పాతబస్తీలో మాయమవుతున్న పొట్టేళ్లు..ఏమవుతున్నాయో తెలుసా?
భాగ్యనగరంలోని పాతబస్తీలో గత కొద్దిరోజులుగా వింత పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రికి రాత్రే మేకలు, గొర్రెలు మాయమవుతుండటం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా పేదలు, చిరువ్యాపారులు తమ జీవనాధారంగా పెంచుకుంటున్న పశువులే లక్ష్యంగా దొంగలు పంజా విసురుతున్నారు.
సాధారణంగా రంజాన్ మాసం లో హలీమ్ తయారీ కోసం మాంసం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే దొంగిలించిన పశువులను అక్రమంగా వధించి, హలీమ్ సెంటర్లకు లేదా మాంసం మార్కెట్లకు విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీగా ఉండే ఇరుకైన గల్లీల్లో పశువులను కట్టేసి ఉంచిన యజమానులు, ఉదయం లేచి చూసేసరికి అవి కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. అయితే, దుండగులు ముఖాలకు ముసుగులు ధరించడం, వాహన నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో పోలీసుల దర్యాప్తు సవాల్గా మారింది. పోలీసులు రాత్రి పహారా పెంచామని చెబుతున్నప్పటికీ, నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్ న్యూస్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

