తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్బ్లోయింగ్ నిజం!
నిర్మల్ జిల్లా కేంద్రంలో జూలై 14వ తేదీన చోటుచేసుకున్న ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం, ఆపై పెళ్లి విషయంలో వచ్చిన విభేదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Naresh Gollana
- Updated on: Jul 25, 2026
- 4:43 pm
Telangana: రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడడంతో వారిని హాస్పిటల్ తరిలించారు అధికారులు.
- Naresh Gollana
- Updated on: Jul 23, 2026
- 3:04 pm
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..? ఒక్కసారిగా పేలిపోయిన మొహం..
కొమురంభీం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఛార్జింగ్ లైట్లోని బ్యాటరీని నోటితో కొరికిన 12 ఏళ్ల బాలుడు లోకేష్ నోట్లోనే అది పేలిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపగా, బ్యాటరీలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను పిల్లలు నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Naresh Gollana
- Updated on: Jul 22, 2026
- 1:41 pm
ముంచుకొస్తున్న ముప్పు.. ఇక తాగు నీటి కష్టాలే..
ఎల్ నినో ఎఫెక్ట్ తో మంచిర్యాల జిల్లాకు తాగునీటి గండం ముంచుకొస్తోంది. తలాపునే గోదావరి ఉన్నా.. ఎగువన ఎల్లంపల్లి జలాశయం ఉన్నా.. వర్షాకాలంలోను జలమో రామచంద్రా అనాల్సి పరిస్థితి ఎదురవబోతోంది. గోదావరి నది ఒడ్డునే ఉన్నా మంచిర్యాల జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు.. 150 పైగాగ్రామాలు తాగునీటి సంక్షోభం అంచున కనిపిస్తున్నాయి.
- Naresh Gollana
- Updated on: Jul 18, 2026
- 3:09 pm
Telangana: మత్తు కోసం యువత కొత్త పుంతలు.. తాటతీస్తున్న పోలీసులు
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో అమ్ముతున్నాయి.. దీంతో పోలీసుల తనిఖీల్లో ఇవి బయటపడుతున్నాయి.
- Naresh Gollana
- Updated on: Jul 18, 2026
- 12:37 pm
దారుణం.. చాయ్ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 20 రూపాయల కోసం వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. దారిన వెళ్తున్న మసాడి సోమయ్యను నిందితుడు బోగారపు నగేష్ డబ్బుల కోసం అడిగాడు. ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో గొడ్డలితో మెడ నరికి తల, మొండెం వేరు చేశాడు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- Naresh Gollana
- Updated on: Jul 17, 2026
- 9:01 pm
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు.. 7 ఏళ్ల తర్వాత జైలు శిక్ష విధించిన కోర్టు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో ఏడేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను దోషులుగా తేల్చింది ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం. ముద్దాయిలకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో 31 మంది నిందితులకు కేసు నుంచి ఉపశమనం లభించింది.
- Naresh Gollana
- Updated on: Jul 16, 2026
- 7:39 pm
Honour killing: కొంప ముంచిన మేనకోడలి ప్రేమ వ్యవహారం.. మేనమామ దారుణ హత్య
కొడుకు ప్రేమ కోసం ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. వరుసకు మేన కోడలు అయ్యే ఓ యువతిని తన కొడుకు గాడంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఓ తండ్రి ఆ యువతితో తన కొడుకుకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ విషయం అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలియడంతో ఆ తండ్రిని నమ్మించి అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. ఈ ఘటన కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
- Naresh Gollana
- Updated on: Jul 16, 2026
- 10:46 am
ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆ వెంటనే..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్యాస్ పైపు లీక్ కారణంగా వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
- Naresh Gollana
- Updated on: Jul 15, 2026
- 12:28 pm
Watch: అర్థరాత్రి MLA ఇంటికి వెళ్లిన 17 మంది గురుకుల విద్యార్ధులు.. రాత్రికి రాత్రే ఆదేశాలు
గురుకుల విద్యాసంస్థలో వసతుల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 17 మంది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్థరాత్రి హాస్టల్ను విడిచి మంచిర్యాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావును కలిసేందుకు వెళ్లిన విద్యార్థులు, ఆయన అందుబాటులో లేకపోవడంతో సతీమణి కొక్కిరాల సురేఖకు తమ సమస్యలను వివరించారు. విద్యార్థుల గోడు విన్న సురేఖ వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసి, ప్రత్యేక వాహనంలో తిరిగి హాస్టల్కు పంపించారు..
- Naresh Gollana
- Updated on: Jul 15, 2026
- 11:36 am
అర్ధరాత్రి అనుమానాస్పదంగా కనిపించాడు.. ఆపి చెక్ చేయగా కుప్పల కుప్పల ఇంజెక్షన్లు
ఆదిలాబాద్ పోలీసులు కెమికల్ డ్రగ్స్, ముఖ్యంగా సర్జరీలలో వాడే టెర్మిన్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలు జరుపుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. అధిక ధరలకు మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారని గుర్తించి, రూ.390 విలువైన ఇంజెక్షన్ను రూ.1500లకు అమ్ముతున్నారని ఎస్పీ తెలిపారు.
- Naresh Gollana
- Updated on: Jul 13, 2026
- 10:07 pm
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన 9 అడుగుల శ్వేతనాగు.. అక్కడే ఎందుకుందంటే?
నిర్మల్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుసకుంది. ఉదయానే పొలానికి వెళ్లిన రైతుకు ఊహించని పరిణామం ఎదురైంది. రైతు పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. సడెన్గా అతనికి సుమారు 9 అడుగుల పొడవున్న ఓ శ్వేతనాగు ఎదరైంది. దాన్ని చూసి రైతు వెంటనే భయంతో దూరంగా వెళ్లి దాన్ని ఆశ్చర్యంగా తిలకించాడు. ఈ అరుదైన దృశ్యాన్ని తన ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
- Naresh Gollana
- Updated on: Jul 9, 2026
- 6:35 pm