భారత రైల్వే
భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్సీటీసీలో సులభంగా టికెట్స్ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ అలర్ట్.. ఈ రైళ్లు రద్దు.. ఫుల్ డీటైల్స్ ఇవే..
తిరుపతి వైపు వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వేశాఖ పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. తమిళనాడులో యార్డ్ పనుల కారణంగా పలు రైళ్లను క్యాన్సిల్ చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం చాలామంది తిరుపతికి చేరుకుంటారు. రైళ్ల ద్వారా ఎక్కుమంది ప్రయాణిస్తారు.
- Venkatrao Lella
- Updated on: Jun 12, 2026
- 4:27 pm
Indian Railways: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాదిలోనే పరుగులు.. ఎప్పుడంటే..?
ఇండియాలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాదిలోనే మొట్టమొదటి రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
- Venkatrao Lella
- Updated on: Jun 11, 2026
- 3:49 pm
Indian Railways: రైళ్లల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం.. ఇది మీ కోసమే..
రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారా.. అయితే మీకో అలర్ట్. ట్రైన్లలో యాప్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్నారా.. ఇది మీ కోసమే. తాజాగా 14 అనధికార యాప్లపై రైల్వేశాఖ చర్యలు తీసుకుంది. వీటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించేందుకు ఫిర్యాదు చేసింది. దీంతో..
- Venkatrao Lella
- Updated on: Jun 10, 2026
- 9:09 pm
Lower Berth Tips: మీకు రైలులో లోయర్ బెర్త్ కావాలంటే ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!
IRCTC Lower Berth Tips: టిక్కెట్ కన్ఫర్మ్ అయితన తర్వాత కూడా మీకు పై బెర్త్ లభించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు సీనియర్ సిటిజన్లు, గర్భిణీ స్త్రీలు లేదా దివ్యాంగులతో ప్రయాణిస్తుంటే మీరు రైలులోని DTEని సంప్రదించి సహాయం కోరవచ్చు..
- Subhash Goud
- Updated on: Jun 10, 2026
- 10:27 am
రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ బుకింగ్కు కొత్త సిస్టమ్..!
ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ఆగస్టు నుంచి అత్యాధునిక రిజర్వేషన్ వ్యవస్థను అమల్లోకి తీసుకురానుంది. కొత్త సిస్టమ్తో లక్షలాది టికెట్లు నిమిషాల్లోనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సర్వర్ సమస్యలు తగ్గడంతో పాటు బుకింగ్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అలాగే ఏఐ ఆధారిత వెయిటింగ్ లిస్ట్ అంచనా సాధనం కూడా ప్రయాణికులకు ఉపయోగకరంగా మారుతోంది.
- Phani CH
- Updated on: Jun 10, 2026
- 10:12 am
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!
MMTS Trains Cancellation: వివిధ కారణాల వల్ల హైదరాబాద్లోని పలు ఎంఎంటీసీ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దు కానున్నాయో తెలుసుకుందాం.. అయితే ఎంఎంటీఎస్ లో ప్రయాణించే ప్రయాణికులు...
- Subhash Goud
- Updated on: Jun 9, 2026
- 5:40 pm
Indian Railways: 9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే బుల్లెట్ రైలు.. ఎప్పటి నుంచో తెలుసా?
Indian Railways: భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు కోసం ప్రభుత్వం ఒక కొత్త కాలపట్టికను విడుదల చేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం, సూరత్-బిలిమోరా మధ్య మొదటి 50 కిలోమీటర్ల మార్గాన్ని 2027లో ప్రజల కోసం తెరవనున్నారు. దీని తరువాత..
- Subhash Goud
- Updated on: Jun 9, 2026
- 5:23 pm
Indian Raiwlays: మీరు ఏజెంట్ల ద్వారా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా? ఈ మ్యాటర్ తెలిస్తే..
Indian Raiwlays: ఐఆర్సీటీసీ గతంలో ఒక AI-ఆధారిత ఆడిట్ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ దర్యాప్తు సమయంలో సుమారు 90 మిలియన్ల వినియోగదారుల ఖాతా కార్యకలాపాలను పరిశీలించారు. పెద్ద సంఖ్యలో ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. తదనంతరం, AIని ఉపయోగించి రెండవ దర్యాప్తు..
- Subhash Goud
- Updated on: Jun 9, 2026
- 4:44 pm
Indian Railways: నో వెయిటింగ్.. సెకన్లలోనే రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు.. రైల్వేశాఖ నుంచి కీలక అప్డేట్..
ప్రస్తుతం ఆన్లైన్లో రైల్వే టికెట్లను బుక్ చేసుకోవాలంటే రిజర్వేషన్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది. కానీ త్వరలో కొత్త సిస్టమ్ రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ అభివృద్ది చేస్తోంది. దీని వల్ల రైల్వే టికెట్లు అత్యంత వేగంగా బుక్ అవుతాయి. సిస్టమ్ క్రాష్ వంటి సమస్యలు ఉండవు.
- Venkatrao Lella
- Updated on: Jun 8, 2026
- 6:12 pm
Telangana: తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త.. రాష్ట్రంలో మెగా రైల్వే కారిడార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..
తెలంగాణకు మరో శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ పట్టాలెక్కనుంది. ఈ మేరకు డీపీఆర్ ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. గ్రీన్ సిగ్నల్ లభించాక పనులు మొదలుకానున్నాయి. ఐదేళ్లల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి వివరాలు చూస్తే..
- Venkatrao Lella
- Updated on: Jun 8, 2026
- 3:07 pm
Indian Railways: వేగం గంటకు 15 కి.మీ.. దూరం 21 కి.మీ.. అయినా క్రేజ్ మామూలుగా లేదు.. టికెట్ కోసం రాత్రంతా క్యూలోనే..!
Indian Railways: రైలు బయలుదేరడానికి సుమారు 45 నిమిషాల ముందు రైల్వే స్టేషన్లో టిక్కెట్లు జారీ చేస్తారు. అందుకే సెలవు దినాల్లో, పర్యాటక సీజన్లో ప్రజలు గంటల ముందే వచ్చి సీటు దక్కించుకోవడానికి వరుసలో నిలబడతారు. రాత్రిపూట నేరల్ స్టేషన్కు రైలు వస్తుంది..
- Subhash Goud
- Updated on: Jun 7, 2026
- 12:10 pm
Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. దేశవ్యాప్తంగా అమలు.. త్వరలోనే సిద్దంగా ఉండండి..
రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే ఎక్స్ప్రెస్, మెయిల్ ట్రైన్ల స్పీడ్ను మరింత పెంచనుంది. ప్రస్తుతం రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా.. 130కు పెంచేందుకు రైల్వేశాఖ సన్నద్దమవుతోంది. దీని వల్ల ప్రయాణికులు మరింత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.
- Venkatrao Lella
- Updated on: Jun 6, 2026
- 9:55 pm