కాంగ్రెస్ పార్టీ
138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.
దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.
తెలంగాణకు రెట్టింపు నిధులు కావాలా? అయితే ‘మేరే సే జోడో’.. రేవంత్కు ప్రధాని మోదీ ఆఫర్!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా "మేరే సే జోడో" (నాతో జతకట్టండి) అనే మాట మార్మోగిపోతోంది. ప్రధాని మోదీ చేసిన "మేరే సే జోడో" కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. హైదరాబాద్లోని HICCలో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 5:41 pm
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక కీలక పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాఖలైన ఈ పిటిషన్ను విచారించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన 'పేపర్ బుక్' (పిటిషన్ రికార్డులను) సీల్ చేసి భద్రపరచాలని స్పష్టం చేసింది.
- Balaraju Goud
- Updated on: May 7, 2026
- 8:22 pm
Revanth Reddy: కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కేరళలో యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ, పార్టీ అగ్రనేతలను ప్రశంసించారు. తన ప్రచారానికి లభించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు తెలంగాణ కాంగ్రెస్లో నూతనోత్తేజాన్ని నింపింది. కాంగ్రెస్ పాలనలో కేరళ అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
- Prabhakar M
- Updated on: May 4, 2026
- 4:43 pm
Party Wise Election Results 2026 Winners: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బెంగాల్లో కమల వికాసం.. 5 రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
All Party Alliance Wise Election Results 2026 and Winners in Telugu: పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా.. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ విజయానికి చేరువలో ఉండగా.. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది.
- Shaik Madar Saheb
- Updated on: May 4, 2026
- 11:50 am
Kerala CM: కేరళ సీఎం ఎవరు..? రేసులో ఆ ముగ్గురు.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఏమన్నారంటే..
యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో కేరళ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ప్రతిపక్ష నేత సతీశన్తో పాటు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, సురేశ్ సీఎం రేసులో ఉన్నారు. శశిథరూర్ ఈ విషయంపై స్పందిస్తూ, పార్టీ మార్పును కోరుకుంటోందని, సీఎం నిర్ణయం హైకమాండ్దేనని స్పష్టం చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 4, 2026
- 11:10 am
ఉత్కంఠ రేపుతోన్న ముంబై బెట్టింగ్ మార్కెట్ అంచనాలు.. ఐదు రాష్ట్రాల్లో ట్రెండ్ ఏమిటి?
ఎన్నికల ఫలితాల వేళ, దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు గడువు దగ్గరపడుతున్న కొద్దీ, అటు ఎగ్జిట్ పోల్స్, ఇటు ముంబై బెట్టింగ్ మార్కెట్ అంచనాలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.
- Balaraju Goud
- Updated on: May 3, 2026
- 7:20 pm
ఫుల్లీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. పశ్చిమ బెంగాల్ సెకండ్ ఫేజ్ పోలింగ్ షురూ..!
పశ్చిమ బెంగాల్లో రెండవ, చివరి దశ పోలింగ్ బుధవారం (ఏప్రిల్ 29) ప్రారంభమైంది. ఈ రెండవ దశలో 142 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో, 152 స్థానాలలో 92 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ రెండవ దశలో 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.
- Balaraju Goud
- Updated on: Apr 29, 2026
- 8:38 am
బీఆర్ఎస్ పని అయిపోయింది.. కొత్త పార్టీకి తావులేదు.. ఇక కాళేశ్వరం లెక్కలు తేలుస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మీడియా చిట్చాట్లో భాగంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కీలక విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నుంచి బీఆర్ఎస్ కనుమరుగవుతోందని ఆయన జోస్యం చెప్పారు.
- Balaraju Goud
- Updated on: Apr 28, 2026
- 8:33 am
గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం.. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్, ఎం. కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో అజారుద్దీన్, కోదండరాం ఇద్దరూ మండలికి వెళ్లడం ఖరారైంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 25, 2026
- 1:24 pm
భారీ భద్రత మధ్య ప్రారంభమైన ‘మినీ పోరు’..! తొలి గంటల్లోనే బెంగాల్, తమిళనాడులో భారీగా పోలింగ్
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్ల వద్ద పొడవైన బారులు తీరాయి. బెంగాల్లో మమతా బెనర్జీ విశ్వసనీయత ప్రమాదంలో పడగా, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం ఉదయం 9 గంటల వరకు ఉన్న ఓటింగ్ గణాంకాలను విడుదల చేసింది.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2026
- 10:44 am
వ్యూహప్రతివ్యూహాల మధ్య బెంగాల్ ఎన్నికల రణం.. తొలి దశలో 3.6 కోట్ల మంది ఓటర్ల తీర్పు!
పశ్చిమ బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమరం నేడు (ఏప్రిల్ 23, 2026) ఘనంగా ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలు బెంగాల్ వర్తమానంతో పాటు భవిష్యత్తును నిర్దేశించేవి కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2026
- 10:28 am
అజారుద్దీన్ ఎమ్మెల్సీపై వీడని ఉత్కంఠ.. గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా ప్లాన్ బీ అమలవుతుందా?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ కోటాపైనే ఉంది. గవర్నర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే, అజారుద్దీన్పై గతంలో ఉన్న కొన్ని కేసులు ఆయన నామినేషన్కు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2026
- 10:06 am