AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

IRCTC: తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? కన్ఫర్మ్‌ కావాలంటే ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి!

IRCTC Tatkal Ticket: ప్రీమియం తత్కాల్ ఛార్జీలు స్థిరంగా ఉండవు. డైనమిక్ ఛార్జీల విధానం వర్తిస్తుంది. అంటే సీట్లు బుక్ అయ్యే కొద్దీ టిక్కెట్ ధర పెరుగుతుంది. అందువల్ల ముందుగా బుక్ చేసుకునే ప్రయాణికులు తక్కువ ఛార్జీ చెల్లించాల్సి రావచ్చు. ప్రయాణానికి ఒక..

Indian Railways: ట్రైన్‌లో వస్తువులు మర్చిపోయారా..? ఈ ఒక్క నెంబర్‌కు కాల్ చేస్తే తిరిగి మీ చేతికి..

ట్రైన్‌లో ప్రయాణం చేసే సమయంలో వస్తువులను సీటుపై పెట్టి మర్చిపోతుంటారు. దీంతో వాటిని వేరేవాళ్లు తీసుకెళ్లడం లాంటివి జరుగుతుంటాయి. ఇలా వస్తువులను పొగోట్టుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఈ పని చేయడం ద్వారా వస్తువులను తిరిగి రాబట్టుకోవచ్చు. ఈ మేరకు రైల్వేశాఖ అవకాశం కల్పిస్తోంది.

వందే భారత్ ఏసీ కోచ్‌ చూసారా? లగ్జరీ ఇంటీరియర్స్‌తో లుక్‌ అదిరిందిగా!

ముంబై–బెంగళూరు మార్గంలో త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్ రైలు ఫస్ట్ ఏసీ కోచ్ లగ్జరీ ఇంటీరియర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రైవేట్ క్యాబిన్లు, ఆధునిక వాష్‌రూమ్‌లు, సీసీటీవీ, డిజిటల్ డిస్‌ప్లేలు, సెంట్రలైజ్డ్ ఏసీ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైలు ఫైవ్ స్టార్ హోటల్ అనుభూతిని అందించనుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

  • Phani CH
  • Updated on: Jun 29, 2026
  • 6:33 pm

హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు.. బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ.. ఏయే ప్రాంతాల్లో అంటే..

హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే, రూట్ మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో అధికారులు ఎలైన్‌మెంట్ గుర్తింపు కోసం ప్రత్యేక మార్కింగ్‌లు చేపడుతున్నారు. సర్వే పూర్తయిన అనంతరం తుది మార్గం, స్టేషన్ల స్థానాలు, భూసేకరణ వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Indian Railways: జేబులో పదేపదే చేయి పెడుతూ దిగిన ప్రయాణికుడు.. పోలీసులకు అనుమానం వచ్చి చెక్‌ చేయగా..

Indian Railways: భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు, దోపిడీ ఘటనలను నివారించేందుకు లక్నో రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా జూన్ 28న ప్రతాప్‌గఢ్ జీఆర్‌పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్..

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!

రైలు ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువస్తోంది. జూలై 1 నుంచి రైళ్లు, రైల్వే స్టేషన్లలో ధూమపానం చేస్తే భారీ జరిమానాతో పాటు టికెట్ రద్దు, జైలు శిక్ష కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇతరుల బెర్తులు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

  • Phani CH
  • Updated on: Jun 28, 2026
  • 6:31 pm

Indian Railways: ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!

Indian Railways: ఇప్పటి నుంచి ఆహార తయారీలో కొన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు ఐఆర్‌సిటిసి తెలిపింది. తగినంత గడువు ముగిసిన, తాజాగా ఉన్న ముడి పదార్థాలను సేకరించాలి. వంట చేసే ముందు ప్రతి పదార్థం నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి..

New Rules: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్..! తెలుసుకోకపోతే జేబుకు చిల్లే!

Indian Railways New Rules: ప్రయాణికుల భద్రత, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ట్రైన్‌లో ధూమపానం చేసినా, లైసెన్స్‌ లేకుండా అమ్మకాలు జరిపినా, బిక్షాటన చేసినా రూ.2వేల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కకొంది.

  • Anand T
  • Updated on: Jun 25, 2026
  • 8:31 am

Indian Railways: మారిన రైల్వే రిజర్వేషన్ టికెట్ రూల్స్.. సీటు దొరకలేదనే టెన్షన్ ఉండదు.. ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు..

రైల్వేశాఖ రిజర్వేషన్ రూల్స్‌లో మార్పులు చేయనుంది. వెయిటింగ్ టికెట్లలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు చార్ట్ ప్రిపేర్ అయ్యాక టికెట్ వెయింటింగ్ లిస్టులో ఉంటే క్యాన్సిల్ అయ్యి రీఫండ్ ఇస్తున్నారు. ఇక నుంచి అలా అవ్వదు. ఆ టికెట్‌పై ప్రయాణం చేయవచ్చు,.

Vande Bharat Sleeper: ఈ రూట్లలో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. రైల్వేశాఖ నుంచి బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?

వందే భారత్ స్లీపర్ రైళ్లపై కీలక అప్డేట్ వచ్చేసింది. 9 మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ వెర్షన్‌లో ఒక రైలును మాత్రమే ప్రవేశపెట్టారు. ఆగస్ట్‌లో మరికొన్ని రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ సిద్దమవుతోంది.

Indian Railways: ట్రైన్ లేదా రైల్వే స్టేషన్లలో ఈ తప్పు చేస్తే బాదుడే.. ఏకంగా రూ.5 వేల జరిమానా.. జులై 1 నుంచే అమల్లోకి..

రైల్వేశాఖ జరిమానా నిబంధనల్లో సవరణలు చేసింది. రైల్వే నిబంధనలను ఉల్లంఘించేవారిపై విధించే ఫైన్లను భారీగా పెంచింది. రెట్టింపు చేస్తూ తాజాగా రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. వీటి గురించి సమాచారం చూస్తే..

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే ప్రయాణం.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే మార్గాన్ని కూడా ఖరారు చేసింది. దేశంలో తొలి స్లీపర్ రైలును హౌరా-గువహతి మధ్య ప్రారంభమైంది. త్వరలోనే మరిన్ని రైళ్లు రానున్నాయి.