తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Sarpanch Elections: అదృష్టం వీళ్లదే.. అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో నిత్య సర్పంచులు వీరే!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవాల జాతర కొనసాగుతోంది. మొదటి విడతతో రాష్ట్రంలోనే ఏకగ్రీవ పంచాయితీల స్థానంలో రెండవ స్థానంలో నిలవగా.. రెండు , మూడు విడతల్లో మరిన్ని పంచాయితీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆదిలాబాద్ బహిరంగ సభ ద్వారా ఏకగ్రీవాలే ముద్దు అంటూ పిలుపునివ్వడంతో ఆ వైపుగానే దూసుకెళుతున్నారు అదికార పార్టీ నేతలు. తాము బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే జిల్లాలోని ఆ ఐదు గ్రామపంచాయితీల్లో మాత్రం రెండు దశాబ్దాలుగా కుటుంబాల పాలనే కొనసాగుతోంది. అయితే భార్య లేదంటే భర్త అన్నట్టుగా సర్పంచ్ పీఠం కొనసాగుతోంది. ఆ గ్రామాలేవో చూద్దాం పదండి.
- Naresh Gollana
- Updated on: Dec 5, 2025
- 12:33 pm
Watch: పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. తెలివిగా కాపరి ఏం చేశాడో చూడండి..
మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర ప్రాణహిత దాటి జిల్లాలోని అడవుల్లోకి ఎంట్రీ ఇస్తున్న పులులు ఆహారం కొసం అడవిలోకి వెళ్లిన పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి. అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లి అటవిప్రాంతంలో చోటు చేసుకుంది. పులి రాకను గమనించిన పశువుల కాపారి ప్రాణభయంతో సమీపంలోని చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకోగా.. కళ్ల ముందే పులి పశువుల మందపై దాడి చేసి ఓ పశువును గాయపరిచింది. ధైర్యం చేసి పులి కదలికలను తన ఫోన్ లో బందించిన పశువుల కాపరి సమాచారాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. గ్రామస్తులు పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ ఘటన స్థలానికి చేరుకోవడంతో పులి అక్కడి నుండి పారిపోయింది.
- Naresh Gollana
- Updated on: Dec 5, 2025
- 12:06 pm
Telangana: వీళ్లు మనుషులు అనుకుంటే పొరపాటే.. మానవ మృగాలు..! ఏం చేశారో తెలిస్తే..
అదృశ్యమై బావిలో శవమై తేలిన నంబాల బాలిక డెత్ మిస్టరీ వీడింది. వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తే కామంతో కళ్లు మూసుకుపోయి ఆ చిన్నారిని చిదిమేశాడని పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తితో కలిసి క్రూరమృగంలా ప్రవర్తించి ఏడేళ్ల బాలికను అత్యంత అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం నంబాలలో చోటు చేసుకుంది.
- Naresh Gollana
- Updated on: Dec 2, 2025
- 2:13 pm
అయ్యప్ప నడిచిన మార్గం..ఎరుమెలి టూ శబరిమల కీంకారణ్యంలో.. రాళ్లు రప్పల్లో
ఎరుమెలి నుండి శబరిమల వరకు సాగే పెద్ద పాదం వనయాత్ర అయ్యప్ప దీక్షలోని అత్యంత కఠినమైన ఘట్టం. కొండలు, రాళ్లు, కీంకారణ్యంలో నడుస్తూ, భక్తులు భక్తితో ఈ మార్గాన్ని పూర్తి చేస్తారు. మహిషి వధించిన అళుదానది, కరిమల కొండ వంటి కీలక స్థలాలను దాటి, పంబా నది స్నానంతో ఈ పుణ్య యాత్ర ముగుస్తుంది. ఇది అయ్యప్ప స్వామి స్వయంగా నడిచిన దారి, భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.
- Naresh Gollana
- Updated on: Nov 30, 2025
- 9:37 pm
Telangana: ఎన్నికల సిత్రాలు.. ఈ 3 గ్రామాల్లో విచిత్ర పరిస్థితి.. ఎలక్షన్స్ ఉన్నా సర్పంచ్ ఉండడు..
మంచిర్యాల జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. తప్పుడు రిజర్వేషన్ విధానాల కారణంగా సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. గూడెం వంటి పంచాయతీల్లో గిరిజనులు లేకున్నా 38 ఏళ్లుగా ఎస్టీ రిజర్వేషన్ కొనసాగుతోంది. రాజారంలో ఎస్సీలు లేకపోయినా ఎస్సీ రిజర్వేషన్ ఉంది. దీంతో ఎన్నికలు నిలిచిపోయి, స్థానిక అభివృద్ధి కుంటుపడుతోంది.
- Naresh Gollana
- Updated on: Nov 30, 2025
- 7:53 pm
Telangana: సర్పంచ్ పదవికి వేలం.. లక్షలు వెచ్చించి దక్కించుకున్న మహిళ.. ఎక్కడో తెలుసా?
