AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

Telangana: ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

  • Anand T
  • Updated on: Jan 8, 2026
  • 3:21 pm

Kishan Reddy: ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించడంతోపాటు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana Assembly Live: కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీ సమావేశాలు లైవ్

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. హిల్ట్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది.. అలాగే.. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా, గోదావరి జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు

నీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి.

మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ షురూ.. స్వయంగా 4బిల్లులు ప్రవేశ పెట్టబోతున్న సీఎం రేవంత్

మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ గెజిట్ నోటిఫికేషన్లు కూడా సభ ముందు ఉంచుతారని సమాచారం.

Telangana Assemly: దుమ్ముదుమారమే..! అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మంత్రి శ్రీధర్‌బాబు ఏమన్నారంటే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్ట్‌లపై చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే హాట్‌టాపిక్‌గా మారాయి.. ఇందుకు కారణం అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారని ప్రచారం.. కేసీఆర్‌ అటెండ్‌ అవుతారా? లేదా?అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.

CM Revanth Reddy: కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. కొత్త ఏడాదిలో కాబోయే మంత్రులు వీరేనా?

Telangana Cabinet Expansion: కొత్త సంవత్సరంలో కొత్త కేబినెట్. ఎవరికి దక్కేనో ఛాన్స్? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ. ఖాళీగా ఉన్న బెర్త్‌లను భర్తీ చేసి.. ఫుల్ టీమ్‌తో సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ.. కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కబోతోంది? పదవులు ఆశించి భంగపడ్డ వారికి పార్టీ ఎలాంటి న్యాయం చేయబోతోంది?

  • Anand T
  • Updated on: Dec 27, 2025
  • 7:38 am

వదలొద్దు.. ప్రతిమాటను తిప్పికొట్టండి.. మంత్రుల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వదలొద్దూ.. ప్రతిమాటను తిప్పికొట్టిండి.ప్రాజెక్టులపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ZPTC, MPTC, GHMC ఎన్నికల్లో రిజల్ట్స్‌ అంతకు మించి వుండాలన్నారు. లడాయి మొదలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం చేసిందన్న కేసీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నుంచి కౌంటర్‌ అటాక్‌ జోరందుకుంది.

Karnataka: సీఎం పదవిపై శాసన సభ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్దరామయ్య..!

తానే ఐదేళ్లపాటు కర్ణాటక ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీ సాక్షిగా సిద్దరామయ్య ప్రకటించారు. డీకే శివకుమార్‌తో సీఎం పదవిపై ఎలాంటి డీల్‌ లేదన్నారు. హైకమాండ్‌ మద్దతు తనకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుంటే, సిద్దరామయ్య నేతృత్వంలో పనిచేయడానికి అభ్యంతరం లేదన్న డీకే లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Telangana: వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవు.. MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం..

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన MLAల అంశంపై స్పీకర్‌ విచారణ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తున్న క్రమంలో ఇవాళ స్పీకర్‌ గడ్డం ప్రసాద్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఫిరాయింపు MLAల కేసులో తెలంగాణ స్పీకర్‌ కీలక తీర్పును వెలువరించారు.

సొంతగ్రామంలోనే అభ్యర్థుల ఓటమి.. ఆ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్.. లిస్ట్‌లో ఉన్నదెవరూ!

తెలంగాణలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని పరిణామం ఎదురైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అధికారి పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంతగ్రామంలోనే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. దీంతో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపికపై పెద్దగా దృష్టిపెట్టలేదనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆయా ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయినట్టు టాక్‌ నడుతస్తోంది.

రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. చిన్న చిన్న ఉద్రిక్తతల మధ్య ప్రశాంతం!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో విడతలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 14) జరిగిన రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి.ఎన్నికల్లో ఓ సర్పంచ్‌ అభ్యర్థి భర్త మిస్సింగ్ మిగతా అభ్యర్థులను టెన్షన్ పెట్టింది.