కాంగ్రెస్ పార్టీ
138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.
దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.
Telangana: అసెంబ్లీ స్పీకర్ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. స్పీకర్ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదన్నారు. స్పీకర్ నోటీసులకు తమ అడ్వకేట్ వివరణ ఇచ్చారని తెలిపారు. ఒకవేళ స్పీకర్ రమ్మంటే విచారణకు వెళ్తా అన్నారు. అడ్వకేట్ లేఖ తర్వాత స్పీకర్ నుంచి మళ్లీ జవాబు రాలేదని తెలిపారు దానం నాగేందర్. అటు బీఆర్ఎస్ పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
- Balaraju Goud
- Updated on: Jan 29, 2026
- 11:23 am
దేశ ఆర్థిక గమనాన్ని డిసైడ్ చేసేందుకు రంగం సిద్ధం.. నేటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!
నేడు బుధవారం (జనవరి 28, 2026) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్రం.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది. అటు.. అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఏఏ అంశాలపై గళమెత్తాలనేదానిపై అన్ని పార్టీలూ అజెండా ఫిక్స్ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది.
- Balaraju Goud
- Updated on: Jan 28, 2026
- 7:18 am
Telangana Municipal Elections: పురపోరుకు నగారా..! పార్టీల బలాబలాలేంటి.. నేతల వ్యూహాలేంటి..
ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అవుతాయా? ఫలితాలు ఎలా వచ్చినా, ఎవరికి అనుకూలంగా ఉన్నా.. జరిగేది ఇదే. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ చెరిసగం సీట్లు పంచుకున్నాయి. ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్కు బీజేపీ షాక్ ఇచ్చింది. రెండు బైఎలక్షన్లలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కైవసం చేసుకుని పట్టణ ఓటర్లలోనూ కాంగ్రెస్కు బలం ఉందని నిరూపించుకుంది కాంగ్రెస్.
- Shaik Madar Saheb
- Updated on: Jan 27, 2026
- 9:49 pm
Telangana: అసలు మ్యాటర్ ఇదే.. ముగ్గురు మంత్రులతో భేటీపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం, మంత్రులు పలు అంశాలపై కీలక చర్చ నిర్వహించారు. అయితే.. సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు .. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రుల భేటీపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.. ఈ నేపథ్యంలో మంత్రులతో భేటీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 27, 2026
- 6:37 pm
విదేశాల్లో ముఖ్యమంత్రి.. నలుగురు మంత్రుల అత్యవసర భేటీ.. అసలు మతలబు అదేనా..?
హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు.. ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. లోక్భవన్లో ఎట్హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమర్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్.. అక్కడి నుంచి ఒకే కారులో ప్రజా భవన్కు చేరుకున్నారు. అయితే.. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఉత్కంఠ రేపింది.
- Balaraju Goud
- Updated on: Jan 27, 2026
- 8:28 am
అసెంబ్లీ నుంచి గవర్నర్ గెహ్లాట్ వాకౌట్! గందరగోళంలో శాసనసభ శీతాకాల సమవేశాలు..!
గవర్నర్ అసెంబ్లీకి హాజరు కాకపోతే తదుపరి చట్టపరమైన చర్యల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, అధికార కాంగ్రెస్ నాయకుల అంచనాలకు భిన్నంగా, గవర్నర్ అసెంబ్లీకి వచ్చి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలోని మొదటి, చివరి పేరాల్లోని కొన్ని పంక్తులను మాత్రమే చదివి, ఆ తర్వాత వెళ్లిపోయారు.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 4:34 pm
Telangana: వాళ్లిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే.. పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్ గడ్డం ప్రసాద్
పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టంచేశారు. ఇద్దరిని BRS ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు..
- Shaik Madar Saheb
- Updated on: Jan 15, 2026
- 3:43 pm
ఇది కదా కావాల్సింది.. పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ.277 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నిర్ణయం తీసుకున్నారు.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 7:25 pm
Parasakthi Movie: కాంగ్రెస్, డీఎంకే మధ్య చిచ్చు పెట్టిన పరాశక్తి సినిమా..! అసలు నిప్పు రాజేసిందెవరు..
అయితే ఇటీవల తమిళ తమిళంలో విడుదలైన పరాశక్తి సినిమా అందులోని అంశాలు మరోసారి డిఎంకె కూటమి లోని కాంగ్రెస్ డిఎంకెమధ్య చిచ్చురేపాయి. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక పోరాటం.. ఆనాడు దివంగత అన్నా దురై చేసిన పోరాటం ఆధారంగా సినిమా తెరకెక్కింది.. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1966లో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..
- Ch Murali
- Updated on: Jan 13, 2026
- 7:09 pm
Telangana: ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
- Anand T
- Updated on: Jan 8, 2026
- 3:21 pm
Kishan Reddy: ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించడంతోపాటు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 8, 2026
- 9:11 am
Telangana Assembly Live: కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీ సమావేశాలు లైవ్
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. హిల్ట్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది.. అలాగే.. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా, గోదావరి జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 3, 2026
- 3:08 pm