తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Telangana: కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో కట్టుకున్న వాడినో లేదా తమ కుమార్తెనే తల్లిదండ్రులు దారుణంగా హింసించడం, లేదా హత్య చేసిన ఘటనలు తరచూ మనం చూస్తేనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. తన కుమార్తె ఓ దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఏకంగా యువకుడి ఇంటినే తగలెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Naresh Gollana
- Updated on: Feb 8, 2026
- 11:53 am
Telangana: పొద్దుపోయి ఇంటికొచ్చిన రైతు.. పంటచేనులోని సీసీ కెమెరా చెక్ చేయగా..
పొలం నుంచి ఆ రైతు అప్పుడే ఇంటికొచ్చాడు. ఇక తన పంటచేనులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఓసారి చెక్ చేయగా.. దెబ్బకు కంగుతిన్నాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి. ఇదిగో ఇలా..
- Naresh Gollana
- Updated on: Feb 2, 2026
- 12:19 pm
అమ్మా. నాన్న.. మీరెక్కడ..? తల్లిదండ్రులను వెతుక్కుంటూ డెన్మార్క్ నుండి అదిలాబాద్ వచ్చిన పదేళ్ల బాలుడు.!
తమ దత్తపుత్రుడి మూలాలను వెతుక్కుంటూ డెన్మార్క్కు చెందిన జంట భారతదేశంలోని అడవుల జిల్లాకు వచ్చింది. తమ బిడ్డ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ రాస్మూస్ దంపతులు శనివారం (జసవరి 31) ఆదిలాబాద్కు చేరుకున్నారు. 2016లో రెండు నెలల వయసు ఉన్న ఓ మగశిశువును రిమ్స్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించి శిశు గృహానికి తరలించారు అధికారులు.
- Naresh Gollana
- Updated on: Jan 31, 2026
- 9:40 pm
Viral: తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆడమ్ గ్లాజెవ్స్కీ పోలాండ్లో తన ఇంటి కింద భారీ సంపదను పాతిపెట్టారు. 80 ఏళ్ల తర్వాత, అతని మనవడు జాన్ గ్లాజెవ్స్కీ ఆ నిధిని కనుగొన్నారు. 19వ శతాబ్దానికి చెందిన బంగారం, వెండి వస్తువులు మిలియన్ల డాలర్ల విలువ చేస్తూ, కుటుంబ చరిత్రకు నిదర్శనంగా నిలిచాయి.
- Naresh Gollana
- Updated on: Jan 31, 2026
- 6:53 pm
Telangana: నల్లి బొక్క ఎంత పని చేసింది.. ఇష్టంగా తింటుండగా..
ఇష్టంగా తిన్న నల్లిబొక్క ప్రాణాల మీదకు వచ్చింది. మంచిర్యాల జిల్లాలో మటన్ బొక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి తీవ్ర ప్రాణాపాయానికి గురయ్యాడు. సకాలంలో కుటుంబ సభ్యులు, వైద్యుల స్పందనతో చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలుసుకోండి .. ..
- Naresh Gollana
- Updated on: Jan 28, 2026
- 12:58 pm
CPR Training: పునర్జన్మనిస్తున్న సీపీఆర్.. అత్యవసర సమయాల్లో ఫర్ఫెక్ట్గా ఎలా చేయాలంటే?
How to perform CPR perfectly: ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల వల్ల యువతలోనూ గుండెపోటు వస్తోంది. అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో సీపీఆర్ చేస్తే, ప్రాణాలు రక్షించవచ్చు. ప్రభుత్వం, ప్రజలు ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవాలని ప్రోత్సహిస్తోంది, ప్రాణదాతలుగా మారే అవకాశం కల్పిస్తోంది.
- Naresh Gollana
- Updated on: Jan 24, 2026
- 4:06 pm
Crime News: నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే కనిపించిది చూసి..
గోదావరి ఒడ్డు.. పక్కనే తుమ్మ పొదలు.. ఆ పొదల చాటున ఓ చెట్టు కొమ్మకు వేళాడుతున్న ఓ యువకుడి మృతదేహం.. కట్ చేస్తే ఎదురుగా పండరీనాథ్ విగ్రహం.. ఆ విగ్రహం ముందు పూజలు చేసిన ఆనవాళ్లు. ఇదేదో సినిమా సీన్ కాదు బాసర గోదావరి ఒడ్డున జరిగిన యదార్థ ఘటన. చనిపోయిన యువకుడు ఎవరో తెలియదు.. ఎందుకు చనిపోయాడో అసలు తెలియదు.. ఆత్మహత్య..? హత్యా.. ? చూద్దాం పదండి.
- Naresh Gollana
- Updated on: Jan 24, 2026
- 3:38 pm
Telangana: నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది.. వీడియో వైరల్..
తెల్లవారుజామున నిద్రలేచి చూసిన ఆ అన్నదమ్ములకు ప్రాణాలు పోయినంత పనైంది. ఇంటి గడప దాటగానే ఎదురుగా కనిపించిన దృశ్యాలు వారిని వణికించాయి. నల్లటి ముగ్గులు, కోసిన నిమ్మకాయలు, విరజిమ్మిన పసుపు కుంకుమలు.. క్షుద్ర పూజల ఆనవాళ్లతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Naresh Gollana
- Updated on: Jan 24, 2026
- 3:02 pm
Nirmal District: సెంచరీ దాటిన బామ్మ.. ఆమె బలగం ఎంతో తెలుసా..?
ఈ రోజుల్లో 60 ఏళ్ల జీవితం కూడా కష్టంగా మారుతున్న తరుణంలో నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన మారవేణి గంగవ్వ శతాయుష్కురాలిగా నిలిచారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగుపెట్టిన గంగవ్వకు కుటుంబ సభ్యులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
- Naresh Gollana
- Updated on: Jan 23, 2026
- 8:31 pm
Telangana: తెల్లారి పొలంలో తల లేకుండా కనిపించిన భారీ ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా
రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ యువకుడి సమాధీని తవ్వి ఆ మృతదేహాం తలను మాయం చేశారు గుర్తు తెలియని దుండగులు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ సారి లుక్కేయండి.
- Naresh Gollana
- Updated on: Jan 23, 2026
- 8:32 am
Telangana: నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
గిరిజన కుంభమేళా నాగోబా మహా జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. ఆదివారం అమవాస్య అర్థరాత్రి నాగ శేషుడికి గంగాజలాభిషేకంతో జాతర షురూ కానుంది. ఉదయం మర్రి చెట్ల వద్ద సేదతీరిన మెస్రం వంశీయులను నాగోబా ఆలయ పెద్దలు సాదర స్వాగతం పలికారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకొని మర్రి చెట్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Naresh Gollana
- Updated on: Jan 18, 2026
- 2:10 pm
వాడి కన్ను పడిందా.. బైకు మాయం..! ఆస్పత్రులే టార్గెట్ గా రెచ్చిపోతున్న ముఠా అరెస్ట్..
ఆసుపత్రులే టార్గెట్ గా రెచ్చిపోతున్న బైక్ దొంగల ముఠాకు చెక్ పెట్టారు ఆదిలాబాద్ పోలీసులు. నిందితుడి వద్ద నుండి 12 బైకులను 3,86,000 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో బైకు చోరీలకు పాల్పడుతున్నచౌహాన్ శ్రావణ్ కుమార్ అలియాస్ రమేష్ అనే దొంగను అరెస్టు చేశారు ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు.
- Naresh Gollana
- Updated on: Jan 17, 2026
- 9:18 pm