భారత రైల్వే
భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్సీటీసీలో సులభంగా టికెట్స్ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.
Indian Railways: ఆన్లైన్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు బంద్.. రైల్వేశాఖ నుంచి కీలక ప్రకటన.. ఈ రోజుల్లోనే..
రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్లో మార్పులు చేయాల్సి ఉండటం వల్ల ఆన్ లైన్ సేవలు ఆగిపోనున్నాయి. మార్చి 26 నుంచి 27వ తేదీ ఉదయం వరకు సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన జారీ చేసింది.
- Venkatrao Lella
- Updated on: Mar 23, 2026
- 7:27 pm
Indian Railways: ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నారా..? రైల్వేశాఖ కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి..
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ బుకింగ్ రూల్స్లో మార్పులు చేసింది. గత ఏడాది జులై నుంచి కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. మీరు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కొత్త నియమాల గురించి తెలుసుకోవాల్సిందే. కొత్త రూల్స్ ఎందుకు అనేది చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Mar 23, 2026
- 5:03 pm
Indian Railways: ఇకపై సెకన్లలోనే రైల్వే టికెట్ల బుకింగ్.. త్వరలోనే హైస్పీడ్ రిజర్వేషన్ సిస్టమ్.. 40 ఏళ్ల నాటి వ్యవస్థ బంద్..
ప్రస్తుతం ఉన్న రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధ 1985 నుంచి అందుబాటులో ఉంది. కేవలం 15 సంవత్సరాల కోసం దీనిని అభివృద్ది చేయగా.. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ప్రపంచంలో అతి పురాతనమైన టికెటింగ్ వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. దీనిలో ఇప్పుడు మార్పులకు శ్రీకారం చుట్టారు.
- Venkatrao Lella
- Updated on: Mar 18, 2026
- 12:48 pm
Indian Railways: ట్రైన్ మొత్తం లేదా కోచ్లను కూడా మీరు బుక్ చేసుకోవచ్చు.. ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచే.. ఒక్క క్లిక్తో
టూర్ లేదా ఫంక్షన్కు ఎక్కువమంది వెళ్తున్నారా..? బస్సులు, కార్లే కాదు. ట్రైన్లను కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ మీకు అవకాశం కల్పిస్తోంది. రైల్వేశాఖ అందించే ఈ సేవల గురించి చాలామందికి తెలియదు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా మీరు సులువుగా బుక్ చేసుకోవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Mar 15, 2026
- 10:20 am
Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మారిన రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్స్ ఇవే..
వందే భారత్ రైళ్ల టైమింగ్స్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మారాయి. మార్చి 15వ తేద నుంచి ఈ షెడ్యూల్స్ను అమలు చేస్తన్నారు. ప్రయాణికులు వీటిని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
- Venkatrao Lella
- Updated on: Mar 15, 2026
- 9:43 am
Indian Railways: ట్రైన్ల చివరి బోగీపై ఉండే ‘X’ సింబల్ వెనుక ఇంత సీక్రెట్ ఉందా..? తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు
ఇండియాలో రైళ్లల్లో ప్రయాణించే ప్రజల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తరచూ లక్షలాది మంది రైళ్ల ద్వారా తమ ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు. అయితే రైలు చివరి బోగీ వెనుక X అనే సింబల్ అందరూ చూసే ఉంటారు. దీని వెనుక అనేక సీక్రెట్ ఉంది. అదేంటంటే..
- Venkatrao Lella
- Updated on: Mar 13, 2026
- 4:23 pm
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్. రెండు రోజలు పాటు రైల్వే ఆన్లైన్ సేవల్లో అంతరాయం కలగనుంది. టికెట్ల బుకింగ్, క్యాన్సిల్ వంటి సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనన్నాయి. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్లో మార్పులు చేస్తున్నారు. దీని వల్ల ఆన్లైన్ సర్వీసుల్లో ఆటంకం ఏర్పడనుంది.
- Venkatrao Lella
- Updated on: Mar 13, 2026
- 3:13 pm
Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. 1,484 ప్రత్యేక రైళ్లు.. ఇన్ని ట్రైన్స్ ఇప్పుడేందుకో తెలుసా?
Indian Railways: రిజర్వేషన్, అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు: ఈ ప్రత్యేక రైళ్లలో 749 రిజర్వ్డ్ ట్రైన్లు, మరియు 735 అన్రిజర్వ్డ్ ట్రైన్లు ఉంటాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను దేశంలోని పలు కీలక మార్గాల్లో నడపనున్నారు. మహారాష్ట్రలో ముఖ్య మార్గాలు..
- Subhash Goud
- Updated on: Mar 13, 2026
- 10:03 am
Indian Railways: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. రూట్ కూడా కన్ఫార్మ్
ఇండియాలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు రైల్వేశాఖ పనులు వేగవంతం అవుతోంది. తొలి రైలు ఏయే ప్రాంతాల మధ్య సర్వీసులు అందిస్తుందనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. తొలి రైలు ఎక్కడనుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది..? అనే వివరాలు చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Mar 11, 2026
- 8:38 pm
Indian Railways: రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. గ్యాస్ కొరత వేళ రైల్వేశాఖ సంచలన నిర్ణయం..?
రైల్వే ప్రయాణికులకు షాక్ తగలనుంది. రైళ్లల్లో క్యాటరింగ్ సర్వీసులను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని రైల్వేశాఖ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తతుం ఇది పరిశీలనలో ఉండగా.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.గ గ్యాస్ కొరత క్రమంలో రైలవ్ే వర్గాలు ఈ నిర్ణయం తీసుకోనున్నాయి.
- Venkatrao Lella
- Updated on: Mar 11, 2026
- 3:35 pm
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రేపే ప్రారంభం.. రూట్, టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఏపీ, తెలంగాణకు రైల్వేశాఖ మరో అమృత్ భారత్ రైలు ప్రకటించింది. ఇది తమిళనాడు నుంచి కేరళ మీదుగా ఏపీ, తెలంగాణకు సర్వీసులు అందించనుంది. ఈ నెల 11వ తేదీన దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Mar 10, 2026
- 6:30 pm
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ రూట్ ఫిక్స్..
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఏపీ, తెలంగాణలో మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. మార్చి 11న ఈ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. దాదాపు ఆ రోజు నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Mar 9, 2026
- 6:39 pm