AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

Kishan Reddy: భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి.. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భూములు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.. HILT పాలసీ పేరుతో మరో భూదందాకు తెరలేపారని, 9వేల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో మరోసారి రెపరెపలాడిన కాషాయ జెండా.. ఒకే స్థానానికే పరిమితమైన కాంగ్రెస్

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా చూపించింది. 12 డివిజన్లకు జరిగిన ఉపఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఐదు స్థానాల్లో మూడింటిని ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఒకటి కాంగ్రెస్‌ గెలుచుకోగా.. మరో స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల ఫలితాలను ఈరోజు (డిసెంబర్ 3న) ప్రకటించారు.

దేవుళ్లపై రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు బీజేపీ నేతలు. మూడు కోట్ల హిందు దేవతలున్నారని ఒక్కొక్కరు ఒక్కో ఓదేవుడిని నమ్ముతారని, అన్ని రకాల దేవుళ్లు ఉన్నట్టే కాంగ్రెస్‌ పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Telangana: ‘దిష్టి’చుక్క .. దీనికుందో లెక్క..! నిత్యం రగులుతూనే ఉన్న తెలంగాణ సెంటిమెంట్..

ఇంతకీ.. ఏం జరిగింది అక్కడ? తెలంగాణ టాపిక్ ఎందుకొచ్చింది? కోనసీమ అంటేనే కొబ్బరిచెట్లకు నెలవు. ఆ అందం అద్భుతం. కాని, క్రమంగా ఆ ఛాయలు తగ్గిపోతున్నాయి. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. కొబ్బరి చెట్టు పైభాగం రాలిపోయి ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. సముద్రపు ఆటుపోటులే..

Telangana: రక్తపాతాలు జరిగిన చోట వెల్లివిరిసిన సామరస్యం.. సర్పంచ్ పదవి ఏకగ్రీవం..

కత్తులు దూసిన ఆ గ్రామంలో అంతా ఒక్కతాటిపైకి రావడంతో శాంతి విరాజిల్లింది.. ఐక్యతా రాగంతో.. సర్పంచ్ పదవికి ఓ మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో.. ఆ గ్రామం చరిత్రలో నిలిచింది.. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని కలకోట గ్రామం.. ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. అనేలా.. గ్రామస్థులందరూ కలిసి రావడం గమనార్హం..

పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు రిలీజ్ కావు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

విభజన గాయాన్ని మళ్లీ రేపిందెవరు.. ఎవరి దిష్టి ఎవరికి తగిలింది.. సెంటిమెంట్‌తో కూడిన అంశాల్లో నేతల మాట ఒక్క శాతం అటు ఇటు అయినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ్‌. ఇటీవల పవన్‌ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయ్‌. ఈ క్రమంలోనే.. పవన్ కల్యాణ్‌కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Parliament Winter Session: రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే!

ఢిల్లీ వాయు కాలుష్యం ఈసారి పార్లమెంట్‌ను కమ్మేయనుంది.. అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రజలు శ్వాసించాలంటే భయపడేలా ఉన్న వాయు నాణ్యత గురించి దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్లో చర్చ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీత‌కాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.

కర్ణాటకలో కొలిక్కిరాని సీఎం లొల్లి.. హైకమాండ్‌ నుంచి కబురుకోసం డీకే, సిద్దరామయ్య వెయిటింగ్‌!

కర్ణాటకలో సీఎం పదవి కోసం సిద్దరామయ్య , డీకే శివకుమార్ మధ్య పోటీ మరింత ముదిరింది. ఈసారి ముఖ్యమంత్రి కాకుంటే ఎప్పటికి సీఎం కాలేనన్న ఆలోచనలో డీకే శివకుమార్‌ ఉన్నారు. అందుకే హైకమాండ్‌ మీద గతంలో ఎన్నడు లేని విధంగా ఒత్తిడి పెంచారు. డీకే వర్గానికి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో క్యాంప్ వేశారు .

పల్లెల్లో ‘పంచాయతీ’ సందళ్లు.. ఊరుఊరంతా ఒకటే గుసగుస..! ఇంతకీ ఊరికి మొనగాడు ఎవరు?

సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు.. తమలో ఒకరిని 'ప్రెసిడెంట్'ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. స్వపరిపాలనకు అసలైన అర్ధం ఈ సర్పంచ్ ఎన్నికలు. బట్.. ఇప్పుడా పరిస్థితి లేదనుకోండి. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అవుతున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధుల కూడా రాజకీయ పార్టీల అండదండలు కోరుకుంటున్నారు. పార్టీల జోక్యం ఉంటోంది కాబట్టే ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. సో, ఊళ్లల్లో పైచేయి 'చేతి' గుర్తుదా, కారుదా, కమలమా, సుత్తికొడవలా, కంకి కొడవలా, పతంగినా.. ఎవరు బలపరిచిన అభ్యర్ధి గెలుస్తాడనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఇంతకీ.. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి ఎలా ఉంది?

దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళం

తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గొప్ప మనస్సు చాటుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన 11 ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని తన స్వగ్రామం రహత్ నగర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు పది ఎకరాలు, సబ్ స్టేషన్ కోసం ఎకరా తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు.