AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

N Narayana Rao

N Narayana Rao

Reporter - TV9 Telugu

narayanarao.naidu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Watch: అర్ధరాత్రి సింగరేణి గనుల వద్ద అలికిడి.. గజగజలాడిన కార్మికులు! ఏం జరిగిందంటే..

Watch: అర్ధరాత్రి సింగరేణి గనుల వద్ద అలికిడి.. గజగజలాడిన కార్మికులు! ఏం జరిగిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి ఓసీ-4 గనుల వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షమై కార్మికులను భయాందోళనకు గురిచేసింది. రాత్రి వేళ నీటిని పంపించే మోటార్ల సమీపంలో గోల్డ్ కలర్‌లో మెరిసిపోతూ కనిపించిన ఈ రాక్ పైతాన్‌ను గమనించిన కార్మికులు వెంటనే స్నేక్ క్యాచర్ ముజాఫర్‌కు సమాచారం అందించారు. అతడు చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని రేగులగండి రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా పాములు మనుషులకు హాని చేయవని, అవి కనిపిస్తే చంపకుండా నిపుణులకు సమాచారం ఇవ్వాలని ముజాఫర్ సూచించారు..

Video: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ గదిలో వింత శబ్దాలు.. తెల్లారి డోర్ తీసి చూడగా భయపెట్టే సీన్.. ఇదిగో వీడియో..

Video: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ గదిలో వింత శబ్దాలు.. తెల్లారి డోర్ తీసి చూడగా భయపెట్టే సీన్.. ఇదిగో వీడియో..

సినిమాను మించిన రేంజ్ ట్విస్ట్ ఇదీ. అర్ధరాత్రి హాస్టల్ గదిలో భయంకర శబ్దాలు రావడంతో భయపడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.. వెంటనే దానికి గడియపెట్టి వేరే గదికి వెళ్లి పడుకున్నారు. తెల్లవారిన తర్వాత ధైర్యం చేసి డోర్ తీయగా లోపల ఉన్న సీన్ చూసి ఒక్కసారిగా షాక్‌తో పరుగు తీశారు. అక్కడ ఉన్నది చూస్తే మీరైనా వణికిపోవాల్సిందే. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఓసి బుజ్జి బంగారమో.. స్కూటీ పాకెట్‌లో గూడు పెట్టి గుడ్లు పెట్టింది..

ఓసి బుజ్జి బంగారమో.. స్కూటీ పాకెట్‌లో గూడు పెట్టి గుడ్లు పెట్టింది..

రికార్డు స్థాయి ఎండల నుంచి తప్పించుకోవడానికి ఓ పిచ్చుక వినూత్న మార్గం ఎంచుకుంది. వైరాలో నెలరోజులుగా పార్క్ చేసి ఉంచిన స్కూటీలో గూడు కట్టుకుని గుడ్లు పెట్టింది. ఈ అరుదైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ చిత్రాలు మీరూ చూద్దురు పదండి...

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. 3 నెలల పసికందు చెయ్యి తొలగించిన వైద్యులు! ఏం జరిగిందంటే

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. 3 నెలల పసికందు చెయ్యి తొలగించిన వైద్యులు! ఏం జరిగిందంటే

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో మూడు నెలల చిన్నారి వికలాంగుడుగా మారాడు. 3 నెలల శిశువుకు రక్తం ఎక్కించే సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కాన్ లా అమర్చిన ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో చివరికి శిశువు చేయి పూర్తిగా తొలగించారు. ఇపుడు పసిబాలుడుడు వికలాంగుడు గా మారాడు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మేతకు వెళుతున్న గేదెలు మాయం.. ఏంటా అని గోదావరి ఒడ్డున కాపుకాసి చూస్తే.. షాకింగ్ నిజం!

మేతకు వెళుతున్న గేదెలు మాయం.. ఏంటా అని గోదావరి ఒడ్డున కాపుకాసి చూస్తే.. షాకింగ్ నిజం!

ఆదివాసి గ్రామాల్లో గోదావరి తీరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తరచూ మేతకు వెళుతున్న గేదెలు మాయం అవుతున్నాయి..అసలే వేసవి కాలం..పశుగ్రాసం దొరకడం లేదు..తాగటానికి నీళ్లు కూడా కష్టంగా ఉంది..ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టపడి జీవనం సాగించే ఆదివాసీలకు చెందిన లక్షల విలువైన పాడి గేదెలు కనిపించకుండా పోవడంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. కానీ, పశువుల మాయం వెనుక మర్మం ఏంటని ఆరా తీయగా.. అసలు గుట్టు రట్టైంది.

మూగజీవాల దాహం తీర్చడమే ధ్యేయం.. 75 ఏళ్ల వృద్ధుడి సేవకు సెల్యూట్!

