AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌

దక్షిణ మధ్య రైల్వే తిరుమల భక్తులకు శుభవార్త ప్రకటించింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. తిరుపతి-చర్లపల్లి, పండరీపూర్-తిరుపతి మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. డిసెంబర్ 16 నుండి జనవరి 4 వరకు సేవలు అందిస్తాయి. ప్రయాణ తేదీలు, వేళలు స్పష్టంగా ఉన్నాయి. ఇది భక్తుల సౌకర్యార్థం తీసున్న నిర్ణయం.

  • Phani CH
  • Updated on: Dec 15, 2025
  • 9:18 pm

IRCTC Account: ఈ పొరపాటు చేస్తున్నారా? మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ బ్యాన్‌.. ఇప్పటికే 3 కోట్లకుపైగా బ్లాక్‌..!

Indian Railways: డిసెంబర్ 4 వరకు దేశంలోని 322 రైళ్లలో ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ వ్యవస్థను అమలు చేశారు. అన్ని IRCTC ఖాతాల ధృవీకరణ, పునఃవాలిడేషన్ పూర్తయినట్లు రైల్వే మంత్రి తెలియజేశారు. 3.02 కోట్ల అనుమానాస్పద ఖాతా IDలను నిష్క్రియం చేసినట్లు..

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు చెన్నై సెంట్రల్‌ నుంచి విజయవాడకే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్‌ వరకు విస్తరించారు. దీంతో ఏసీ ప్రయాణం కోసం ఎదురుచూసే ప్రయణికులకు ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది.

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు స్లీపర్‌ కోచ్‌లలో ఏసీ సదుపాయాలు!

Indian Railways: ప్రయాణికులకు సౌకర్యాలను పెంచడానికి భారతీయ రైల్వేలు నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో దక్షిణ రైల్వే శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఎయిర్ కండిషన్ లేని (నాన్-ఏసీ) స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇప్పుడు నామమాత్రపు రుసుముతో బెడ్‌షీట్లు..

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌.. స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించిన రైల్వే.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే..

Sankranti special trains 2026: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.. 2026 జనవరి 4వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ సమయ వేళల్లో మార్పు!

Janmabhoomi Express: రైల్వే శాఖ అప్పుడప్పుడు రైళ్ల సమయ వేళలను మారుస్తుంటుంది. అలాగే విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ల ప్రయాణ సమయ వేళలను మార్చింది. కొత్తగా మార్చిన సమయ వేళలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి..

Sankranti Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు!

Indian Railways: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు (విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడ) అలాగే ప్రయాణికులకు..

Indian Railways: రైల్వేశాఖ బిగ్ యాక్షన్.. 3 కోట్ల ఐడీలు బ్లాక్.. తత్కాల్ చీకటి దందాకు చెక్..

బోగస్ బుకింగ్‌లు, బాట్‌ల వల్ల తత్కాల్ టికెట్లు త్వరగా అయిపోతున్నాయి. దీనిని అరికట్టేందుకు రైల్వేశాఖ ఆధార్ ఆధారిత OTP ధృవీకరణను ప్రవేశపెట్టింది. ఈ కొత్త నియమం ఇప్పటికే 322 రైళ్లలో అమలవుతోంది. నకిలీ ఐడీలను బ్లాక్ చేసి, బాట్‌లను నిరోధించడం ద్వారా నిజమైన ప్రయాణికులకు టికెట్లు సులువుగా లభిస్తాయి.

Vande Bharat: డిసెంబర్లో కూత పెట్టనున్న తొలి వందే భారత్‌ స్లీపర్ రైలు

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు డిసెంబర్ చివరి నాటికి ఢిల్లీ-పట్నా మార్గంలో సేవలు ప్రారంభించనుంది. 16 కోచ్‌లు, 827 బెర్త్‌లు, 160 కి.మీ/గం వేగంతో ప్రయాణించే ఈ హైటెక్ రైలు, కవచ్ భద్రతా వ్యవస్థతో వస్తుంది. అధునాతన సౌకర్యాలు, హోటల్ లాంటి అనుభూతిని అందిస్తూ, రాత్రిపూట ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణాన్ని సురక్షితంగా అందిస్తుంది.

  • Phani CH
  • Updated on: Dec 10, 2025
  • 1:39 pm

తత్కాల్‌ కౌంటర్ బుకింగ్స్‌లో కీలక మార్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

రైల్వే శాఖ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు కీలక మార్పు చేపట్టింది. ఇకపై రైల్వే కౌంటర్ల వద్ద తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి. ఆన్‌లైన్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానం ఇప్పుడు కౌంటర్లకు విస్తరిస్తోంది. ప్రయోగాత్మకంగా ప్రారంభమై, త్వరలో అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించనుంది. ఇది అసలైన ప్రయాణికులకు మేలు చేస్తుంది.

  • Phani CH
  • Updated on: Dec 9, 2025
  • 1:18 pm

Indian Railways: రైల్వే కోచ్‌లపై పసుపు, నీలం, తెల్లటి గీతలు ఎందుకు ఉంటాయి? ఇంట్రెస్టింగ్‌ స్టోరీ

Indian Railways: సాధారణంగా మీరు రైలు ప్రయాణం చేసి ఉంటారు. బోగీలపై వివిధ రకాల గీతలు, బోగీలపై రకరకాల రంగులు ఉంటాయి. రంగులు, గీతలు ఉండటం కూడా ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. మరి రైల్వే బోగీలపై గ్రీన్‌, బ్లూ, వైట్‌ లాంటి..

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..

భారతీయ రైల్వే నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు గొప్ప వార్త. 2026 జనవరి 1 నుండి బెడ్‌రోల్ సేవలను అందుబాటులోకి తేనుంది. బెడ్‌షీట్, దిండు కవర్‌లకు వరుసగా రూ.20, రూ.30 చెల్లించాలి. రెండూ కలిపి రూ.50. పైలట్ ప్రాజెక్ట్‌లో విజయవంతమయిన ఈ సేవ, ఇకపై సాధారణ ప్రయాణికులకు కూడా సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తుంది.

  • Phani CH
  • Updated on: Dec 6, 2025
  • 2:23 pm