కాంగ్రెస్ పార్టీ
138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.
దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.
తోటి ప్రయాణికులతో ముచ్చట్లు.. సామాన్య ప్రయాణికుడిలా రైలెక్కిన మంత్రి జూపల్లి కృష్ణారావు!
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం (మే 31) సామాన్య ప్రయాణికుడిలా రైలు ప్రయాణం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సిర్పూర్ కాగజ్నగర్కు బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఆయన ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.
- Balaraju Goud
- Updated on: May 31, 2026
- 4:13 pm
పట్టణ పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల కానుక.. ఎప్పటి నుంచంటే.. ?
పట్టణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అత్యాధునిక ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో తొలివిడతగా మంజూరు చేసిన లక్ష ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: May 30, 2026
- 1:23 pm
‘జమీందారీ పోకడలు పక్కన పెట్టండి.. జనంలోకి వెళ్లండి’.. లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్!
ఇప్పటి వరకు పాలనపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. మెయిన్గా పార్టీపైనా, లీడర్లపైనా దృష్టి పెట్టారు. కొందరు నేతల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'జమీందారీ పోకడలు పక్కన పెట్టండి.. జనంలోకి వెళ్లండి' అంటూ గట్టిగానే మాట్లాడారు. తనతో సహా ఎవరికీ మినహాయింపులు లేవంటూ కఠిన నిబంధనలు పెట్టారు. మరి పీఏసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ కీలక వ్యాఖ్యలు ఏంటి? ఎమ్మెల్యేలకు ఇచ్చిన టార్గెట్ ఏంటి?
- Balaraju Goud
- Updated on: May 30, 2026
- 8:02 am
కన్నడ రాజకీయంలో ‘డీకే’ మార్క్ సోషల్ ఇంజనీరింగ్.. ‘టీమ్ DK’ ఎవరెవరికి ఏ పదవంటే?
కర్ణాటక పాలిటిక్స్లో ఇప్పుడు అందరి కళ్లూ 'టీమ్ DK' వైపే! సరికొత్త వ్యూహాలతో, పక్కా ప్లానింగ్తో కర్నాటక కొత్త మంత్రివర్గ కూర్పు సిద్ధమవుతోంది. కేవలం అధికారం పంపకమే కాదు.. రాబోయే రోజుల్లో అసమ్మతి అనే మాటే రాకుండా డీకే శివకుమార్ అండ్ టీమ్ మైండ్ గేమ్ ఆడుతోంది.
- Balaraju Goud
- Updated on: May 30, 2026
- 7:47 am
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. సిద్ధూ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న డీకే!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మంత్రుల సమక్షంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: May 28, 2026
- 2:00 pm
భలే ఛాన్స్ లే..! ఆరు దశాబ్దాల కల.. విజయ్ ‘చేయూత’తో నెరవేరిన వేళ!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేబినెట్లోకి వచ్చింది. ఆరు దశాబ్దాల నుంచి నెలకొన్న నిరీక్షణ ఇప్పట్లో సాధ్యమవుతుంది అని కాంగ్రెస్ కూడా అనుకోలేదు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న పార్టీతో మిత్రపక్షంగా ఉన్నా కూడా కేబినెట్లో చోటు దక్కని కాంగ్రెస్ కు ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంతకీ అంత సుదీర్ఘమైన గ్యాప్ ఎందుకొచ్చింది..?
- Ch Murali
- Updated on: May 21, 2026
- 12:26 pm
SIRపై తెలంగాణలో సరికొత్త పొలిటికల్ వార్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు.. బీజేపీ కౌంటర్
ఓట్లపై బీజేపీ కుట్రలు.. ఆపండి మీ డ్రామాలు.. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్పుడే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఇదంతా బీజేపీ కావాలనే చేస్తోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. ఈ ప్రక్రియ ఇప్పుడే కొత్తగా చేపడుతోంది కాదంటూ కౌంటర్ ఇస్తోంది కమలదళం.
- Shaik Madar Saheb
- Updated on: May 17, 2026
- 9:40 pm
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్.. చెన్నితాల, మురళీధరన్లకు చోటు!
కేరళ రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేరళ కాబోయే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత వి.డి. సతీసన్ ఎంపికయ్యారు. సోమవారం (మే 18, 2026) జరగనున్న నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల పేర్లను సతీసన్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: May 17, 2026
- 9:35 pm
పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏంటి? సీఎం కుర్చీ మీద ఆశపడుతున్నారా?
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్కు ఇచ్చిన 'క్రాస్ఫైర్' ఇంటర్వ్యూలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో తన తదుపరి లక్ష్యం, సీఎం కుర్చీపై ఆశల గురించి వస్తున్న ప్రచారాలను ఆయన సున్నితంగా తిప్పికొట్టారు.
- Balaraju Goud
- Updated on: May 16, 2026
- 9:02 pm
Ponguleti Srinivasa Reddy: సీఎం కుర్చీ.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్ట్స్ టార్గెట్ అదేనా..? సంచలన ఇంటర్వ్యూ
రాజకీయంగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏంటి? సీఎం కుర్చీ మీద ఆశపడుతున్నారా? 30శాతం కమీషన్ తీసుకుంటారనే ప్రచారంలో నిజమెంత? BRSలో పొంగులేటికి జరిగిన అన్యాయమేంటి?.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల BRSలబ్ధి పొందిందా?.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్కు ఇచ్చిన క్రాస్ఫైర్లో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 16, 2026
- 7:29 pm
నాడు చెత్త ఆటో.. నేడు ప్యాసింజర్ ఆటో.. గుర్తు పట్టుకుండా తిరుగుతున్న ఎమ్మెల్యే.. ఎందుకంటే?
సాధారణంగా ప్రజా ప్రతినిధి అనగానే మంది మార్బలంతో హంగామా చేస్తుంటారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులతో ఏసి రూముల్లో సమీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే రూటే.. సపరేటు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఆయన సామాన్యుడిలా అవతారం ఎత్తారు. ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆయన ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
- M Revan Reddy
- Updated on: May 12, 2026
- 8:10 pm
తెలంగాణకు రెట్టింపు నిధులు కావాలా? అయితే ‘మేరే సే జోడో’.. రేవంత్కు ప్రధాని మోదీ ఆఫర్!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా "మేరే సే జోడో" (నాతో జతకట్టండి) అనే మాట మార్మోగిపోతోంది. ప్రధాని మోదీ చేసిన "మేరే సే జోడో" కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. హైదరాబాద్లోని HICCలో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 5:41 pm