AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh Gollana

Naresh Gollana

Correspondent - TV9 Telugu

gollana.naresh@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్‌న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్‌న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!

ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో గత నెల 23న రాత్రి భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు 12 రోజుల తర్వాత భారీ దొంగ తనాన్ని ఛేదించారు జిల్లా పోలీసులు. జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలను‌ జల్లెడ పట్టిన పోలీసులు.. అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తులను‌ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది..

Telangana: తాగితే రూ.5 వేలు.. అమ్మితే రూ.10వేలు.. ఈ ఊరి రూటే సపరేట్.. ఒక్క నిర్ణయంతో అందరికీ ఆదర్శం..

Telangana: తాగితే రూ.5 వేలు.. అమ్మితే రూ.10వేలు.. ఈ ఊరి రూటే సపరేట్.. ఒక్క నిర్ణయంతో అందరికీ ఆదర్శం..

ఆ ఊరి పొలిమేర దాటి మద్యం లోపలికి రావడానికి వీల్లేదు. తాగితే ఒక శిక్ష.. అమ్మితే మరో శిక్ష.. చివరకు చుట్టాలొచ్చినా సరే రూల్స్ పాటించాల్సిందే.. యువతను సన్మార్గంలో నడపడమే లక్ష్యంగా, చితికిపోతున్న సంసారాలను చక్కదిద్దడమే ధ్యేయంగా కొమురంభీం జిల్లాలోని ఒక చిన్న గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం కథ తెలుసుకుందాం..

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. అనాథ బాలుడికి అండగా నిలిచి, పేరు పెట్టి బారసాల చేసి..

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. అనాథ బాలుడికి అండగా నిలిచి, పేరు పెట్టి బారసాల చేసి..

రాజకీయ నాయకులు కేవలం ప్రజల సమస్యలకే పరిమితం కాకుండా, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఆదర్శంగా నిలవగలరని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నిరూపించారు. పుట్టకతోనే అనాథగా మారిన ఒక చిన్నారికి తానూ ఉన్నానంటూ భరోసా ఇచ్చి, ఆ బాబు భవిష్యత్తుకు బాటలు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లిన  తల్లి ఆవు.. కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు.. కన్నీళ్లు తెపిస్తున్న వీడియో

బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లిన తల్లి ఆవు.. కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు.. కన్నీళ్లు తెపిస్తున్న వీడియో

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో సెప్టిక్ ట్యాంక్‌లో పడిన దూడను స్థానికులు రక్షించారు. బిడ్డ ప్రమాదంలో పడటంతో తల్లి ఆవు కన్నీళ్లతో అరుస్తూ సహాయం కోసం ప్రదక్షిణలు చేసింది. స్థానికులు వెంటనే స్పందించి తాళ్ల సాయంతో దూడను సురక్షితంగా బయటకు తీశారు. బిడ్డ క్షేమంగా బయటకు రాగానే, తల్లి ఆవు సంతోషంతో గంతులేసి, రక్షించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.

ఇదెక్కడి విడ్డూరం.. పౌడర్ రాసుకుంటేనే పనిచేసినట్టు లెక్క! లేదంటే పస్తులే

ఇదెక్కడి విడ్డూరం.. పౌడర్ రాసుకుంటేనే పనిచేసినట్టు లెక్క! లేదంటే పస్తులే

ఆదిలాబాద్ ఉపాధి హామీ కూలీలు NMMS యాప్ ముఖ హాజరు కోసం టాల్కమ్ పౌడర్ వాడుతున్నారు. చెమట, సాంకేతిక సమస్యల వల్ల ఫేస్ రికగ్నిషన్ అవ్వకపోవడంతో వేతనాలు కోల్పోతున్నారు. ఈ వినూత్న పరిష్కారం క్షేత్ర సహాయకుడిదే అయినా, ఇది కూలీల కష్టాలను పెంచుతోంది.

Mancherial: రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన

Mancherial: రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన

మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి మిస్సింగ్ మిస్టరీ కలకలం రేపుతోంది. స్నేహితులతో కలిసి పేకాట ఆడేందుకు వెళ్లి అదృశ్యమైన ఆటో డ్రైవర్ ఆచూకీ ఎంతకీ లభించడం లేదు. వారం రోజులుగా అణువణువు గాలించినా ఎలాంటి ఫలితం లభించలేదు. ఒక్కడి కోసం 30 మంది గజ ఈతగాళ్లు , మూడు కెమారాల్లో , పదుల సంఖ్యలో పోలీసులు , వందల మంది స్థానికులు గోదావరి అంతా గాలింపు చేపట్టినా లాభం లేకుండా పోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో సంచలనంగా మారింది. వారం రోజులు గడిచినా ఒక్క క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది.

