తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Baby Elephant birthday: ఎలిఫెంట్ క్యాంప్లో బుజ్జి గజరాజుకు ఘనంగా పుట్టిన రోజులు వేడుకలు!
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కమలాపూర్ ఏనుగుల క్యాంప్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఓ గున్న ఏనుగు జన్మించడంతో ఆ పిల్ల ఏనుగు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు అక్కడి అటవిశాఖ అధికారులు. ఈ ఎలిఫెంట్ క్యాంప్ తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత సమీపంలోని గడ్చిరోలి జిల్లా కమలాపూర్ అటవి ప్రాంతంలో ఉంది.
- Naresh Gollana
- Updated on: Mar 25, 2026
- 11:55 am
Telangana: మందు సిట్టింగ్ వేసిన ముగ్గురు స్నేహితులు.. మత్తులో ఫోన్ లాక్కోగా.. ఆ తర్వాత
ఆ ముగ్గురు మిత్రులు ఓ ఖాళీ ప్లేస్ చూసుకుని తాగడం మొదలు పెట్టారు. ఈలోగా సెల్ ఫోన్ విషయంలో చిన్న గొడవ జరిగింది.. ఆపై జరగకూడనిది జరిగిపోయింది. చివరికి ఎవరికీ తెలియకుండా ఇద్దరు పరారయ్యారు. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- Naresh Gollana
- Updated on: Mar 24, 2026
- 4:08 pm
సారూ.. నేను సచ్చిపోలేదు బతికే ఉన్నా..! భరోసా లేకుండా రికార్డుల్లో చంపేసిన అధికారులు
సారూ... నేను బతికే ఉన్నా.. అధికారులు మాత్రం నేను సచ్చిపోయానంటున్నారు. బ్రతికే ఉన్నావని ఆధారాలు తేవాలంటున్నారు. చెట్టంత మనిషిని మీ ముందే ఉన్నా.. అయినా సచ్చిపోయానంటూ రికార్డుల్లోకి ఎక్కించి.. నా భూమిని లాగేసుకున్నారు.. ఇదెక్కడి న్యాయం సార్.. ఇలా రైతు భరోసా సాయం అందకుండా చేశారు. అంటూ ఓ మహిళా రైతు బోరున విలపిస్తోంది.
- Naresh Gollana
- Updated on: Mar 24, 2026
- 1:11 pm
Nirmal: ఫ్లీజ్ బ్రో.. చిన్న కారణాలకే ఇలాంటివి వద్దు బ్రో..
చిన్న చిన్న కారణాలకే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం యువతలో ఆందోళన కలిగిస్తోంది. కోరికలు తీరకపోయినా సహనం, ఆలోచన అవసరం అనే సందేశాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. సమస్యలు ఎంత పెద్దవిగా కనిపించినా, ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదని గుర్తుంచుకోవాలి. ..
- Naresh Gollana
- Updated on: Mar 24, 2026
- 11:57 am
Adilabad: అయ్యో గణపతి అన్నంత పని చేశావ్ కదయ్యా.. కన్నీళ్లు ఆగవ్..
అకాల వర్షాలతో పంటలు నష్టపోయి, అప్పుల భారం తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లాలో రైతు తుడుం గణపతి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటకు గిట్టుబాటు లేక, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్న ఘటన జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది.
- Naresh Gollana
- Updated on: Mar 21, 2026
- 5:55 pm
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో సంచలన ట్విస్ట్! వెలుగులోకి..
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ విద్యార్థిని తేజస్విని మృతి వివాదం మరో మలుపు తిరిగింది. తేజస్విని మృతికి దీర్ఘ కాలిక వ్యాదే కారణమంటూ యాజమాన్యం ప్రకటించగా అసలు అలాంటి వ్యాది తమ కూతురుకు లేనే లేదంటూ తేజస్విని ఫ్యామిలీ ఆరోపిస్తోంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న తమ కూతురిని యాజమాన్యమే పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
- Naresh Gollana
- Updated on: Mar 21, 2026
- 2:45 pm
మూగబోతున్న పల్లెలు.. మాయమవుతున్న పక్షి జాతులు! టెక్ భూతం ధాటికి ప్రకృతి విలవిల..?
