AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh Gollana

Naresh Gollana

Correspondent - TV9 Telugu

gollana.naresh@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్‌న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్‌న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా పాదయాత్ర బంధువులు

ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా పాదయాత్ర బంధువులు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనయుడి వివాహ వేడుకలో అపురూప ఘట్టం చోటుచేసుకుంది. ఆయన పాదయాత్రలో తోడుగా నిలిచిన ఆదివాసీ మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించి, వివాహ వేదికపై గౌరవించడం అందరినీ ఆకట్టుకుంది. పదవులు వచ్చినా పాత అనుబంధాలను మరువని భట్టి కృతజ్ఞతకు, మానవ సంబంధాలకు ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇది రాజకీయాల్లో అరుదైన ఘట్టం.

Tiger Terror: వామ్మో మ్యాన్ ఈటర్స్.. చంద్రపూర్ జిల్లాను వణికిస్తున్న రక్తం రుచిమరిగిన పులులు

Tiger Terror: వామ్మో మ్యాన్ ఈటర్స్.. చంద్రపూర్ జిల్లాను వణికిస్తున్న రక్తం రుచిమరిగిన పులులు

Tiger Terror: ఆపరేషన్ మ్యాన్ ఈటర్ చేపట్టిన మహారాష్ట్ర అటవిశాఖ బాలాపూర్ , యెనోలి కోట్ అటవి ప్రాంతంలోని కంటోన్మెంట్ 168 లోని రక్షిత అటవీ ప్రాంతంలో ఎట్టకేలకు పులిని బందించింది. పట్టు బడ్డ పులి 20 నెలల వయసున్న T-139 (ఆడ) అనే..

Fake Currency: భారీగా నకిలీ నోట్లు సీజ్.. 12 మంది అరెస్ట్.. ఇద్దరి పరారీ

Fake Currency: భారీగా నకిలీ నోట్లు సీజ్.. 12 మంది అరెస్ట్.. ఇద్దరి పరారీ

Fake Currency: తీగ లాగితే డొంక అంత కదిలినట్టు దొంగ నోట్ల ముఠా గుట్టంతా రట్టైంది. లక్షేట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కానుగంటి‌. క్రాంతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాసతో దొంగ..

Telangana: ఎక్కడ చూసినా అవే నోట్లు.. ఆరా తీస్తే పెద్ద డొంకే కదిలింది…

Telangana: ఎక్కడ చూసినా అవే నోట్లు.. ఆరా తీస్తే పెద్ద డొంకే కదిలింది…

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలను టార్గెట్‌గా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ ఇక్కడికి చేరినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం షాపులు, సూపర్ మార్కెట్లు, పెట్రోలు బంకులు, వార సంతల ద్వారా ఈ నోట్లు చలామణి అయినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.

పండంటి బిడ్డకు జననం.. మరణించి నలుగురికి పునర్జన్మనిచ్చి మహిళ..

పండంటి బిడ్డకు జననం.. మరణించి నలుగురికి పునర్జన్మనిచ్చి మహిళ..

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్ గ్రామంలో విషాదంలోను మానవత్వం వెల్లివిరిసింది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ బాలింత అవయవదానం చేసి నలుగురి ప్రాణాలు కాపాడింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి 23 రోజులు తిరక్కుండానే ఈ లోకాన్ని వీడింది. వెలుతు వెలుతూ నలుగురికి ప్రాణదానం చేసి చిరంజీవిగా మారింది. వివరాల్లోకి వెళితే

వలస పక్షుల స్వర్గధామం కవ్వాల్… ఇప్పుడు భయపెడుతున్న గుడ్లగూబలు!

వలస పక్షుల స్వర్గధామం కవ్వాల్… ఇప్పుడు భయపెడుతున్న గుడ్లగూబలు!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కవ్వాల్ అభయారణ్యం, సమీప ప్రాంతాల్లో పక్షుల గణన జరిగింది. కౌటాల అటవీ ప్రాంతంలో అరుదైన చంద్రముఖ గుడ్లగూబ గాయాలతో కంటపడగా, అటవీ శాఖ రక్షించి చికిత్స అందించింది. కవ్వాల్ టైగర్ జోన్‌తో పాటు ఇతర జలవనరుల్లో స్థానిక, ఆర్కిటిక్ వలస పక్షులతో సహా వందలాది జాతులను గుర్తించారు. వలస పక్షుల సంఖ్య పెరుగుతుండటంతో అటవీ శాఖ వాటి రక్షణకు చర్యలు చేపట్టి, స్థానికుల సహకారం కోరుతోంది.

