కాంగ్రెస్ పార్టీ
138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.
దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.
ఇంకా చదవండిప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ
నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026పై లోక్సభలో మంగళవారం (జూలై 28) కీలక చర్చ జరగనుంది. నీట్ అంశంపై వరుసగా ఆరు రోజుల పాటు పార్లమెంట్లో కొనసాగిన ప్రతిష్టంభన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చకు అంగీకారం కుదరడంతో ఈ బిల్లు సభలో ప్రధాన అజెండాగా మారింది.
- Balaraju Goud
- Updated on: Jul 28, 2026
- 9:21 am
ఢిల్లీలో CJP ఆందోళనలపై కేంద్ర నిఘా వర్గాల అనుమానాలు!
ఇండియా అన్లిమిటెడ్.. ఇండియా అన్స్టాపబుల్.. ఇండియా అన్బీటబుల్.. విశాలమైన భూభాగం, పెరుగుతున్న యువ జనాభా, అనుకూలమైన భౌగోళిక స్థితి, పవర్ఫుల్ డెమొక్రసీ, పటిష్టమైన సైనిక శక్తి, సురక్షితమైన విదేశాంగ విధానం.. ఇలా భారతదేశానికి ఉన్న సూపర్ స్పెషాలిటీస్ గురించి చాలానే చెప్పుకోవచ్చు. పైగా, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మన ఐటీ ప్రొఫెషనల్స్ సోకాల్డ్ అగ్రరాజ్యాలకు ఆక్సిజన్ అవుతున్నారు. ఒక రకంగా 'గ్లోబల్ సౌత్' మొత్తాన్నీ లీడ్ చేస్తోంది హమారా భారత్. అమెరికా, రష్యా, యూరోపియన్ కంట్రీస్తో బలమైన దౌత్య సంబంధాలతో పూర్తిగా సేఫ్జోన్లో ఉంది భారత్. ముఖ్యంగా అతితక్కువ యుద్ధభయం ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు. ఉపఖండం చుట్టూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడిగి, రాజకీయ స్థిరత్వం లేక ప్రపంచం ముందు చులకనైపోయినా.. భారతదేశం మాత్రం దశాబ్దాల తరబడి స్టెబుల్గా స్టాండర్డ్గా నిలబడింది. అందుకే, ఎక్కడో ఎవ్వడికో కన్నుకుట్టింది. లేక ఎటు నుంచైనా దిష్టి తగిలుండొచ్చు. ఇంటర్నల్ ఇండియా కొద్దికొద్దిగా వేడెక్కుతున్నట్టుంది. వారం పది రోజులుగా తడబడుతున్నట్టుంది లాఅండ్ ఆర్డర్. హాట్హాట్గా మారిన ఢిల్లీ ఫైల్స్.. నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి?
- Balaraju Goud
- Updated on: Jul 22, 2026
- 10:01 pm
నీట్ పేపర్ లీక్ ఆందోళనలపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా
నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ అంశాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉందని మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 22, 2026
- 9:14 pm
పేపర్ లీక్లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు
దేశవ్యాప్తంగా పేపర్ లీక్లు, నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, ప్రశ్నపత్రాల లీక్లు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు.
- Balaraju Goud
- Updated on: Jul 22, 2026
- 5:06 pm
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే..
నీట్ పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన నిరసనపై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక చీకటి రోజని పేర్కొంటూ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాంగ్రెస్ ఉల్లంఘించిందని విమర్శించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 22, 2026
- 10:37 am
పార్లమెంటులో పోటాపోటీ వ్యూహాలు.. మారిన బలాబలాలు.. మోదీ సర్కార్ పంతం నెగ్గేనా?
దేశంలో మిగతా ప్రాంతాల మాటేమో గాని, రాజధాని ఢిల్లీని మాత్రం గట్టిగానే తాకినట్టుంది ఎల్నినో ఫియర్. వాతావరణం వేడెక్కి, ఉరుములు మెరుపులతో తల్లడిల్లుతోంది ఢిల్లీ నగరం. వర్షాకాల సమావేశాల్లో కూడా గరంగరంగా మారింది క్యాపిటల్ సిటీ. సభ లోపలే కాదు, ఢిల్లీ వీధులు కూడా గరం మీదున్నాయి. ముఖ్యంగా రాహుల్ వర్సెస్ మోదీ.. మైండ్గేమ్తో ఢిల్లీలో హైటెంపరేచర్లు.. 2026 జూలై 20... మోదీ సర్కార్కి ఒకరకంగా అండర్లైన్ చేసుకోవాల్సిన తారీఖు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చాలా కాలం యాదుండే రోజు కూడా. గత సమావేశాల్లో రాజ్యాంగసవరణ కోసం చేసిన తీర్మానం వీగిపోయి సభాముఖంగా తొలిసారి తలదించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం, మళ్లీ ఈ సెషన్లోనే తలెత్తుకు నిలబడిన రోజు. ఉభయ సభల్లోనూ బలగం పెంచుకుని రెట్టించిన ఉత్సాహంతో పెర్ఫామ్ చేయాలని డిసైడైంది కూడా ఈరోజే. కానీ, మోదీ టీమ్ ఎంత గొప్ప కాన్ఫిడెన్స్తో సభకు వచ్చిందో, అంతకంటే ఎక్కువగా కాంట్రవర్సీలే రిజిస్టర్ అయ్యాయి. సభ లోపలా, వెలుపలా బిగ్ అండ్ బిగ్గర్ క్వశ్చన్ మార్కులు ఎదురయ్యాయి. దీటుగా ఢీకొని, వింటర్ సెషన్ మొత్తాన్ని ఇదే టెంపోతో కంటిన్యూ చేయాలన్నది ఎన్డీఏ సంకల్పం. కానీ, ఆగస్ట్ 13 వరకూ మొత్తం 19 వర్కింగ్డేస్లో జరిగే పార్లమెంటు వానాకాలం సమావేశాల్లో ఇంకా ఎన్నెన్ని ఉరుములు, మెరుపులు? వాతావరణం ఎన్ని వంకర్లు తిరుగుతుంది..? జంతర్మంతర్ పరిసరాల్లో టెన్షన్ఫ్రీ ఎట్మాస్ఫియర్ ఎప్పటికి క్రియేటౌతుంది? వాడీవేడిగా ఢిల్లీ ఫైల్స్..
