
కాంగ్రెస్ పార్టీ
138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.
దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.
Telangana Assembly: 30శాతం కమీషన్లు..! ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. అసెంబ్లీలో దుమ్ముదుమారం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. పలు అంశాలపై సుధీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ.. స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 26, 2025
- 1:50 pm
Telangana Politics: తగ్గేదేలే.. బీఆర్ఎస్ vs బీజేపీ మధ్యలో కాంగ్రెస్.. తెలంగాణ పాలిటిక్స్లో ఫిర్యాదుల పరంపర
తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలు ప్రత్యర్థి పార్టీల నేతలపై వరుస ఫిర్యాదులు చేస్తుండటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు..
- Shaik Madar Saheb
- Updated on: Mar 26, 2025
- 7:25 am
Telangana Cabinet: ఆ నలుగురు ఎవరు..? తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్..
ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురుచూస్తోన్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం దగ్గరపడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి ఆమోద ముద్ర పడింది. ఐతే కేబినెట్లో రెండు బెర్త్లను పెండింగ్లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
- Shaik Madar Saheb
- Updated on: Mar 25, 2025
- 6:58 am
హనీట్రాప్ వ్యవహారంపై అట్టుడికిన అసెంబ్లీ.. సీడీలు ప్రదర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు
కర్ణాటక అసెంబ్లీలో హనీట్రాప్ వ్యవహారంపై రగడ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో సీడీలను ప్రదర్శించారు. నేతల హనీట్రాప్ వెనుక ఉన్నది ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. మంత్రులే తమపై హనీట్రాప్ జరిగిందని ఆరోపిస్తున్నారని నినాదాలు చేశారు.
- Balaraju Goud
- Updated on: Mar 21, 2025
- 2:57 pm
Pralhad Joshi: కాంగ్రెస్ది బుజ్జగింపు రాజకీయం.. కర్ణాటక ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్..
మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని బీజేపీ మండిపడుతోంది.. ఈ విషయంపై తాజాగా.. ఈ విషయంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకించడం, 4% రిజర్వేషన్ల వివాదాన్ని తిరస్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తంచేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 20, 2025
- 1:03 pm
Telangana Budget 2025: అభివృద్ధి, సంక్షేమంపైనే ఫోకస్.. రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్!
తెలంగాణ ప్రభుత్వం బుధవారం భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3.30 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. మరీ బడ్జెట్తో రాష్ట్ర ప్రజలను రేవంత్ సర్కార్ మెప్పిస్తుందా..?
- Shaik Madar Saheb
- Updated on: Mar 19, 2025
- 9:49 am
Telangana Assembly: తగ్గేదేలే.. వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ.. లైవ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదోరోజు మంగళవారం కొనసాగుతున్నాయి.. ఇవాళ సభ ముందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు రానుంది.. SC వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు..
- Shaik Madar Saheb
- Updated on: Mar 18, 2025
- 11:47 am
Telangana Assembly: వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులకు ఆమోదం..
ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతోపాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు.. ఈ బిల్లులపై సోమవారం అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ జరగనుంది.
- Shaik Madar Saheb
- Updated on: Mar 17, 2025
- 1:28 pm
Telangana Assembly: మళ్లీ చెబుతున్నా గుర్తుపెట్టుకోండి.. బీజేపీ ఎమ్మెల్యేలకు కిషన్రెడ్డి డైరెక్షన్..
సోమవారం నుంచి అసెంబ్లీలో ట్రయాంగిల్ వార్ షురూ కాబోతోందా..? జగదీష్ రెడ్డి ఎపిసోడ్తో నిన్నటిదాకా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచిన సభను.. బీజేపీ తనవైపు టర్న్ చేసుకోబోతోందా..? బడ్జెట్ సెషన్స్ జరుగుతున్న తీరుపై కమలంపార్టీ ఎమ్మెల్యేతో చర్చించిన కిషన్రెడ్డి.. నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు.. కిషన్రెడ్డి నేతలకిచ్చి క్లియర్ కట్ పిక్చర్ ఏంటి...? అనేది ఈ కథనంలో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Mar 16, 2025
- 7:16 am
Telangana Assembly: తగ్గేదేలే.. వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు శనివారం ప్రారంభమయ్యాయి.. ఇవాళ కీలక అంశాలపై ప్రభుత్వం, విపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ జరగనుంది. అయితే.. జగదీష్రెడ్డి వివాదం తర్వాత ఇవాళ సభ జరగనుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది..
- Shaik Madar Saheb
- Updated on: Mar 15, 2025
- 11:30 am