AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గుండెల్ని పిండేసే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని మృతి కేసులో సంచలన నిజాలు..

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. నూరేళ్లూ కలిసి బతకాలని కలలు కన్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ఇద్దరి ప్రేమాయణం చివరకు స్మశాన వాటికలోనే ముగిసింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని వసంత మృతి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. బాయ్‌ఫ్రెండ్ గణేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడన్న వార్త విన్న గంటల వ్యవధిలోనే వసంత కూడా ప్రాణాలు తీసుకుంది.

Telangana: గుండెల్ని పిండేసే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని మృతి కేసులో సంచలన నిజాలు..
Basara Iiit Girl Student And Her Boyfriend Take Their Own Life
Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 4:28 PM

Share

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత మృతి కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రేమ వ్యవహారం విఫలమవడం తోనే వసంత ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. వనపర్తి జిల్లా పాంగల్ మండల అన్నారం తండాకు చెందిన వసంత.. ఖిర్యాతండాకు చెందిన గణేష్ అనే యువకుడు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గం కూడా ఒకటే.. కానీ ఇరు కుటుంబాల్లో వీరి ప్రేమ వ్యవహారం ఇష్టం లేకపోవడంతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గత రాత్రి కూడా గణేష్‌తో ఫోన్‌లో మాట్లాడింది వసంత. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. వసంత ఫోన్‌ను బ్లాక్ చేశాడు గణేష్. వాట్సాప్‌లోను బ్లాక్ చేయడంతో మరింత మనోవేదనకు గురైంది.

ఈ నేపథ్యంలో ఎంత ప్రయత్నించిన గణేష్ నుండి‌ స్పందన లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని వసంత నిశ్చయించుకుంది. ఇంతలోనే గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందడంతో మరింత మనోవేదనకు గురైన వసంత చేతిని కత్తితో కట్ చేసుకుంది. అక్కడితో ఆగకుండా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవదిలోనే ప్రేమికులు ఇద్దరు చనిపోవడంతో ఇటు ట్రిపుల్ ఐటీలో అటు వనపర్తి జిల్లాలో విషాద చాయలు అలుముకున్నాయి. నువ్వు లేని లోకంలో నేను ఉండలేనంటూ ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

బాసర ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత.. యమునా గర్ల్స్ హాస్టల్‌లో ఉంటుంది. గత రాత్రి ఓ ఫోన్ రావడంతో భయాందోళనకు గురైంది. అయితే ఆ ఫోన్ చేసింది ఎవరు.. ఎందుకు వసంత ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకున్న వసంత చేతిపై గాయాలు ఎందుకు ఉన్నాయి.. ఉరి వేసుకునే కంటే ముందే చేతులు, గొంతుపై గాయం చేసుకుందా.. పోలీసులు చెబుతున్న ప్రాథమిక సమాచారంలో నిజమెంత అనే విషయాలు నిగ్గు తేలాల్సి ఉంది. వసంత మృతదేహాన్ని బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా.. లావుడ్యా గణేష్ మృతదేహాన్ని హైదరబాద్ నుండి స్వస్థలం ఖిర్యా తండాకు తరలించారు.

Follow Us
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