దంచి కొట్టనున్న ఎండలు.. మార్చి నుంచే ప్రారంభం!
భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ వేసవిలో మార్చి నుంచే తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు, హీట్వేవ్ల సంఖ్య కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అధిక ఉష్ణోగ్రతలతో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని అంచనా. తెలంగాణలోని తూర్పు జిల్లాలను మినహాయించి, చాలా ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మార్చి నెలలో కూడా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా అధికంగా ఉంటాయి. వేసవిలో హీట్వేవ్ల సంఖ్య కూడా ఈసారి పెరుగుతుందని IMD సూచించింది. ఏప్రిల్, మే నెలల్లో హీట్వేవ్లు మరింత తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

