AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

ప్రాంతీయ పార్టీల ‘చీలిక’.. కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా? జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలివే!

భారత రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీల చుట్టూనే చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో తలెత్తుతున్న అసమ్మతి, చీలికలు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఏ మేరకు లాభం చేస్తాయి? బీజేపీకి ఉన్న అవకాశాలేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జంట నగరాల ప్రజలు, మెట్రో కారిడార్ పరిధిలోని ప్రజలకు కీలక విషయాలను వెల్లడించారు. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివ‌ృద్దిని అడ్డుకుంటారని మండిపడ్డారు.

మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న దానికంటే, ప్రారంభ దశలోనే సరైన న్యాయపరమైన వాదనలు వినిపించకపోవడమే మీనాక్షికి ఎక్కువ నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో మీనాక్షి నటరాజన్‌కు కొంత ఊరట లభించినప్పటికీ, ఆమె తరఫున వ్యవహరించిన న్యాయవాదుల పాత్రపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

మీనాక్షి నటరాజన్‌కు షాక్.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవం..!

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఎన్నిక అనివార్యం కాకుండా పోయింది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించబడ్డారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠ.. మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో నిరాశ..!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో గురువారం (జూన్ 11) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన నామినేషన్‌ను రద్దు చేస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆమె భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు వెంటనే స్వీకరించడానికి నిరాకరించింది. “రేపు రండి.. రేపే విచారణ చేపడతాం” అంటూ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.

బెంగాల్ రాజకీయంలో పెను తుఫాను.. రెబెల్స్ షాక్‌తో సోనియా గాంధీతో మమతా అత్యవసర భేటీ!

బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను తుఫాను చెలరేగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఇప్పుడు నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడింది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా పార్టీలోనే ఊహించని రీతిలో భారీ తిరుగుబాటు మొదలైంది. ఏకంగా 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్‌సభ ఎంపీలు మమతపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు

తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో పోల్చుతూ బహిరంగ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాల వంటి కీలక అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. 2028 ఎన్నికల లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి.

‘కేటీఆర్‌తో లోకేష్ సరితూగలేరు.. నాయకుడిగా మరింత ఎదగాల్సి ఉంది’: కడియం

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏపీ రాజకీయాలు, తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నేతలపై స్పందిస్తూ.. నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కుమారుడిగానే ప్రొజెక్ట్ అవుతున్నారని, నాయకుడిగా ఆయన మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

“రేవంత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. మళ్లీ గెలిచే సత్తా ఉంది”: క్రాస్‌ఫైర్‌లో కడియం కీలక వ్యాఖ్యలు!

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ రాజకీయాలు, పార్టీల భవిష్యత్తుపై ఆసక్తికర విశ్లేషణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

“డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయా.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోయా”: కడియం

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు సంచలన విషయాలు బయటపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ, స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏమీ చేయలేకపోయానని కడియం అంగీకరించారు.

“సాంకేతికంగా నేను బీఆర్ఎస్సే.. కానీ..” టీవీ9 క్రాస్‌ఫైర్‌లో కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పలు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. తా తాను సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్‌తో తనకు సంబంధం లేదని స్పీకర్‌కు అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు.

కాలం మారింది.. రికార్డు మారింది! నాడు రేడియో కాలపు రాజకీయం.. నేడు రీల్స్ కాలపు పోరాటం..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 10 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజున ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకోనున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. దీంతో, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన సుదీర్ఘ కాలపు రికార్డును నరేంద్ర మోదీ అధిగమించనున్నారు.