మూగజీవాల దాహం తీర్చడమే ధ్యేయం.. 75 ఏళ్ల వృద్ధుడి సేవకు సెల్యూట్!

మండు వేసవి… మాడు పగులగొడుతున్న ఎండలు… మనుషులే నీళ్ల కోసం అల్లాడుతున్న వేళ, ఓ వృద్ధుడు మాత్రం మూగజీవాల దాహం తీర్చేందుకు తన జీవితాన్నే అంకితం చేస్తున్నాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో 75 ఏళ్ల ఆదినారాయణ చేస్తున్న సేవ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఓ కుటుంబం మొత్తం.. వీడియో

రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఓ కుటుంబం మొత్తం.. వీడియో

ఖమ్మం జిల్లా వైరా మండలం గోల్లపూడి వద్ద రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో చెట్టుకు మంటలు అంటుకుని రహదారిపై కూలిపోయింది. అదే సమయంలో వెళ్తున్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల కారుపై భారీ వృక్షం పడటంతో కారు ధ్వంసమైంది. కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడగా.. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

TGSRTC బస్సులో టికెట్లు ఇస్తూ కుప్పకూలిన కండక్టర్.. క్షణాల్లో మృతి!

TGSRTC బస్సులో టికెట్లు ఇస్తూ కుప్పకూలిన కండక్టర్.. క్షణాల్లో మృతి!

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేక మంది గుండెపోటుతో మృతి చెందుతున్నారు. కారణాలు ఏమైనా ఈ వరుస మరణాలు జనాల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రయాణికులను టికెట్లు ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో..

మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

ఇది మామూలు మెడికల్ షాప్ బోర్డు కాదు... ప్రతి భారతీయుడి గుండె చప్పుడు వినిపించే దేశభక్తి ప్రకటన!అశ్వారావుపేటలోని శ్రీ లక్ష్మీ మెడికల్ & జనరల్ స్టోర్స్ బోర్డుపై రెపరెపలాడుతున్న మన త్రివర్ణ పతాకం. దాని కిందే, ప్రతి అక్షరంలోనూ భారతమాతపై ప్రేమను చాటే అద్భుతమైన వాక్యాలు అందరిని ఆకర్షిస్తున్నాయి ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో భద్రాచలం రోడ్లు గల ఓ మెడికల్ షాప్ బోర్డ్ పై ఇలా రాసి తన దేశభక్తి చాటుకున్నాడు .

Rooster: కోళ్లు కూడా ఇన్నేళ్లు బతుకుతాయా?.. దీని వయసెంతో తెలిస్తే..

Rooster: కోళ్లు కూడా ఇన్నేళ్లు బతుకుతాయా?.. దీని వయసెంతో తెలిస్తే..

గ్రామాల్లో నివసించే వారు కొళ్లను పెంచుకోవడం సహజం.. అయితే ఆ కోళ్లు ఎన్నాళ్లు బ్రతుకుతాయి.. సవంత్సరం లేదా కొన్ని నెలలు.. సాధారణంగా ఒక కోడి పుంజు జీవితాకం చూసుకుంటే ఐదు నుంచి పది సంవత్సాలు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం 16 ఏళ్లగా ఓ కోడి పుంజును పెంచుతున్నాడు. పదేళ్లు బ్రతకాల్సిన కోడి పుంజును ఆయుష్సును ఆయన ఎలా పెంచాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

Telangana: సమ్మర్ ఎఫెక్ట్.. ఈ దొంగలు ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే.. నవ్వాపుకోలేరు!

Telangana: సమ్మర్ ఎఫెక్ట్.. ఈ దొంగలు ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే.. నవ్వాపుకోలేరు!

దొంగలంటే సాధారణంగా ఇంట్లో ఉన్న డబ్బో, లేదా బంగారమో ఎత్తు కెళ్తారు. లేదా ఇంటి ముందు ఉన్న వాహనాలో లేదా ఏవైనా విలువైన వస్తువులు ఉంటే కాజేస్తారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు దొంగలు చేసిన పని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారు ఎత్తుకెళ్లిన వస్తువు గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకూ వాళ్లు కోట్టేసింది ఏంటనేగా మీ డౌట్.. అయితే తెలుసుకుందాం పదండి.

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. తెలంగాణలో సంచలనం..

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. తెలంగాణలో సంచలనం..

భర్త వేధింపులపై న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన ఘటన ఖమ్మంలో సంచలనం రేపింది. గర్భవతిని చేసి అబార్షన్‌కు బలవంతం చేశాడని బాధితురాలు ఆరోపించడంతో సీఐ రాజు నాయక్‌పై కేసు నమోదైంది. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.