పాతబస్తీలో మాయమవుతున్న పొట్టేళ్లు..ఏమవుతున్నాయో తెలుసా?
భాగ్యనగరంలోని పాతబస్తీలో గత కొద్దిరోజులుగా వింత పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రికి రాత్రే మేకలు, గొర్రెలు మాయమవుతుండటం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా పేదలు, చిరువ్యాపారులు తమ జీవనాధారంగా పెంచుకుంటున్న పశువులే లక్ష్యంగా దొంగలు పంజా విసురుతున్నారు.
సాధారణంగా రంజాన్ మాసం లో హలీమ్ తయారీ కోసం మాంసం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే దొంగిలించిన పశువులను అక్రమంగా వధించి, హలీమ్ సెంటర్లకు లేదా మాంసం మార్కెట్లకు విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీగా ఉండే ఇరుకైన గల్లీల్లో పశువులను కట్టేసి ఉంచిన యజమానులు, ఉదయం లేచి చూసేసరికి అవి కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. అయితే, దుండగులు ముఖాలకు ముసుగులు ధరించడం, వాహన నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో పోలీసుల దర్యాప్తు సవాల్గా మారింది. పోలీసులు రాత్రి పహారా పెంచామని చెబుతున్నప్పటికీ, నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

