AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh Gollana

Naresh Gollana

Correspondent - TV9 Telugu

gollana.naresh@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్‌న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్‌న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
CPR Training: పునర్జన్మనిస్తున్న సీపీఆర్.. అత్యవసర సమయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?

CPR Training: పునర్జన్మనిస్తున్న సీపీఆర్.. అత్యవసర సమయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?

How to perform CPR perfectly: ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల వల్ల యువతలోనూ గుండెపోటు వస్తోంది. అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో సీపీఆర్ చేస్తే, ప్రాణాలు రక్షించవచ్చు. ప్రభుత్వం, ప్రజలు ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవాలని ప్రోత్సహిస్తోంది, ప్రాణదాతలుగా మారే అవకాశం కల్పిస్తోంది.

Crime News: నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే కనిపించిది చూసి..

Crime News: నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే కనిపించిది చూసి..

గోదావరి ఒడ్డు.. పక్కనే తుమ్మ పొదలు.. ఆ పొదల చాటున ఓ చెట్టు కొమ్మకు వేళాడుతున్న ఓ యువకుడి మృతదేహం.. కట్ చేస్తే ఎదురుగా పండరీనాథ్ విగ్రహం.. ఆ విగ్రహం ముందు పూజలు చేసిన ఆనవాళ్లు. ఇదేదో సినిమా సీన్ కాదు బాసర గోదావరి ఒడ్డున జరిగిన యదార్థ ఘటన. చనిపోయిన యువకుడు ఎవరో తెలియదు.. ఎందుకు చనిపోయాడో అసలు తెలియదు.. ఆత్మహత్య..? హత్యా.. ? చూద్దాం పదండి.

Telangana: నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది.. వీడియో వైరల్..

Telangana: నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది.. వీడియో వైరల్..

తెల్లవారుజామున నిద్రలేచి చూసిన ఆ అన్నదమ్ములకు ప్రాణాలు పోయినంత పనైంది. ఇంటి గడప దాటగానే ఎదురుగా కనిపించిన దృశ్యాలు వారిని వణికించాయి. నల్లటి ముగ్గులు, కోసిన నిమ్మకాయలు, విరజిమ్మిన పసుపు కుంకుమలు.. క్షుద్ర పూజల ఆనవాళ్లతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Nirmal District: సెంచరీ దాటిన బామ్మ.. ఆమె బలగం ఎంతో తెలుసా..?

Nirmal District: సెంచరీ దాటిన బామ్మ.. ఆమె బలగం ఎంతో తెలుసా..?

ఈ రోజుల్లో 60 ఏళ్ల జీవితం కూడా కష్టంగా మారుతున్న తరుణంలో నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన మారవేణి గంగవ్వ శతాయుష్కురాలిగా నిలిచారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగుపెట్టిన గంగవ్వకు కుటుంబ సభ్యులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

Telangana: తెల్లారి పొలంలో తల లేకుండా కనిపించిన భారీ ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా

Telangana: తెల్లారి పొలంలో తల లేకుండా కనిపించిన భారీ ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా

రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ యువకుడి సమాధీని తవ్వి ఆ మృతదేహాం తలను‌ మాయం చేశారు గుర్తు తెలియని దుండగులు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ సారి లుక్కేయండి.

Telangana: నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..

Telangana: నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..

గిరిజన కుంభమేళా నాగోబా మహా జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. ఆదివారం అమవాస్య అర్థరాత్రి నాగ శేషుడికి గంగాజలాభిషేకంతో జాతర షురూ కానుంది. ఉదయం మర్రి చెట్ల వద్ద సేదతీరిన మెస్రం వంశీయులను నాగోబా ఆలయ పెద్దలు సాదర స్వాగతం పలికారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకొని మర్రి చెట్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వాడి కన్ను పడిందా.. బైకు మాయం..! ఆస్పత్రులే టార్గెట్ గా రెచ్చిపోతున్న ముఠా అరెస్ట్..

వాడి కన్ను పడిందా.. బైకు మాయం..! ఆస్పత్రులే టార్గెట్ గా రెచ్చిపోతున్న ముఠా అరెస్ట్..

