Naresh Gollana

Naresh Gollana

Correspondent - TV9 Telugu

gollana.naresh@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్‌న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్‌న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Telangana: ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష.. మెజార్టీ కోల్పోతే ఇక అంతే సంగతులు..

Telangana: ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష.. మెజార్టీ కోల్పోతే ఇక అంతే సంగతులు..

ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‎పై జెండా ఎగరువేయాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విశ్వప్రయత్నాలు‌ చేస్తున్నాయి. బీఆర్ఎస్ సైతం మేము రేసులోనే ఉన్నామంటూ దూసుకొస్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తుంటే.. ఇంచార్జ్ మంత్రి‌ సీతక్క వ్యూహరచనతో కాంగ్రెస్ సైతం సై అంటే సై అంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నిలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నిక సవాల్‎గా మారింది. కార్యకర్తలు కష్టపడుతున్నా.. అక్కడక్కడా వినిపిస్తున్న అసమ్మతి రాగంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి మూడు పార్టీల్లోను‌ కనిపిస్తోంది.

Telangana: లోక్‌సభ ఎన్నికల వేళ.. కమలదళం ఎంపీపై కాంగ్రెస్ అగ్రజుడి ప్రేమాభిమానాల.. మతలబేంటో..?

Telangana: లోక్‌సభ ఎన్నికల వేళ.. కమలదళం ఎంపీపై కాంగ్రెస్ అగ్రజుడి ప్రేమాభిమానాల.. మతలబేంటో..?

ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ.. ఆదివాసీ ఉద్యమ నేత.. నిన్నమొన్నటి వరకు ఉద్యమాల్లో దూకుడుగా వ్యవహరించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, గెలిచి నిలిచిన నాయకుడు. కానీ ఐదేళ్ల కాలంలోనే ఆ చరిష్మా ఒక్కసారిగా మాయమై చివరికి సిట్టింగ్ సీటును కూడా దక్కించుకోలేని పరిస్థితి ఆయనకి ఎదురైంది.

ఆదిలాబాద్ బాద్ షా ఎవరు.. ఆదివాసీలు పట్టం కట్టేదెవరికి.. ఆందరి చూపూ ఆ సామాజిక వర్గం వైపే..

ఆదిలాబాద్ బాద్ షా ఎవరు.. ఆదివాసీలు పట్టం కట్టేదెవరికి.. ఆందరి చూపూ ఆ సామాజిక వర్గం వైపే..

అడవుల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారంతో ముచ్చటగా మూడు పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీజేపీ, గెలిచి నిలిచేందుకు బీఆర్ఎస్ , కొత్త ఆశలతో కాంగ్రెస్.. ముచ్చటగా మూడు పార్టీలు సై అంటే సై అంటూ దూసుకుపోతున్నాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ రెండు సామాజిక వర్గాల ఆశీస్సులు గంప గుత్తగా దక్కితేనే విజయం సొంతమవుతుందన్న నేపథ్యంలో ఆ రెండు వర్గాల మద్దతు‌కోసం మూడు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలే చేస్తున్నాయి.

Viral: మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ.. సంబరాలు చేసుకున్న తాగుబోతుల సంఘం సభ్యులు..

Viral: మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ.. సంబరాలు చేసుకున్న తాగుబోతుల సంఘం సభ్యులు..

మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ చేసిన పోరాటం ఫలించింది. కూలింగ్ బీర్ల కొరతతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మండు టెండల్లో మద్య ప్రియుల బాదలు తీర్చాలంటూ మంచిర్యాల ఐబీ నుండి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి ఎక్సైజ్ శాఖకు తన గోడు వెళ్లబోసుకున్నాడు మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు.. దీంతో అతని పోరాటం 24 గంటల్లోనే ఫలించింది.

Lok Sabha Election: అస్సలు తగ్గేదే లే..! పార్టీకి, బరిలో ఉన్న అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న నేత!

Lok Sabha Election: అస్సలు తగ్గేదే లే..! పార్టీకి, బరిలో ఉన్న అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న నేత!

అన్నీ పార్టీల నేతలంతా ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎర్రని ‌ఎండలో గడపకు గడపకు తిరుగుతుంటే, ఆ పార్టీ‌నేతలు మాత్రం ఆ నేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చి అలక మానిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నారట. కానీ ఏం లాభం ఆ నేత మాత్రం అస్సలు తగ్గేదే లే.. నా రూటే సపరేట్ అంటూ పార్టీకి, బరిలో ఉన్న పార్టీ అభ్యర్థికి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నాడట.

