తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
మీ బైక్కు మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చారా..? దొరికితే.. నా సామిరంగ నుజ్జు నుజ్జే..
ఆదిలాబాద్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న సుమారు 120 మోడిఫైడ్ బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్లు, అనుమతి లేకుండా పోలీస్ సైరన్లు వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
- Naresh Gollana
- Updated on: Jul 6, 2026
- 8:55 pm
సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటో.. ప్రభుత్వ బడికి ఊపిరి పోసిన ముగ్గురు ఉపాధ్యాయులు!
Mancherial News: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ సొంత జీతంతో విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పిస్తున్నారు. నోటు పుస్తకాలు, మినరల్ వాటర్, మౌలిక సదుపాయాల కోసం కూడా ఖర్చు చేస్తూ ప్రభుత్వ బడిని అభివృద్ధి చేసి విద్యార్థుల సంఖ్యను 14 నుంచి 36కు పెంచి ఆదర్శంగా నిలిచారు.
- Naresh Gollana
- Updated on: Jul 6, 2026
- 8:10 pm
బాసర క్షేత్రంలో చారిత్రక ఘట్టం.. బాలాలయంలోకి చదువుల తల్లి.. గర్భగుడి మూసివేత!
ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. శృంగేరి శారదా పీఠం జగద్గురువుల ఆశీస్సులతో సరస్వతి, మహంకాళి, లక్ష్మీదేవి అమ్మవార్లను శాస్త్రోక్తంగా బాలాలయంలోకి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన గర్భగుడిని భక్తుల దర్శనార్థం మూసివేశారు. ఇకపై పనులు పూర్తయ్యే వరకు భక్తులు ..
- Naresh Gollana
- Updated on: Jul 6, 2026
- 8:43 am
పసుపు బంగారు పంటకు కేరాఫ్..తెలంగాణలో ఆ జిల్లానే నెంబర్ వన్!
పసుపు సాగులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో పండించే మొత్తం పసుపులో సగం ఉత్తర తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా పసుపును నిజామాబాద్ జిల్లా రైతులే అధికంగా సాగు చేస్తారు. తాజాగా గోదావరి పరివాహక ప్రాంతం నిర్మల్ జిల్లాలోను పసుపు సాగు పెరుగుతోంది. సాగు పెరగడమే కాదు నాణ్యమైన పచ్చబంగారపు విత్తనాలకు కేరాఫ్ కూడా నిలుస్తోంది. ఈ ప్రాంత రైతులు ఎప్పటికప్పుడు అధునాత పద్ధతులను అవలంబిస్తూ పసుపు పంటలో నాణ్యమైన పంటను ఉత్పత్తి చేస్తున్నారు.
- Naresh Gollana
- Updated on: Jul 3, 2026
- 12:11 pm
ఒక్క అంబర్ ప్యాకెట్తో అసలు గుట్టు బయటపెట్టింది.. హంటర్ డాగ్తో మామూలుగా ఉండదు..
మంచిర్యాల జిల్లాలో సాంబార్ జింక వేట కేసును అటవీశాఖ హంటర్ డాగ్ స్క్వాడ్ ఛేదించింది. ఘటనాస్థలంలో లభించిన అంబర్ గుట్కా ప్యాకెట్ ఆధారంగా నిందితుల జాడను గుర్తించిన హంటర్ డాగ్, ముగ్గురు వేటగాళ్లను పట్టించడంలో కీలక పాత్ర పోషించింది. వన్యప్రాణులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ హెచ్చరించింది.
- Naresh Gollana
- Updated on: Jun 29, 2026
- 11:21 am
లేరా.. సుశీల్.. తల్లి కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. అతివేగం.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం..
మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇంటర్ పూర్తి చేసిన 18 ఏళ్ల వెంకటసాయి సుశీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుభకార్యం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా వారి కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
- Naresh Gollana
- Updated on: Jun 29, 2026
- 9:51 am
Telangana: సరిహద్దు సమరం.. ఆ 14 గ్రామాల్లో నిలిచిన SIR సర్వే! అసలు మ్యాటరేంటంటే?
మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దులోని వివాదస్పద గ్రామాల్లో మరో కొత్త వివాదం తెర పైకి వచ్చింది. ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల ఓటర్లుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సరిహిద్దులోని 14 గ్రామాలు.. ఇప్పుడు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. తాము ఏ రాష్ట్రానికి చెందిన వారో తేల్చిన తర్వాతే తమ గ్రామాల్లో సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
- Naresh Gollana
- Updated on: Jun 26, 2026
- 6:38 pm
కనక వర్షం కురిపిస్తున్న నాటుకోళ్ల బిజినెస్! పోషకాలు ఫుల్.. ఆదాయం డబుల్
నాటు కోడి మాంసం కొరతను తీర్చడానికి ఆదిలాబాద్ మహిళా సంఘాలు అద్భుత వ్యాపారం మొదలుపెట్టాయి. 20 కోడి పిల్లలతో ప్రారంభించి, మూడు నెలల్లో 300 కోళ్లకు పెంచి, ఒక్కో కోడిని రూ.600కు పైగా అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. ఇది గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, సంప్రదాయ నాటు కోడి పెంపకాన్ని పునరుద్ధరిస్తోంది.
- Naresh Gollana
- Updated on: Jun 23, 2026
- 7:30 pm
Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో భారీ చోరీ.. సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పి కిరీటం, హుండీ మాయం
నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ కలకలం రేపింది. ప్రధాన ఆలయ మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు గర్భగుడి తాళాలు పగలగొట్టి అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటం, హుండీని అపహరించారు. చోరీకి ముందు ఆలయం సమీపంలోని సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పినట్లు పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో వ్యాస మహర్షి ఆలయం వెనుక వైపు నుంచి ఇద్దరు దుండగులు ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఆధారాలు వెల్లడిస్తున్నాయి.
- Naresh Gollana
- Updated on: Jun 23, 2026
- 7:38 am
బాసర IIITలో విడ్డూరం.. భోజనంలో బొద్దింక కనిపిస్తే మెస్లో సెల్ ఫోన్లు తావొద్దంటూ నిషేధం!
ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ మరో వివాదంలో చిక్కుకుంది. గత కొంత కాలంగా వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఆంక్షల చట్రంలో చిక్కుకున్న బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల పాలిట ఓ సర్కిలర్ శాపంగా మారింది. ఇక మీదట భోజనశాలల్లోకి విద్యార్థులు సెల్ ఫోన్ లతో వస్తే భోజనం పెట్టమని.. భోజనశాలల్లోకి విద్యార్థులు ఫోన్లు తేకూడదంటూ సర్కిలర్ను విడుదల చేయడం ఆందోళనకు కారణమైంది. పది రోజుల క్రితం క్యాంపస్ మెస్ లో ఆహారంలో బొద్దింక రావడం.. ఆ బొద్దింక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఆ ఘటనలో ఏడుగురు విద్యార్థులను విచారించిన యాజమాన్యం.. మెస్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థులపై ఆంక్షలు విదించడం చర్చనీయాంశంగా మారింది..
- Naresh Gollana
- Updated on: Jun 22, 2026
- 10:48 am
ఎవర్రా మీరంతా.. కార్లలో వస్తారు.. పశువులకు మత్తు మందు ఇస్తారు.. ఆ తర్వాత..
ఆదిలాబాద్ జిల్లాలో పశువుల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కార్లలో వచ్చి పశువులకు మత్తు మందు ఇచ్చి మహారాష్ట్రలోని వధశాలలకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేయగా, మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు.
- Naresh Gollana
- Updated on: Jun 21, 2026
- 8:38 pm
Telangana: రైల్లో ఫోన్.. చెరువులో శవం..! సినిమాను మించిన ట్విస్ట్లు.. పోలీసులు ఎలా చేధించారంటే?
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో తీవ్ర సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దృశ్యం సినిమా తరహాలో యువకుడిని హత్య చేసి.. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు, మృతదేహాన్ని ఒక దగ్గర అతని ఫోన్ను ఒక దగ్గర పడేసినట్టు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- Naresh Gollana
- Updated on: Jun 21, 2026
- 2:58 pm