ప్రకృతి ఒడిలో ఒకప్పుడు సందడి చేసిన పక్షుల కిలకిలరావాలు నేడు నిశ్శబ్దంగా మారుతున్న తీరు ఆందోళకలిగిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ఒకప్పుడు పల్లెల్లో ఉదయాన్నే వినిపించే పిచుకల కిలకిలరావాలు, కోడికూతలు నేడు కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ వంటి అటవీ ప్రాంతాల్లో కూడా పక్షుల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. రాబంధులు, గద్దలు, పాలపిట్టలు వంటి పక్షి జాతులు ఇప్పటికే అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. మరోవైపు, అడవుల నరికివేత, గుట్టల విధ్వంసంతో వన్యప్రాణులు తమ ఆవాసాలను కోల్పోయి ఊళ్లపై పడుతున్నాయి. ఈ వినాశనానికి కారణం ఏంటో తెలుసా..?
- Naresh Gollana
- Updated on: Mar 21, 2026
- 1:07 pm
Telangana: రోడ్డు పక్కన పొలం నుంచి అదే పనిగా శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా..
సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. పందులు, కుక్కలు సంచరించే పత్తి చేనులో, ముళ్ల పొదల్లో ఒక ఆడ శిశువును గుడ్డలో కట్టి పారేసిన వైనం స్థానికులను విస్మయానికి గురిచేసింది. అసలు ఆ పసికందును ఎవరు వదిలేశారు.. ఏం జరిగింది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Naresh Gollana
- Updated on: Mar 21, 2026
- 12:24 pm
సింగరేణి శివంగులు.. భూగర్బ గనుల్లో పురుషులతో దీటుగా దూసుకెళుతున్న మహిళా కార్మికులు
నల్ల బంగారాన్ని గర్బంలో దాచుకున్న వెలుగుల తల్లి సింగరేణి. కనకరాశులకు తీసిపోని బొగ్గు నిక్షేపాల అవని.. శతాబ్దానికి పైగా తవ్వకాలు జరుపుతున్నా.. ఇంకా తరగని సిరిసపందలనిస్తూ ప్రపంచ ఖ్యాతి గడిస్తోంది ఆ తల్లి. సిరి వెలుగుల విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారమంటూ రాష్ట్ర కీర్తిని నలుదిక్కులా విస్తరింప జేస్తోంది. అంతటి ఖ్యాతి గడించిన తల్లి గర్బంలోకి ఒడి వడిగా అడుగులేస్తోంది అతివా లోకం. రేపటి భవిష్యత్ అంతా మాదే అంటూ వెలిగెత్తి చాటేందుకు సై అంటోంది. అతివ నడుం బిగిస్తే.. అసాధ్యమనేదే లేదంటూ నిరూపిస్తోంది సింగరేణి నారీ లోకం.
- Naresh Gollana
- Updated on: Mar 21, 2026
- 12:11 pm
Watch: ఆహా ఐడియా అదిరింది గురూ.. కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటిగా మారిన సర్పంచ్
తెలంగాణలో సర్పంచ్లకు కోతుల బెడద పెను సవాలుగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి సర్పంచులు నానా తంటాలు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని సూర్జాపూర్ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్రాములు స్వయంగా చింపాంజీ మాస్క్ ధరించి కోతులను తరిమేస్తున్నాడు. పంటలను, ప్రజలను కాపాడుతూ గ్రామస్తులకు ఉపశమనం కలిగిస్తున్న ఈ వినూత్న పరిష్కారం ఇప్పుడు ట్రెండిగ్ మారింది.
- Naresh Gollana
- Updated on: Mar 20, 2026
- 6:02 pm
Telangana: ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు.. ముఠా గుట్టు రట్టు..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పదేళ్ల సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకానికి బడ్జెట్ సాక్షిగా ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతి ఉద్యోగి చేతికి డిజిటల్ హెల్త్ కార్డ్ను అందించే విప్లవాత్మక నిర్ణయాన్ని భట్టి ప్రకటించారు.
- Naresh Gollana
- Updated on: Mar 20, 2026
- 2:19 pm
Telangana: పాపం ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
ఏ తల్లి అయినా పిల్లల క్షేమాన్నే కోరుకుంటుంది. పిల్లల కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటేనే ఆమె మనసు తల్లడిల్లుపోతుంది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ బిడ్డల్ని బాగా చూసుకుంటుంది. కానీ ఇక్కడ అలాంటి ఓ తల్లే తన కన్నబిడ్డల పాలిట మృత్యువుగా మారింది. ఏం జరిగిందో ఏమో కానీ.. తన పేగుతెంచుకొని జన్మనిచ్చిన ఇద్దరు పిల్లలను హత్య చేసేందుకు ప్రయత్నించి.. చివరకు ఆమెకు కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Naresh Gollana
- Updated on: Mar 16, 2026
- 4:49 pm