AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

లోక్‌సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!

అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్‌సభ ముందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

Telangana: హాట్ హాట్‌గా సాగిన బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలకు ఆమోదం లభించిందంటే..?

పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే! గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రభస స్టోన్‌ క్రషింగ్‌ వరకు పొలిటికల్ టెంపరేచర్‌ రోజు రోజుకు పెరిగింది. గాంధీ-గాడ్సేల నుంచి ఇందిరాగాంధీ వరకు.. ఎథిక్స్ కమిటీ నుంచి సీబీసీఐడీ వరకు.. సారీల నుంచి సవాళ్ల వరకు అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

CM Revanth Reddy: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే సీపెక్ సర్వే ఆధారంగా గుర్తించిన అన్ని కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఒక విప్లవాత్మక సామాజిక భద్రతకు ముందడుగు అని సీఎం స్పష్టం చేశారు.

మూడు ముక్కలాట! మూడు రాష్ట్రాల్లో ఉత్కంఠ భరితం.. బ్రేకప్ ఎవరికి.. విక్టరీ ఎవరిది..?

మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మరింత హీట్ పెంచాయి.. 2028లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవు అంటున్నారు సీఎం రేవంత్. అంటే అర్థం.. జమిలి రాబోతోందనేగా..! అలా జమిలి జరగాలంటే ఓ ఈక్వేషన్ పాస్ అవ్వాలి. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ గెలిస్తే జమిలి ఎన్నికలు ఇక ఎంతో దూరం ఉండవు. సో, తమిళనాడులో పాగా వేయడం, బెంగాల్‌లో విజయం సాధించడం, అసోంలో మళ్లీ అధికారం, కేరళంలో బలమైన అడుగులు వేయడం, పుదుచ్చేరిలో సునాయాస విజయం సాధించడం.. ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయితేనే బీజేపీ అనుకున్నది సాధ్యం. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్‌కు ఓ అర్ధం. మరి అలా జరుగుతుందా? సాధ్యమేనా? తమిళనాట DMK వర్సెస్ అన్నా DMK.. మధ్యలో TVK. కేరళంలో NDF వర్సెస్ LDF.. మధ్యలో బీజేపీ. బెంగాల్‌లో దీదీ వర్సెస్ మోదీ.. మధ్యలో కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ప్రకటన జరుగుతున్న వేళ.. ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది?

Telangana Assembly: మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. సభా సమరం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ అన్నట్లు నడిచింది. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ పలు పశ్నలు సంధించారు.

భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యంః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారతదేశాన్ని రక్షిస్తున్న 'రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్' (RAW), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వంటి సంస్థలను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని దిగజార్చుకుని, దేశ వ్యతిరేక పార్టీగా మారిపోవడానికి ఈ ట్వీట్ ఒక నిదర్శనమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Telangana Assembly LIVE: ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ.. గవర్నర్ ప్రసంగం.. లైవ్ వీడియో

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందుగా.. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌ ఖాతాలోనే పడనున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలో సరిపడ బలం లేకపోయినా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది.

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట.. ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..?

మాట ఇచ్చాం మడమతిప్పం అంటున్నారు లోకల్ కామ్రేడ్‌లు.. కాదు.. కాదు.. కాంగ్రెస్‌తో కలిసుంటేనే కలదు సుఖం అంటోంది కామ్రేడ్ అదిష్టానం. ఇంత జరిగాక వెనక్కి తగ్గితే ప్రజల్లో చులకన అవుతామంటున్నారు లోకల్ ఎర్రన్నలు. అలా కాదు మరోసారి ఆలోచించండి.. భవిష్యత్ అవసరాల కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదంటోంది ఆ పార్టీ అధినాయకత్వం.

AI సమ్మిట్‌లోకి దూసుకువచ్చిన యువజన కాంగ్రెస్ నేతలు.. టీ-షర్టులు విప్పి నిరసన..!

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. అయితే ఏకంగా భారత్ మండపంలోకి భారత యువజన కాంగ్రెస్ నాయకులు ప్రవేశించారు. ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. AI సమ్మిట్‌లో ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

ప్రజా పాలన చేపట్టిన తల్లి కూతుళ్లు.. ఒకరు మేయర్ గా.. మరొకరు గ్రామ సర్పంచ్‌గా..!

రాజకీయాల పట్ల ఆసక్తిలేకున్నా.. కొందరు మహిళలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఒకరు గ్రామ సర్పంచ్‌గా.. మరొకరు నగర మేయర్‌గా ఎన్నికై పాలనా పగ్గాలు చేపట్టారు. ప్రజా పాలన చేపట్టిన తల్లీకూతుళ్లు.. గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

కాలం కలిసి వస్తే.. అదృష్టం తలుపు తడుతుందంటే ఇదే..! మున్సిపల్ చైర్మన్, వైస్-చైర్మన్‌గా భార్యాభర్తలు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలి చైర్మన్‌గా జూపల్లి శశికళ, ఆమె భర్త జూపల్లి రమేష్ బాబు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా పేరొందిన జూపల్లి రమేష్ దంపతులు నూతన మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ ,13వ వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు.