![కాంగ్రెస్ పార్టీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/congress-party.jpg)
కాంగ్రెస్ పార్టీ
138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.
దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.
Congress – BRS: బీఆర్ఎస్ విలీనంపై కోమటిరెడ్డి కామెంట్స్ వెనుక ఉన్న అర్థం ఏంటి?
బీఆర్ఎస్ చుట్టూ కాంగ్రెస్ మైండ్ గేమ్ నడుస్తోందా..? కాంగ్రెస్ నేతల కామెంట్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేల జాయినింగ్స్తో బీఆర్ఎస్ఎల్ఎపీ.. కాంగ్రెస్లో విలీనం ఖాయమని చెప్తూనే.. మరోవైపు.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారుతోంది.
- Balaraju Goud
- Updated on: Jul 27, 2024
- 7:27 am
Telangana: ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పట్టాదారు పాసుబుక్కులకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
- Prabhakar M
- Updated on: Jul 26, 2024
- 7:56 pm
Prahlad Joshi: కొత్త వివాదంలో కాంగ్రెస్.. ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి..
రామ్ నగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చేందుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. బెంగళూరులోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో రాం నగర్ అనే పేరు కలిగిన ప్రాంతాన్ని బెంగళూరు సౌత్ జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదించింది.
- Srikar T
- Updated on: Jul 26, 2024
- 7:08 pm
Kishan Reddy: బడ్జెట్లో ఏం లేదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందు దొందే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్ లో ఏమి లేదని.. బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఏమీ కనిపించలేదని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 9:36 pm
KCR: ఈ రంగాలపై ప్రభుత్వం పాలసీ ఏంటి.. బడ్జెట్పై కేసీఆర్ కౌంటర్..
తెలంగాణ బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భట్టి పద్దు బడ్జెట్లాగా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప వాస్తవం లేదన్నారు. రాష్ట్రం మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకశంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది అని కౌంటర్ ఇచ్చారు.
- Srikar T
- Updated on: Jul 25, 2024
- 3:31 pm
Telangana Budget: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అయితే సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడామన్నారు.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 12:41 pm
Budget 2024: ‘రెండు రాష్ట్రాలకే వడ్డించారు’.. బడ్జెట్పై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం..
కేంద్ర బడ్జెట్పై అధికార , విపక్షాల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ పార్టీలు ఆరోపించాయి. రాజ్యభలో కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే. రెండు రాష్ట్రాలకు మాత్రమే వడ్డించి మిగతా రాష్ట్రాలను విస్మరించారని అన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 24, 2024
- 11:41 pm
Telangana: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. బడ్జెట్ రోజు హాజరుపై వ్యూహం ఇదేనా.?
అసెంబ్లీకి కేసీఆర్ రావడం కొత్త కాదు కదా అని షాక్ అవుతున్నారా? ఆయన అసెంబ్లీకి కొత్తేమీ కాదు కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి అడుగుపెట్టడం మాత్రం మొదటిసారి. ఉద్యమ సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగాలను చాలామంది విన్నారు. ఆయన ప్రసంగాలు అన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉండేవి. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పదేళ్లపాటు అసెంబ్లీలో అనేక అంశాలపై కొన్ని వందల గంటలు మాట్లాడారు.
- Rakesh Reddy Ch
- Updated on: Jul 24, 2024
- 8:28 pm
Telangana: ‘అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం’.. కేంద్ర బడ్జెట్పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేపు పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా? అని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం రేవంత్.. రాహుల్ గాంధీతో పార్లమెంటులో మాట్లాడించాలన్నారు. అలాగే ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:52 pm
CM Revanth: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:02 pm
Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో ప్రతి మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్..!
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సీఎం రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందులో భాగంగానే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న తరువాత అక్కడి లాబీలో భట్టి మీడియా చిట్ చాట్లో మాట్లాడారు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 4:09 pm
Telangana: రేపే అసెంబ్లీ సమావేశాలు.. తొలిసారి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 10:08 pm
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్, మంత్రుల బృందం బిజీబిజీ.. ఈ అంశాలే అజెండాగా పర్యటన..
అటు పాలనాపరమైన భేటీలు.. ఇటు పార్టీపరమైన భేటీలు.. మొత్తంగా ఢిల్లీ టూర్లో తెలంగాణ సీఎం రేవంత్ బిజీబిజీగా గడిపారు. హస్తినలో ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం చాలామందితే కలిసింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్ బృందం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని వివరించారు.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 8:57 pm
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఆ అంశాలపై క్లారిటీ రానుందా..
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండనున్నారు. నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లగా.. రెండు రోజులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలోనే మకాం వేశారు. ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jul 21, 2024
- 9:43 pm
Anurag Thakur: ‘రాజ్యాంగాన్ని అవమానించింది రాహుల్ గాంధీ కుటుంబమే’.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై ఎక్కువ ప్రేమ చూపిస్తోందని, రాహుల్ కూడా ప్రతిసారీ రాజ్యాంగ గ్రంధాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారని ఎద్దేవాచేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేసింది రాహుల్ గాంధీ అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చూపించి దానిపై తప్పుడు ప్రమాణాలు చేయడం వల్ల నిజం అబద్దంగా మారిపోదన్నారు.
- Srikar T
- Updated on: Jul 21, 2024
- 7:03 pm