Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

N Narayana Rao

N Narayana Rao

Reporter - TV9 Telugu

narayanarao.naidu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
క్రికెట్ అంటే అభిమానం ఉండాలి.. మరీ ఇంతలానా.. ఏకంగా పెళ్లి వేడుకలో..!

క్రికెట్ అంటే అభిమానం ఉండాలి.. మరీ ఇంతలానా.. ఏకంగా పెళ్లి వేడుకలో..!

క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందులో మన దేశంలో క్రేజ్ ఎక్కువ. ఇపుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులకు పండుగే. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా సందడే కనిపిస్తోంది. అయితే పెళ్లికి హాజరైతే, ఐపీఎల్ మ్యాచ్ మిస్ అవుతాం కదా.. ఎలా..? అందుకే ఓ నూతన జంట వినూత్న ఆలోచన చేసింది.

ఆంబోతు మృతితో తల్లడిల్లిన గ్రామం.. ఊరంతా కదిలి.. కన్నీటి పర్యంతం!

ఆంబోతు మృతితో తల్లడిల్లిన గ్రామం.. ఊరంతా కదిలి.. కన్నీటి పర్యంతం!

మన కుటుంబ సభ్యులు, ఆప్తులు మరణిస్తే చాలా బాధ పడతాం. వారితో ఉన్న అనుబంధం, జ్ఞాపకాల గుర్తుకు తెచ్చుకుని.. ఆ బాధతో కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాం. కొందరిని మరిచిపోలేని మమకారం ఉంటుంది. తాజాగా ఓ గ్రామంలో ఆంబోతు మరణిస్తే ఊరంతా కదిలింది. ఆంబోతు మృతిని తట్టుకోలేక మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు.

Khammam: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. గంట వ్యవధిలోనే భార్య, భర్తలు మృతి!

Khammam: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. గంట వ్యవధిలోనే భార్య, భర్తలు మృతి!

నూరేళ్లు నీతోడై నడుస్తానని అగ్ని సాక్షిగా ఏడగులు వేసి తన వెంట వచ్చిన భార్య..తనని వదిలి వెళ్లిపోయింది. అన్యోన్యంగా ఉండే భార్య కళ్ళ ముందే మరణించడంతో.. ఆ భర్త హృదయం చలించిపోయింది. భార్య మరణవార్త విన్న ఆ భర్త ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవదిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లాలోని రామచంద్రపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే

Telangana: అక్రమ సంబంధం కోసం ఎంతకు తెగించాడు.. ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ.. కట్ చేస్తే

Telangana: అక్రమ సంబంధం కోసం ఎంతకు తెగించాడు.. ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ.. కట్ చేస్తే

ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు సుపారి ఇచ్చాడు ప్రియుడు... వివాహేతర సంబంధం నేపథ్యంలో.. ఆమె భర్తను హత్య చేసేందుకు స్కెచ్ గీశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌తో 20 లక్షలకు డీల్ కుదుర్చుకుని...అడ్వాన్స్ కింద 5 లక్షలు ఇచ్చాడు. చెప్పిన సమయానికి మిగిలిన నగదు ఇవ్వక పోవడంతో నిందితులు హత్య చేయకుండా వదిలి పెట్టారు. అయితే ఈ ప్లాన్ గుట్టు రట్టవ్వడంతో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?

సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?

తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో ఉన్న సువర్చల సహిత ఆంజనేయస్వామి ఆలయం అత్యంత ప్రత్యేకమైనది. 2006లో నిర్మించబడిన ఈ ఆలయంలో, ఆంజనేయస్వామికి భార్య సువర్చలగా పూజలు జరుగుతాయి. సూర్యపుత్రిక సువర్చలను ఆంజనేయస్వామి వివాహం చేసుకున్న కథ ఆలయ పురోహితులు వివరించారు.

పేదింట్లో మెరిసిన ఆణిముత్యం.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యవసాయ కూలీ బిడ్డ!

పేదింట్లో మెరిసిన ఆణిముత్యం.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యవసాయ కూలీ బిడ్డ!

