తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
ఆదివాసీల గుండెల్లో నిలిచిన కలెక్టర్.. ఏకంగా ఆయన పేరుతోనే గూడెం పేరు!
అమాయకపు ఆదివాసీ జనం.. కల్మషం లేని ప్రేమ వారి సొంతం. ఆత్మీయతలకు ఆప్యాయతలకు వారు పెట్టింది పేరు. పూరి గుడిసెల్లో.. గుడ్డిదీపాల కింద కాలం వెళ్లదీసే అడవమ్మ బిడ్డలు వారు. అడవినే నమ్ముకుని అడవితోనే బతుకంటూ సాగిపోయే జనం వాళ్లు. కష్టాలు ఎన్నొచ్చినా కన్నీళ్లతోనే ప్రయాణం చేసే బడుగు జీవులు.
- Naresh Gollana
- Updated on: Aug 13, 2026
- 8:42 pm
క్రైమ్ థ్రిల్లర్స్ను మించి.. తండ్రిని చంపి బాడీని మాయం చేసిన కొడుకు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే?
కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడం సహజమే. కానీ, అదే కలహాలు పగగా మారి, కన్న తండ్రిని కిరాతకంగా చంపే స్థాయికి దిగజారుతాయని ఎవరైనా ఊహించగలరా. మనుషుల మధ్య బంధాలు ఎంతలా బలహీనపడిపోతున్నాయో నిరూపించే అత్యంత దిగ్భ్రాంతికర సంఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది.
- Naresh Gollana
- Updated on: Aug 13, 2026
- 1:46 pm
Telangana: అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Naresh Gollana
- Updated on: Aug 12, 2026
- 4:53 pm
Hyderabad: ఇద్దరు భార్యల మధ్య చిన్నగా మొదలైన గొడవ.. కట్చేస్తే.. ఒకరి తర్వాత ఒకరు..
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు జనాలు. తాజాగా ఇలాంటి ఘటనే కొమురం భీమ్ ఆసీఫాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. చిన్న గొడవ కారణంగా ఓ మహిళ తన భర్త రెండో భార్యపై దాడి చేయడంతో ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది.. అనంతరం నిందితురాలు సైతం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది.
- Naresh Gollana
- Updated on: Aug 10, 2026
- 2:05 pm
చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఎండకు ఎండిపోయి.. జీవం కోల్పోయి మరణ దశకు చేరిన ఓ మొక్కపై చుక్క నీరు పడగానే మళ్లీ జీవం పోసుకొని నిలబడితే. సినిమా కథలు చెపుతున్నారని అనుకుంటున్నారు. అస్సలు కాదు నిజంగా నిజం. వృక్ష జాతిలోనే తిరిగి ప్రాణం పోసుకునే ఓ వింతైన మొక్క ఇది. పేరు మయూర శిఖ.. వృక్షశాస్త్రంలో ఆక్టినియోప్టెరీస్ రాడియాట అని పిలిచే అంగుళం ఎత్తుండే ఫెర్న్ జాతి మొక్క.
- Naresh Gollana
- Updated on: Aug 10, 2026
- 1:49 pm
కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా
Adilabad burglary case: ఆదిలాబాద్లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు, ఒక భారతీయుడిని అరెస్ట్ చేసి బంగారం, వెండి, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడిన అంతర్జాతీయ ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు.
- Naresh Gollana
- Updated on: Aug 3, 2026
- 5:17 pm
6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కిడ్నాప్కు గురైన నాలుగేళ్ల చిన్నారిని పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే సురక్షితంగా రక్షించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. దీంతో తల్లి ఒడికి చిన్నారి క్షేమంగా చేరింది..
- Naresh Gollana
- Updated on: Jul 29, 2026
- 3:58 pm
పోలీసులా మజాకా..! నెంబర్ ప్లేట్ ముక్కతో కూపీ లాగితే పెద్ద నెట్వర్కే బయటపడ్డది..
ఒక విరిగిన నంబర్ ప్లేట్ ముక్కతో మొదలైన దర్యాప్తు చివరకు భారీ అంతర్రాష్ట్ర దొంగల నెట్వర్క్ను బయటపెట్టింది. ఆదిలాబాద్ పోలీసులు వరుస చోరీలు, బైక్ దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, సైబర్ మోసాలు, బ్యాంకుల వద్ద నగదు చోరీలకు పాల్పడుతున్న పలు ముఠాల గుట్టు రట్టు చేసి, కేవలం పది రోజుల వ్యవధిలో 30 మందిపై కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్టు చేశారు.
- Naresh Gollana
- Updated on: Jul 27, 2026
- 4:44 pm
సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్బ్లోయింగ్ నిజం!
నిర్మల్ జిల్లా కేంద్రంలో జూలై 14వ తేదీన చోటుచేసుకున్న ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం, ఆపై పెళ్లి విషయంలో వచ్చిన విభేదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Naresh Gollana
- Updated on: Jul 25, 2026
- 4:43 pm
Telangana: రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడడంతో వారిని హాస్పిటల్ తరిలించారు అధికారులు.
- Naresh Gollana
- Updated on: Jul 23, 2026
- 3:04 pm
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..? ఒక్కసారిగా పేలిపోయిన మొహం..
కొమురంభీం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఛార్జింగ్ లైట్లోని బ్యాటరీని నోటితో కొరికిన 12 ఏళ్ల బాలుడు లోకేష్ నోట్లోనే అది పేలిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపగా, బ్యాటరీలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను పిల్లలు నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Naresh Gollana
- Updated on: Jul 22, 2026
- 1:41 pm
ముంచుకొస్తున్న ముప్పు.. ఇక తాగు నీటి కష్టాలే..
ఎల్ నినో ఎఫెక్ట్ తో మంచిర్యాల జిల్లాకు తాగునీటి గండం ముంచుకొస్తోంది. తలాపునే గోదావరి ఉన్నా.. ఎగువన ఎల్లంపల్లి జలాశయం ఉన్నా.. వర్షాకాలంలోను జలమో రామచంద్రా అనాల్సి పరిస్థితి ఎదురవబోతోంది. గోదావరి నది ఒడ్డునే ఉన్నా మంచిర్యాల జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు.. 150 పైగాగ్రామాలు తాగునీటి సంక్షోభం అంచున కనిపిస్తున్నాయి.
- Naresh Gollana
- Updated on: Jul 18, 2026
- 3:09 pm