ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Watch Video: అంతులేని శోకంతో పెంపుడు శునకానికి దహన సంస్కారాలు! వీడియో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అంతోటి నాగేశ్వరరావు లీలబాయి దంపతులు 8 సంవత్సరాల క్రితం ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి లక్కీ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. జనవరి నెల పండగ రోజుల్లో అనుకోకుండా..
- N Narayana Rao
- Updated on: Feb 5, 2026
- 5:27 pm
తమ వృత్తిని తెలిపే వెడ్డింగ్ కార్డు.. వినూత్న రీతిలో వివాహ ఆహ్వానం పలుకుతున్న వధూవరులు..
ఔను...ఆ ఇద్దరు ఇష్టపడ్డారు.. వారిద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే.. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనమే ఈ వెడ్డింగ్ కార్డు. తాము ఏ వృత్తిలో స్థిరపడ్డామనే విషయాన్ని అందరికీ తెలిసేలా ఏదో ఒకటి చేయాలి అని అనుకొని వినూత్నంగా ఆలోచించారు. తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ వృత్తి నలుగురికి తెలిసేలా వెడ్డింగ్ కార్డును డిజైన్ చేశారు. విచిత్రమైన వెడ్డింగ్ కార్డుతో ఔరా అనిపించారు.
- N Narayana Rao
- Updated on: Feb 1, 2026
- 8:18 pm
దురదృష్టం అంటే ఇదే.. రూ. 200 బిర్యాని కోసం వెళితే.. లక్ష రూపాయల బైక్ గోవిందా..!
బిర్యాని అంటే కొందరికి ఎంతో ఇష్టం.. దగ్గరలో రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్ళి రుచికరమైన బిర్యాని అరగిస్తుంటారు. ఒక్కో చోట ఒక్కో ఐటమ్ ఫేమస్.. ఈ క్రమంలోనే ఓ యువకుడు రూ. 200 రూపాయలకే లభిస్తున్న రుచికరమైన బిర్యానిని అస్వాదించేందుకు ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. రెండు వందల రూపాయలు బిర్యానిపై ఆశపడితే లక్ష రూపాయలు విలువ చేసే బైక్ పోయింది.
- N Narayana Rao
- Updated on: Jan 29, 2026
- 1:30 pm
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కిష్టారం ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు రియాజ్ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠాలు బోధించడమే కాకుండా, పేద విద్యార్థుల చిరిగిన యూనిఫాంలను కుడుతూ, తెగిన గుండీలు వేస్తూ, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల వలే వారిని అక్కున చేర్చుకొని, వారి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన నిస్వార్థ సేవ ఎందరికో స్ఫూర్తిదాయకం.
- N Narayana Rao
- Updated on: Jan 23, 2026
- 5:06 pm
Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్ చూస్తే..
ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పొలంలో ఉన్న గడ్డివాము ప్రమాదవశాత్తు అంటుకోగా.. రైతులు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఆరకపోగా.. అందులోంచి వింత శబ్ధాలు వచ్చాయి. ఏంటా అని అందరూ దగ్గరవచ్చి చూస్తే.. నాగుపాము పడవిప్పుకొని నిల్చుంది. అది చూసిన రైతులంగా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
- N Narayana Rao
- Updated on: Jan 22, 2026
- 12:17 pm
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం.. అటవీశాఖ హెచ్చరిక..
భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి హడలెత్తిస్తోంది..మారుమూల ఏజెన్సీ గ్రామం కావడి గాండ్ల లో ఇంట్లో ఉన్న రెండు ఆవులను చంపి తినింది. సమీప అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు..
- N Narayana Rao
- Updated on: Jan 21, 2026
- 11:12 am
Khammam: అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి వెళ్లి చూడగా..
రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లారి కల్లాపి కోసం వరండాలోకి వచ్చి చూడగా.. దెబ్బకు దడుసుకుని ఒక్కసారిగా అరిచింది ఒక ఆమె. ఇంతకీ ఆ వరండాలో ఏం కనిపించింది. అదేంటో.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.
