ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
అడవి బిడ్డకు అందని వైద్యం.. తొలి కాన్పులోనే నరకయాతన.. ఆటోలోనే ప్రసవం..!
ప్రభుత్వాలు మారుతున్నా ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతులు, వైద్య సౌకర్యాలు మాత్రం మెరుగుపడటం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో అర్ధరాత్రి వేళ ఒక గర్భిణీకి ఎదురైన అనుభవం ఇక్కడి వైద్యు లీలలను కళ్ళకు కడుతోంది. తొలి కాన్పు కావడంతో ఆమె పురిటి నొప్పులతో అల్లాడిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నరకయాతన అనుభవించింది.
- N Narayana Rao
- Updated on: Jun 26, 2026
- 2:53 pm
Khammam: ఓరి మీకు కాలం రాను.. మామిడికాయ పచ్చడి ఎత్తుకుపోవుడు ఏందిరా..?
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో దొంగలు విచిత్ర చోరీకి పాల్పడ్డారు. ఐదు కాసుల బంగారం, రూ.60 వేల నగదుతో పాటు బియ్యం, వంటనూనె, నిత్యావసర సరుకులు కూడా ఎత్తుకెళ్లారు. అంతేకాదు, పాత చెప్పులు వదిలేసి కొత్త చెప్పులు వేసుకుని వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
- N Narayana Rao
- Updated on: Jun 26, 2026
- 10:11 am
Viral Video: సీటు కోసం రణరంగంగా మారిన ఆర్టీసీ బస్సు.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే ఇదే సమయంలో సీట్ల కోసం, ప్రయాణాల కోసం మహిళల మధ్య నిత్యం ఏదో ఒక చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో సీటు విషయంలో మహిళా ప్రయాణికులు ఏకంగా ఒకరినొకరు కొట్టుకున్న ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా, తోటి ప్రయాణికులలో తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే?
- N Narayana Rao
- Updated on: Jun 24, 2026
- 9:56 pm
అభిరుచిలో ఈయనే ‘శ్రీమంతుడు.. వందల ఏళ్ల చరిత్రను భద్రపరుస్తున్న లారీ క్లీనర్!
మనలో చాలామంది పాత నాణేలు, నోట్లను చూస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన మల్లెల్లి శ్రీను మాత్రం వాటిలో చరిత్రను చూశారు. ఆర్థికంగా చాలా సాధారణ కుటుంబానికి చెందిన పేదవాడైనప్పటికీ, తన అపురూపమైన అభిరుచితో నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jun 24, 2026
- 8:54 pm
మానవత్వం మరిచిన ఇంటి యజమాని.. మృతదేహాలను ఇంట్లోకి రానివ్వకుండా గేటుకు తాళం
భద్రాచలంలో మూఢనమ్మకాల కారణంగా ఇంటి యజమాని మృతదేహాలను అద్దె ఇంట్లోకి రానివ్వకుండా గేటుకు తాళం వేయడం వివాదాస్పదమైంది. స్థానికుల విజ్ఞప్తులను పట్టించుకోకుండా వ్యవహరించడంతో మూడు మృతదేహాలను వేరే గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి యజమాని తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు..
- N Narayana Rao
- Updated on: Jun 23, 2026
- 7:33 am
అర్ధరాత్రి ఆలయ ప్రాంగణం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు.. ఫిర్యాదులో పోలీసులు వెళ్లి చూడగా
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని మారెమ్మతల్లి ఆలయంలో గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టిన ఘటనను పోలీసులు భగ్నం చేశారు. ఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకుని సెల్ఫోన్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ పూజారితో పాటు మరికొందరి పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jun 21, 2026
- 9:42 pm
Khammam: చేతులు ఎలా వచ్చాయ్ స్వాతి.. భర్త మాట వినడం లేదని ఏం చేసిందో తెలుసా..?
ఖమ్మం నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భర్తతో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులకు అన్నంలో ఎలుకల మందు కలిపి తినిపించిన తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో వేదిక్ కుమార్ (7), తనిష్క్ (5) చికిత్స పొందుతూ మృతి చెందగా, తల్లి స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. వ్యవసాయం కోసం స్వగ్రామానికి వెళ్లాలన్న భర్త సూచనపై దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
- N Narayana Rao
- Updated on: Jun 21, 2026
- 12:28 pm
Telangana: ఒక్క నిర్ణయం డబుల్ బెనిఫిట్.. బెల్ట్ షాపుల నియంత్రణకు ఆ గ్రామ సర్పంచ్ వినూత్న ప్రయోగం
గ్రామాల్లో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపులను అరికట్టేందుకు ఓ గ్రామ సర్పంచ్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింత్రియాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉషారాణి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటనేగా మీ డౌట్ అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- N Narayana Rao
- Updated on: Jun 19, 2026
- 3:15 pm
Viral VIdeo: పొలానికి వెళ్తుండగా.. పొదల్లో ఏదో అలజడి.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్లో పొద్దుపొద్దున్నే జనాలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉదయాన్నే పొలానికి వెళ్తున్న కొందరు రైతులకు దారి పక్కన ఉన్న పొదల్లోంచి ఏవో వింత శబ్దాలు వినిపించాయి. ఏంటని దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ రెండు పాములు సయ్యాట ఆడుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- N Narayana Rao
- Updated on: Jun 18, 2026
- 12:56 pm
అరె ఏంట్రా ఇదీ..! నడిరోడ్డు మీద పోలీసులకే చుక్కలు చూపించిన యువకుడు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మద్యం మత్తులో ఓ యువకుడు నడిరోడ్డుపై సృష్టించిన హంగామా స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీర్ బాటిల్తో తన పొట్టలో తానే గాయపరుచుకుని సుమారు గంటపాటు ప్రధాన రహదారిపై వీరంగం సృష్టించాడు. చివరకు అతికష్టం మీద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jun 16, 2026
- 12:51 pm
చచ్చే వయసులో ఇదేం పనిరా.. షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు.. చివరకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, స్థానికులు గుర్తించగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నా ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడికి కఠిన శిక్ష డిమాండ్ చేస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jun 15, 2026
- 11:25 am
అలసట పాయే..ఆనందం మెదలాయే..ఉపాధి పనిలో పెళ్లి సంబరాలు!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలకు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లేవు, రక రకాల వంటకాలు లేవు.. పచ్చని చెట్ల మధ్య, ఆకాశం పందిరిగా మారి, చెట్టు కొమ్మలే తోరణాలుగా మారి, శ్రమ జీవులలో సంబరాన్ని నింపే వేడుకలు.. ఇలా అనుకుంటున్నారా? ఉపాధి హామీ కూలీలు సంబురంగా చేసుకునే పెళ్లి.
- N Narayana Rao
- Updated on: Jun 14, 2026
- 6:44 pm