తెలంగానలో మొదటి విడత స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శనివారం చివరి తేదీ కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు ఆశవాహులు. మరో వైపు అదే స్థాయిలో ఏకగ్రీవాల జాతర కూడా కొనసాగుతోంది. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఊరి బాగు కోసం గుడి కట్టిస్తా.. బడి కట్టిస్తా.. అంటూ హామీలిస్తున్నారు నాయకులు. మరికొందరైతే వేలం పాటలో సర్పంచ్ , వార్డ్ మెంబర్లను కైవసం చేసుకుంటున్నారు.
- Naresh Gollana
- Updated on: Nov 29, 2025
- 1:17 pm
Cockroach coffee: కాక్రోచ్ కాఫీ.. తాగారంటే మైమరిచిపోతారు.. ఎక్కడికి అని అడగొద్దు..
ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. అనుకునే వారు సైతం గుమగుమల కాఫీ వాసన తగలగానే మనసు మార్చేసుకుంటారు. ఇక కాఫీ ప్రియులైతే రోజుకో డిఫరెంట్ టేస్ట్ ఆస్వాదించేవరుకూ నిద్రపోరు. ప్రపంచ వ్యాప్తంగా ఛాయ్ కంటే కాఫీ ప్రియులే ఎక్కువ అని లెక్కలు చెప్తున్నాయి. అది వేరే ముచ్చట కానీ ఇప్పుడు మేం చెప్పబోయే కాఫీని తాగాలంటే మాత్రం జేబులో డబ్బులే కాదు గుండెల్లో ధైర్యం దండిగా ఉండాల్సిందే. మరీ అంతలా డేర్ ఛాలెంజ్ చేసే కాఫీ కథ ఏంటి అనేగా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Naresh Gollana
- Updated on: Nov 25, 2025
- 4:04 pm
Health: అదే పనిగా ప్లాస్టిక్ బాటిల్లో మిగిలిన నీళ్లు తాగుతున్నారా.? రోగాలన్నీ రూపాయల్లో కొనితెచ్చుకున్నట్టే..
దూరప్రయాణాలు చేస్తున్నారా.. బస్ లోనో కారు లోనో ప్రయాణిస్తున్నారా. మార్గమధ్యలో దాహం వేస్తే రోడ్డు పక్కన ఉన్న దుకాణాల నుండో బస్ స్టాప్ నుండో వాటర్ బాటిల్ను కొనుగోలు చేస్తున్నారా.. అదే నీటిని తాగేసి మిగిలిన వాటర్ను అలాగే ఉంచేసి.. నాలుగు ఐదు రోజుల తర్వాత తాగుతున్నారా.!
- Naresh Gollana
- Updated on: Nov 21, 2025
- 7:51 pm
Telangana: షాప్ ముందు దిష్టి తీశారనుకునేరు.. కాస్త వీడియో ఫార్వార్డ్ చేస్తే ఖంగుతింటారు
ఎప్పటిలానే పొద్దునే తన షాప్ తెరిచేందుకు వచ్చాడు ఓ వ్యక్తి.. ఇక షట్టర్ తెరిచే దగ్గర కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. అక్కడ కనిపించింది చూడగానే పరుగులు పెట్టాడు. మరి ఆ స్టోరీ ఏంటి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Naresh Gollana
- Updated on: Nov 21, 2025
- 5:41 pm
చలికాలంలో చన్నీటి స్నానం మంచిదేనా..? ఈ డౌట్ మీకూ ఉందా..
చలికాలం స్నానం చేయాలంటే ఏ నీటితో స్నానం చేయాలి.. 'వేడి నీళ్లతోనా, చన్నీళ్లతోనా.. అన్న ప్రశ్నే వస్తే ముమ్మాటికి గరం గరం నీటితోనే అనే సమాధానం వినిపిస్తుంది. కానీ వేడి నీటితో స్నానం కూడా నష్టాన్నే తెచ్చిపెడుతుందంటున్నారు వైద్యులు. అలా అని చన్నీటి తో స్నానం కూడా సేప్ కాదంటున్నారు...
- Naresh Gollana
- Updated on: Nov 21, 2025
- 10:08 am
Telangana: రైతన్నలకు మధ్యాహ్న భోజనం.. ప్రతీరోజూ రూ. 10కే కడుపునిండా
రైతుల ఆకలిని తీర్చేందుకు ఇస్కాన్ సంస్థ ముందుకు వచ్చింది. ఆదిలాబాద్లో ఇది జరుగుతుండగా.. కేవలం రూ. 10 కే రైతులకు భోజనం పెడుతోంది ఇస్కాన్ సంస్థ. మరి ఆ వివరాలు ఏంటో..? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
- Naresh Gollana
- Updated on: Nov 20, 2025
- 8:22 pm
Telangana: పోలీసులతోనే నిబ్బా కట్టింగ్లా.. మాంచిగా మడతెట్టి జైలులో కూర్చోబెట్టారు
అక్కడితో అయినా ఆగిపోయారా అంటే అదీ లేదు.. వాళ్ల రీల్ను మరింత మంది చూడాలన్న ఆశలో అసలు పప్పులో కాలేశారు. ఆ రీల్ కాస్తా వైరల్గా మారడం వివాదానికి తెరలేపింది. దీంతో అలర్ట్ అయిన జిల్లా పోలీసులు విచారణ చేపట్టి సదరు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు.
- Naresh Gollana
- Updated on: Nov 19, 2025
- 8:42 pm