మూఢనమ్మకం చిదిమిన ప్రాణం.. మంత్రాల నెపంతో పూజారి దారుణ హత్య..!

మూఢనమ్మకం చిదిమిన ప్రాణం.. మంత్రాల నెపంతో పూజారి దారుణ హత్య..!

మనుషులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా, గ్రామాల్లో ఇంకా వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని కాలువలో పడేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

Telangana: అద్భుతం.. అడవి బిడ్డల హైదరాబాద్ పర్యటన.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్

Telangana: అద్భుతం.. అడవి బిడ్డల హైదరాబాద్ పర్యటన.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్

ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గోండుగూడలో ఇవాళ ఉదయం 6 గంటలకు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా సుమారు 200 మంది ఆదీవాసులు 5 బస్సుల్లో హైదరాబాద్‌ సందర్శనయకు బయయల్దేరారు. మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించింది. వీరు తిరిగి ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు.

Telangana: నిర్మల్ కోటలో బయటపడిన అద్భుతం.. ఈ సీక్రెట్ ప్లేస్ చూసి అవాక్కవుతున్న జనం

Telangana: నిర్మల్ కోటలో బయటపడిన అద్భుతం.. ఈ సీక్రెట్ ప్లేస్ చూసి అవాక్కవుతున్న జనం

నిర్మల్ అంటేనే గడ్ల కోట.. శత్రువుల గుండెల్లో దడ పుట్టించే వ్యూహాల అడ్డా.. అలాంటి నిర్మల్ కోటపై ఇప్పుడు మరో రహస్య మెట్ల బావి వెలుగులోకి వచ్చింది. సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తున, అసలు నీటి జాడలే లేని చోట ఈ బావిని ఎందుకు తవ్వారు..? 200 మెట్లతో నిర్మించిన ఈ రహస్య మార్గం వెనుక ఉన్న సైనిక వ్యూహం ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

Video: ఇంటి పక్కన బావి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా ఊహించని సీన్..

Video: ఇంటి పక్కన బావి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా ఊహించని సీన్..

ప్రాణం కంటే మిన్నగా పెంచుకున్న పెంపుడు జంతువు ఆపదలో ఉంటే ఆ యజమాని మనసు విలవిల్లాడిపోయింది. బావిలో పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన పిల్లిని కాపాడమంటూ ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి ఆ మూగజీవాన్ని మృత్యువు నుండి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఎండల్లో జర జాగ్రత్త.. వేడిగా ఉందని కూలర్ ఆన్ చేసిన మహిళ.. అంతలోనే..

ఎండల్లో జర జాగ్రత్త.. వేడిగా ఉందని కూలర్ ఆన్ చేసిన మహిళ.. అంతలోనే..

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎండల వేడి.. ప్రాణాలు తీస్తోంది.. బయటకు వెళ్లాలంటేనే.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా..వడదెబ్బతో ఒకరు మృతి చెందగా, చల్లదనం కోసం ప్రయత్నించి కూలర్ విద్యుదాఘాతంతో మరొకరు కన్నుమూశారు. ఈ వేసవిలో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా, ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అస్వస్థతకు గురైతే వెంటనే చికిత్స పొందాలి.

మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూచిపూడి

మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూచిపూడి

మంచుతో కప్పుకున్న అతి చల్లని ప్రదేశాల్లో ఒకటైన గుల్మార్గ్ . మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత,ఆక్సిజన్ కూడా తక్కువగా లభించే ప్రమాదకర పరిస్థితులు, సాధారణంగా అక్కడికి వెళ్లడమే ఓ పెద్ద సాహసం. కానీ అలాంటి ప్రాంతంలో ఓ చిన్నారి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ మంచు పర్వతంపై శ్రీ విఘ్నరాజం భజే అంటూ వినాయకున్ని స్తుతిస్తూ ఏకంగా కూచిపూడి నృత్యం చేసి అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. నింగి నేల హిమంతో దూది పింజలా మెరిసిపోతున్న చోట సాహస నృత్యం ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది.