AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

Indian Railways: రైలులో రాత్రి 10 దాటితే ఇవి అస్సలు చేయకూడదు.. ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన నిబంధనలు!

Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. చాలా మంది దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. కానీ రాత్రి వేళల్లో రైల్వే నిబంధనలు వేరుగా ఉంటాయని మీకు తెలుసా? రాత్రి పూట రైలు ప్రయాణం చేసేవారు ఈ నిబంధనలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్ ఫిక్స్.. తక్కువ ధరలో వందే భారత్ తరహా ప్రయాణం..

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మరో అమృత్ భారత్ రైలు ఏపీ, తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అనేక రైళ్లు అందుబాటులో ఉండగా.. రేణిగుంట మీదుగా మరో రైలు అందుబాటులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఉపయోగపడనుంది.

Indian Railways: రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే..

రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా చెత్త వేయడం, ఉమ్మివేయడం వంటి చర్యలకు విధించే జరిమానా పెంచారు. అంతేకాదు.. అనుమతి లేకుండా రైలు బోగీలపై పోస్టర్లు అంటించడం, రాయడం, గీయడం, రైల్వే ఆస్తులను దెబ్బతీయడం వంటి వాటిపైనా చర్యలు తీసుకుంటారు. వంట చేయడం, స్నానం చేయడం, మూత్ర విసర్జన, మల విసర్జన, జంతువులు లేదా పక్షులకు ఆహారం పెట్టడం, వాహనాలు, పాత్రలు, దుస్తులు ఉతకడం వంటి చర్యలకూ జరిమానా వర్తిస్తుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.1,000 వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది.

Indian Railways: మీతో పాటు ట్రైన్ కోచ్‌లోకి సైకిల్ తీసుకెళ్లవచ్చా..? ఈ రూల్స్ తెలియకపోతే భారీగా పెనాల్టీ..

రైల్వే కోచుల్లోకి కొన్ని సామాన్లను తీసుకెళ్లడం కుదరదు. కొంతమందికి తెలియక ఏవి పడితే అవి తీసుకెళుతూ ఉంటారు. ఇలాంటప్పుడు రైల్వే అధికారులు భారీగా జరిమానాలు విధిస్తూ ఉంటారు. దీంతో మీరు ట్రైన్ ప్రయాణం చేస్తుంటే లగేజీ రూల్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!

IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే సర్వర్ సమస్యలను తగ్గించేందుకు IRCTC భారీ సాంకేతిక అప్‌గ్రేడ్ చేపడుతోంది. ప్రస్తుతం నిమిషానికి 37,000 టికెట్లను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని 1 లక్షకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా తత్కాల్, పండుగల సమయంలో అధిక రద్దీ ఉన్నప్పటికీ వేగంగా టికెట్లు బుక్ చేసుకునేలా కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. ఈ వీడియో చూస్తే అబ్బురపోవాల్సిందే.. ఆహా ఎలా ఉందంటే..?

దేశంలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు వస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో తొలి బుల్లెట్ రైలు రానుంది. ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యాయి. ట్రాక్ నిర్మాణంలో కూడా వేగం పుంజుకుంది.

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఏయే మార్గాల్లో అంటే..!

Indian Railways: ఈ ఏడు రైళ్ల ప్రారంభం సుదూర ప్రయాణికులకు అనేక కొత్త ఎంపికలను అందిస్తుంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, దక్షిణ భారతదేశం మధ్య రైలు అనుసంధానం బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని సమయాల్లో ఫ్రీ జర్నీ ఉండదా..? రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

రైల్వే ఉద్యోగులు ఏ ట్రైన్లలో అయినా ఉచిత ప్రయాణం చేయవచ్చా.. ఏ కోచ్‌లో అయినా ప్రయాణం చేయవచ్చా.. వందే భారత్ ట్రైన్లలో కూడా ఫ్రీ జర్నీ ఉంటుందా.. ఇలా అందరిలోనే అనేక అనుమానాలు ఉంటాయి. కుటుంబసభ్యులకు కూడా ఫ్రీ జర్నీ ఉంటుందా..?

Indian Railways: ఇక నుంచి వీరు రైలు ప్రయాణం చేయాలంటేనే వణికిపోవాల్సిందే.. తస్మాత్‌ జాగ్రత్త

Indian Railways New Rules: ప్రయాణికుల భద్రతను పెంచడం, రైళ్లలో క్రమశిక్షణను పాటించడం, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి లక్ష్యాలతో ఈ కొత్త నిబంధనలు రూపొందించినట్లు రైల్వే శాఖ తెలిపింది. అందువల్ల మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఈ కొత్త నిబంధనల గురించి..

Bullet Train: గుడ్‌న్యూస్‌.. పట్టాలెక్కనున్న భారతదేశపు తొలి బులెట్ ట్రైన్.. బిగ్ అప్‌డేట్!

Bullet Train: బుల్లెట్ రైలు కారిడార్‌కు సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ హై-స్పీడ్ రైలు కోసం 12 స్టాప్‌లను ఖరారు చేశారు. నివేదికల ప్రకారం, ఈ బుల్లెట్ రైలు కారిడార్ మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నగర్ హవేలీల..

Tirumala: తిరుమలకు వెళ్లేవారికి రైల్వేశాఖ భారీ శుభవార్త.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. టైమింగ్స్ ఇవే..

తిరుమల వెళ్లే భక్తులకు సూపర్ న్యూస్. రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. మరో ప్రత్యేక వీక్లీ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైలు షెడ్యూల్ వివరాలను కూడా ప్రకటించింది. ఈ ట్రైన్ టైమింగ్స్ ఏంటి.. ఏయే రోజుల్లో సర్వీసులు అందించనుందనే వివరాలు ఇలా..

Indian Railways: ఏసీ కోచ్‌లో బెడ్ షీట్ ఇవ్వలేదా..? రైల్వేశాఖ నుంచి రీఫండ్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..?

ట్రైన్లలో చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఏసీ కోచుల్లో వెళ్లేవారికి బెడ్ రోల్ కిట్ రైల్వేశాఖ అందిస్తోంది. బెడ్ షీట్, దుప్పటి, టవల్ లాంటివి ఇందులో ఉంటాయి. అయితే ఇది అందించకపోతే రైల్వేశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. రీఫండ్ కూడా పొందవచ్చు.