Adilabad: బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం.. ఊరురా అలర్ట్

Adilabad: బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం.. ఊరురా అలర్ట్

మహారాష్ట్ర తెలంగాణ ప్రాణహిత సరిహద్దులోని‌ కొమురంభీం జిల్లాకు కొత్త ముప్పు‌పొంచి ఉంది. ఇప్పటికే అడవులను‌ గంప గుత్తగా కబ్జా పెట్టిన మహారాష్ట్ర వలస పులులకు తోడు.. ఇప్పుడు మరో వైల్డ్ యానిమల్ గుంపుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల క్రితం గుంపు నుండి తప్పిపోయి విధ్వంసం సృష్టించిన మదగజం విధ్వంసం మరువక ముందే బాహుబలి రేంజ్ లో విధ్వంసం ముందుందనే సమాచారంతో ఆ పరిదిలోని అటవిశాఖ అలర్ట్ అయింది.

Lok Sabha Election: పార్లమెంట్ ఎన్నికల వేళ కుగ్రామం కఠిన‌ నిర్ణయం.. నేతలకు షాక్ ఇస్తూ తీర్మానం

Lok Sabha Election: పార్లమెంట్ ఎన్నికల వేళ కుగ్రామం కఠిన‌ నిర్ణయం.. నేతలకు షాక్ ఇస్తూ తీర్మానం

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామం. వందకు పైగా గడపలున్న గ్రామం. వ్యవసాయమే ఆధారంగా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామస్తులంతా కలిసి సమిష్టి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడమే..!

Adilabad BRS: గెలుపే లక్ష్యంగా చలిచీమల్లా దండు కట్టి కదులుతున్న ఆదిలాబాద్ గులాబీ సైన్యం..

Adilabad BRS: గెలుపే లక్ష్యంగా చలిచీమల్లా దండు కట్టి కదులుతున్న ఆదిలాబాద్ గులాబీ సైన్యం..

ఆపరేషన్ ఆకర్ష్‌తతో ఆ నియోజక వర్గంలో కారు పార్టీ కుదేలైపోతోంది. రాత్రికి రాత్రే కీలక‌నేతలంతా పార్టీకి రాంరాం చెప్పేసి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయితేనేం మా పార్టీకి మేమున్నాం అంటూ కొండంత అండగా నిలుస్తున్నారు‌ అక్కడి కార్యకర్తలు. పార్టీకి మేమే శ్రీరామ రక్షా అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు.

ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు.. ఎక్కడో తెలుసా.?

ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు.. ఎక్కడో తెలుసా.?

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదం కొనసాగుతున్న ఆ 14 గ్రామాల్లో ఓట్ల పండుగ వచ్చిన సమయంలో డబుల్ ధమాకా కొనసాగుతోంది. దేశమంతా ఒకేసారి పార్లమెంట్ ఎన్నికల సాగుతున్న ఈ తరుణంలో అక్కడ మేమే.. ఇక్కడ మేమే అంటున్న ఆ 14 గ్రామాల ఓటర్లు. రెండు రాష్ట్రాలు రెండు ఓట్లు..

రాత్రైందంటే ఆ ప్రాంతమంతా వింత శబ్దాలు.. మిరమిట్లు గొలిపే కళ్లు.. మ్యాటర్ తెలిస్తే.!

రాత్రైందంటే ఆ ప్రాంతమంతా వింత శబ్దాలు.. మిరమిట్లు గొలిపే కళ్లు.. మ్యాటర్ తెలిస్తే.!

కొమురంభీం జిల్లా పులుల అడ్డాలో నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి. కాగజ్‌నగర్ కారిడార్‌లో‌ సాయంత్రం ఆరు దాటిందో నో ఎంట్రీ అన్న బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. పులుల సంచారంతో రాకపోకలు నిషేదిస్తూ అటవిశాఖ నిర్ణయం తీసుకోవడంతో సాయంత్రం ఆరు దాటిందంటే ఆ ప్రాంతంలో..

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ? భగ్గుమంటోన్న విద్యార్ధి సంఘాలు

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ? భగ్గుమంటోన్న విద్యార్ధి సంఘాలు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మరో విద్య కుసుమం నేలరాలింది. హాస్టల్ గదిలో విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చుక అరవింద్ యూనివర్సిటీలో పియుసి రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో బాయ్స్ హాస్టల్ వన్ గదిలో..

Watch Video: ఎండిపోతాయనుకున్న పంటలకు ప్రాణమొచ్చింది.. మరి సాగు చేతికొచ్చేనా..?

Watch Video: ఎండిపోతాయనుకున్న పంటలకు ప్రాణమొచ్చింది.. మరి సాగు చేతికొచ్చేనా..?

నిర్మల్ జిల్లాలో ఎండిపోతాయనుకున్న పంటలకు ప్రాణమొచ్చింది. మూసుకున్న కెనాల్ గేట్లు షరతులతో కూడిన ఒప్పందంతో తెరుచుకోవడంతో పంటలకు పునర్జీవం పోసినట్టైంది. కరువు కోరలతో తెలంగాణ వర ప్రదాయినైన శ్రీరాంసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువవడంతో.. సాగుకు ఇవ్వలేమంటూ వారం రోజుల క్రితం అధికారులు చేతులెత్తేశారు. దీంతో కోతదశకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు.

Latest Articles