- N Narayana Rao
- Updated on: Jan 19, 2026
- 12:36 pm
Telangana: ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య.. ఇప్పుడు భర్త.. గుండెల్ని పిండేసే ఘటన..
ఒకప్పుడు ఆ ఇల్లు పిల్లల నవ్వులతో కళకళలాడేది. కానీ కాలం పగబట్టింది. సిలిండర్ పేలుడు రూపంలో వచ్చిన మృత్యువు, ఆ ఇంటి ఆనందాన్ని బూడిద చేసింది. గ్యాస్ మంటలు ఆ కుటుంబం ఆశలను, ఆయుష్షును కూడా చిదిమేశాయి. కన్నబిడ్డలు కాలగర్భంలో కలిశారు.. తోడుండాల్సిన భార్య తనువు చాలించింది. ఆఖరికి నా అనుకునే వారు లేని లోకంలో ఉండలేక.. ఆ వ్యక్తి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
- N Narayana Rao
- Updated on: Jan 17, 2026
- 8:15 pm
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా 271 రకాల వంటకాలు
సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ళ సందడి, అత్తారింటి విందులు గుర్తుకు వస్తాయి. ఆంధ్ర లోనే ఇటువంటి మర్యాదలు జరుగుతూ ఉంటాయి..ఇటీవల తెలంగాణ లో కూడా అల్లుడు కి మర్యాదలు జరుగు తున్నాయి. సాధారణంగా పండుగకు ఐదు లేదా పది రకాల పిండివంటలు చేయడం మనం చూస్తుంటాం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒక అత్తామామలు తమ కొత్త అల్లుడిపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు.
- N Narayana Rao
- Updated on: Jan 16, 2026
- 4:39 pm
Telangana: అయ్యో చిట్టి తల్లి.. ఇంతకంటే నరకమైన చావు ఉంటుందా.. సాంబార్ గిన్నెలో పడి..
పండుగ వేళ ఆ తల్లిదండ్రుల జీవితాల్లో చీకటి అలుముకుంది. మూడేళ్ల చిన్నారి మృత్యువుతో నెలరోజుల పోరాటం చేసి చివరికి ఓడిపోయింది. ఆటపాటల మధ్య జరిగిన ఒక క్షణపు ప్రమాదం.. ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. పూర్తి వివరాలు కథనం లోపల ...
- N Narayana Rao
- Updated on: Jan 15, 2026
- 10:48 am
ప్రాన్స్ అబ్బాయి.. తెలుగు అమ్మాయి.. ఒక్కటి చేసిన హిందూ సాంప్రదాయం..!
ప్రేమ కేవలం రెండు అక్షరాలు కాదు. రెండు మనస్సుల కలయిక. స్వచ్ఛమైన ప్రేమైతే.. ఎల్లలు ఏంటి ఖండాంతరాలు దాటుతుందని నిరూపించాయి. కులాలు వేరు.. ప్రాంతాలు వేరు.. దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. ఇద్దరి మనస్సులు కలిసి, అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి లే కాకుండా రెండు కుటుంబాల పెద్దలను సైతం ఖండాంతరాలు దాటేలా చేసింది.
- N Narayana Rao
- Updated on: Jan 13, 2026
- 11:12 am
Telangana: అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో మోగిన ఫోన్.. ఆ తర్వాత..
మరణించారని భావించి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఒక్క ఫోన్ కాల్ ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. రెండున్నరేళ్ల క్రితం కళ్లముందే మాయమైన అమ్మ.. ఇక తిరిగి రాదని ఆశలు వదులుకున్న కొడుక్కి.. నీ తల్లి ప్రాణాలతో ఉంది అన్న మాట వినగానే కలిగిన అనుభూతి వర్ణనాతీతం. చావు అంచు వరకు వెళ్లి, మళ్లీ ప్రాణాలతో ఇంటికి చేరుకున్న ఒక తల్లి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- N Narayana Rao
- Updated on: Jan 12, 2026
- 8:58 pm