Revanth Reddy: భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. డబుల్ డిజిట్ సీట్లలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ గెలుపుతో 2004, 2009 రిపీట్‌ అవుతుందన్నారు రేవంత్‌రెడ్డి. సికింద్రాబాద్‌లో ఎవరు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీదే గెలుపన్నారు.

Revanth Reddy: భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy
Follow us

|

Updated on: Apr 24, 2024 | 3:41 PM

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. డబుల్ డిజిట్ సీట్లలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ గెలుపుతో 2004, 2009 రిపీట్‌ అవుతుందన్నారు రేవంత్‌రెడ్డి. సికింద్రాబాద్‌లో ఎవరు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీదే గెలుపన్నారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు సికింద్రబాద్‌ ఎంపీలుగా గెలిచి కేంద్రంలో మంత్రి అయ్యారని, వారు ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లో బీజేపీ గెలుపుకోసమే.. బీఆర్‌ఎస్‌ పద్మారావును బరిలో నిలిపిందని విమర్శించారు. బీఆర్ఎస్ తోపాటు.. బీజేపీపై కూడా రేవంత్ ఫైర్ అయ్యారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మతాలపేరుతో చిచ్చుపెట్టి కేంద్రంలోని మోదీ సర్కార్‌ ఓట్లు దండుకుంటోందని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌రావుతో కలిసి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దానం నాగేందర్ నామినేషన్ దాఖలుకు ముందు ప్యారడైజ్‌, ప్యాట్నీ సెంటర్‌, సికింద్రాబాద్‌ మహంకాళి స్ట్రీట్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌పై నాకు గౌరవం ఉంది.. దానం నాగేందర్..

కాగా.. సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బాట సర్కిల్‌, ప్యాట్నీ సెంటర్‌, మహబూబ్‌కాలేజీ మీదుగా ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌, బీజేపీతీరుపై మండిపడ్డారు దానం నాగేందర్.. ఫోన్ ట్యాపింగ్‌పై BRS తక్కువ మాట్లాడితే మంచిదన్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీని గెలిపించేందుకు.. బీఆర్‌ఎస్‌ యత్నిస్తోందన్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకుందామని కేటీఆర్ తనతో అన్నారన్నారు. కేసీఆర్‌పై తనకు గౌరవం ఉంది.. కానీ బీఆర్‌ఎస్‌ది అయిపోయిన చరిత్ర.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం.. అంటూ దానం నాగేందర్ టీవీ9తో పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..