్చుకుంటూ కన్నతల్లి గుండె చెరువవుతోంది. కళ్ల ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు.. తోటలు జల్లెడపడుతున్నారు. ఎక్కడా పాప కాన రావడం లేదు. ఇక జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్కను అధికారులు బంధించారు. అదిచ్చే సిగ్నల్స్ ఏంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంతా.

Andha News: కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన పెట్‌డాగ్..

Andha News: కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన పెట్‌డాగ్..

వెంట వెళ్లిన కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. మరి జాహ్నవి జాడేది. కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్‌ జాహ్నవి మిస్సింగ్‌ కేసు సంచలనం రేపింది. పోలీసులు, SDRF టీమ్స్‌ సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.. జాహ్నవి ఎక్కడ ఉంది ? ఎలా వుందో తెలియక కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తు్నారు. ఎవరో కిడ్నాప్‌ చేసి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.