తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Kakinada: హోటల్కెళ్లి ఇష్టంగా పునుగులు తిన్నారు.. ఇంటికెళ్లిన కాసేపటికే.. ఇది పరిస్థితి
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గ్రామంలోని ఓ హోటల్ పునుగులు తిన్న సుమారు 50 మంది గ్రామస్తులు ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్కు పాలయ్యారు. హోట్లో పునుగులు తిన్న తర్వాత కడుపునొప్పితో బాధపడడంతో వారిని హాస్పిటల్కు తరలించారు చికిత్స అందించారు కుటుంబ సభ్యులు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 28, 2026
- 7:51 pm
Andhra: వాయమ్మో.. చేప రెండు లచ్చలు ఏంది మావ.. అక్కడే ఉంది అసలు కిటుకు..
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన 25 కిలోల కచిడి చేప చిక్కింది. రెండు నెలల వేట విరామం అనంతరం లభించిన ఈ చేపను హార్బర్లో జరిగిన వేలంలో పాలకొల్లుకు చెందిన వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 24, 2026
- 1:11 pm
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా మృతి చెందిన ముగ్గురు.. అసలేంజరిగిందంటే?
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు- రంగంపేట మధ్య ఘోర ప్రమాదం జరిగింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ టాటాఎస్ వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూళీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారీని హాస్పిటిల్కు తరలించారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 23, 2026
- 9:21 am
Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది
రెండు నెలల వేట విరామం అనంతరం సముద్రంలోకి వెళ్లిన అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. హార్బర్లో జరిగిన వేలంలో స్థానిక వ్యాపారి వాటిని రూ.1.50 లక్షలకు కొనుగోలు చేయగా, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 22, 2026
- 10:13 am
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత బాడీకి రీపోస్ట్మార్టం.. సంచలనం సృష్టిస్తున్న కేసు
తూర్పుగోదావరి జిల్లాలో రెండు నెలల క్రితం మరణించిన ఓ గర్భిణీ మృతి కేసు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా మరణానికి ముందు భర్తతో జరిగిన ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్లు వెలుగులోకి రావడంతో ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషంపై వారు పోలీసులను ఆశ్రయించగా.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని సైతం వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు. దీంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- Pvv Satyanarayana
- Updated on: Jun 14, 2026
- 1:31 pm
Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..
నాలుగు రోజులయింది.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి. ఎక్కడ ఉందో.. ఎలా ఉందోనని.. తల్చుకుంటూ కన్నతల్లి గుండె చెరువవుతోంది. కళ్ల ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు.. తోటలు జల్లెడపడుతున్నారు. ఎక్కడా పాప కాన రావడం లేదు. ఇక జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్కను అధికారులు బంధించారు. అదిచ్చే సిగ్నల్స్ ఏంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంతా.
- Pvv Satyanarayana
- Updated on: Jun 11, 2026
- 11:04 am
Andha News: కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన పెట్డాగ్..
వెంట వెళ్లిన కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. మరి జాహ్నవి జాడేది. కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి మిస్సింగ్ కేసు సంచలనం రేపింది. పోలీసులు, SDRF టీమ్స్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.. జాహ్నవి ఎక్కడ ఉంది ? ఎలా వుందో తెలియక కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తు్నారు. ఎవరో కిడ్నాప్ చేసి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 10, 2026
- 10:08 pm
ఏపీలో మట్టా ఆదిలక్ష్మి.. కానీ ఖతార్లో.. 47 ఏళ్ల పాటు తమను తల్లిలా సాకినందుకు..
ఉపాధి కోసం ఖతార్ వెళ్లిన కోనసీమ మహిళ మట్టా ఆదిలక్ష్మి.. 47 ఏళ్లపాటు ఓ అరబ్ కుటుంబానికి సేవలందించి, వారి పిల్లలకు తల్లిగా మారింది. ఆమె మరణంతో భావోద్వేగానికి గురైన షేక్ కుటుంబ సభ్యులు తమ సొంత తల్లి సమాధి పక్కనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కదిలిస్తోంది.
- Pvv Satyanarayana
- Updated on: Jun 9, 2026
- 5:25 pm
నాన్న కోసం అడవిలోకి.. సీసీ కెమెరాలో చిన్నారి పరుగులు! ఆచుకీ తెలిపిన వారికి భారీ బహుమతి
కాకినాడ జిల్లాలో రెండేళ్ల ముక్కుపచ్చలారని చిన్నారి అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన, ఉత్కంఠ రేపుతోంది. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం గ్రామంలో చిన్నారి జ్ఞానేశ్వరి మాయమై మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడం మిస్టరీగా మారింది. అడవి, కొండల మధ్య దాగిన ఈ అదృశ్యం కేసులో సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
- Pvv Satyanarayana
- Updated on: Jun 9, 2026
- 8:38 am
Anasuya: తొలి తిరుపతిలో యాంకర్ అనసూయ.. శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న సినీనటి.. ఫోటోస్ వైరల్..
కాకినాడ జిల్లా పెద్దాపురం లో ప్రముఖ టీవీ యాంకర్, వర్తమాన సినీ హీరోయిన్ అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. స్తానిక శృంగార వల్లభ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా విజిటింగ్ లో భాగంగా పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి ని దర్శించుకున్నారు. అనసూయ భరద్వాజ్ కు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం ఫలికారు. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అనసూయకు వేద ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేస్తూ స్వామివారి ఫోటోను ప్రసాదాన్ని అనసూయకు అందజేశారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 5, 2026
- 12:36 pm
Viral: చల్లచల్లగా ఐస్క్రీమ్ తిందామనుకున్నాడు.. ఓపెన్ చేయగా.. కనిపించిన బల్లి.. చివరకు..
వేసవి ఎండల్లో చల్లగా ఐస్క్రీమ్ తిందామని కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. చాకోబార్ ఐస్క్రీమ్ సీల్ తొలగించగానే అందులో బల్లి కనిపించడంతో అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏపీ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఎర్రబోర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానికంగా తయారవుతున్న ఐస్క్రీమ్ల నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Pvv Satyanarayana
- Updated on: May 31, 2026
- 12:59 pm
ఇంక పెళ్ళిళ్లు ఎలా అవుతాయ్ సార్.. ట్రాఫిక్ పోలీసుల వద్ద కాబోయే అల్లుడి హిస్టరీ చెక్ చేసిన వ్యక్తి
Traffic Record Before Marriage: కాకినాడలో ఓ తండ్రి కాబోయే అల్లుడి కారు, బైక్ నంబర్లతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు, స్పీడింగ్ టికెట్లు, ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్ర ఉందా? అని తెలుసుకోవడం చర్చనీయాంశమైంది. “ట్రాఫిక్ చలానాలు ఎక్కువగా ఉంటే పెళ్లి చేయను” అన్నదే ఆయన ఆలోచనట.
- Pvv Satyanarayana
- Updated on: May 30, 2026
- 9:21 am