AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

మన దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? 90శాతం మందికి ఈ నిజం తెలియదు..

ప్రతిరోజూ రైలులో ప్రయాణించే వారికి కూడా తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మన దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది? చాలా మంది ముంబై లేదా ఢిల్లీ అనుకుంటారు. కానీ, 23 ప్లాట్‌ఫారాలతో, లక్షలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే పెద్ద కోట లాంటి మహా స్టేషన్ గురించి ఇప్పడు తెలుసుకుందాం. .

Indian Railways: మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి రెడీ.. ఈ రూటు ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. అప్డేట్ వచ్చేసింది..

వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. రెండో రైలు పట్టాలెక్కేందుకు రెడీ అయింది. ఈ మేరకు రూట్ ఫిక్స్ కాగా.. త్వరలో షెడ్యూల్, ధరలను ప్రకటించనున్నారు. రెండో రైలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. తొలి రైలు జనవరిలో ప్రారంభమైంది.

Indian Railways: మీరు ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారా? కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త రైల్వే నిబంధనలు

Indian Railways: భారతీయ రైల్వే తన నిబంధనలలో భారీ మార్పులను తీసుకువస్తోంది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15, 2026 మధ్య దశలవారీగా అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల వల్ల ప్రయాణికులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా రీఫండ్ నియమాలు, చివరి నిమిషంలో ప్రయాణికులకు కల్పించే వెసులుబాట్లపై స్పష్టతనిచ్చింది..

Indian Railways: వారెవ్వా.. రైళ్లల్లో జనరల్ బోగీలు ముందు లేదా వెనుక ఎందుకుంటాయో తెలుసా..? ఈ రీజన్ తెలిస్తే సూపర్ అంటారు..

రైళ్లల్లో కొన్ని విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యం ట్రైన్ బోగీల ఏర్పాటు, వాటిపై ఉండే నెంబర్లు లాంటివి ప్రత్యేకంగా ఉంటాయి. వీటికి కారణాలు ఏంటనేది తెలియక పట్టించుకోవడం మానేస్తారు. అయితే రైళ్లల్లో జనరల్ బోగీలు వెనుక లేదా ముందే వెనుక ఉంటాయనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా..

Indian Railways: ఏపీ నుంచి మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూట్ మ్యాప్ ఫిక్స్..

ఏపీ కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రం మీదుగా మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆమోదించి ప్రాజెక్టులో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక విజయవాడ నుంచి విశాఖ రైలు కారిడార్ ఇప్పటికే ప్రతిపాదన దశల్లో ఉంది.

Tirumala: తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇప్పటివరకు పలు ప్రాంతాల నుంచి తిరుపతికి నడుస్తున్న రైళ్లను రైల్వేశాఖ రెగ్యూలర్ చేసింది. దీంతో తిరుమల వెళ్లేవారికి మరిన్ని రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లుగా ఉన్న వీటిని రెగ్యూలర్ సర్వీసులుగా మార్చింది. వాటి వివరాలు..

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు.. కొత్త రూల్స్ ఇవే..

భారతీయ రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. టికెట్ రద్దు మరియు రీఫండ్ విధానంలో ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న 4 గంటల గడువును 8 గంటలకు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రూల్స్ తెలియకపోతే ఒక్క రూపాయి కూడా రీఫండ్ రాదు. ఆ కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Bullet Trains: బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కేంద్రం మరో అప్డేట్.. భూసేకరణపై కీలక ప్రకటన

బుల్లెట్ రైళ్ల కారిడార్లపై కేంద్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు కారిడార్లను ప్రకటించారు. అప్పటినుంచి ఈ ప్రాజెక్టుపై కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాజాగా పార్లమెంటరీ ప్యానెల్ కీలక వ్యాఖ్యలు చేశారు,

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగా కనెక్టివిటీ..

ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు అడుగులు పడ్డాయి. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుపై పార్లమెంట్‌లో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. రామాయపట్నం పోర్ట్‌కు కనెక్టివిటీని పెంచేందుకు కొత్త రైల్వే లైన్ చేపట్టనున్నారు. త్వరలోనే ఈ పనులను వేగవంతం చేయనున్నారు.

Indian Railways: ట్రైన్ టికెట్ రద్దు చేసుకునేవారికి కొత్త రూల్స్.. ఆ టైమ్‌లో క్యాన్సిల్ చేస్తే నో రీఫండ్.. షాకింగ్ డెసిషన్..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ట్రైన్ టికెట్ రద్దు చేసుకునే సమయంలో ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి. ఇప్పటివరకు ఉన్న టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలను రైల్వేశాఖ మార్చింది. వీటి వివరాలు ఏంటో ఇందులో చూద్దాం.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌

భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ రద్దు, రీఫండ్, బోర్డింగ్ స్టేషన్ మార్పుల నిబంధనలను సవరించింది. ఏప్రిల్ 1 నుండి అమలయ్యే ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, రీఫండ్ గడువు, బోర్డింగ్ స్టేషన్ మార్పు, కౌంటర్ టికెట్ల రద్దు, ఈ-టికెట్ రీఫండ్ ప్రక్రియ సులభతరం అయ్యాయి. దళారుల దందాకు అడ్డుకట్ట వేసి, పారదర్శకత పెంచడమే లక్ష్యం.

  • Phani CH
  • Updated on: Mar 27, 2026
  • 5:24 pm

Indian Railways: వీరికి జీవితాంతం రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.. కేంద్ర ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త.. ఎవరెవరికి అంటే..?

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ అందించింది. ప్రస్తుతం రైళ్లల్లో దివ్యాంగులు, విద్యార్థులుకు టికెట్లపై రాయితీ సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రజాప్రతినిధులకు కూడా రైళ్లల్లో ప్రత్యేక రిజర్వేషన్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ క్రమంలో కేంద్రం వారికి ఉచిత రైల్వే ప్రయాణాన్ని ప్రకటించింది.