తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
అరేయ్ ఏంట్రా ఈ అరాచకం.. రూ.70 వేల అప్పుకు ఎంత వసూలు చేశారో తెలుసా..?
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ తాహేర్ అలీ రూ.70 వేల అప్పు తీసుకుని ఇప్పటివరకు రూ.1.33 లక్షలు చెల్లించినప్పటికీ, ఇంకా అసలు బాకీ ఉందంటూ ముగ్గురు నిందితులు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఆటోను బలవంతంగా తీసుకెళ్లడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
- Naresh Gollana
- Updated on: Jun 16, 2026
- 12:27 pm
వారి ఉసురు తగలకుండా పోతుందా.. 17 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్లో 17 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఉద్యోగ మోసగాడు వెంగళ్ళ రమేష్ బాబును ఎట్టకేలకు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2009లో నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేసి పరారైన రమేష్ బాబుపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
- Naresh Gollana
- Updated on: Jun 16, 2026
- 11:13 am
డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!
జాతీయ రహదారులపై నిబందనలకు విరుద్దంగా ఎక్కడపడితే అక్కడ లారీలు నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపిన కొన్ని గంటల్లోనే జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ నుండి హైదరాబాద్కు ఆలుగడ్డల లోడ్ తో వెళుతున్న లారీ జాతీయ రహదారిపై నిలుపడంతో దానిని గమనించని మరో లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్యాబిన్ లోనే లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు.
- Naresh Gollana
- Updated on: Jun 11, 2026
- 1:06 pm
దాగుడు మూతలు ఆడుతూ ఆ ఇంటి పక్కన నిలబడ్డారు.. ఇంతలోనే అకస్మాత్తుగా..
వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి దాగుడు మూతలు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారి విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ గ్రామంలో గోడ కూలి బాలిక మృతి చెందగా, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
- Naresh Gollana
- Updated on: Jun 10, 2026
- 7:37 pm
వేగంగా వెళ్తున్న ఆటోలో ఒక్కసారిగా ప్రత్యక్షమైన పాము.. ఆ తర్వాత
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ప్రయాణిస్తున్న ఆటోలోకి ఒక్కసారిగా పాము దూసుకురావడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో రన్నింగ్ ఆటో నుంచి ముగ్గురు దూకగా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..
- Naresh Gollana
- Updated on: Jun 10, 2026
- 1:11 pm
చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
చెన్నూరులో సంచలనం సృష్టించిన ఎస్బీఐ అంతర్గత బంగారం చోరీ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. తొమ్మిది నెలల క్రితం చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు పూర్తిగా రికవరీ చేయగా, ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు తిరిగి అందజేసింది. అంతేకాకుండా తొమ్మిది నెలల వడ్డీని కూడా మాఫీ చేయడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ బ్యాంకు వద్ద స్వీట్లు పంచుకున్నారు. 400 మందికి పైగా ప్రభావితమైన ఈ కేసులో బాధితులకు భారీ ఊరట లభించింది..
- Naresh Gollana
- Updated on: Jun 9, 2026
- 9:05 pm
Indiramma Illu: వారెవ్వా.. నయా టెక్నాలజీ.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు.. ఎలా నిర్మిస్తారంటే..
పేదల సొంతింటి కలను వేగంగా సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం షియర్ వాల్ టెక్నాలజీని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రవేశపెట్టింది. సాధారణంగా మూడు నెలలు పట్టే గృహ నిర్మాణాన్ని ఈ అత్యాధునిక సాంకేతికతతో రెండు వారాల్లోనే పూర్తి చేయవచ్చు. ఇటుకల అవసరం లేకుండా ఆర్సీసీ, స్టీల్, అల్యూమినియం ఫార్మ్వర్క్తో నిర్మించే ఈ విధానం ఖర్చు తగ్గించడంతో పాటు నాణ్యతను పెంచుతుందని అధికారులు చెబుతున్నారు.
- Naresh Gollana
- Updated on: Jun 6, 2026
- 5:01 pm
Telangana: ఊర్లోని పిల్లలంతా సర్కార్ బడికే.. ప్రవేట్ స్కూల్కి పోతే జరిమానా..
వేల రూపాయల ఫీజులతో ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామంలోకి రాకూడదని, ప్రభుత్వ బడులనే బలోపేతం చేయాలని నిర్ణయించారు.
- Naresh Gollana
- Updated on: Jun 6, 2026
- 12:35 pm
పేరు ఒకరిది.. వాడకం మరొకరిది.. రూ. 8.18 కోట్ల భారీ ‘మ్యూల్ అకౌంట్’ స్కాం బట్టబయలు!
బ్యాంకు ఖాతా మనదే, ఏటీఎం కార్డు, చెక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, దానికి లింక్ అయిన ఫోన్ నంబర్.. అన్నీ మనవే! కానీ ఆ అకౌంట్ను నిర్వహించేది మాత్రం మనం కాదు, దేశ విదేశాల్లో కూర్చున్న సైబర్ నేరగాళ్లు. అమాయకుల నమ్మకాన్ని, డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని, దొంగ కంపెనీల పేరిట కోట్లాది రూపాయల సైబర్ నేరాల సొమ్మును చేరవేస్తున్న ఒక భారీ 'మ్యూల్ అకౌంట్ల' ముఠా బాగోతాన్ని నిర్మల్ జిల్లా పోలీసులు తాజాగా బట్టబయలు చేశారు.
- Naresh Gollana
- Updated on: Jun 5, 2026
- 5:01 pm
Video: వారెవ్వా.. ఏడాదిలోనే 70 కిలోలు తగ్గాడు.. భైంసా యువకుడి వెయిట్ లాస్ సీక్రెట్ తెలిస్తే మీరు అవాక్కవడం పక్కా..
ఏ జిమ్కు వెళ్లలేదు.. ఖరీదైన ప్రొడక్టులు అసలే వాడలేదు.. కట్ చేస్తే, ఒకే ఒక్క ఏడాదిలో ఏకంగా 70 కేజీల బరువు తగ్గాడు.. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాలా నిజం. బరువు తగ్గడం కోసం రేపు, ఎల్లుండి అంటూ బద్ధకంతో కాలం వెళ్లదీసే ఆరంభ శూరుల అందరికీనిర్మల్ జిల్లాకు చెందిన గంగాప్రసాద్ అనే యువకుడు ఇప్పుడు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్గా మారాడు.
- Naresh Gollana
- Updated on: Jun 5, 2026
- 11:47 am
మామిడి కాదు బంగారం! నిర్మల్లో పండిన మియాజాకీ.. ఒక్కో పండు రూ.50 వేలకుపైనే!
Miyazaki Mango in Nirmal: జపాన్కు చెందిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి ఇప్పుడు తెలంగాణలోనూ పండుతోంది. నిర్మల్ జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ రాపల్లి సత్యం సాగు చేసిన ఈ మామిడి అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది.
- Naresh Gollana
- Updated on: Jun 4, 2026
- 1:24 pm
ఇలా కూడా ప్రొటెస్ట్ చేస్తారా? బ్యాంక్ ముందే వంటలు.. అక్కడే భోజనాలు.. అసలు మ్యాటరేంటంటే?
నమ్మి దాచుకున్న బంగారాన్ని బ్యాంకు సిబ్బందే నొక్కేశారు.. అడిగితే నిబంధనల పేరుతో కాలయాపన చేశారు. దీంతో కడుపు మండిన బాధితులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఏకంగా బ్యాంక్ ముందే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.దారినపోయే వారికి అన్నం వడ్డిస్తూనే, బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
- Naresh Gollana
- Updated on: Jun 1, 2026
- 4:11 pm