తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..
నాలుగు రోజులయింది.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి. ఎక్కడ ఉందో.. ఎలా ఉందోనని.. తల్చుకుంటూ కన్నతల్లి గుండె చెరువవుతోంది. కళ్ల ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు.. తోటలు జల్లెడపడుతున్నారు. ఎక్కడా పాప కాన రావడం లేదు. ఇక జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్కను అధికారులు బంధించారు. అదిచ్చే సిగ్నల్స్ ఏంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంతా.
- Pvv Satyanarayana
- Updated on: Jun 11, 2026
- 11:04 am
Andha News: కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన పెట్డాగ్..
వెంట వెళ్లిన కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. మరి జాహ్నవి జాడేది. కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి మిస్సింగ్ కేసు సంచలనం రేపింది. పోలీసులు, SDRF టీమ్స్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.. జాహ్నవి ఎక్కడ ఉంది ? ఎలా వుందో తెలియక కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తు్నారు. ఎవరో కిడ్నాప్ చేసి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 10, 2026
- 10:08 pm
ఏపీలో మట్టా ఆదిలక్ష్మి.. కానీ ఖతార్లో.. 47 ఏళ్ల పాటు తమను తల్లిలా సాకినందుకు..
ఉపాధి కోసం ఖతార్ వెళ్లిన కోనసీమ మహిళ మట్టా ఆదిలక్ష్మి.. 47 ఏళ్లపాటు ఓ అరబ్ కుటుంబానికి సేవలందించి, వారి పిల్లలకు తల్లిగా మారింది. ఆమె మరణంతో భావోద్వేగానికి గురైన షేక్ కుటుంబ సభ్యులు తమ సొంత తల్లి సమాధి పక్కనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కదిలిస్తోంది.
- Pvv Satyanarayana
- Updated on: Jun 9, 2026
- 5:25 pm
నాన్న కోసం అడవిలోకి.. సీసీ కెమెరాలో చిన్నారి పరుగులు! ఆచుకీ తెలిపిన వారికి భారీ బహుమతి
కాకినాడ జిల్లాలో రెండేళ్ల ముక్కుపచ్చలారని చిన్నారి అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన, ఉత్కంఠ రేపుతోంది. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం గ్రామంలో చిన్నారి జ్ఞానేశ్వరి మాయమై మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడం మిస్టరీగా మారింది. అడవి, కొండల మధ్య దాగిన ఈ అదృశ్యం కేసులో సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
- Pvv Satyanarayana
- Updated on: Jun 9, 2026
- 8:38 am
Anasuya: తొలి తిరుపతిలో యాంకర్ అనసూయ.. శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న సినీనటి.. ఫోటోస్ వైరల్..
కాకినాడ జిల్లా పెద్దాపురం లో ప్రముఖ టీవీ యాంకర్, వర్తమాన సినీ హీరోయిన్ అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. స్తానిక శృంగార వల్లభ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా విజిటింగ్ లో భాగంగా పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి ని దర్శించుకున్నారు. అనసూయ భరద్వాజ్ కు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం ఫలికారు. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అనసూయకు వేద ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేస్తూ స్వామివారి ఫోటోను ప్రసాదాన్ని అనసూయకు అందజేశారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 5, 2026
- 12:36 pm
Viral: చల్లచల్లగా ఐస్క్రీమ్ తిందామనుకున్నాడు.. ఓపెన్ చేయగా.. కనిపించిన బల్లి.. చివరకు..
వేసవి ఎండల్లో చల్లగా ఐస్క్రీమ్ తిందామని కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. చాకోబార్ ఐస్క్రీమ్ సీల్ తొలగించగానే అందులో బల్లి కనిపించడంతో అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏపీ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఎర్రబోర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానికంగా తయారవుతున్న ఐస్క్రీమ్ల నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Pvv Satyanarayana
- Updated on: May 31, 2026
- 12:59 pm
ఇంక పెళ్ళిళ్లు ఎలా అవుతాయ్ సార్.. ట్రాఫిక్ పోలీసుల వద్ద కాబోయే అల్లుడి హిస్టరీ చెక్ చేసిన వ్యక్తి
Traffic Record Before Marriage: కాకినాడలో ఓ తండ్రి కాబోయే అల్లుడి కారు, బైక్ నంబర్లతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు, స్పీడింగ్ టికెట్లు, ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్ర ఉందా? అని తెలుసుకోవడం చర్చనీయాంశమైంది. “ట్రాఫిక్ చలానాలు ఎక్కువగా ఉంటే పెళ్లి చేయను” అన్నదే ఆయన ఆలోచనట.
- Pvv Satyanarayana
- Updated on: May 30, 2026
- 9:21 am
హనుమంతుడి కళ్యాణం జరుపుకునే ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Kotipally Hanuman Temple: అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం కోటిపల్లి గోదావరి గట్టున ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సువర్చలా దేవి సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా ఆంజనేయస్వామి ఒక్కరే దర్శనమిచ్చే ఆలయాలకంటే భిన్నంగా ఇక్కడ సతీసమేతంగా దర్శనమివ్వడం. ఇది భక్తులకు అరుదైన విశిష్ట అనుభూతిని కలిగిస్తుంది.
- Pvv Satyanarayana
- Updated on: May 14, 2026
- 12:17 pm
పుట్టెడు దుఃఖంలోనూ మహోన్నత సేవ.. కుటుంబ పెద్ద మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం!
కుటుంబ పెద్ద మృతి అనంతరం పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల విద్య అభ్యాసం కోసం రంగరాయ మెడికల్ కాలేజీకి ఓ కుటుంబం దానం చేసింది. సాంప్రదాయలు దాటి మృతదేహాన్ని వైద్య విద్య కోసం త్యాగం చేసిన ఆదర్శప్రాయుడు బిక్కిన వీర్రాజు భౌతిక కాయాన్ని సందర్శించిన వందలమంది జనాలు. మరణ అనంతరం తమ దేహాన్ని ఉపయోగించుకోమని దేహదానం చేసే ఆదర్శవాదులకు పునర్జన్మరాహిత్య ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం..
- Pvv Satyanarayana
- Updated on: May 13, 2026
- 4:50 pm
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..
Sri veera venkata satyanarayana swamy temple annavaram: కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.
- Pvv Satyanarayana
- Updated on: Apr 28, 2026
- 2:03 pm
వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!
అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామివారికి స్వర్ణ పూతరేకులను ఒక భక్తుడు అందజేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన (ఇడబుల్ గోల్డ్ ) పూతరేకులను స్వామివారికి సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.
- Pvv Satyanarayana
- Updated on: Apr 21, 2026
- 2:46 pm
Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్
గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఒక వ్యక్తికి డెలివరీ అయిందని OTP వచ్చినప్పటికీ సిలిండర్ అందకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన ఘటన కలకలం రేపుతోంది. .. .. .. ..
- Pvv Satyanarayana
- Updated on: Apr 17, 2026
- 10:00 pm