AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

Telangana: రేవంత్‌, కేసీఆర్.. మధ్యలో బీజేపీ.. వార్‌ జోన్ షురూ అయినట్టేనా?

ముఖ్యంగా రేవంత్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్‌ని టార్గెట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పథకాల్ని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేశారు. ఒక్కో పథకాన్ని గుర్తు చేస్తూ పాయింట్‌ టూ పాయింట్ నిగ్గదీసే ప్రయత్నం చేశారు. జనం కూడా రేవంత్‌ ప్రభుత్వంపై మొహం మొత్తి, తన రీఎంట్రీని కోరుకుంటున్నారు అన్నట్టుగా సాగింది కేసీఆర్‌ స్పీచ్.

Women Bill: మహిళా బిల్లుపై ‘మహా’ ఉత్కంఠ.. మోదీ మ్యాజిక్ చేస్తారా? ఎన్డీఏ గట్టెక్కుతుందా?

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ రాజకీయ సమీకరణాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. మరి కొన్ని గంటల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కిస్తుందా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బిల్లును వ్యతిరేకిస్తానని ప్రకటించడం రాజకీయ వేడిని పెంచింది.

చీకటిలో నిజం.. మనసులో భయం: లోక్‌సభలో రాహుల్ గాంధీ భావోద్వేగ ప్రసంగం

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 'నారీ శక్తి వందన్' సహా మూడు కీలక బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, తన వ్యక్తిగత జీవితంలోని జ్ఞాపకాలను రాజకీయ పాఠాలతో ముడిపెట్టి ఆసక్తికరంగా మాట్లాడారు.

Parliament Special session: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్.. 54 ఓట్ల దూరంలో ఆగిన 131వ సవరణ

భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు దారితీశాయి.

మూడు బిల్లులు.. ఒకటే సంకల్పం.. కోటా లెక్కపై పీటముడి..!

2026 ఏప్రిల్ 16.. ఈ తేదీ చానాకాలం యాదుంటది. రాబాయే రెండుమూడు తరాలు బరాబర్ మాట్లాడుకుంటాయి.. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పార్టీల తలరాతను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన రెండు నిర్ణయాలకు మోదీ సర్కార్ పెట్టిన ముహూర్తం ఇది. మొదటిది, లోక్‌సభలో సీట్ల పెంపు, ఆ పెంచిన సీట్లలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయింపు. రెంటికి రెండూ హిస్టరీని బ్రేక్ చేసే నిర్ణయాలే. కానీ, ఈ రెండింటికీ ముడిపెట్టి, ఒకటే గాటనకట్టి, చర్చిద్దాం, ఓటేసి ఆమోదించుకుందాం అనడమే, విపక్షానికి రుచించడం లేదు. ఆ సంఘర్షణకే అద్దం పెట్టింది పార్లమెంట్ స్పెషల్ సెషన్. మరి, ధిక్కరించిందెవరు.. గట్టిగా తిప్పికొట్టిందెవరు? ఎవరి వాదనలో ఎంత పస..? హీరో ఆఫ్ ది డేవన్ ఎవరు..?

కాకరేపుతోన్న కరీంనగర్ పాలిటిక్స్.. ఒకేరోజు ఇద్దరూ.. తూర్పున సీఎం రేవంత్.. పశ్చిమాన మాజీ సీఎం కేసీఆర్..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ తూర్పున రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే, పశ్చిమ దిశలో కేసీఆర్ సభ ఖరారైంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 2029 వరకు జరిగే అన్ని ఎన్నికలు పాత పద్ధతిలోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం.. డీలిమిటేషన్‌పై అనుమానాలు!

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేదికగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఈ బిల్లులోని చిక్కుముడులను ప్రశ్నించారు. మహిళలకు రావాల్సిన న్యాయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆమె ఆరోపించారు.

ఢీలిమిటేషన్.. దుమ్ముదుమారం.. లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. ఓటింగ్ ఎప్పుడంటే..

లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్రం. 131 రాజ్యాంగ సవరణ బిల్లును అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా.. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. అంతకుముందు రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సాగింది. బిల్లుపై చర్చించాలా వద్దా అనే దానిపై విపక్షాలు డివిజన్‌ కోరడంతో ఓటింగ్ జరిగింది.

Special Parliament Session: డీలిమిటేషన్‌.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది..

మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న 'ఫార్ములా'నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.

Revanth Reddy: నేషనల్ పాలిటిక్స్‌లో ‘రేవంత్ మార్క్’.. వ్యూహకర్తగా మారిన తెలంగాణ సీఎం!

తెలంగాణ రాజకీయ యవనికపై ఉవ్వెత్తున ఎగసిన కెరటం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ కెరటం కేవలం గండిపేట పరిధిలోనే ఆగకుండా, యమునా తీరం వరకు తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక 'నేషనల్ బ్రాండ్'గా అవతరించారు.

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం.. ఇండియా కూటమి నేతల కీలక భేటీ..!

భారత రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏప్రిల్ 16, గురువారం రోజున పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. పార్లమెంటుకు సంబంధశించిన అధికారిక అజెండా వెలువడటంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.