తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Telangana: అదిగో తోక.. ఇదిగో పులి.. నమ్మండి.! సాక్ష్యం ఈ ఫోటోనే.. సీన్ కట్ చేస్తే
మూడున్నరేళ్ల వయసున్న పులిగా గుర్తించిన అటవిశాఖ అదికారులు సమీప ప్రాంత ప్రజలను, సింగరేణి కార్మికుల ను అలర్ట్ చేశారు. అయితే పులి అదే రాత్రి రాష్ట్ర రహదారి దాటి.. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గుండా గోదావరి వైపు ప్రయాణం సాగించినట్టుగా గుర్తించిన అటవిశాఖ అదికారులు.. 21 ట్రాప్ కెమెరాల సాయంతో పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
- Naresh Gollana
- Updated on: Dec 18, 2025
- 1:46 pm
Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!
ఆ ఊరు ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల కోసం ఓటేసింది. సర్పంచ్ను ఎన్నుకోవాలనుకున్న ఆ ఊరి ఓటర్ల కల 70 ఏళ్లకు నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ సహా ఇతర ఎన్నికలకు ఓటు వేసినా.. ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ గ్రామ ఓటర్లు.. ఈ సారి జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా సర్పంచ్ను ఎన్నుకోవడం ఓ విశేషం.
- Naresh Gollana
- Updated on: Dec 17, 2025
- 7:47 pm
ఆ గ్రామంలో 70 ఏళ్ల తర్వాత పంచాయతీ పోరు.. తొలిసారి ఓటేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?
ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల ముచ్చటే లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరు ఓటు వేసిన దాఖలాలే లేవు. 70 ఏళ్లు దాటినా స్థానిక ఎన్నికల్లో చేతికి సిరా చుక్క తాకలేదు. కానీ చరిత్రను తిరగ రాస్తూ 7 దశాబ్దాల తర్వాత తొలిసారి పంచాయితీ ఎన్నికలను చూసింది ఆ గ్రామం. ఇంతకు ఆ గ్రామం ఏంది.. అక్కడ ఇన్నాళ్లు ఎందుకు ఎన్నికలు జరగలేదో తెలుసుకుందాం పదండి.
- Naresh Gollana
- Updated on: Dec 17, 2025
- 1:55 pm
ఏజెన్సీలో కలకలం.. ఓ ఇంట్లో తలదాచుకున్న మావోయిస్టులు.. పోలీసుల అదుపులో టాప్ లీడర్..!
కొమురంభీం జిల్లా సిర్పూర్ యు అడవుల్లో కలకలం రేగింది. సిర్పూర్ (యు) లోని ఓ ఇంటిలో తలదాచుకున్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంకలనంగా మారింది. ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన 16 మంది మావోయిస్టులు షెల్టర్ కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రాణహిత మీదుగా కొమురంభీం జిల్లాలోకి చేరుకున్నారని సమాచారం.
- Naresh Gollana
- Updated on: Dec 16, 2025
- 6:47 pm
Telangana: సాధువులకు ఇంత దివ్యశక్తి ఉంటుందా..? వారు చెప్పిన చోట తవ్వకాలు జరుపగా..
గోదావరి పరిక్రమ యాత్రలో ఆ ప్రాంతానికి వచ్చిన సాదు సంతులు చెప్పిన మాటే నిజమైంది. గోదావరి తీరానికి సమీపంలోని ఓ స్థలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. పెద్ద ఎత్తున తరలొచ్చిన భక్త జనం ఎదుట సాగిన తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడటంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా కోలహాలంగా మారింది. అసలేం జరిగిందంటే..
- Naresh Gollana
- Updated on: Dec 15, 2025
- 5:37 pm
Sarpanch Election: అమెరికా టూ తెలంగాణ.. మామ వేసిన ఒక్క ఓటుతో సర్పంచ్గా గెలిచిన కోడలు
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత ముఖ్యమో తెలియజేసే ఆసక్తికర ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. కోడలు తమ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడంతో.. అమెరికా నుంచి వచ్చి మరీ వేసిన మామయ్య ఓటు.. కోడలి గెలుపులో కీలకంగా మారింది. రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో ఆమే ఒక్క ఓటు తేడాతో సర్పంచ్గా విజయం సాధించింది. దీంతో విజయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- Naresh Gollana
- Updated on: Dec 15, 2025
- 6:14 pm
Telangana: వ్యక్తిని హత్య చేసి.. కాల్చి బూడిద చేసిన గ్రామస్తులు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన పోలీసులు
కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెంపతో ఓ వృద్దున్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి కాల్చి వేశారు గ్రామస్తులు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఉడుంపూర్ గ్రామపంచాయితీ పరిధిలో మారుమూల గ్రామం గండి గోపాల్ పూర్ లో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- Naresh Gollana
- Updated on: Dec 13, 2025
- 5:33 pm
మరో వ్యక్తితో సన్నిహితంగా కనిపించిన లవర్.. భరించలేక ప్రియుడు ఎంతకు తెగించాడంటే..
