AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pvv Satyanarayana

Pvv Satyanarayana

Staff Reporter (Kakinada) - TV9 Telugu

vvsatyanarayana.pothuraju@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
గోదావరి తీరంలో వేలాది వలస పక్షుల సందడి.. నత్తకొంగలకు సురక్షిత నిలయంగా మారిన మధ్యలంక!

గోదావరి తీరంలో వేలాది వలస పక్షుల సందడి.. నత్తకొంగలకు సురక్షిత నిలయంగా మారిన మధ్యలంక!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బి.దొడ్డవరం మధ్యలంకకు వేలాది ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్‌లు వలస వచ్చాయి. తుమ్మ చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చేస్తున్న ఈ పక్షులను స్థానికులు నత్తకొంగలుగా పిలుస్తున్నారు. గోదావరిలో లభించే నత్తలు వీటి ప్రధాన ఆహారం. తుమ్మ చెట్ల ముళ్లు పాముల నుంచి పిల్లలను రక్షించడంతో ఈ చెట్లనే ఆవాసంగా ఎంచుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. వేట నుంచి వీటిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Andhra News: చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు.. చివరకు

Andhra News: చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు.. చివరకు

అమ్మాయి విషయంలో చిన్నగా మొదలైన వివాదం.. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య వైరాన్ని పెంచింది. అదే చివరకు ఒకరి ప్రాణం తీసే వరకు తెచ్చింది. తనతో సన్నిహితంగా ఉండే అమ్మాయితో తన గురించి చెడుగా చెప్పాడనే కోపంతో సాయికిరణ్ అనే యువకుడు.. తన స్నేహితుడైన సతీష్‌ రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కాకినాడ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Watch: ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్‌లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!

Watch: ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్‌లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!

కాకినాడలోని ఓ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ల చోరీ వివాదంపై నర్సింగ్ విద్యార్థినులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. హాస్టల్‌లో విద్యార్థినుల నడుమ చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు పరస్పర దాడులకు దారితీసింది. సమాచారం అందుకున్న సర్పవరం పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.. చివరకు..

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీ! ఎక్కడంటే..?

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీ! ఎక్కడంటే..?

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అభిమానులు వినూత్నంగా నిర్వహించారు. మెగా యూత్ ఫోర్స్ కో కన్వీనర్ కందాల చంటి ఆధ్వర్యంలో 156 అడుగుల పొడవైన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అభిమానుల ర్యాలీని చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివచ్చారు.

Lotus cultivation: ఎకరం వరి చేలలో తామర సాగు.. భారీగా లాభాలు అర్ధిస్తున్న తండ్రి కొడుకులు

Lotus cultivation: ఎకరం వరి చేలలో తామర సాగు.. భారీగా లాభాలు అర్ధిస్తున్న తండ్రి కొడుకులు

Lotus cultivation: ఏటా వరిపంటలో వచ్చే నష్టాల నుంచి తప్పించుకునేందుకు పంట మార్పిడి చేయాలనుకున్నానని రైతు యాళ్ల వీరబాబు తెలిపారు. మా అబ్బాయి సలహాతో 108 రేకుల తామరపూల సాగు గురించి తెలుసుకున్నాను. విత్తనాలు తీసుకువచ్చి ఎకరం పొలంలో సాగు చేశాను. పూలు బాగా వికసిస్తున్నాయి..

అరటి పంటకు శ్రావణ శోభ..  రైతుల్లో ఆనందం

అరటి పంటకు శ్రావణ శోభ.. రైతుల్లో ఆనందం

గత కొంతకాలంగా ఆర్థిక ఒడిదుడుకులతో అల్లాడిన అరటి వ్యాపారం ఊపందుకుంది. అరటికి అనూహ్య రీతిలో డిమాండ్ పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఓవైపు శ్రావణమాసం.. మరోవైపు పండుగలు.. అలాగే పెళ్లిళ్లు గృహప్రవేశాలు వంటి శుభముహూర్తాలుతో ఇక్కడి అరటి పంటకు డిమాండ్ ఏర్పడింది.

పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?

పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?

పెళ్లి రెండు అక్షరాలే అయినా ఇది ఇద్దరు వ్యక్తుల నూరేళ్లు జీవితానికి నాంది. ఇక ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారి మాత్రమే అవుతుంది. కానీ అక్కడ మాత్రం పెళ్లైన వారే రెండు సార్లు వివాహం చేసుకుంటారంట. కాగా, అసలు దీని వెనకున్న కథ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Andhra News: కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా?

Andhra News: కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా?

కాకినాడ చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి దాదాపు రెండు నెలలు కావోస్తోంది.. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు కానరాక కన్నీళ్లు పెడుతున్న తల్లిదండ్రులకు ఊరటకల్పించేలా బంధువులు చేసిన ఓ చిన్న ప్రయత్నం ఇప్పుడు వారి ముఖంలో చిరు సంతోషాన్ని తెచ్చింది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రూ.3.75 లక్షలకు పుంగనూరు గిత్త.. చెన్నైలో జాతి అభివృద్ధి కోసం అంబాజీపేట నుంచి కొనుగోలు!

రూ.3.75 లక్షలకు పుంగనూరు గిత్త.. చెన్నైలో జాతి అభివృద్ధి కోసం అంబాజీపేట నుంచి కొనుగోలు!

డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పుంగనూరు జాతి గిత్త అధిక ధరకు అమ్ముడైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత ధర పలకడం అంటే మాములు విషయం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుంగనూరు గిత్తరికార్డ్ బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి.

ఆ స్కూల్లో చదివేది ఒక్కడే.. అయినా 30 మందితో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు!

ఆ స్కూల్లో చదివేది ఒక్కడే.. అయినా 30 మందితో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు!

ఆ ఊరు మొత్తానికి ఒకే ఒక స్కూల్ అది కూడా మున్సిపల్ స్పెషల్ స్కూల్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏడు కాలువలు అనే గ్రామంలో సుమారు 1500 మంది ప్రజలు నివసిస్తుంటారు. ఆ ఊరు మునిసిపాలిటీలో ఉండడం కారణంగా గతంలో అక్కడ స్పెషల్ గా పాఠశాలను నిర్మించారు.

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండపైకి ఎక్కుతున్న నీరు.. ఆంధ్రాలో అద్భుతం..

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండపైకి ఎక్కుతున్న నీరు.. ఆంధ్రాలో అద్భుతం..

విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా నీరు కొండపైకి ఎక్కుతోంది. ఇది మాయ కాదు.. ఒక గ్రామీణ రైతు మేధస్సు. తూర్పుగోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన రైతు శ్రీనివాస్‌ రూపొందించిన హైడ్రో లిఫ్ట్ ర్యామ్‌ పంప్‌ ప్రవహించే నీటి శక్తిని ఉపయోగించి ఎత్తైన ప్రాంతాలకు నీటిని తరలిస్తోంది.

Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?

Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?

ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారుడి వలకు భారీ మండపీత చిక్కింది. ఏకంగా 1.4 కిలోల బరువున్న ఈ అరుదైన పీతను వేలంలో ఉప్పాడకు చెందిన కొండపల్లి శివ రూ.1,400లకు కొనుగోలు చేశాడు. సాధారణంగా కిలో బరువు వరకు ఉండే మండపీత 1.4 కిలోలు ఉండటం విశేషమని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.