AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌ ఖాతాలోనే పడనున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలో సరిపడ బలం లేకపోయినా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది.

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట.. ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..?

మాట ఇచ్చాం మడమతిప్పం అంటున్నారు లోకల్ కామ్రేడ్‌లు.. కాదు.. కాదు.. కాంగ్రెస్‌తో కలిసుంటేనే కలదు సుఖం అంటోంది కామ్రేడ్ అదిష్టానం. ఇంత జరిగాక వెనక్కి తగ్గితే ప్రజల్లో చులకన అవుతామంటున్నారు లోకల్ ఎర్రన్నలు. అలా కాదు మరోసారి ఆలోచించండి.. భవిష్యత్ అవసరాల కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదంటోంది ఆ పార్టీ అధినాయకత్వం.

AI సమ్మిట్‌లోకి దూసుకువచ్చిన యువజన కాంగ్రెస్ నేతలు.. టీ-షర్టులు విప్పి నిరసన..!

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. అయితే ఏకంగా భారత్ మండపంలోకి భారత యువజన కాంగ్రెస్ నాయకులు ప్రవేశించారు. ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. AI సమ్మిట్‌లో ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

ప్రజా పాలన చేపట్టిన తల్లి కూతుళ్లు.. ఒకరు మేయర్ గా.. మరొకరు గ్రామ సర్పంచ్‌గా..!

రాజకీయాల పట్ల ఆసక్తిలేకున్నా.. కొందరు మహిళలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఒకరు గ్రామ సర్పంచ్‌గా.. మరొకరు నగర మేయర్‌గా ఎన్నికై పాలనా పగ్గాలు చేపట్టారు. ప్రజా పాలన చేపట్టిన తల్లీకూతుళ్లు.. గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

కాలం కలిసి వస్తే.. అదృష్టం తలుపు తడుతుందంటే ఇదే..! మున్సిపల్ చైర్మన్, వైస్-చైర్మన్‌గా భార్యాభర్తలు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలి చైర్మన్‌గా జూపల్లి శశికళ, ఆమె భర్త జూపల్లి రమేష్ బాబు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా పేరొందిన జూపల్లి రమేష్ దంపతులు నూతన మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ ,13వ వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు.

Telangana: ఇక ఉప్పు నిప్పుల్లేవ్..! మేయర్, ఛైర్మన్‌గిరి కోసం.. బద్ధ శత్రువుల మధ్య చిగురించిన ప్రేమలు!

ఇట్స్ మిరాకిల్. పొలిటికల్ సైన్స్‌లో ఇవో విచిత్రమైన సన్నివేశాలు. గతంలో చూసుంటారు.. బట్ అడపాదడపా. కాని, ఒకేసారి, ఒకేపూటలో ఇన్ని రాజకీయ వైచిత్రిలు చూడ్డం బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు.. వాళ్లని ఓడించండి, మాకే ఓటేయండని ప్రచారాల్లో సెగలు కక్కుకున్న పార్టీలు.. ఇలా కలిసిపోయి అధికారం పంచుకుంటాయని ఎవ్వరూ ఊహించరు.

Chandrababu – Tummala: ఆ ఐదు గ్రామాల కోసం.. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ..

ఆ ఐదు గ్రామాల అంశంతో పాటు పలు సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీటితో పాటు పలు ఇతర అంశాలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్‌ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.

Jeevan Reddy : పార్టీలో కొనసాగడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానన్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియడం లేదన్నారు. పార్టీలో ఇంకెంత కాలం అవమానాలు భరించాలని ప్రశ్నించారు. సంజయ్‌ ఉన్నంత వరకు తమకు ఈ వేధింపులు తప్పవన్నారు.

  • Anand T
  • Updated on: Feb 17, 2026
  • 12:01 am

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. !

తెలంగాణలో మున్సిపల్‌ పోరు ముగిసి మూడు రోజులు అవుతున్నా పొలిటికల్ డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఐదు మున్సిపాలిటీలు.. హంగ్ పాలిటిక్స్‌తో హీట్‌ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ మధ్య క్యాంప్‌ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి.

Nizamabad Municipal Election Result: రెండోసారి కమలం చేజారిన ఇందూరు పీఠం.. మజ్లిస్‌తో కలిసి మేజిక్ ఫిగర్..!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

MLA Komatireddy: మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఆయన ఏదో సెన్సేషనల్ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Telangana Municipal Election Results: ఒక్క ఓటు మ్యాజిక్‌.. అభ్యర్థుల జీవితాలనే మార్చేసింది..!

పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్‌కట్‌గా ఉంది. రూలింగ్ పార్టీకే జైకొట్టింది. నంబర్ల విషయంలో నో కన్‌ఫ్యూజన్. కానీ, పట్టణ ఓటరు మాత్రం పెద్ద పజిలే పెట్టేశాడు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు, అలాగని ఏ పార్టీనీ నిరుత్సాహపర్చలేదు మున్సిపల్ ఫలితం. ఓవరాల్‌గా పురపోరు ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది.

ఏం కష్టాలు సామీ..! గ్యాస్ లేదని వాటర్ హీటర్‌తో వంట చేస్తున్నారు!
ఏం కష్టాలు సామీ..! గ్యాస్ లేదని వాటర్ హీటర్‌తో వంట చేస్తున్నారు!
సినిమాల్లో గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు ప్రతిరోజూ నరకమే అంటూ కామెం
సినిమాల్లో గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు ప్రతిరోజూ నరకమే అంటూ కామెం
ఏపీలో మరో కొత్త హైవే.. బెంగళూరుకు 8 గంటల్లోనే ప్రయాణం..
ఏపీలో మరో కొత్త హైవే.. బెంగళూరుకు 8 గంటల్లోనే ప్రయాణం..
బిగ్ న్యూస్.. పెట్రోల్ రేట్లు పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన..!
బిగ్ న్యూస్.. పెట్రోల్ రేట్లు పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన..!
విజయ్‏కు దెబ్బ మీద దెబ్బ.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..
విజయ్‏కు దెబ్బ మీద దెబ్బ.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..
17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం
17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం
వంటగ్యాస్ లేదా..దోంట్‌ వర్రీ! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా!!
వంటగ్యాస్ లేదా..దోంట్‌ వర్రీ! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా!!
ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం..
ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం..
రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్
రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్
మోనాలిసా భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా
మోనాలిసా భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా