AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు

భారతీయ రైల్వే డిసెంబరు 26 నుండి రైలు ఛార్జీలను పెంచింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలను బ్యాలెన్స్ చేయడమే దీనికి కారణం. లోకల్, స్వల్ప దూర ప్రయాణాలకు ఛార్జీలలో మార్పు లేదు. 215 కి.మీల పైన ఆర్డినరీ క్లాస్‌కు కి.మీకి 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కి.మీకి 2 పైసలు పెంపు వర్తిస్తుంది. ఈ పెంపు ద్వారా రైల్వేకు అదనంగా రూ.600 కోట్లు ఆదాయం అంచనా.

  • Phani CH
  • Updated on: Dec 24, 2025
  • 12:07 pm

Indian Railway: పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..

సంక్రాంతికి ఊరెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే మరో తీపికబురు అందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఏకంగా 16 రైళ్లకు హాల్ట్ కల్పించింది. దీంతో అక్కడి నుంచే ప్రయాణికులు ట్రైన్ ఎక్కవచ్చు.

Vande Bharat Train: వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ట్రైన్.. పండగే పండుగ

Indian Railway: ఏపీ మీదుగా అనేక వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి ప్రధాన నగరాల మీదుగా ఈ సర్వీసులు ప్రయాణం చేస్తున్నాయి. తరచూ వేలమంది వీటిల్లో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా ఆ ప్రాంత ప్రజలకు కూడా వందే భారత్ రైలు సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

Indian Railways: 50 సెకన్లలోనే ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారు.. ఎలానో చూడండి

ట్రైన్ టికెట్ బుక్ చేాయాలంటే దాదాపు 10 నిమిషాల సమయం పట్టవచ్చు. ఐఆర్‌సీటీసీ లాగిన్ డీటైల్స్ ఇచ్చి పేమెంట్ చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. కానీ కొంతమంది ఏజెంట్లు అక్రమ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి 50సెకన్ల వ్యవధిలోనే టికెట్ బుక్ చేస్తున్నారు. దీని వల్ల సామాన్యులు నష్టపోతున్నారు.

Indian Railways: రైల్వే ట్రాక్‌లో లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? దీన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Indian Railways: ఇతర రైళ్లకు మార్గం ఇచ్చేందుకు కీలక పాత్ర పోషించే ఈ లూప్‌లైన్‌లు సుమారు 750 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిపై రెండు ఇంజన్లతో పాటు మొత్తం రైలును నిలిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 1500 మీటర్ల పొడవు ఉండే..

ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి

రైలు టికెట్ ధరలు ఈ నెల 26 నుండి పెరుగుతాయి. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీ. దాటితే కి.మీ.కి ఒక పైసా, నాన్-ఏసీ, ఏసీలో 2 పైసలు పెరుగుతాయి. 500 కి.మీ. పైబడిన నాన్-ఏసీ ప్రయాణానికి రూ.10 అదనంగా చెల్లించాలి. నిర్వహణ ఖర్చులు పెరగడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది, రూ.600 కోట్ల అదనపు ఆదాయం ఆశిస్తోంది.

  • Phani CH
  • Updated on: Dec 21, 2025
  • 7:12 pm

Indian Railways: అంతా అబద్దమే.. అలాంటిదేమి లేదు.. ఆ టికెట్లపై క్లారిటీ ఇచ్చిన ఇండియన్‌ రైల్వే…!

Indian Railways: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో భారతీయ రైల్వేలలో బుక్ చేయబడిన అన్ని రిజర్వ్‌డ్‌ టిక్కెట్లలో ఇప్పుడు 87% ఇ-టిక్కెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ అపారమైన ప్రజాదరణను ఇది స్పష్టంగా ప్రదర్శిస్తుంది..

Indian Railways: బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు.. రైల్వే కీలక నిర్ణయం

Indian Railways: ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్లపై అనుమానం వచ్చింది. తరువాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ (A.I.) ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత రైళ్లలో రిజర్వ్ చేయని కంపార్ట్‌మెంట్లలో..

తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌

దక్షిణ మధ్య రైల్వే తిరుమల భక్తులకు శుభవార్త ప్రకటించింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. తిరుపతి-చర్లపల్లి, పండరీపూర్-తిరుపతి మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. డిసెంబర్ 16 నుండి జనవరి 4 వరకు సేవలు అందిస్తాయి. ప్రయాణ తేదీలు, వేళలు స్పష్టంగా ఉన్నాయి. ఇది భక్తుల సౌకర్యార్థం తీసున్న నిర్ణయం.

  • Phani CH
  • Updated on: Dec 15, 2025
  • 9:18 pm

IRCTC Account: ఈ పొరపాటు చేస్తున్నారా? మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ బ్యాన్‌.. ఇప్పటికే 3 కోట్లకుపైగా బ్లాక్‌..!

Indian Railways: డిసెంబర్ 4 వరకు దేశంలోని 322 రైళ్లలో ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ వ్యవస్థను అమలు చేశారు. అన్ని IRCTC ఖాతాల ధృవీకరణ, పునఃవాలిడేషన్ పూర్తయినట్లు రైల్వే మంత్రి తెలియజేశారు. 3.02 కోట్ల అనుమానాస్పద ఖాతా IDలను నిష్క్రియం చేసినట్లు..

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు చెన్నై సెంట్రల్‌ నుంచి విజయవాడకే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్‌ వరకు విస్తరించారు. దీంతో ఏసీ ప్రయాణం కోసం ఎదురుచూసే ప్రయణికులకు ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది.

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు స్లీపర్‌ కోచ్‌లలో ఏసీ సదుపాయాలు!

Indian Railways: ప్రయాణికులకు సౌకర్యాలను పెంచడానికి భారతీయ రైల్వేలు నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో దక్షిణ రైల్వే శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఎయిర్ కండిషన్ లేని (నాన్-ఏసీ) స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇప్పుడు నామమాత్రపు రుసుముతో బెడ్‌షీట్లు..