ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
అయ్యో దేవుడా.. పాఠాలు చెబుతూనే కుప్పకూలిన టీచర్.. ధైర్యం ఉన్నోళ్లే చూడండి..
ఖమ్మంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లీష్ టీచర్ గారపాటి జయరాజు పాఠం చెబుతుండగా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. క్లాస్రూంలో కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. జయరాజు మృతితో కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అకస్మిక మరణాలపై ఆందోళన పెరుగుతోంది.
- N Narayana Rao
- Updated on: May 9, 2026
- 6:16 pm
మాతృత్వానికి అడ్డురాని జాతి వైరం.. పాలిచ్చి కుక్కపిల్లను సాకుతున్న వానరం..!
ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక అపురూప ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మానవత్వానికే ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. సహజంగా కోతికి, కుక్కకు మధ్య జాతి వైరం ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఒక వానరం ఆ వైరాన్ని మరచి, ఒక కుక్క పిల్లను తన సొంత బిడ్డలా సాకుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
- N Narayana Rao
- Updated on: May 8, 2026
- 5:43 pm
“నన్నే ఆపుతారా? నాకే టెస్టులు చేస్తారా..?” నడిరోడ్డులో పోలీసులకే చుక్కలు చూపించిన మందుబాబు!
మణుగూరులోని తోగ్గుడెం ప్రాంతంలో గల సమ్మక్క-సారక్క గుడి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న సోలెం నాగేశ్వరరావు అనే వ్యక్తిని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో అతనికి 80 పర్సంటేజ్ అని తేలింది. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని హెచ్చరించి ఇంటికి పంపించి వేశారు.
- N Narayana Rao
- Updated on: May 7, 2026
- 7:53 pm
బైక్పై వెళ్తుండగానే ఆగిన గుండె.. కూతురు కళ్ళెదుటే తండ్రి దుర్మరణం.. !
ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరిని కలచివేసింది. అప్పటి వరకు కళ్లముందే తిరుగుతూ, సరదాగా కబుర్లు చెప్పిన తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కూతురు కళ్లెదుటే తండ్రి గుండెపోటుతో బైక్పై నుంచి కుప్పకూలి ప్రాణాలు విడిచిన హృదయవిదారక ఘటన ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
- N Narayana Rao
- Updated on: May 7, 2026
- 4:19 pm
Telangana: ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్లో బిగ్ ట్విస్ట్..
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది. తెలంగాణలో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో ఉందా చెప్పాలంటూ అధికారులను నిలదీస్తున్నారు భద్రాచలం వాసులు. కేంద్రం జన గణనలో భాగంగా చేపట్టిన సెల్ఫ్ ఎమ్యూనరేషన్ వెబ్సైట్లో భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు చూయించడం కలకలం రేపింది.
- N Narayana Rao
- Updated on: May 1, 2026
- 10:34 pm
Telangana: ఒకరి తర్వాత ఒకరు రెండ్రోజుల్లోనే నలుగురు మృతి.. ఇంతకూ ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది!
మూడుముళ్లు వేసి, ఏడడుగులు నడిచి నూరెళ్లు కలిసుందామని ఒక్కటైన భార్యభర్తలు ఈ మధ్యకాలంలో చిన్నచిన్న విషయాలకే విడిపోతున్నారు. లేదా కట్టుకున్నవారిని కడతేర్చుతున్నారు. అదీ చాలదన్నట్టూ ఇద్దరూ కలిసి చనిపోతూ.. లోకం తెలియని పసివాళ్లను కూడా వారి కోపాలకు బలిచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. భార్యభర్తల మధ్యలో మొదలైన చిన్న గొడవలు ఫ్యామిలీ మొత్తం మరణాలకు కారణం అయింది. ఇంతకు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
- N Narayana Rao
- Updated on: May 1, 2026
- 7:53 pm
Kothagudem: చెరువులో కనిపించినవి చూసి అవాక్కయిన గ్రామస్థులు.. కుప్పలు తెప్పలుగా..
దొంగనోట్ల కలకలం మధ్య భద్రాద్రి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చెరువులో 500 రూపాయల నోట్లు కట్టలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు పరిశీలించగా.. కొత్త విషయం తేలింది. ఇది ఆకతాయిల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు కథనంలో ...
- N Narayana Rao
- Updated on: Apr 29, 2026
- 5:05 pm
మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో చోటుచేసుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తొలుత తండ్రి రాము, కుమార్తె దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, తాజాగా ఈ కేసులో మరో విషాదకర మలుపు చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య రమ్య కూడా మంగళవారం (ఏప్రిల్ 28) కన్నుమూసింది.
- N Narayana Rao
- Updated on: Apr 28, 2026
- 2:06 pm
సిమ్ మార్చండి.. లీటర్ పెట్రోల్ కొట్టేయండి! ఇది కదా అసలైన బిజినెస్ మైండ్!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంకు చూసినా 'నో స్టాక్' బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభో అని జనం అల్లాడిపోతున్న వేళ, ఒక వ్యాపారి తెలివైన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
- N Narayana Rao
- Updated on: Apr 28, 2026
- 12:25 pm
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో బాలాలయానికి తరలిన ..
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా కళావాహన కార్యక్రమం ఘనంగా జరిగింది చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో వైదిక పరమైన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి..ఉదయం ముందుగా పవిత్ర పావన గోదావరి నది నుండి నదీ జలాలను సేకరించి ఆలయానికి ఋత్వికుల బృందం మేలతాలతో తీసుకువచ్చారు. జీర్ణోద్ధరణ, కళావాహన కార్యక్రమాలలో పాల్గొనేందుకు..
- N Narayana Rao
- Updated on: Apr 27, 2026
- 8:47 pm
Khammam: ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేస్తుండగా ఇలా అయింది ఏంటి..?
సారపాకలో వినాయక ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన సమయంలో అపశృతి చోటుచేసుకుంది. క్రేన్తో ప్రతిష్టిస్తున్న ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి పడడంతో ముగ్గురు గాయపడ్డారు. భక్తులు అప్రమత్తంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. భద్రతా లోపాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .. ..
- N Narayana Rao
- Updated on: Apr 26, 2026
- 8:30 pm
మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ.. మండే ఎండలకు ఈ శునకం ఏం చేసిందంటే!
వేసవి కాలం వచ్చిందంటే..పెద్దింటి వాళ్ళు సెంట్రల్ AC, AC లు, కూలర్లు తో చల్లని గాలి కి ఉపశమనం పొందుతారు. అదే పేదవాడు అయితే చెట్టు నీడ చూకుని సేద తీరుతారు. ఎండల తీవ్రతకు ప్రతి జీవి కూడా ఉపశమనం కోసం తహతహ లాడుతుంటాయి. మరి అలాంటి ఒక ఒక మూగ జీవి తాను ఎండకు తట్టుకోలేక విలవిలలాడుతుంది. తనతో పాటు తన బిడ్డ కూడా ఎండ తీవ్రతకు గురవుతుందని భావించిన ఆ మూగ జీవి తన బిడ్డ కు ఎండ తగలకుండా చేసిన ఉపాయం చూసి అందరూ షాక్ అయ్యారు.
- N Narayana Rao
- Updated on: Apr 26, 2026
- 5:57 pm