ఆసుపత్రులే టార్గెట్ గా రెచ్చిపోతున్న బైక్ దొంగల ముఠాకు చెక్ పెట్టారు ఆదిలాబాద్ పోలీసులు. నిందితుడి వద్ద నుండి 12 బైకులను 3,86,000 వేల రూపాయలను‌ స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో బైకు చోరీలకు‌ పాల్పడుతున్నచౌహాన్ శ్రావణ్ కుమార్ అలియాస్ రమేష్ అనే దొంగను అరెస్టు చేశారు ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు.

Telangana: ఇంటి ముందు మాయమై.. కందకంలో శవమై.. బాలుడి మరణం మిస్టరీ..

Telangana: ఇంటి ముందు మాయమై.. కందకంలో శవమై.. బాలుడి మరణం మిస్టరీ..

నిర్మల్ జిల్లా భాగ్యనగర్ కాలనీలో మూడేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఇంటిముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి… వారం రోజుల తర్వాత ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న మురికి కాలువలో మృతదేహంగా లభించడం కలకలం రేపింది. తొలినాళ్లలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడం, అదే ప్రదేశంలో శవం బయటపడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అయ్యో దేవుడా.. అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా ఊహించని ఘటన.. సెకన్ల వ్యవధిలోనే..

అయ్యో దేవుడా.. అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా ఊహించని ఘటన.. సెకన్ల వ్యవధిలోనే..

అయ్యప్ప స్వామి దర్శనం పూర్తి చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్‌లో.. భక్తులతో కలిసి కన్యాకుమారికి వెళ్లారు సత్యనారాయణ, రమ దంపతులు.. కన్యాకుమారిలో సముద్రస్నానం ముగించుకుని రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చి ఢీకొట్టింది గుర్తు తెలియని వాహనం. ప్రమాదంలో సత్యనారాయణ, రమాదేవి దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. వీరి మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Sabarimala Makara Jyothi: నేడే అద్బుత ఘట్టం.. మకర జ్యోతి దివ్యదర్శనం: ఇక్కడే స్పష్టంగా జ్యోతి దర్శనం

Sabarimala Makara Jyothi: నేడే అద్బుత ఘట్టం.. మకర జ్యోతి దివ్యదర్శనం: ఇక్కడే స్పష్టంగా జ్యోతి దర్శనం

శబరిమల కొండపై కొలువైన అయ్యప్ప స్వామి దివ్యరూప దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు. నేడు పంచగిరులపై అత్యంత పవిత్రమైన ‘మకరవిలక్కు’ (మకర జ్యోతి) దర్శనానికి శుభ ఘడియలు సమీపించాయి. బుధవారం సాయంత్రం పొన్నంబలమేడు కొండపై దివ్య జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. బుధవారం సాయంత్రం 6:30 నుంచి 6:45 గంటల మధ్య ఈ మహా దివ్య దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది.

తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..

తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..

ఆదిలాబాద్ జిల్లాలోని తొడసం వంశీయుల అద్భుత సంప్రదాయం: పుష్యమాసంలో ఖందేవ్ ఆలయంలో ఆడపడుచులు 2.5 కిలోల నువ్వుల నూనెను తాగే ఆచారం. విశ్వశాంతి, వంశ అభివృద్ధి కొరకు జరిగే ఈ మహోత్సవంలో తెలంగాణ, మహారాష్ట్రల నుండి భక్తులు పాల్గొంటారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం ఆదివాసీ సంస్కృతిలో ప్రత్యేకతను చాటుతుంది.

ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు

ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూతపడిన డోర్లి 2 ఓపెన్ కాస్ట్ గనిలో నీరు రసాయనాలతో కలిసి నీలి రంగులోకి మారింది. ఈ 'బ్లూ వాటర్' ప్రాంతం పర్యాటక ఆకర్షణగా మారింది. పోలీసులు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా, ప్రజలు సెల్ఫీలు, డ్రోన్ వీడియోలతో తరలి వస్తున్నారు. ఈ అద్భుతమైన, ప్రమాదకరమైన అందం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.