Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

అది రైలు బ్రో.. మన ఇల్లు కాదు.. అలా ఎలా చేస్తావ్ ??

రీల్స్ పిచ్చితో ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు రైలు కోచ్‌లో స్నానం చేసి వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు ఆ యువకుడిని గుర్తించి, అతనిపై చర్యలు తీసుకున్నారు. అతని యూట్యూబ్ ఛానెల్ నుండి వీడియోను తొలగింపజేశారు. ఇలాంటి చర్యలు రైళ్లలో చేయవద్దని రైల్వే హెచ్చరించింది.

  • Phani CH
  • Updated on: Nov 14, 2025
  • 11:38 am

ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు

దేశంలో అత్యధిక వేగంతో వందే భారత్ రైళ్ల నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది కానీ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు వెళ్లిపోయాయి. నవంబర్ కూడా వచ్చేసింది.

  • Phani CH
  • Updated on: Nov 8, 2025
  • 12:06 pm

Vande Bharat Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గాల్లో కొత్తగా మరో 4 వందే భారత్‌ రైళ్లు!

Vande Bharat Trains: ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే రైలు ప్రయాణికులకు సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా అవుతుంది. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి ముఖ్యమైన మత, సాంస్కృతిక..

Indian Railways: ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ మార్గాల్లో 8 ప్రత్యేక రైళ్లు!

Indian Railways: ఇందులో అరకు-యలహంక ప్రత్యేక రైళ్లకు కొత్తగా మార్కాపూర్ రోడ్డు, నరసరావుపేట అదనపు స్టాపులుగా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం రోడ్డు-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్ లుగా ఇచ్చారు. అలాగే భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు..

Indian Railways: ఇలా చేస్తే రైళ్లలో లోయర్ బెర్త్ పొందడం గ్యారెంటీ!‌

Indian Railways: సుదూర రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ సీట్లను ఇష్టపడతారు. ముఖ్యంగా వృద్ధులు లేదా ప్రత్యేక వికలాంగులు లేదా గర్భిణీ స్త్రీలు లోయర్ బెర్త్‌లను ఇష్టపడతారు. రైల్వే కంప్యూటరీకరించిన వ్యవస్థలో వృద్ధులకు, 45 ఏళ్లు పైబడిన మహిళా..

Trains Cancelled: రైల్వే ప్యాసింజర్లకు గమనిక.. మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో 127 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

Montha Cyclone Effect: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అలర్టయ్యింది.. మొంథా తుపాను, వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది..

Watch Video: బిగ్ అలర్ట్.. పట్టాలపైకి భారీగా వరద నీరు.. నిలిచిపోయిన పలు రైళ్లు..

మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. తెలంగాణ మహబూబాబాద్‌ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యాయి..

Hyderabad: వామ్మో జర్రుంటే నిండు ప్రాణం బలయ్యేది.. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయొద్దు.. వీడియో

హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. రైలు దిగుతూ.. కిందపడిన యువకుడిని.. అక్కడున్న వారు రెప్పపాటులో కాపాడారు.. వరంగల్‌కు చెందిన సాదుల మణిదీప్ (31) బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.

Indian Railways: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు ఏది? టికెట్ ధర ఎంతో తెలుసా?

Indian Railways: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు పేరు తేజస్ ఎక్స్‌ప్రెస్. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటైన న్యూఢిల్లీ నుండి లక్నో వరకు నడుస్తుంది. ఇది అక్టోబర్ 4, 2019న తన మొదటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. అలాగే..

Railway New Rules: ఇక వందే భారత్‌లో వారి కోసం ప్రత్యేక ఆహారం.. రైల్వే కీలక నిర్ణయం

Railway New Rules: డయాబెటిస్ వారి కోసం భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అన్ని ప్రీమియం రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికులు తమ..