AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌పై మాటలయుద్దం.. రాహుల్‌ గాంధీ సంచలన ట్వీట్‌.. విదేశాంగశాఖ క్లారిటీ

ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌లో నక్కిన ఉగ్రవాదుల తాట తీశామని కేంద్రం చెబుతుంటే .. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ స్టేట్‌మెంట్‌తో దాడిపై పాకిస్తాన్‌కు ముందే సమాచారం అందిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. జైశంకర్‌ మాటలను రాహుల్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారని విదేశాంగశాఖ వివరణ ఇచ్చింది.

ఆపరేషన్ సింధూర్‌పై విదేశాలకు భారత బృందం.. కాంగ్రెస్‌ సిఫారసులో కనిపించని శశిథరూర్‌ పేరు!

పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం పైకి కనిపించని రాజకీయం మొదలైంది. పేర్ల మీద కాంగ్రెస్‌ నేరుగా విమర్శలు చేయడం లేదుగానీ, పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీల పేర్లను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కోరారని జైరామ్‌ రమేష్‌ వెల్లడించారు.

Kishan Reddy: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం..

తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగించారంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు.

Kishan Reddy: ఆ కులగణనకు చట్టబద్ధత లేదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రభుత్వ కుల సర్వేకు చట్టబద్ధత లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనగణన ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.

BJP vs Congress: తెలంగాణ రోల్‌ మోడల్‌..! కులగణనపై క్రెడిట్‌ వార్‌.. వేడెక్కిన రాజకీయం..

కులగణనపై క్రెడిట్‌ వార్‌ ఊపందుకుంది. ఓవైపు పాక్‌తో తీవ్ర ఉద్రిక్తతలు , మరోవైపు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కులగణన చేపడుతామని కీలక ప్రకటన చేసింది. ఇది అధికార , విపక్షాల మధ్య మాటల యుద్దాన్ని రాజేసింది. మోదీ నాయకత్వానికి ఇది నిదర్శనమని బీజేపీ అంటుంటే .. రాహుల్‌ పోరాటానికి ఫలితం దక్కిందని కాంగ్రెస్‌ నేతలంటున్నారు.

Pawan Kalyan: పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్..

మన దేశంలో పుట్టి.. మన దేశంలో ఉంటూ.. కొందరు పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.. పహల్గామ్ ఘటనపై కొందరు స్పందిస్తున్న తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi: పహాల్గామ్‌ ఉగ్రదాడిపై సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్..

ఒకరు యద్ధం చేయాలంటారు, ఇంకొకరు శాంతి మంత్రం జపిస్తారు. మరొకరు.. అసలు సింధూ నీళ్లు ఆపడమే దండగన్నట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల తలోమాట విని రాహుల్‌కు చిర్రెత్తుకొచ్చింది. నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ రాహుల్‌ గాంధీ ఏం అన్నారు?.. ఏం చెప్పారు.. ఈ వివరాలను తెలుసుకోండి..

Revanth Reddy: కేసీఆర్‌ స్పీచ్‌లో క్లారిటీ లేదు.. వాళ్లకు పొగరు పెరిగింది.. పదవులు ఇవ్వం: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అభద్రతాభావంలో మాట్లాడారని.. ఆయన స్పీచ్‌లో క్లారిటీ లేదంటూ పేర్కొన్నారు. కేసీఆర్‌ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని.. రాహుల్‌గాంధీకి, తనకు గ్యాప్‌ ఉందనడం అవాస్తవమంటూ పేర్కొన్నారు.

ముగిసిన భారత్ సమ్మిట్.. పదేళ్లలో రాజకీయాలు ఎంతగానో మారిపోయాయిః రాహుల్ గాంధీ

దేశంలో పాత తరం రాజకీయం అంతరించిపోయిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయం నడుస్తోందన్నారు. మరోవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ సమ్మిట్‌ సక్సెస్ అయిందన్నారు.

Telangana Cabinet Expansion: రేవంత్‌ ఒకలా.. మీనాక్షి మరోలా..! కన్‌ఫ్యూజన్‌లో కాంగ్రెస్‌ నేతలు

ఇదిగో.. అదిగో.. అన్నారు. కొందరైతే డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు. తీరా చూస్తే ఏదీ లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది.. అసలు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్‌ కామెంట్స్‌తో మరోసారి కేబినెట్‌ అంశం తెరపైకొచ్చింది.