AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

ఢీలిమిటేషన్.. దుమ్ముదుమారం.. లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. ఓటింగ్ ఎప్పుడంటే..

లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్రం. 131 రాజ్యాంగ సవరణ బిల్లును అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా.. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. అంతకుముందు రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సాగింది. బిల్లుపై చర్చించాలా వద్దా అనే దానిపై విపక్షాలు డివిజన్‌ కోరడంతో ఓటింగ్ జరిగింది.

Special Parliament Session: డీలిమిటేషన్‌.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది..

మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న 'ఫార్ములా'నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.

Revanth Reddy: నేషనల్ పాలిటిక్స్‌లో ‘రేవంత్ మార్క్’.. వ్యూహకర్తగా మారిన తెలంగాణ సీఎం!

తెలంగాణ రాజకీయ యవనికపై ఉవ్వెత్తున ఎగసిన కెరటం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ కెరటం కేవలం గండిపేట పరిధిలోనే ఆగకుండా, యమునా తీరం వరకు తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక 'నేషనల్ బ్రాండ్'గా అవతరించారు.

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం.. ఇండియా కూటమి నేతల కీలక భేటీ..!

భారత రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏప్రిల్ 16, గురువారం రోజున పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. పార్లమెంటుకు సంబంధశించిన అధికారిక అజెండా వెలువడటంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.

ఆ దేవుడే మీతో కలిసి పని చేయమని పంపాడంటూ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం!

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు పార్టీలో చేరబోతున్నారు. గులాబీ కండువ కప్పుకోనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసిన జీవన్ రెడ్డి.. శుక్రవారం (ఏప్రిల్ 10) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో కలిశారు. ఎర్రవల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పార్టీ నేతలు స్వాగతం పలికారు.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

శ్రీపరాభవ నామ సంవత్సరంలో పరాభవం జరగని పార్టీలోకి వెళ్తానన్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఇవ్వడం లేదని.. తన సీనియార్టీని గుర్తించడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. తాజా రాజకీయాలపై చర్చించారు.

మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు.. వివాదాస్పద వ్యాఖ్యల పై ఖర్గే క్షమాపణలు

గుజరాత్ ప్రజల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు చెప్పారు. "గుజరాత్ ప్రజల పట్ల నాకు ఎప్పుడూ అత్యంత గౌరవం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. వారి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు" అని అన్నారు. ఆదివారం (ఏప్రిల్ 05) కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Kerala Assembly Election: ఎన్నికల బరిలో ఎంతమంది నేరస్థులు, ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో తెలుసా?

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలోనే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో సుమారు 38% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించగా, 39% మంది కోటీశ్వరులు ఉన్నట్లు పేర్కొంది.

దోమ.. చూడ్డానికి చిన్నజీవే.. దోమల దండయాత్రపై తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ..!

ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి తీసిన ఈగ సినిమాలో కంటే హైదరాబాద్ జనాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి దోమలు. గతంలో ఒక సీజన్‌కు మాత్రమే పరిమితమైన దోమలు.. ఇప్పుడు సంవత్సరంలో 365 రోజులు.. రోజుకు 24 గంటలూ కుట్టికుట్టి పగ తీర్చుకుంటున్నాయి. అటు ప్రతిపక్షం సైతం దోమల దండయాత్రపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

లోక్‌సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!

అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్‌సభ ముందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

Telangana: హాట్ హాట్‌గా సాగిన బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలకు ఆమోదం లభించిందంటే..?

పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే! గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రభస స్టోన్‌ క్రషింగ్‌ వరకు పొలిటికల్ టెంపరేచర్‌ రోజు రోజుకు పెరిగింది. గాంధీ-గాడ్సేల నుంచి ఇందిరాగాంధీ వరకు.. ఎథిక్స్ కమిటీ నుంచి సీబీసీఐడీ వరకు.. సారీల నుంచి సవాళ్ల వరకు అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

CM Revanth Reddy: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే సీపెక్ సర్వే ఆధారంగా గుర్తించిన అన్ని కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఒక విప్లవాత్మక సామాజిక భద్రతకు ముందడుగు అని సీఎం స్పష్టం చేశారు.