Andhra Pradesh: ఇంతఘోరమా.. రెండ్రోజులుగా ఇంటిముందు తండ్రి శవం.. ఆస్తికోసం వారసుల పోట్లాట..

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో అమాయవీయ ఘటన చోటు చేసుకుంది. ఇది స్థానికంగా సంచలనంగా మారింది. ఆస్తికోసం కన్న తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్నారు కన్నబిడ్డలు. ఈ వ్యవహారం ..

Andhra Pradesh: ఇంతఘోరమా.. రెండ్రోజులుగా ఇంటిముందు తండ్రి శవం.. ఆస్తికోసం వారసుల పోట్లాట..
Dead Body
Follow us

|

Updated on: Nov 26, 2022 | 1:20 PM

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో అమాయవీయ ఘటన చోటు చేసుకుంది. ఇది స్థానికంగా సంచలనంగా మారింది. ఆస్తికోసం కన్న తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్నారు కన్నబిడ్డలు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కార్వేటినగరంలోని అప్పాచారి వీధిలో ఓ ఇంటి ముందు గత రెండు రోజులుగా మృతదేహాం పడిఉన్న పరిస్థితి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆస్తి వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇంటి ముందు తండ్రి శవాన్ని పెట్టుకొని కొడుకులు, కూతుళ్ళు ఆస్తికోసం తగువులాడుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కార్వేటినగరానికి చెందిన గురవ మందడి(85) అనారోగ్యంతో సోమవారం రాత్రి చనిపోయాడు. ఈయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. 40 ఏళ్ల క్రితం మొదటి భార్య మృతి చెందడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు గురువ. ఇప్పుడు ఆయన కూడా చనిపోవడంతో తండ్రి పేరున ఉన్న 4 ఎకరాల పొలం, ఇంటి స్థలం కోసం ఇద్దరి భార్యల సంతానం మధ్య వివాదం రాజుకుంది. కోర్టులో కేసు అపరిష్కృతంగా ఉండడంతో.. తండ్రి మృతదేహానికి దహన సంస్కారాలు చేపట్టకుండా పంచాయతీ పెట్టారు కుటుంబ సభ్యులు. ఎట్టకేలకు పోలీసుల, గ్రామస్తుల జోక్యంతో రెండ్రోజుల తరువాత ఈ రోజు తండ్రి శవం దహనసంస్కారాలకు నోచుకుంది.

ఇవి కూడా చదవండి

ఇంటి ముందు వృద్ధుడి శవం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..