BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కాకరేగుతున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే 175 అసెంబ్లీ, 24 లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కాకరేగుతున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే 175 అసెంబ్లీ, 24 లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. నిన్న మొన్నటి వరకు 11 అసెంబ్లీ సీట్లు కావాలని పట్టుబట్టిన బీజేపీ ఎట్టకేలకు ముందు కేటాయించిన దానిప్రకారం 10 స్థానాలను మాత్రమే ప్రకటించడం గమనార్హం. అయితే 11 వ స్థానాన్ని మరి కొన్ని రోజుల్లో ప్రకటిస్తుందా లేకపోతే 10 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందా అనేది స్పష్టత రావల్సి ఉంది.
గతంలో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ.. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ.. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా తెలుగుదేశం 144 స్థానాలకు గాను 139 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే సిద్దంగా ఉంది. జనసేన 21 స్థానాలకు గాను 18 మంది పేర్లను ఖరారు చేసింది. ఇలా ఇరుపార్టీల అధినేతలు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించగా తాజాగా బీజేపీ కూడా 10 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది.
- అదోని – పీవీ పార్థ సారధి
- ధర్మవరం – సత్యకుమార్
- ఎచ్చెర్ల – ఎన్. ఈశ్వర్ రావు
- విశాఖ నార్త్ – విష్ణు కుమార్ రాజు
- అరకు – పంగి రాజారావు
- విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
- కైకలూరు – కామినేని శ్రీనివాస్ రావు
- అనపర్తి – శివ కృష్ణం రాజు
- బద్వేల్ – బొజ్జా రోషన్న
- జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…