Telangana: అర్ధరాత్రి ఒక్కసారిగా ఫోన్‌కు వరుస మెసేజ్‌లు.. తెల్లారేసరికి సీన్ సితారయ్యింది

Telangana: అర్ధరాత్రి ఒక్కసారిగా ఫోన్‌కు వరుస మెసేజ్‌లు.. తెల్లారేసరికి సీన్ సితారయ్యింది

అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా ఫోన్‌కు భారీగా మెసేజ్‌లు వచ్చాయి. రూ. 500 నుంచి రూ. 50 వేల వరకు బాధితుడి బ్యాంక్ ఖాతాల నుంచి వరుసగా డ్రా చేసి రెండు ఖాతాలను ఒకే సమయంలో ఖాళీ చేశారు సైబర్ కేటుగాళ్లు‌‌.

Health Tips: కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!

Health Tips: కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!

ఈ మధ్య కాలంలో పనిలో పడి చాలా మంది తమ ఒంటిపై కూడా శ్రద్ధ పెట్టడం లేదు. మరికొందరైతే ఏకంగా పని పేరుతో మూత్రాన్ని కూడా ఆపుకుంటున్నారు. అలాగే ప్రయాణాల్లో పరిస్థితి అనుకూలంచడం లేదనో.. పరిసరాలు శుభ్రంగా లేవనో, అసలు టాయిలెట్సే లేవనే కారణంతో కూడా కొందరు ఈ అలవాటును కొనసాగిస్తున్నారు. కానీ ఇలా మూత్ర విసర్జన ను నియంత్రిస్తే కలిగే అనర్థాలు ఏంటి.. భవిష్యత్‌లో ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కాబట్టి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telangana: గుండెల్ని పిండేసే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని మృతి కేసులో సంచలన నిజాలు..

Telangana: గుండెల్ని పిండేసే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని మృతి కేసులో సంచలన నిజాలు..

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. నూరేళ్లూ కలిసి బతకాలని కలలు కన్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ఇద్దరి ప్రేమాయణం చివరకు స్మశాన వాటికలోనే ముగిసింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని వసంత మృతి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. బాయ్‌ఫ్రెండ్ గణేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడన్న వార్త విన్న గంటల వ్యవధిలోనే వసంత కూడా ప్రాణాలు తీసుకుంది.

Adilabad: ఎగ్జామ్ హాల్‌లో ఇలా సెల్‌ఫోన్లు ఏంటి..? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Adilabad: ఎగ్జామ్ హాల్‌లో ఇలా సెల్‌ఫోన్లు ఏంటి..? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ఇదేంటి క్లాస్ రూంలో విద్యార్థులు ఫోన్లలలో మునిగిపోయారేంటి.. అందులోనూ పరీక్ష సమయంలా కనిపిస్తుంది.. పక్కనే ఇన్విజిలెటర్ కూడా ఉన్నట్టున్నాడు.. అయినా విద్యార్థుల దర్జాగా ఫోన్‌లలో మునిగి పోయారేంటి అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. వాళ్లంతా ఫోన్‌లలో మునిగిపోయింది పరీక్షలు రాసేందుకంట. అందులోను అదంతా చట్టబద్దంగా సాగుతున్న పరీక్షేనంట. అవును మీరు చదువుతున్నది నిజమే.

Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన RTC బస్సు.. !

Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన RTC బస్సు.. !

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 23) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శ్యాంపూర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం ఆదిలాబాద్ నుంచి ఆసిపాబాద్ బయలుదేరింది.

Telangana: ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు

Telangana: ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు

కొమురంభీం జిల్లాలో ఫిబ్రవరి 22న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎర్రటి ఎండ ఉండాగానే కురిసిన అకాల వర్షం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీ వర్షంతో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు సూర్యుడు సుర్రుమంటున్న సమయంలో ఈ జోరు వానలేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.