ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Telangana: శత్రుత్వాన్ని గెలిచిన అమ్మప్రేమ.. తల్లిలేని పిల్లి పిల్లకు ప్రాణం పోసిన కుక్క.. వీడియో వైరల్..
కుక్క, పిల్లి ఎదురుపడితే చాలు రచ్చ రచ్చే.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. శత్రుత్వాన్ని మరిచి, తల్లిలేని పిల్లి పిల్లకు పాలిచ్చి కడుపు నింపింది ఓ శునకం. ఖమ్మం జిల్లాలో మనుషుల్లో నానాటికీ కనుమరుగవుతున్న మానవత్వానికి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ అరుదైన సీన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- N Narayana Rao
- Updated on: Sep 14, 2026
- 12:17 pm
Telangana: అర్థరాత్రి హాస్టల్ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లి చూడగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషాదం వెలుగు చూసింది.బూర్గంపాడు మండలం సారపాక లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల హాస్టల్లో రాత్రి నిద్రిస్తున్న 8 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో అప్రమత్తమైన హాస్టల్స్ సిబ్బంది వెంటనే వారిని స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు.
- N Narayana Rao
- Updated on: Sep 13, 2026
- 9:54 am
‘పిల్లలను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ సూసైడ్ నోట్! బెట్టింగ్ భూతానికి భర్త బలి
జిల్లాలోని బూర్గంపాడులో బెట్టింగ్కు బానిసైన ఓ మటన్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు గతంలో రూ.80 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. తన చావుకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
- N Narayana Rao
- Updated on: Sep 10, 2026
- 10:51 am
Viral Video: రాత్రి పూట పొదల్లోంచి అదే పనిగా శబ్ధాలు.. ఏంటని టార్చ్ వేసి చూడగా..
ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. సుమారు 15 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ సంచారంతో కాలనీవాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ దాన్ని పట్టుకోని అడవిలో వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
- N Narayana Rao
- Updated on: Sep 6, 2026
- 11:16 am
Telangana: ముళ్ల పొదల్లోంచి వింత శబ్దాలు.. దగ్గరకెళ్లి చూడగా గుండె పగిలే సీన్.. వీడియో చూడండి..
పేగు తెంచుకుని పుట్టిన పసికందును కళ్లారా చూసుకుని మురిసిపోవాల్సిన కన్నవారే కాలయముళ్లయ్యారు. కనికరం లేకుండా చీకట్లో ముళ్లపొదల్లోకి విసిరేసి వెళ్లిపోయారు. రాత్రంతా ముళ్ల నడుమ నరకం అనుభవించిన ఆ నవజాత శిశువు ఏడుపు విన్న స్థానికులు చలించిపోయారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- N Narayana Rao
- Updated on: Sep 5, 2026
- 11:48 am
ప్రియురాలి బర్త్డే.. ఐఫోన్ సర్ప్రైజ్ ప్లాన్.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కైన లవర్స్..
ప్రియురాలి పుట్టినరోజుకు ఖరీదైన ఐఫోన్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న యువకుడు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరా సమీపంలో ప్రియురాలితో కలిసి 12 కిలోల గంజాయిని తరలిస్తూ ఈగల్ బృందాలు, వైరా పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చిన గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గతంలోనూ గంజాయి కేసుల్లో అరెస్టైన అతడు.. ఐఫోన్ కోసం మరోసారి ఇదే దందాకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
- N Narayana Rao
- Updated on: Sep 4, 2026
- 10:14 am
గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
Sathupalli Anganwadi Food Poisoning: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కిష్టారం అంగన్వాడీ కేంద్రంలో గన్నేరు ఆకులు కలిసిన పప్పు అన్నం తిని ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు.
- N Narayana Rao
- Updated on: Sep 3, 2026
- 6:39 pm
డాబాపై చిన్నారి ఏడుపు.. వెళ్లి చూడగా షాక్! ఫోన్లో మాట్లాడుతూనే మృత్యు ఒడిలోకి తల్లి.. అసలేం జరిగింది?
పిండిప్రోలులో విషాదం నెలకొంది. తన ఏడాది కుమారుడితో ఆడుకుంటున్న శిరీష, తోడికోడలితో ఫోన్లో మాట్లాడుతుండగా డాబాపైనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పుట్టినింటికి వచ్చిన ఆమె అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
- N Narayana Rao
- Updated on: Sep 3, 2026
- 3:56 pm
ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ.. కోతులను తరిమికొడుతున్న ఎలుగుబంటి? అసలు సంగతి ఇదే!
ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చిన పంటలను కోతుల దండు ధ్వంసం చేస్తుండటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన రైతు వేముల నాగయ్య ఓ వినూత్న ఆలోచన చేశారు. తన పత్తి చేనును కోతుల నుండి కాపాడుకోవడానికి అతడు వేసిన ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
- N Narayana Rao
- Updated on: Sep 1, 2026
- 8:18 am
పొలం గట్టున డిప్యూటీ సీఎం.. కూలీలతో ఆత్మీయ పలకరింపు..
నిత్యం బిజి గా ఉండే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..పొలం గట్ల పై ప్రత్యక్ష మయ్యారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా రోజంతా పొలంలో చెమటోడ్చి పనిచేసిన ఆ శ్రమజీవులకు, ఆదివారం ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
- N Narayana Rao
- Updated on: Aug 30, 2026
- 5:44 pm
Telangana: పాపం ఈ వయస్సులో తాతకు ఎంత కష్టం.. భార్య కోసం కాళ్లరిగేలా వెతుకులాట.. ఇంతలో ఇదేం ట్విస్ట్..
తన భార్య కోసం వెతుకుతున్న వృద్దుడిని ఇద్దరు అపరిచితులు మోసం చేశారు. వృద్దుడి దగ్గర ఉన్న పించన్ డబ్బులను చోరీ చేశారు. దీనిపై వృద్దుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మానసిక స్థితి బాలేక వృద్దుడి భార్య కనిపించకుండా పోయినట్లు తేలింది.
- N Narayana Rao
- Updated on: Aug 28, 2026
- 9:26 pm
వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్న వన్యప్రాణులు.. గర్భిణీ చుక్కల జింక మృతి, కడుపులోని శిశువు కూడా..
Palvancha Deer Death: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కిన గర్భిణీ చుక్కల జింక, దాని కడుపులోని బిడ్డ మృతి చెందాయి. తీవ్ర గాయాలతో జింక పరుగుతీసినా, చివరకు తల్లిబిడ్డలను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వన్యప్రాణుల సంరక్షణకు గస్తీ పెంచి, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖను డిమాండ్ చేస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Aug 26, 2026
- 11:58 am