AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ

138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్‌ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.

దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

ఇంకా చదవండి

Andhra Politics: తగ్గేదే లే..! చినుకుల్లేకపోయినా.. జోరుగా చిటపటలు.. పక్కా లోకల్‌ పాలిటిక్స్‌

రాప్తాడు నుంచి చంద్రగిరి వరకు, ఆళ్లగడ్డ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏపీలో స్థానిక రాజకీయాలు హీటెక్కుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ సమరం కొత్త మలుపులు తిరుగుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన రాయలసీమలో ఇప్పుడు మాటల యుద్ధమే ప్రధాన ఆయుధంగా మారింది. స్థానిక స్థాయిలో చెలరేగుతున్న ఈ రాజకీయ వేడి రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపిస్తోంది.

వరంగల్ రాజకీయాల్లో మరోసారి రగడ.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..!

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కడియం శ్రీహరి తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. తన శాఖకు సంబంధించిన అంశాలపై జరుగుతున్న వివాదంపై స్పందించిన మంత్రి, ప్రోటోకాల్ ఉల్లంఘనల అంశాన్నే తాను ప్రస్తావించానని స్పష్టం చేశారు.

Telangana: జెండాకో ఇరిగేషన్ ఎజెండా..! ఈసారి చిచ్చు పేరు కన్నెపల్లి మోటార్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని తెలంగాణలో సాగునీటి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. పంపులను వెంటనే ఆన్ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుండగా, డ్యామ్ భద్రతా కారణాల వల్ల ఇప్పుడే నీటి ఎత్తిపోతలు సాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ వివాదంలో బీజేపీ కూడా రంగంలోకి దిగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. పోలీసుల అదుపులో హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని రూ. 7 లక్షల కోట్ల అప్పులపై చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు.. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, గురుకులాల విద్యాశాఖలో జరిగిన అవినీతి, కొనుగోళ్లపై కాంగ్రెస్ మంత్రులు చర్చకు సిద్ధమవడంతో హైదరాబాద్ ఒక్కసారిగా అట్టుడికిపోయింది.

తెలంగాణ పాలిటిక్స్‌లో ‘11 AM’ హైటెన్షన్: ఒకే ముహూర్తం.. మూడు వేదికలు.. ‘సై’ అంటే ‘సై’ అంటున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. నిన్నటివరకు కేవలం ప్రెస్ మీట్లు, ట్వీట్లకే పరిమితమైన విమర్శల పర్వం.. ఇప్పుడు "ఇవాళ ఉదయం 11 గంటల" డెడ్‌లైన్‌కు చేరింది. ముహూర్తం ఒక్కటే అయినప్పటికీ, నేతలు కొట్లాడేందుకు ఎంచుకున్న వేదికలు మాత్రం మూడు కావడం విశేషం. అటు తెలంగాణ భవన్, ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మరోవైపు గన్ ఫౌండ్రీ అమరవీరుల స్థూపం.. ఎక్కడ చూసినా 11 గంటల సమయం చుట్టూనే ఉత్కంఠ తిరుగుతోంది.

Telangana Politics: రేవంత్‌ అండ్ కిషన్‌..! మధ్యలో మెట్రో రైల్.. ఎవరి ఎత్తుగడలు వాళ్లవే

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కలిసి మెట్రో ప్రాజెక్టుపై చర్చించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్-బీజేపీ మధ్య అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నామని ఇరు పార్టీలు చెబుతున్నాయి. మెట్రో నుంచి సింగరేణి వరకు వివిధ అంశాలపై మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది.

ప్రాంతీయ పార్టీల ‘చీలిక’.. కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా? జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలివే!

భారత రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీల చుట్టూనే చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో తలెత్తుతున్న అసమ్మతి, చీలికలు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఏ మేరకు లాభం చేస్తాయి? బీజేపీకి ఉన్న అవకాశాలేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జంట నగరాల ప్రజలు, మెట్రో కారిడార్ పరిధిలోని ప్రజలకు కీలక విషయాలను వెల్లడించారు. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివ‌ృద్దిని అడ్డుకుంటారని మండిపడ్డారు.

మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న దానికంటే, ప్రారంభ దశలోనే సరైన న్యాయపరమైన వాదనలు వినిపించకపోవడమే మీనాక్షికి ఎక్కువ నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో మీనాక్షి నటరాజన్‌కు కొంత ఊరట లభించినప్పటికీ, ఆమె తరఫున వ్యవహరించిన న్యాయవాదుల పాత్రపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

మీనాక్షి నటరాజన్‌కు షాక్.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవం..!

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఎన్నిక అనివార్యం కాకుండా పోయింది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించబడ్డారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠ.. మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో నిరాశ..!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో గురువారం (జూన్ 11) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన నామినేషన్‌ను రద్దు చేస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆమె భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు వెంటనే స్వీకరించడానికి నిరాకరించింది. “రేపు రండి.. రేపే విచారణ చేపడతాం” అంటూ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.

బెంగాల్ రాజకీయంలో పెను తుఫాను.. రెబెల్స్ షాక్‌తో సోనియా గాంధీతో మమతా అత్యవసర భేటీ!

బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను తుఫాను చెలరేగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఇప్పుడు నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడింది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా పార్టీలోనే ఊహించని రీతిలో భారీ తిరుగుబాటు మొదలైంది. ఏకంగా 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్‌సభ ఎంపీలు మమతపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు