AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

వివాదంగా మారుతున్న కూతురు వ్యవహారం.. టీపీసీసీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ ఘాటు వివరణ!

మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి వివరణ ఇచ్చారు. కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తాను బాధ్యురాలిని కానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిపై సుస్మితా వ్యాఖ్యలతో పార్టీలో దుమారం రేగింది. నోటీసును ఉపసంహరించుకోవాలని సురేఖ కోరారు. తదుపరి కమిటీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం.. క్రమశిక్షణ కమిటీ ముందుకు మంత్రి కొండా సురేఖ..

పరకాల రాజకీయాలపై కొండా సుస్మితా పటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో రేవూరినే అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆమె ప్రశ్నిస్తూ.. పరకాలలో పోటీ చేసేది, గెలిచేది తానేనంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

స్మార్ట్ రేషన్ కార్డు ప్లాస్టిక్ కాదు.. పేదల ఆత్మగౌరవం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రారంభించారు. ఇవి కేవలం కార్డులు కాదని, పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఉద్ఘాటించారు. 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ, రైతులకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యం తమ ప్రభుత్వ సంక్షేమ విధానాలని వివరించారు.

ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవాలకు ఖర్గే, రాహుల్ గాంధీ దూరం.. కారణం అదేనా..?

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకాలేదు. వరుసగా రెండో ఏడాది కూడా ఇద్దరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూర్చునే ఏర్పాట్లు, ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అసంతృప్తితోనే కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ్య రహస్యమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురించి రాజకీయాలపై ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ ఆయన వ్యక్తిగత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి, కుటుంబంతో ఉండే తీరు గురించి మాత్రం విడివిడిగా వచ్చిన విషయాలు తక్కువే. వాటన్నింటినీ ఒక చోట చేరిస్తే.. “రేవంత్ రెడ్డి ఆరోగ్య రహస్యం ఏంటి?” అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం కనిపిస్తుంది.

నదీ జలాలపై మళ్లీ రాజకీయం..! మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. ఆగస్టు 18న ఏం జరగబోతోంది?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గోదావరి జలాల వివాదం మరోసారి వేడెక్కింది. ఆగస్టు 18న జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం చుట్టూ రెండు రాష్ట్రాల్లో రాజకీయ హీట్ పెరిగింది. తెలంగాణలోని ఏడు సాగునీటి ప్రాజెక్టులపై పునస్సమీక్ష, కాళేశ్వరం నీటి సామర్థ్యం, సమ్మక్కసాగర్ అనుమతులు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వంటి అంశాలపై ఏపీ లేవనెత్తిన డిమాండ్లు చర్చకు రానున్నాయి.

ఆయన అహంకారం వల్లే పార్లమెంట్ సమావేశాలు దెబ్బతిన్నాయి: రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల చర్చలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు సజావుగా సాగలేదని ఆరోపించారు. కేవలం ఒక వ్యక్తి అహంకారం కారణంగానే మొత్తం సమావేశాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. డిమాండ్లను అంగీకరించినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గకుండా కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నాయని ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు.

యూపీలో సరికొత్త రాజకీయ వ్యూహాలు.. ఆ ఓటర్ల వైపే అన్ని పార్టీల చూపు..!

Gen Z Voters: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కుల సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంకులతో పాటు ఇప్పుడు జెన్-జీ ఓటర్లపై ప్రధాన పార్టీల దృష్టి పడింది. సోషల్ మీడియా, విద్య, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు డిజిటల్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని యువ ఓటర్ల మద్దతు వచ్చే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, వారిని ప్రసన్నం చేసుకోవడం పార్టీలకు కీలకంగా మారింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..! ఎవరో తెలుసా..?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జెన్ జెడ్‌ (Gen Z) యువత, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యేందుకు కొత్త ప్రయత్నం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (Ask Me Anything) సెషన్ నిర్వహించారు. విద్యార్థుల నిరసనలు, విద్యా వ్యవస్థ, మహిళా విద్య, రాజకీయాలు వంటి అంశాలతో పాటు బాట్‌మాన్ వంటి సరదా ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు.

పాదయాత్రల నుంచి పబ్లిక్ సర్వీస్ వరకు… మారుతున్న రాజకీయాల కొత్త ఫార్ములా!

ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజల మనసు గెలవాలంటే పాదయాత్రే ప్రధాన ఆయుధంగా ఉండేది. వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ద్వారా నాయకులు తమ రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకునేవారు. కానీ కాలం మారుతోంది... రాజకీయ కమ్యూనికేషన్ కూడా మారుతోంది. ఇప్పుడు జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, మహిళా సమావేశాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావడం వంటి కొత్త పద్ధతులు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. మరి నిజంగానే పాదయాత్రల యుగానికి ప్రత్యామ్నాయం వచ్చిందా?

ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ

నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో మంగళవారం (జూలై 28) కీలక చర్చ జరగనుంది. నీట్ అంశంపై వరుసగా ఆరు రోజుల పాటు పార్లమెంట్‌లో కొనసాగిన ప్రతిష్టంభన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చకు అంగీకారం కుదరడంతో ఈ బిల్లు సభలో ప్రధాన అజెండాగా మారింది.

ఢిల్లీలో CJP ఆందోళనలపై కేంద్ర నిఘా వర్గాల అనుమానాలు!

ఇండియా అన్‌లిమిటెడ్.. ఇండియా అన్‌స్టాపబుల్.. ఇండియా అన్‌బీటబుల్.. విశాలమైన భూభాగం, పెరుగుతున్న యువ జనాభా, అనుకూలమైన భౌగోళిక స్థితి, పవర్‌ఫుల్ డెమొక్రసీ, పటిష్టమైన సైనిక శక్తి, సురక్షితమైన విదేశాంగ విధానం.. ఇలా భారతదేశానికి ఉన్న సూపర్ స్పెషాలిటీస్‌ గురించి చాలానే చెప్పుకోవచ్చు. పైగా, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మన ఐటీ ప్రొఫెషనల్స్ సోకాల్డ్ అగ్రరాజ్యాలకు ఆక్సిజన్‌ అవుతున్నారు. ఒక రకంగా 'గ్లోబల్ సౌత్' మొత్తాన్నీ లీడ్‌ చేస్తోంది హమారా భారత్. అమెరికా, రష్యా, యూరోపియన్ కంట్రీస్‌తో బలమైన దౌత్య సంబంధాలతో పూర్తిగా సేఫ్‌జోన్‌లో ఉంది భారత్. ముఖ్యంగా అతితక్కువ యుద్ధభయం ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు. ఉపఖండం చుట్టూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడిగి, రాజకీయ స్థిరత్వం లేక ప్రపంచం ముందు చులకనైపోయినా.. భారతదేశం మాత్రం దశాబ్దాల తరబడి స్టెబుల్‌గా స్టాండర్డ్‌గా నిలబడింది. అందుకే, ఎక్కడో ఎవ్వడికో కన్నుకుట్టింది. లేక ఎటు నుంచైనా దిష్టి తగిలుండొచ్చు. ఇంటర్నల్ ఇండియా కొద్దికొద్దిగా వేడెక్కుతున్నట్టుంది. వారం పది రోజులుగా తడబడుతున్నట్టుంది లాఅండ్ ఆర్డర్‌. హాట్‌హాట్‌గా మారిన ఢిల్లీ ఫైల్స్.. నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి?