మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు.. 3AC టికెట్ రూ. 2 వేల 300
సుదూర ప్రయాణికులకు వందేభారత్ స్లీపర్ రైళ్లు శుభవార్త. కోల్కతా-గువాహటి మధ్య త్వరలో ప్రారంభం కానున్న ఈ రైళ్లు విమాన టిక్కెట్ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకొని ధరలు నిర్ణయించారు. గంటకు 180 కి.మీ. వేగంతో అధునాతన సదుపాయాలతో నడిచే ఈ రైళ్లు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు.
సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. తొలి రైలు కోల్కతా- గువాహటిల మధ్య ప్రధాని మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుంది. బెంగాల్- అస్సాం మధ్య నడిచే ఈ రైలు టికెట్ ధరలు.. విమాన టికెట్ ధరల కంటే తక్కువ. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ప్రకటన చేసారు. జనవరి 18, 19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండొచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి రూ.6 వేలు నుంచి 8 వేలు ఖర్చవుతోంది. వందేభారత్ స్లీపర్లో 3rd ఏసీ టికెట్ ధర ఫుడ్తో కలిపి సుమారు రూ.2,300, 2nd ఏసీ ధర సుమారు రూ. 3 వేలు, 1ఏసీ ధర సుమారు రూ.3,600 ఉంటుంది. మధ్యతరగతిని దృష్టిలోపెట్టుకొని టికెట్ ధరలు నిర్ణయించినట్లు మంత్రి. ఈ ఏడాది అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని సాధించగలిగింది. కోటా నుంచి నాగ్దా మధ్య ఫైనల్ పరీక్ష నిర్వహించగా ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలింజిన్లో ఉంచినా.. గరిష్ఠ వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం తొణకకపోవడాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పోస్ట్ చేసారు. ఈ రైల్లో 16 బోగీలుంటాయి. వీటిలో ఆకర్షణీయమైన ఏసీ స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, ఆధునిక మరుగుదొడ్లు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాహనదారులకు కేంద్రం శుభవార్త.. సరికొత్త రూల్ ఫిబ్రవరి 1 నుండి అమలు
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు
2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

