AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pvv Satyanarayana

Pvv Satyanarayana

Staff Reporter (Kakinada) - TV9 Telugu

vvsatyanarayana.pothuraju@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
తెల్లారేసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!

తెల్లారేసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దంపతులిద్దరూ దివ్యాంగులు కావడంతో ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Andhra Pradesh: డీజిల్ లేక అంబులెన్స్ బంద్.. ఆస్పత్రిలోనే చిన్నారి మృతి.. పాపం కదా..

Andhra Pradesh: డీజిల్ లేక అంబులెన్స్ బంద్.. ఆస్పత్రిలోనే చిన్నారి మృతి.. పాపం కదా..

అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మెరుగైన వైద్య చికత్స కోసం వేరే ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన పోలవరం జిల్లా చింతూరులో చోటుచేసకుంది. దీంతో బంధువులు ఆప్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. అంబులెన్స్ రాకపోడంతోనే మృతి చెందినట్లు ఆరోపిస్తున్నాయి.

100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు

100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు

ఆ గ్రామం ఓ రంగస్థలం.. కళాకారులకు పుట్టినిల్లు.. వేషాలు వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకునే గ్రామస్తులు.మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్మవార్లకు మొక్కుకుంటే ఏ కోడినో..మేకనో..కొబ్బరికాయ కొట్టడం మొక్కుకోవడం సర్వసాధారణం,కానీ అవేవీ కాకుండా వాటన్నిటికీ భిన్నంగా ఆ గ్రామంలో అమ్మవారికి మాత్రం ప్రతి ఏడాది ఆషాడ మాసంలో జరిగే జాతరలో వేషాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ గ్రామం నుండి ఏ రాష్ట్రానికి ఏ స్టేట్ కి వెళ్లిన జాతర సమయానికి వచ్చి మొక్కులు చెల్లించుకోవాల్సిందే,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మోదు కొండమ్మ అమ్మవారి జాతరలో వింతగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆ ఊరి ఆచారం.

ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

కాకినాడ సమీపంలోని కోరంగి మడ అడవుల్లో స్పీడ్ బోట్ షికారు పర్యాటకుల ను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే అద్భుత అనుభూతిని అందిస్తోంది.గోదావరి డెల్టాలో విస్తరించిన ఈ మడ అడవులు జీవ వైవిధ్యాని కి నిలయంగా నిలిచాయి. స్పీడ్ బోట్‌లో ప్రయాణిస్తూ పచ్చని మడ చెట్లు, ప్రశాంతమైన నీటి కాలువలు,వివిధ రకాల పక్షులను దగ్గరగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్క వాక్‌వే,వాచ్ టవర్ కూడా సందర్శకుల ను విశేషంగా ఆకట్టుకుంటాయి.

సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే

సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే

రాజమండ్రిలోని దేవి చౌక్ జగన్నాథ స్వామి ఆలయం తొలి ఏకాదశి రోజున మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. సంవత్సరానికి ఒకసారి తెరిచే ఈ ప్రత్యేకమైన ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తాతల కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయం ప్రకారం, భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, అశేష భక్తితో ఆశీస్సులు పొందుతారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక విశిష్ట పుణ్యక్షేత్రం.

తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం.. విద్యార్థిని అద్భుత ప్రతిభకు ఫిదా!

తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం.. విద్యార్థిని అద్భుత ప్రతిభకు ఫిదా!

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో ఆకుపై మహావిష్ణువు ప్రతిరూపం చిత్రాన్ని రూపకల్పన చేశారు ఇదే గ్రామానికి చెందిన బద్దిరాజు లక్ష్మి సుప్రజా పార్వతి. ఏకాదశి రోజు రావి ఆకుపై ఓ యువతో విష్ణుమూర్తి చిత్రాన్ని రూపొందించింది. మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి.

ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమ.. చంద్రబాబు, పవన్ ఫోటోలకు పాలాభిషేకం

ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమ.. చంద్రబాబు, పవన్ ఫోటోలకు పాలాభిషేకం

Talliki Vandanam Scheme: అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలకు 'తల్లికి వందనం' పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.60 వేల సాయం జమైంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు వారి ఫోటోలకు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు.

Andhra Pradesh: ఎన్నో ఏళ్ల చరిత్ర.. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. నేడు పనులకు శ్రీకారం

Andhra Pradesh: ఎన్నో ఏళ్ల చరిత్ర.. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. నేడు పనులకు శ్రీకారం

సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ పనునలు ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న గేట్లు 50 ఏళ్ల నాటివి కావడంతో సర్వీస్ కాలం పూర్తయింది. దీంతో కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.

అమ్మను ఒంటరిగా పంపలేకపోయాడు.. మరణంలోనూ తోడొచ్చిన కన్నకొడుకు..! నిమిషాల వ్యవధిలో..

అమ్మను ఒంటరిగా పంపలేకపోయాడు.. మరణంలోనూ తోడొచ్చిన కన్నకొడుకు..! నిమిషాల వ్యవధిలో..

అమ్మకు అనారోగ్యం.. తన కళ్ల ముందే ఆమె పరిస్థితి విషమించడాన్ని ఆ హృదయం తట్టుకోలేకపోయింది. తల్లికి ఏమవుతుందోనన్న తీవ్ర మనోవేదన, గుండె కోతతో ఆ కన్న కొడుకు నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగి కన్నుమూశాడు. అటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ తల్లి ప్రాణం కూడా అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇలా నిమిషాల వ్యవధిలో తల్లి, కొడుకు ఇద్దరూ మృతి చెందిన అత్యంత దయనీయమైన, గుండెలవిసే ఉదంతం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో చోటుచేసుకుంది.

Yanam: యానాం గోదావరిలో  కానాగంత చేపలకు ఏమైంది.. ఎందుకు ఇలా..

Yanam: యానాం గోదావరిలో కానాగంత చేపలకు ఏమైంది.. ఎందుకు ఇలా..

యానాం గౌతమి గోదావరిలో భారీ సంఖ్యలో కానాగంత చేప పిల్లలు మృతిచెంది ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో గోదావరిలో లవణీయత ఒక్కసారిగా తగ్గి, ఉప్పునీటిలో జీవించే కానాగంత చేపలు మృతిచెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు కారణాలపై స్పష్టత కోసం నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని స్థానికులు, మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.

వానరసేన వేషధారణలో కోటి తలంబ్రాల మహాయజ్ఞం.. రామనామంతో వరి విత్తనాల సాగుకు శ్రీకారం

వానరసేన వేషధారణలో కోటి తలంబ్రాల మహాయజ్ఞం.. రామనామంతో వరి విత్తనాల సాగుకు శ్రీకారం

Crore Talambralu: తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాల మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు తదితర వానరసేన వేషధారణలో భక్తులు రామనామ స్మరణతో వరి విత్తనాలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం, అయోధ్య, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలకు పంపే తలంబ్రాల కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.

Watch: వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో

Watch: వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో పాముల సంచారం తీవ్ర కలకలం రేపింది. వాష్‌రూం, టికెట్ కౌంటర్ సమీపంలో పాములు కనిపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసి, పొదలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.