- Balaraju Goud
- Updated on: Jul 21, 2026
- 9:40 pm
రాహుల్ గాంధీ ధర్నాపై ఆప్ నేత సంచలన వ్యాఖ్యలు.. సంజయ్ ఆరోపణలతో రాజకీయ దుమారం!
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి నివాసం ఎదుట చేపట్టాల్సిన నిరసనను బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితో రాహుల్ గాంధీ తన నివాసంలోనే ధర్నాకు పరిమితమయ్యారని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 21, 2026
- 6:28 pm
ఎన్డీఏ Vs ఇండియా కూటమి: వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ వాడివేడిగా కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆందోళనలు, అయోధ్య విరాళాల వ్యవహారం వంటి అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు నీట్ పేపర్ లీక్పై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధంతో పార్లమెంట్లో రాజకీయ వేడి మరింత పెరిగింది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 21, 2026
- 11:11 am
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు.. ఎన్డీఏ మాస్టర్ ప్లాన్..! ఇవాళ్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు..
ఈరోజు ప్రారంభమవుతున్న పార్లమెంట్ మాన్సూన్ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదిక కానున్నాయి. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు, జమిలి ఎన్నికలు, ఉన్నత విద్యా సంస్కరణలు వంటి కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని చూస్తుండగా, ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరలు, నీట్ పరీక్ష, అయోధ్య విరాళాల వ్యవహారం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష కూటమి వ్యూహాలు రచిస్తోంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 20, 2026
- 7:44 am
నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావ్.. కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్..
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సోషల్ మీడియా ఇంచార్జ్ అడప మహేష్పై హత్యాయత్నం జరిగింది. మాట్లాడుదామని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించిన రౌడీషీటర్ పత్తి కుమార్, తనపై ఎమ్మెల్యేకు ఏమి చెప్పావంటూ ప్రశ్నించి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 19, 2026
- 8:48 am
ధరణి Vs భూభారతి.. 18 లక్షల ఎకరాలకు అసలు ఓనర్ ఎవరు? లెక్కతేలాలి..!
భూమి అనేది ఒక బరువైన సెంటిమెంట్..! బలమైన భావోద్వేగం. అరెకరం భూమి ఉన్నా సన్నకారోడైనా, వందెకరాలున్న భూస్వామైనా... నేలతల్లితో వాళ్లకుండే ఎటాచ్మెంటే వేరు. సగటు రైతు తన భూమిని ఆత్మగా భావిస్తాడు, దాంతో బంధుత్వం కలుపుకుంటాడు. తనది అనుకున్న భూమ్మీద ఎవ్వడొచ్చి చెయ్యి పెట్టినా సహించలేడు. ఓనర్షిప్ ప్రశ్నార్థకమైనప్పుడు.. భూమ్మీద తనకుండే హక్కును లాక్కోవాలని చూస్తే తల్లడిల్లిపోతాడు. ఒక్కోసారి తిరగబడతాడు. భూతగాదాల్లో సొంత కుటుంబాల్నే కాదనుకున్న రక్తచరిత్రలను చాలానే చూశాం. మరి, అవతలోడొచ్చి మన భూమిని రోడ్డు మీదకు లాగితే? ఊరుకుంటాడా? గత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేగా జరిగింది..! ఏకంగా ప్రభుత్వాలనే మార్చేసింది భూ సెంటిమెంట్. ఏపీలో పాస్బుక్కు మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండడాన్ని రైతు ఎంత సీరియస్గా తీసుకున్నాడో ఓడిపోయిన పార్టీకి తర్వాత తెలిసొచ్చింది. తెలంగాణలో ధరణి వెబ్సైట్ మీద వ్యతిరేక ప్రచారం పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీని మట్టికరిపించింది. ఇప్పుడు మళ్లీ ఆ ధరణి చట్టాన్నే తవ్వితీసి, మరో ఎలక్షన్కి సై అంటోంది రూలింగ్ పార్టీ. ధరణి భూస్థాపితమైన దాదాపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ల్యాండ్మైనింగ్ దేనికోసం..? ప్రభుత్వ అంతరార్థం ఏమై ఉంటుంది..?
- Balaraju Goud
- Updated on: Jul 18, 2026
- 9:40 pm
తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ.. జీరో ఫోబియా.. ఏ పార్టీలకు..?
మొదటి నుంచీ తెలంగాణ రైజింగ్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ, డెవలప్మెంట్ సబ్జెక్ట్లో భిన్నాభిప్రాయాలుంటే ఉండొచ్చు. పొలిటికల్గా మాత్రం తెలంగాణ రైజింగే..! దీంతో టాప్గేర్లోకి వచ్చాయి మూడు పార్టీలు. ఎవరి బ్యాటింగ్ వాళ్లు ఆడుతూ, స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. మూడు పార్టీల మధ్య ఒక నంబర్గేమ్ కూడా మొదలైంది. దంగల్ 2028.. కాదు.. కాదు.. తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ అయ్యింది. డీటెయిల్డ్గా చూద్దాం..
- Balaraju Goud
- Updated on: Jul 17, 2026
- 10:46 pm