కాంగ్రెస్ పార్టీ
138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.
దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.
ఇంకా చదవండిఇండియా కూటమిలో ‘వందేమాతరం’ రచ్చ.. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య ముదిరిన విభేదాలు!
శ్రీనగర్లో ‘వందేమాతరం’ పూర్తి గీతం ఆలపనపై ఇండియా కూటమిలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా పూర్తి వెర్షన్కు గౌరవంగా నిలబడగా, కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్సీ కాంగ్రెస్ వైఖరిని ఖండించి, ఇది అనవసర రాజకీయ వివాదమని పేర్కొంది. ఈ వివాదం ఇండియా కూటమి ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
- Balaraju Goud
- Updated on: Sep 9, 2026
- 5:04 pm
Telangana Assembly Live: మూడో రోజు పక్కా యాక్షన్ ప్లాన్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజుకు చేరుకున్న వేళ రాజకీయ వేడి మరింత పెరిగింది. తాతా మధు వ్యవహారంపై మండలిలో చర్చ జరగనుండగా, హేట్ స్పీచ్ అంశంపై సీఎం రేవంత్రెడ్డి చర్చలో పాల్గొననున్నారు. మరోవైపు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలవనున్నారు. దీంతో ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Sep 9, 2026
- 10:00 am
Telangana Assembly: రెండోరోజూ ఆరని జ్వాల.. రగిలించిందెవరు? చలి కాచుకుంటున్నదెవరు?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్పై తాతా మధు, నవీన్రెడ్డి వ్యాఖ్యలతో మొదలైన వివాదం అరెస్టులు, సస్పెన్షన్లు, అసెంబ్లీ తీర్మానాలు, ఎర్రవల్లి ఫామ్హౌస్ వద్ద ఘర్షణల వరకు వెళ్లింది. మరోవైపు కేసీఆర్పై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరులో ఎవరిది పైచేయి? బీజేపీ మాత్రం ప్రజా సమస్యలపై చర్చకు డిమాండ్ చేస్తోంది.
- Shaik Madar Saheb
- Updated on: Sep 8, 2026
- 9:50 pm
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. మండలి నుంచి తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెన్షన్..
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను ఈ సెషన్ మొత్తం మండలి నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందు అసెంబ్లీలో కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో తీర్మానం చేసి మండలి చైర్మన్కు పంపించారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 8, 2026
- 6:11 pm
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం..
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా తీర్మానం చేశారు. తీర్మానం కాపీని మండలి చైర్మన్కు పంపించాలని నిర్ణయించారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 8, 2026
- 5:12 pm
Telangana Assembly: ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ రగడ తీవ్రస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నేతల నల్లచొక్కాల నిరసన, ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు, స్పీకర్ గౌరవంపై వివాదం, కాంగ్రెస్-బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు హాట్టాపిక్గా మారాయి. మరోవైపు 22ఏ భూముల అంశంపై చర్చకు బీజేపీ పట్టుబడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 7, 2026
- 9:50 pm
ఒక లోక్సభ సహా ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు.. మమతా బెనర్జీ మళ్లీ పోటీ చేస్తారా..?
దేశవ్యాప్తంగా ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఈ ఆరు స్థానాల్లో అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
- Balaraju Goud
- Updated on: Sep 7, 2026
- 6:49 pm
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్పై చేసిన వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్పీకర్కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు మంత్రి సీతక్క భావోద్వేగానికి గురికాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా సభలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 7, 2026
- 3:44 pm
కొండా సురేఖ ఎపిసోడ్కు ఎండ్ కార్డ్..! అసలు రాజకీయం ఇప్పుడే మొదలైందా..
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కూతురు సుష్మిత పటేల్ వ్యాఖ్యలు, పరకాల సీటు అంశం, రేవంత్రెడ్డితో పెరిగిన రాజకీయ దూరంపై చర్చ కొనసాగుతోంది. మంత్రి పదవి కోల్పోయినా కొండా కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి తగ్గలేదు. కాంగ్రెస్లోనే కొనసాగుతారా, మౌనం వహిస్తారా, లేక మరో రాజకీయ అడుగు వేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Siva Nagaraju
- Updated on: Sep 4, 2026
- 7:23 am
Video: కొండా సురేఖ బర్తరఫ్.. మీసం మెలేసిన కొండా మురళీ!
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త కొండా మురళీ బాల్కనీ నుంచి మీసం మెలేస్తూ అభిమానులకు అభివాదం చేయడం వైరల్గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
- SN Pasha
- Updated on: Sep 3, 2026
- 4:51 pm
సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసే అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. తన బర్తరఫ్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారని ఆరోపించారు.
- SN Pasha
- Updated on: Sep 3, 2026
- 4:17 pm
తుమ్మిడిహెట్టి ఎత్తుపై తెలంగాణ కీలక ప్రతిపాదన.. మహారాష్ట్రను ఒప్పించేందుకు రంగంలోకి సీఎం రేవంత్..!
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 152 మీటర్ల ఎత్తును మహారాష్ట్ర ముందు ఉంచి, కనీసం 150 మీటర్ల నిర్మాణానికి ఒప్పందం కోరుతోంది. ఈ అంశంపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ముంపు, భూసేకరణ నివేదికలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణంపై చర్చలు జరుగనున్నాయి.
- Prabhakar M
- Updated on: Sep 1, 2026
- 12:14 pm