భారత రైల్వే
భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్సీటీసీలో సులభంగా టికెట్స్ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.
Indian Railways: ఇక ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. రైల్వే కొత్త రూల్స్!
Indian Railways: దేశ సరిహద్దుల వెంబడి భద్రతను బలోపేతం చేసే దిశగా భారత రైల్వేలు కీలక అడుగులు వేస్తోంది. రైల్వేలో సరికొత్త నియమ నిబంధనలు తీసుకువస్తోంది. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకువస్తోంది. ఇక నుంచి ఆ రైళ్లలో..
- Subhash Goud
- Updated on: Feb 10, 2026
- 1:14 pm
Indian Railways: మార్చి 1 నుండి నిలిచిపోనున్న రైల్వేలు UTS యాప్.. ఇక అన్ని సేవలు అందులోనే..!
Indian Railways: ల్వే మంత్రిత్వ శాఖ UTS టికెట్ బుకింగ్ యాప్లో సేవలను నిలిపివేయనుంది. జనవరి 2026 నుండి జాతీయ రవాణాదారుడు రైల్వన్ మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించే ప్రయాణికులకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా డిజిటల్ టికెటింగ్ను ప్రోత్సహిస్తున్నారు. అన్ని రైలు ప్రయాణ..
- Subhash Goud
- Updated on: Feb 10, 2026
- 12:04 pm
Indian Railways: రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఆర్డర్ చేస్తే మీ సీటు వద్దకే ఫుడ్.. ఐఆర్సీటీసీ ద్వారా..
ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లల్లో ఈ-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుత కొన్ని రైళ్లల్లో ప్రవేశపెట్టగా.. త్వరలో అన్ని రైళ్లకు విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. దీని ద్వారా ప్రయాణికులు ఫుడ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండనే ఉండదు.
- Venkatrao Lella
- Updated on: Feb 9, 2026
- 8:37 pm
బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!
రైలు ప్రయాణంలో RAC టికెట్లపై భారతీయ రైల్వే కీలక మార్పులు చేయనుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు, పూర్తి ఛార్జీలు వసూలు చేస్తూ బెర్త్ కేటాయించని RAC ప్రయాణికులకు రీఫండ్లు అందించే వ్యవస్థను రూపొందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ప్రస్తుతం బెర్త్ పంచుకుంటున్న విధానంపై కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని రైళ్లలో RAC బోర్డింగ్ నిషేధం వంటి మార్పులు కూడా చేసింది.
- Phani CH
- Updated on: Feb 8, 2026
- 1:00 pm
Vande Bharat Sleeper: వావ్.. వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. రైల్వేశాఖ లైనప్ మాములుగా లేదుగా..
Indian Railways: వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం దేశంలోని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఒక వందే భారత్ స్లీపర్ రైలు మాత్రమే నడుస్తోంది. జనవరిలో హౌరా-గువహతి మధ్య తొలి రైలును మోదీ ప్రారంభించారు. ఇక త్వరలో మరిన్ని రైళ్లను తీసుకురానుందని ప్రకటించిన రైల్వేశాఖ.. తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Feb 6, 2026
- 1:12 pm
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. హోలీ పండక్కి రైల్వేశాఖ శుభవార్త.. ఏంటంటే..?
పండుగల సందర్భంగా రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను తిప్పుతూ ఉంటుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. మార్చిలో హోలీ పండుగ వస్తుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
- Venkatrao Lella
- Updated on: Feb 6, 2026
- 11:25 am
Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్లను నిర్మించనుంది. ఈ మేరకు లోక్సభలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వీటి వల్ల రాష్ట్రంలోనూ నలుమూలకు రైల్వే నెట్ వర్క్ మరింతగా విస్తరించనుందని తెలుస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Feb 5, 2026
- 10:28 am
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్న్యూస్.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సౌకర్యం.. కీలక అప్డేట్ ఇదే..
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 విస్తరణకు మార్గం సుగమైంది. త్వరలో రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. త్వరలోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ను విస్తరించే పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
- Venkatrao Lella
- Updated on: Feb 4, 2026
- 11:13 am
భారతీయ రైల్వేలో పెను మార్పు.. ఇకపై LNGతో రైళ్ల ప్రయాణం
భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణలో కీలక మైలురాయిని అధిగమించింది. అహ్మదాబాద్ విభాగం ఎల్ఎన్జి-డీజిల్ మిశ్రమ ఇంధనంతో నడిచే డెము రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలోనే మొదటిసారిగా ఈ డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ 40% డీజిల్ ఆదా చేసి, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది పర్యావరణ హితమైన, ఖర్చు తగ్గించే రైల్వే ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది.
- Phani CH
- Updated on: Feb 3, 2026
- 12:36 pm
Bullet Train: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్.. రూట్ ఫిక్స్.. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం
ఏపీకి మరో బుల్లెట్ ట్రైన్ రానుంది. చెన్నై-బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ను బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారిడార్ చెన్నై నుంచి చిత్తూరు జిల్లా మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో కారిడార్ పూర్తైతే ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ తిప్పనున్నారు.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 9:46 am
Telangana: తెలంగాణకు కేంద్రం మరో గుడ్న్యూస్.. నమో భారత్ రాపిడ్ రైలు.. ఈ రూట్లోనే ప్రయాణం
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-వరంగల్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ స్పీడ్ కారిడార్ను నిర్మించనుంది. ఇందులో భాగంగా నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. దీని వల్ల హైదరాబాద్-వరంగల్ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే వివిధ ప్రాంతాల మధ్య వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
- Venkatrao Lella
- Updated on: Feb 2, 2026
- 10:30 am
High Speed Rail Corridors: కేవలం మూడు గంటల్లోనే చెన్నై, బెంగళూరు.. అమరావతికి జస్ట్ 75 నిమిషాల్లోనే.. హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రత్యేకతలివే..
హైస్పీడ్ రైల్ కాారిడార్లను తెలుగు రాష్ట్రాల మీదుగా కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అందుబాటులోకి వస్తే కేవలం గంటల వ్యవధిలోనే చెన్నై, బెంగళూరు, పుణెకు చేరుకోవచ్చు. ఇక 75 నిమిషాల్లో అమరావతికి చేరుకోవచ్చు. ఇంకా ఎన్నో వివేషాలు ఉన్నాయి.
- Venkatrao Lella
- Updated on: Feb 2, 2026
- 7:23 am