తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
AP News: రూపాయి ఖర్చు లేదు.. ప్రయాసా లేదు.. ఇట్టా వెళ్లి.. అట్టా నచ్చిన చేప తెచ్చుకోవడమే
చేపలు ఇష్టంగా తినేవారికి ఇది కదా లక్కీ చాన్స్. పెద్దగా కష్ట పడాల్సిన పనిలేదు. రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. పాత చీర తీసుకుని వెళ్తే.. నచ్చిన సైజున్న చేపను పట్టుకుని.. ఎంచక్కా ఇంటికి వచ్చేయొచ్చు. ఎక్కడంటే..?
- Pvv Satyanarayana
- Updated on: Jul 20, 2024
- 1:23 pm
Watch Video: శభాష్ రా తెలుగోడా.. అంబానీ పెళ్లిలో అరుదైన గౌరవం..
అంబానీ ఇంట పెళ్లిని దేశమే కాదు.. ప్రపంచం అంతా కళ్లప్పగించి, ముక్కున వేలేసుకుని మరీ చూసింది. అంతేకాదు ఈ పెళ్లిలో దేశంలోని చాలామంది పండితులు, కళాకారులు తమ వంతు పాత్ర పోషించారు. అంబానీ మ్యారేజ్లో తెలుగు సందడి కూడా ఉంది. మన పండితులు, కళాకారుల ప్రతిభకు ముకేష్ అంబానీ కూడా ఆశ్చర్యపోయారట.
- Pvv Satyanarayana
- Updated on: Jul 18, 2024
- 9:56 pm
Watch Video: అభివృద్దిపై మంత్రి ఫోకస్.. దానికే తొలి ప్రధాన్యం ఇచ్చిన స్థానికులు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఉద్యాన వనం శిధిలావస్థకు చేరుకుంది. 2014 టిడిపి హయంలో పట్టణం మధ్యలో మంచి నీటి చెరువు వద్ద కోటిన్నర వ్యయంతో నిర్మించారు అధికారులు. చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనం గత ఐదు సంవత్సరాల నుండి మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిలర్ల నిర్లక్ష్యంతో ఐ లవ్ అమలాపురం కాస్త ఐ హేట్ అమలాపురంగా మారిందంటున్నారు స్థానికులు.
- Pvv Satyanarayana
- Updated on: Jul 15, 2024
- 7:09 pm
పవన్ కల్యాణ్పైనే సముద్రమంత ఆశ… ఉప్పాడ గ్రామం గుండె కోతను తీరుస్తారని …!
ఇప్పటి వరకు ఆ ఊరి కథను.. చెప్పని పేపరు లేదు... చూపించని టీవీ లేదు... వైరల్ చెయ్యని సోషల్ మీడియా లేదు... బట్ ఏం లాభం... ఇప్పటి వరకు ఆ ఊరి సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.
- Pvv Satyanarayana
- Updated on: Jul 15, 2024
- 1:13 pm
Watch Video: పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్.. భయాందోళనలో విద్యార్థులు..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి నేలపడడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ విద్యార్థులు ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూనవరం మండలంలోని పెదార్కూరు పంచాయతీ పరిధిలోని బండారు గూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది.
- Pvv Satyanarayana
- Updated on: Jul 10, 2024
- 9:43 am
Watch Video: హెడ్ లైట్లో నల్లని ఆకారం.. కట్ చేస్తే బైక్ సర్వీసింగ్లో బయటపడ్డ పాము..
తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో ఓ పాము బైక్ లైట్ డూమ్లో తలదాచుకుని స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. బైక్ రిపేర్ చేస్తుండగా హెడ్ లైట్కు చుట్టుకుని మెకానిక్ కంటపడింది. దీంతో బెంబేలెత్తిన మెకానిక్ ఒక్కసారిగా భయంతో బైక్ను కింద పడేసి పరుగు తీసాడు. అటుగా వెళ్తున్న స్థానిక యువకులు పామును బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సుమారు 30 నిముషాల పాటు హెడ్ డూమ్లో నుండి బయటకు తీసేందుకు కర్రలతో పొడిచారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అందరూ ఆందోళన చెందారు.
- Pvv Satyanarayana
- Updated on: Jul 4, 2024
- 12:29 pm
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూలై ఒకటి నుంచి మూడు రోజులు పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేయనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనపై ఆ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటన చేసే ప్రాంతాలను పరిశీలించింది.
- Pvv Satyanarayana
- Updated on: Jun 30, 2024
- 5:10 pm
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సినిమా హిట్ అవ్వాలని పిఠాపురంలో పెద్దెత్తున పూజలు, హోమాలు
భారీ ఖర్చుతో నిర్మాణమైన కల్కి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాదగయలో కల్కి సినిమా విజయం కోసం ప్రత్యేక పూజలు ,హోమాలు చేపట్టారు.. ప్రముఖ దత్త ఉపాసకుడు లక్ష్మీనారాయణ దత్త, పాదగయ పుణ్యక్షేత్రంలో దత్త హోమం నిర్వహించారు.. పిఠాపురంలో దత్త పూజలు నిర్వహించి విడుదల అయిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి.
- Pvv Satyanarayana
- Updated on: Jun 26, 2024
- 9:15 pm
Brahma Kamalam: ఉప్పలగుప్తంలో విరబూసిన బ్రహ్మ కమలం.. మహాశివుడికి నైవేధ్యంగా ప్రత్యేక పూజలు
మహాశివునికి అత్యంత ప్రితిప్రతమైనవి బ్రహ్మ కమలం పుష్పాలు. అందుకే రాత్రి సమయం కావస్తున్నప్పటికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మకమలం పూలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇంట్లో పూసిన బ్రహ్మ కమలం పుష్పలను మహశివునికి అందించడం ఎంతో అదృష్టంగాను పుణ్యపలంగా భావిస్తున్నామని శేషగిరి రావు దంపతులు పేర్కొన్నారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 25, 2024
- 1:01 pm
జల్సాలకు అలవాటు పడ్డ యువకులు.. చోరీ చేసిన వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా..
జల్సాలకు అలవాటు పడ్డ యువకులు తమ ఆర్థిక అవసరాలకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. బైక్లు దొంగతనాలు చేసి అదే బైక్లపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలం డొంకరాయిలో ఓ మైనర్ బాలుడితో సహా ఐదుగురు యువకులు గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 21, 2024
- 1:56 pm
Watch Video: ఘనంగా వన దేవతల జాతర.. అక్కడ ఆ ఘట్టమే కీలకం..
అల్లూరి సీతారామరాజు జిల్లా పిఆర్పురం మండలం రేకపల్లిలో వనదేవతల ఉత్సవం వైభవంగా జరిగింది. మేళతాళాల, డప్పుల సందడి, భక్తుల జయజయధ్వానాలతో వనదేవతలు ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెపై కొలువుదీరిన వేళ వేలాది మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. వన దేవతల ఆశీస్సులతో నిప్పులగుండాన్ని తొక్కడానికి పోటీపడ్డారు. నాయకపోడు, కొండరెడ్లు సంయుక్తంగా రెండేళ్లకో సారి ఈ జాతర 10 రోజులపాటు నిర్వహిస్తారు. చివరి మూడురోజుల్లో భక్తులు ఎక్కువగా వస్తారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 19, 2024
- 9:40 pm
ఇది కదా లక్ అంటే.. చేపల కోసం వల వేసిన జాలరి.. ఎంత లాగినా పైకి రాకపోవడంతో..
కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోనెం, నెమలి కోనెం తదితర రకాల చేపలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోనెం అనే భారీ చేప లభ్యం కావడంతో దానిని ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు శ్రమించాల్సి వచ్చింది. క్రేన్ సాయంతో కుంభాభిషేకం రేవుకు భారీ చెపను తరలించారు. మత్స్యకారులు వేలం పాట నిర్వహించగా రూ.36 వేలు ధర పలికింది. చేపల వేట విరామం అనంతరం భారీ చేపలు చిక్కడంతో స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Pvv Satyanarayana
- Updated on: Jun 19, 2024
- 6:47 pm