Hyderabad: హైదరాబాదీలు బీ అటెన్షన్.! పండుగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది
హైదరాబాద్ వాసులకు మరో శుభవార్త. రెండో దశ మెట్రో కారిడార్లను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు లోగా కొన్ని కారిడార్లు పూర్తీ చేయాలన్న లక్ష్యంతో ఉంది. మరి ఆ వివరలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి..

హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా సన్నద్ధమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు కనీసం కొన్ని కారిడార్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో సర్కారు వేగవంతంగా అడుగులు వేస్తోంది. మొత్తం 162.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 కారిడార్ల నిర్మాణానికి రూ.43,847 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ప్రాజెక్ట్కి 48 శాతం రుణాలను అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా 2–4 శాతం వడ్డీతో సేకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సావరీన్ గ్యారంటీతో పాటు 18 శాతం నిధులు సమకూర్చనుంది. ప్రతి కారిడార్ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేర్వేరుగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఒక్కో కారిడార్ను ఒక్కో నిర్మాణ సంస్థకు అప్పగిస్తే పనులు ఆలస్యమయ్యే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
ముఖ్యంగా, ఎల్బీనగర్–హయత్నగర్ (7.1 కి.మీ), ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ), రాయదుర్గం–కోకాపేట్ నియోపోలిస్ (11.6 కి.మీ) వంటి చిన్న కారిడార్లను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కారు ముందుకు సాగుతోంది. రెండో దశ ప్రాజెక్టులో భాగమైన ఓల్డ్సిటీ కారిడార్కు సంబంధించి ఆస్తుల సేకరణ 65 శాతం పూర్తయింది. ఈ నెలాఖరులోగా మిగతా ఆస్తుల స్వాధీనం పూర్తి చేసి టెండర్ పిలిచే అవకాశాలు ఉన్నాయి.
తగ్గనున్న మెట్రో డిపోలు..
రెండో దశలో కొత్తగా ఐదు కారిడార్ల కోసం ఇప్పటికే ఉన్న ఉప్పల్, మియాపూర్ డిపోలను వినియోగించే అవకాశం ఉంది. దీంతో కొత్త డిపోల అవసరం గణనీయంగా తగ్గనుంది. శంషాబాద్–భారత్ ఫ్యూచర్ సిటీ, ప్యారడైజ్–మేడ్చల్, ప్యాట్నీ–శామీర్పేట్ మార్గాలకు మాత్రమే కొత్తగా రెండు డిపోలు నిర్మిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దుబాయ్, లండన్, పారిస్, షాంఘై, దోహా నగరాల్లో కూడా మెట్రో రైళ్ల సేవలను నిర్వహిస్తోంది.
ఎల్అండ్టీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, కియోలిస్ 2026 వరకు హైదరాబాద్ మెట్రో నిర్వహణ కొనసాగించనుంది. రెండో దశ పూర్తయిన తర్వాత కూడా అదే సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్లు కొనసాగించే అవకాశం ఉంది. డీపీఆర్కి కేంద్రం నుంచి ఆమోదం రాగానే 8 కారిడార్ల పనులు ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో పలు దఫాలుగా సమావేశమై, ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించింది. రెండో దశ పూర్తయితే నగర రవాణా వ్యవస్థలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్