జంగం జ్యోతి శిరీష చిన్నతనం నుండే చదువుపై మక్కువ చూపించడంతో తల్లిదండ్రులు కష్టపడి ఆమెను ప్రోత్సహించారు. ఇంటర్ డిగ్రీ తోపాటు పీజీ బీఈడీ పూర్తిచేసిన జ్యోతి శిరీష యుపిఎస్సి పై మక్కువ చూపించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యుపిఎస్సి కోచింగ్ సెంటర్‌లో విద్యను అభ్యసించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులతో పాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరైంది. ఒకే సంవత్సరంలో వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయింది.

Telangana: పెద్ద చెరవులో వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..

Telangana: పెద్ద చెరవులో వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..

చెరువుల్లో నీరు అడుగంటుతుండటంతో చేపలు పట్టేందుకు జనం ఎగబడుతున్నారు. పల్లెల్లో కనిపిస్తున్న దృశ్యాలు చెరువుల జాతర తలపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. కుర్నవల్లి పెద్ద చెరువులో జల పుష్పాల జాతరలో భాగంగా చేపల వేటకు జనం ఎగబడ్డారు.

Kusumanchi: లోన్ కిస్తీలు కట్టలేదని గొర్రెలు ఎత్తుకెళ్లారు.. మీకు సామాన్యులు అంటే లోకువేలే..

Kusumanchi: లోన్ కిస్తీలు కట్టలేదని గొర్రెలు ఎత్తుకెళ్లారు.. మీకు సామాన్యులు అంటే లోకువేలే..

ఆస్తి పన్ను కట్టలేదని.. హైదరాబాద్‌లో దుకాణం ఎదుట పన్ను విభాగం అధికారులు జేసీబీతో గుంత తవ్విన వ్యవహారం ఇటీవల చర్చనీయాంశమైంది. ఈ పని చేసిన సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ తరహా ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో వెలుగుచూసింది.

Telangana:  ప్రొఫెసర్ మాట విని ఇంట్లోనే పుట్ట గొడుగుల పెంపకం.. వేల రూపాయలు సంపాదించిన విద్యార్థులు

Telangana: ప్రొఫెసర్ మాట విని ఇంట్లోనే పుట్ట గొడుగుల పెంపకం.. వేల రూపాయలు సంపాదించిన విద్యార్థులు

పుట్టగొడుగులు ముఖ్యమైన ఉద్యానవన వాణిజ్య పంట. వ్యవసాయ పొలాల్లో పండించే ఇతర పంటలతో పోలిస్తే ఈ పంటలు ఆకర్షణీయమైన లాభాలను ఇస్తాయి. భారతదేశంలో పుట్టగొడుగుల పెంపకం చాలా మందికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా క్రమంగా పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు.

Telangana: పేకమేడలా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!

Telangana: పేకమేడలా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీపతి శ్రీను అనే వ్యక్తి జీ ప్లస్‌-2 భవన నిర్మాణం కోసం పర్మిషన్‌ తీసుకని ఐదంస్తులు కడుతున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపేయాలని మునిసిపల్ అధికారులు ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణం చేపట్టారు.

ఏడాదైనా.. కుక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న యజమాని.. చర్చిలో ఘనంగా సంవత్సరీకం!

ఏడాదైనా.. కుక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న యజమాని.. చర్చిలో ఘనంగా సంవత్సరీకం!

ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక కుక్క అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. దీన్ని తట్టుకోలేని ఓ స్కూల్ టీచర్ దాని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాడు. అంతేకాదు దాని జ్ఞాపకాలను మరిచిపోకుండా, చనిపోయి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా చర్చిలో జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసిచ భోజనాలు పెట్టి తన కుక్కపై మమకారాన్ని చాటుకున్నాడు.

Telangana: ఒరెయ్ పొలం నుంచి అవి ఎలా దొంగతనం చేశార్రా.. బిత్తరపోయిన రైతు

Telangana: ఒరెయ్ పొలం నుంచి అవి ఎలా దొంగతనం చేశార్రా.. బిత్తరపోయిన రైతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో దొంగలు రూట్ మార్చారు. కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్లు మారారు కొందరు చోరులు. లోకల్ పుష్పాలుగా సినిమాని చూపిస్తున్నారు. ఇంతకీ వారేం దొంగతనం చేశారు..? ఎవరు బాధితులుగా మారారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....