తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Video: ఛీ వ్యాక్.. ఇది చూస్తే తిన్నది కూడా బయటికొస్తుంది.. మీరు వాడుతున్న నూనె మంచిదేనా..
కాకినాడ జిల్లా ధర్మవరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నూనె ముఠా గుట్టు రట్టయింది. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్తో విషతుల్యమైన వంట నూనె తయారు చేస్తున్న కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. 840 కిలోల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరమైన ఈ అక్రమ దందాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
- Pvv Satyanarayana
- Updated on: Jan 27, 2026
- 6:35 pm
ఢిల్లీ రిపబ్లిక్ వేడుకల్లో కోనసీమ కళాకారులు.. ఆకట్టుకున్న ప్రదర్శన..
జనవరి 26,2026 న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశం మొత్తం ఘనంగా జరుపుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకలు ఆకాశాన్ని అంటాయి. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది కళాకారులు ఢిల్లీ చేరుకొని, తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన కోనసీమా జిల్లా ముక్కామల కళాకారుల బృందం తన ప్రదర్శనతో ఆకట్టుకుంది.
- Pvv Satyanarayana
- Updated on: Jan 29, 2026
- 7:00 am
Andhra: పండగ పూట ఈ మాట్లాడే చిలుక భలే పని చేసింది.. పీఎస్కే చేరిన పంచాయతీ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కాట్రేనికోన మండలానికి చెందిన బండారు దొరబాబు అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెంపుడు చిలుక ‘చార్లి’ కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్లో రూ.80 వేల వెచ్చించి కొనుగోలు చేసిన ఈ మాట్లాడే చిలుక సంక్రాంతి రోజున పంజరం శుభ్రం చేసే సమయంలో ఎగిరిపోయింది.
- Pvv Satyanarayana
- Updated on: Jan 23, 2026
- 10:19 pm
రికార్డింగ్ డాన్సర్లతో స్థానిక నేత అనుచిత ప్రవర్తన.. ఏపీ మహిళా కమిషన్ సీరియస్..!
సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాల్లో కోడిపందాలు, రికార్డింగ్ డాన్సులు జరగడం ఆనవాయితీగా మారిన విషయం తెలిసిందే..! అయితే ఈ కార్యక్రమాల్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు అప్పుడప్పుడూ వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఒక రికార్డ్ డాన్స్ కార్యక్రమం తీవ్ర చర్చకు దారి తీసింది.
- Pvv Satyanarayana
- Updated on: Jan 20, 2026
- 8:54 pm
Konaseema: దేశంలో ఇంకా లాంచ్ కానీ టెస్లా ట్రక్ కోనసీమకు వచ్చింది.. అందులో వచ్చింది ఎవరంటే..?
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అరుదైన దృశ్యం కనిపించింది. ఫ్యూచరిస్టిక్ లుక్తో ఉన్న టెస్లా సైబర్ ట్రక్ అమలాపురం గడియార స్తంభం సెంటర్లో సందడి చేసింది. చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య రామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తారింటికి టెస్లా సైబర్ ట్రక్లో రావడంతో జనం ఆసక్తిగా తిలకించారు.
- Pvv Satyanarayana
- Updated on: Jan 16, 2026
- 8:57 pm
సంక్రాంతి పండగ వేళ పెను ప్రమాదం.. రోడ్డున పడ్డ 46 కుటుంబాలు.. సరుకులు కొందామని వెళితే..
అడవిని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే గిరిజనులు వారు. నేటికీ పూరిళ్లలోనే 46 కుటుంబాలకు చెందిన 120 మంది జీవనం సాగిస్తున్నారు. ప్రమాదం వారిని నిరాశ్రయులను చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కొండల్లోని ప్రశాంత మైన గిరిజన పల్లె సార్లంక(తండా)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి బూడిద తప్ప ఏమీ మిగల్లేదు.
- Pvv Satyanarayana
- Updated on: Jan 14, 2026
- 10:04 am
చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?
తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ధనుర్మాసం పురస్కరించుకుని మహిళలు 160 రకాల పిండి వంట కాలతో శ్రీ గోదాదేవి అమ్మ వారికి సారె సమర్పించారు. లోక కళ్యాణార్థం, శ్రీ వాసవీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ గత నెల 14 వ తేది నుంచి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లోమహిళలు వివిధ రకాలు గా పూజలు నిర్వహిస్తున్నారు.
- Pvv Satyanarayana
- Updated on: Jan 11, 2026
- 6:16 pm
31 ఏళ్ల పాశర్లపూడి ఘటనను గుర్తు చేసిన మలికిపురం లీకేజీ.. మళ్లీ అదే సీన్ రిపీట్!
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో మరో బ్లో ఔట్ పెను సంచలనానికి దారితీసింది. అయితే బ్లో ఔట్ అనగానే మూడు దశాబ్దాల నాటి ప్రమాదం గుర్తుకొస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులోలేని రోజుల్లో అక్కడి ప్రజలకు 65 రోజుల తరువాత గాని ఉపశమనం కలగలేదు. ఇంకో మూడు రోజులు గడిస్తే అంటే జనవరి 8th నాటికి ఆనాటి పాశర్లపూడి బ్లో ఔట్ కు 31 ఏళ్ళు నిండుతాయి..
- Pvv Satyanarayana
- Updated on: Jan 6, 2026
- 4:39 pm
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ధర ఎంతంటే..
అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లా సమీపంలో ఉన్న యానాం పరిధి దరియాలతిప్ప వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి గాలానికి 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల ఇంత పెద్ద పండుగప్ప చిక్కలేదని స్థానికులు తెలిపారు. చెరువుల్లో పెంచే పండుగప్ప చేపలు గరిష్ఠంగా ఆరు కిలోల వరకే పెరుగుతాయి.
- Pvv Satyanarayana
- Updated on: Jan 5, 2026
- 1:04 pm
Kadiyam Nursery: అందమైన మొక్కలతో ముస్తాబైన కడియం నర్సరీ.. చూశారంటే కొనక తప్పరు!
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందినవని చెప్పుకోవచ్చు. అనేక రాష్ట్రాల నుండి ఈ నర్సరీలకు వచ్చి అరుదుగా దొరికే అనేక రకాల మొక్కలు తీసుకువెళ్లి వారి నివాసాల్లో పెంచుకుంటారు జనాలు. నిజానికి ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. అలాంటి నర్సరీని ఇప్పుడు లక్ష మొక్కలతో రెడీ చేశారు నిర్వాహలకులు.. ఇంకెందుకు లేటు అక్కడ ఏఏ మొక్కలున్నాయో చూసేద్దాం పదండి.
- Pvv Satyanarayana
- Updated on: Jan 1, 2026
- 7:07 pm
Mysterious Fish: మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?
అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి నదిలో ఓ మత్స్యకారుడికి అరుదైన సూకర్ ఫిష్ వలకు చిక్కింది. గతంలో ఎన్నడూ చూడని ఈ వింత చేపను చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారుడు అధికారులను సంప్రదించాడు. నీటిలో నాచును తినే ఈ చేప మంచి, ఉప్పునీటిలో జీవిస్తుంది. దీని ప్రత్యేక లక్షణాల గురించి నిపుణులు వివరించారు.
- Pvv Satyanarayana
- Updated on: Dec 30, 2025
- 1:31 pm
పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగలు.. ఏకంగా నగరం నడిరోడ్డులో హల్చల్..!
కాకినాడ జిల్లాలో ముఖ్య కూడలిలోనే దొంగలు రెచ్చిపోయారు. కత్తిపూడిలో పరిసర ప్రాంతాల్లో నిత్యం చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం (డిసెంబర్ 29) తెల్లవారుజామున దొంగల ముఠా హల్చల్ చేసింది. రెండుచోట్ల చోరీలకు పాల్పడగా మరో మూడుచోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చేపట్టారు.
- Pvv Satyanarayana
- Updated on: Dec 30, 2025
- 1:21 pm