అనుమానం పెను భూతం అయింది. ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న అక్కసుతో దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమోన్మాది. అత్యంత కిరాతకంగా హత్య చేసి.. అక్కడే రక్తపు మడుగులో పోలీసులు వచ్చేంత వరకు ఎదురు చూశాడు. నిర్మల్ జిల్లా బైంసాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన తెలంగాణ వాప్తంగా కలకలం రేపింది..
- Naresh Gollana
- Updated on: Dec 8, 2025
- 8:03 pm
Panchayat Elections: ఎన్నికల బరిలోంచి తప్పుకో.. లేదంటే లేపేస్తాం.. పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి వార్నింగ్!
మీరు సర్పంచ్ అభ్యర్థి మామ కదా.. ఎన్నికల్లో నామినేషన్ కంటే ముందే రెండు లక్షలు ఖర్చు చేశారు.. అక్రమంగా ఓటర్లను మభ్య పెడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు నోటు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు. ఎన్నికల నుండి మీ కోడలును తప్పుకోమనండి లేదంటూ మీ అంతు చూస్తాం అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో సర్పంచ్ అభ్యర్థి మామను బెదిరించాడు. కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకలకలం రేపుతోంది.
- Naresh Gollana
- Updated on: Dec 6, 2025
- 12:09 pm
Sarpanch Elections: అదృష్టం వీళ్లదే.. అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో నిత్య సర్పంచులు వీరే!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవాల జాతర కొనసాగుతోంది. మొదటి విడతతో రాష్ట్రంలోనే ఏకగ్రీవ పంచాయితీల స్థానంలో రెండవ స్థానంలో నిలవగా.. రెండు , మూడు విడతల్లో మరిన్ని పంచాయితీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆదిలాబాద్ బహిరంగ సభ ద్వారా ఏకగ్రీవాలే ముద్దు అంటూ పిలుపునివ్వడంతో ఆ వైపుగానే దూసుకెళుతున్నారు అదికార పార్టీ నేతలు. తాము బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే జిల్లాలోని ఆ ఐదు గ్రామపంచాయితీల్లో మాత్రం రెండు దశాబ్దాలుగా కుటుంబాల పాలనే కొనసాగుతోంది. అయితే భార్య లేదంటే భర్త అన్నట్టుగా సర్పంచ్ పీఠం కొనసాగుతోంది. ఆ గ్రామాలేవో చూద్దాం పదండి.
- Naresh Gollana
- Updated on: Dec 5, 2025
- 12:33 pm
Watch: పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. తెలివిగా కాపరి ఏం చేశాడో చూడండి..
మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర ప్రాణహిత దాటి జిల్లాలోని అడవుల్లోకి ఎంట్రీ ఇస్తున్న పులులు ఆహారం కొసం అడవిలోకి వెళ్లిన పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి. అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లి అటవిప్రాంతంలో చోటు చేసుకుంది. పులి రాకను గమనించిన పశువుల కాపారి ప్రాణభయంతో సమీపంలోని చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకోగా.. కళ్ల ముందే పులి పశువుల మందపై దాడి చేసి ఓ పశువును గాయపరిచింది. ధైర్యం చేసి పులి కదలికలను తన ఫోన్ లో బందించిన పశువుల కాపరి సమాచారాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. గ్రామస్తులు పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ ఘటన స్థలానికి చేరుకోవడంతో పులి అక్కడి నుండి పారిపోయింది.
- Naresh Gollana
- Updated on: Dec 5, 2025
- 12:06 pm
Telangana: వీళ్లు మనుషులు అనుకుంటే పొరపాటే.. మానవ మృగాలు..! ఏం చేశారో తెలిస్తే..
అదృశ్యమై బావిలో శవమై తేలిన నంబాల బాలిక డెత్ మిస్టరీ వీడింది. వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తే కామంతో కళ్లు మూసుకుపోయి ఆ చిన్నారిని చిదిమేశాడని పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తితో కలిసి క్రూరమృగంలా ప్రవర్తించి ఏడేళ్ల బాలికను అత్యంత అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం నంబాలలో చోటు చేసుకుంది.
- Naresh Gollana
- Updated on: Dec 2, 2025
- 2:13 pm