AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండంటి బిడ్డకు జననం.. మరణించి నలుగురికి పునర్జన్మనిచ్చి మహిళ..

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్ గ్రామంలో విషాదంలోను మానవత్వం వెల్లివిరిసింది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ బాలింత అవయవదానం చేసి నలుగురి ప్రాణాలు కాపాడింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి 23 రోజులు తిరక్కుండానే ఈ లోకాన్ని వీడింది. వెలుతు వెలుతూ నలుగురికి ప్రాణదానం చేసి చిరంజీవిగా మారింది. వివరాల్లోకి వెళితే

Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 11:38 AM

Share
మంచిర్యాల జిల్లా మందమర్రికి కి చెందిన ఈస్త సృజన (34) కు కొమురంభీం జిల్లా జన్కాపూర్ కు చెందిన గుండు నాగరాజుకు 2018 లో వివాహం అయింది.  వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. వృత్తిరిత్యా మూడేళ్లుగా దుబాయ్ లో ఉంటున్నారు. రెండు నెలల క్రితం ప్రసవం కోసం తల్లిగారింటికి మందమర్రికి వచ్చింది. 23 రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సృజన. భర్త సైతం 11 రోజుల క్రితం ఇండియాకు వచ్చి కొడుకును భార్యను చూసి తిరిగి ఉద్యోగానికి దుబాయ్ కు వెళ్లిపోయాడు.

మంచిర్యాల జిల్లా మందమర్రికి కి చెందిన ఈస్త సృజన (34) కు కొమురంభీం జిల్లా జన్కాపూర్ కు చెందిన గుండు నాగరాజుకు 2018 లో వివాహం అయింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. వృత్తిరిత్యా మూడేళ్లుగా దుబాయ్ లో ఉంటున్నారు. రెండు నెలల క్రితం ప్రసవం కోసం తల్లిగారింటికి మందమర్రికి వచ్చింది. 23 రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సృజన. భర్త సైతం 11 రోజుల క్రితం ఇండియాకు వచ్చి కొడుకును భార్యను చూసి తిరిగి ఉద్యోగానికి దుబాయ్ కు వెళ్లిపోయాడు.

1 / 5
ఇంతలోనే సృజన తీవ్రంగా తలనొప్పి వస్తుందంటూ తల్లిగారింట్లో ఒక్కసారి గా కుప్పకూలింది. అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్  ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరబాద్ కు తరలించారు. కానీ అంతలోనే విషాదం చోటు‌చేసుకుంది. సృజన బ్రెయిన్ డెడ్ కు గురైందంటూ తెలిపారు వైద్యులు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీయ్యారు.

ఇంతలోనే సృజన తీవ్రంగా తలనొప్పి వస్తుందంటూ తల్లిగారింట్లో ఒక్కసారి గా కుప్పకూలింది. అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరబాద్ కు తరలించారు. కానీ అంతలోనే విషాదం చోటు‌చేసుకుంది. సృజన బ్రెయిన్ డెడ్ కు గురైందంటూ తెలిపారు వైద్యులు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీయ్యారు.

2 / 5
తనువు చాలించి.. నలుగురికి ప్రాణం పోసి.. హైదరబాద్ లోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన సృజన.. బ్రెయిన్ డెడ్ కు గురైందని తెలిపారు అక్కడి వైద్యులు. ఏం చేసినా లాభం లేదని.. అవయవదానం చేసి మరో నలుగురికి ప్రాణదానం చేసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులను ఒప్పించారు వైద్యులు. జీవన్ ధాన్ సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి అవగాహన కల్పించారు.

తనువు చాలించి.. నలుగురికి ప్రాణం పోసి.. హైదరబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన సృజన.. బ్రెయిన్ డెడ్ కు గురైందని తెలిపారు అక్కడి వైద్యులు. ఏం చేసినా లాభం లేదని.. అవయవదానం చేసి మరో నలుగురికి ప్రాణదానం చేసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులను ఒప్పించారు వైద్యులు. జీవన్ ధాన్ సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి అవగాహన కల్పించారు.

3 / 5
విషయం తెలుసుకున్న భర్త నాగరాజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని, భార్య అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో సదరు ఆసుపత్రి వైద్యులు సృజన రెండు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన రోగులకు మార్పిడి చేశారు. ఆమె అవయవ దానంతో నలుగురి ప్రాణాలు నిలిచాయి. అవయవదానం అనంతరం సృజన పార్థివదేహానికి ఆ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ సెల్యూట్ చేసి నివాళులర్పించడం అందరి హృదయాలను కదిలించింది.

విషయం తెలుసుకున్న భర్త నాగరాజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని, భార్య అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో సదరు ఆసుపత్రి వైద్యులు సృజన రెండు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన రోగులకు మార్పిడి చేశారు. ఆమె అవయవ దానంతో నలుగురి ప్రాణాలు నిలిచాయి. అవయవదానం అనంతరం సృజన పార్థివదేహానికి ఆ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ సెల్యూట్ చేసి నివాళులర్పించడం అందరి హృదయాలను కదిలించింది.

4 / 5
కన్నీరు మున్నీరైన జన్కాపూర్.. గురువారం సాయంత్రం జనకాపూర్ గ్రామంలో సృజన అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి చితికి ఐదేళ్ల పెద్ద కుమారుడుతో అంత్యక్రియలు నిర్వహింపజేశారు గ్రామ పెద్దలు. తల్లి పొత్తిల్లలో సేదతీరాల్సిన 23 రోజుల పసికందు తల్లి చితి ముందు గుక్కపెట్టి ఏడ్వడం అందరిని కలిచి వేసింది. విషాదాన్ని తట్టుకుని సమాజహితాన్ని ముందుంచి అవయవదానానికి ముందుకొచ్చిన సృజన కుటుంబ సభ్యులను జీవన్ ధాన్ ప్రతినిధులతో పాటు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, సభ్యులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కేఎస్ వాసు, రాంరెడ్డి తదితరులు అభినందించారు.

కన్నీరు మున్నీరైన జన్కాపూర్.. గురువారం సాయంత్రం జనకాపూర్ గ్రామంలో సృజన అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి చితికి ఐదేళ్ల పెద్ద కుమారుడుతో అంత్యక్రియలు నిర్వహింపజేశారు గ్రామ పెద్దలు. తల్లి పొత్తిల్లలో సేదతీరాల్సిన 23 రోజుల పసికందు తల్లి చితి ముందు గుక్కపెట్టి ఏడ్వడం అందరిని కలిచి వేసింది. విషాదాన్ని తట్టుకుని సమాజహితాన్ని ముందుంచి అవయవదానానికి ముందుకొచ్చిన సృజన కుటుంబ సభ్యులను జీవన్ ధాన్ ప్రతినిధులతో పాటు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, సభ్యులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కేఎస్ వాసు, రాంరెడ్డి తదితరులు అభినందించారు.

5 / 5
Follow Us
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!
పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ..
పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. వైరల్‌గా మారిన వీడియో..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. వైరల్‌గా మారిన వీడియో..
ఒక్క సిరీస్.. 3 ఇన్నింగ్స్‌లు.. జీరో రన్స్..
ఒక్క సిరీస్.. 3 ఇన్నింగ్స్‌లు.. జీరో రన్స్..