ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు.. భక్తులు స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం
భద్రాచలం రామాలయంలో భక్తురాలు సమర్పించిన విలువైన పట్టుచీర మాయమైంది. సీసీ కెమెరాలకు చిక్కకుండానే అంతరాలయం నుంచి ఈ వస్త్రం అదృశ్యమవ్వడం దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై ఈవో దామోదర్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భక్తులు ఆవేదన చెందుతున్నారు.
- N Narayana Rao
- Updated on: Feb 25, 2026
- 6:39 pm
Boggula Srinivas: బొగ్గుల శ్రీనివాస్ది హత్యే.. కేసును చేధించిన పోలీసులు
రోడ్డు ప్రమాదంగా కనిపించిన ప్రముఖ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు సంచలన మలుపు తీసుకుంది. ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో స్నేహితుడే రూ.5 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పాలేరు రిజర్వాయర్లో కారుతో పాటు మృతదేహాన్ని పడేసి ప్రమాదంలా చిత్రీకరించిన కుట్రను టెక్నికల్ ఆధారాలతో పోలీసులు ఛేదించారు.
- N Narayana Rao
- Updated on: Feb 22, 2026
- 2:43 pm
Telangana: కొడుకు కార్మికుడిగా ఉన్న మున్సిపాలిటీకే ఛైర్మన్గా ఎన్నికైన తండ్రి.. ఆ జిల్లాలో అరుదైన ఘటన!
ఎన్నికలు వచ్చాయంటే చాలు చిత్ర విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. కొడుకు మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తుండగా తాజాగా జరిగిన ఎన్నికల్లో అదే మున్సిపాలిటీకి తండ్రి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
- N Narayana Rao
- Updated on: Feb 21, 2026
- 6:56 pm
Telangana: నాడు మున్సిపల్ కార్మికుడు.. నేడు అదే మున్సిపాలిటీకి కౌన్సిలర్!
రాజకీయాల్లో ఎప్పుడు.. ఎలా.. ఏమి.. జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు అద్భుతాలు, సంచలనాలు జరుగుతాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు అసామాన్యులు అయ్యారు. సత్తుపల్లి మున్సిపాలిటీ లో నిన్నటి వరకు కార్మికుడు గా పని చేసిన సామాన్యుడు నేడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిచి అడుగు పెట్టాడు..
- N Narayana Rao
- Updated on: Feb 19, 2026
- 6:28 pm
Telangana: ముసలవ్వ ఒంటరిగా ఉందని షాప్లోకి వచ్చారు.. ఆమె సామాన్ల కోసం లోపలికి వెళ్లగా
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కంపెనీలో తాము పని చేస్తున్నామని ముసలవ్వతో పరిచయం చేసుకున్న ఆ కేటుగాళ్లు.. పక్కా స్కెచ్తో వృద్ధురాలిని నిలువు దోపిడీ చేశారు. తమకు అన్నం పెట్టినందుకు కృతజ్ఞతగా 50 కేజీల బియ్యం ఇస్తామని..
- N Narayana Rao
- Updated on: Feb 19, 2026
- 1:03 pm
Watch Video: విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్ ఇదే!
రేజర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాల ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ పిల్లలను ప్రధానోపాధ్యాయురాలు నాగమణి విచక్షణ రహితంగా కర్రతో కొట్టారంటూ ఆందోళనకు దిగారు. శివరాత్రి సందర్భంగా సోమవారం జరిగిన..
- N Narayana Rao
- Updated on: Feb 18, 2026
- 4:16 pm
Telangana: టాబ్లెట్ కోసం మెడికల్ షాప్లోకి వచ్చాడు.. అక్కడున్న వ్యక్తి తీసి ఇద్దామనుకునేలోపే..
ఆ వ్యక్తి టాబ్లెట్ తీసుకునేందుకు మెడికల్ షాప్ లోకి వచ్చాడు. అక్కడున్న వ్యక్తి టాబ్లెట్ ఇచ్చేలోపు జరగరానిది జరిగింది. అతడు అక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.
- N Narayana Rao
- Updated on: Feb 18, 2026
- 12:58 pm
Watch Video: రూ.కోటి ఇన్సూరెన్స్ కోసం మర్డర్ స్కెచ్.. స్నేహం ముసుగులో దారుణం! వీడియో వైరల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో దారుణం చోటు చేసుకుంది..ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్ ప్లాన్ చేశారు. స్నేహం ముసుగులో ఓ యువకుడ్ని చంపేందుకు కుట్ర చేశారు ఇద్దరు యువకులు. హత్యా యత్నాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు..
- N Narayana Rao
- Updated on: Feb 17, 2026
- 6:57 pm
Kothagudem: ఆటో డ్రైవర్ టు మేయర్.. కొత్తగూడెంలో ఎర్రజెండా సరికొత్త చరిత్ర.. ఎన్నో ట్విస్టుల తర్వాత..
అతనో సామాన్య ఆటో డ్రైవర్.. కట్ చేస్తే.. రాజకీయాల్లోకి అరంగ్రేటం.. బీఆర్ఎస్ పై అభిమానంతో.. 2019లో ఆ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించాడు.. ఆ తర్వాత.. 2023 లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమక్షంలో సీపీఐలో చేరి.. ఏకంగా కార్పోరేషన్ మేయర్ అయ్యాడు.
- N Narayana Rao
- Updated on: Feb 17, 2026
- 6:12 pm
కాలం కలిసి వస్తే.. అదృష్టం తలుపు తడుతుందంటే ఇదే..! మున్సిపల్ చైర్మన్, వైస్-చైర్మన్గా భార్యాభర్తలు..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలి చైర్మన్గా జూపల్లి శశికళ, ఆమె భర్త జూపల్లి రమేష్ బాబు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా పేరొందిన జూపల్లి రమేష్ దంపతులు నూతన మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ ,13వ వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు.
- N Narayana Rao
- Updated on: Feb 17, 2026
- 5:26 pm
పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. అతిధులకు చీర, సారెలతో విందు భోజనం
ఖమ్మం జిల్లా కిష్టారం గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. చాగంటి దంపతులు తమ పెంపుడు శునకం "బుజ్జి"కి అచ్చం మనుషుల సీమంతం లాగే ఘనంగా శ్రీమంతం నిర్వహించారు. గ్రామంలోని ముత్తైదువులను ఆహ్వానించి, సాంప్రదాయ పిండివంటలతో, ఒడినింపి, హారతులిచ్చి పండుగ వాతావరణం సృష్టించారు. తమ పెంపుడు జంతువుపై కుటుంబ సభ్యులు చూపిన అపారమైన ప్రేమ గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
- N Narayana Rao
- Updated on: Feb 17, 2026
- 11:38 am
తాను మరణించి మరో ఆరుగురికి వెలుగులు పంచి యువకుడు.. తల్లిదండ్రుల ఔదార్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..
ఖమ్మం జిల్లాకు చెందిన కందిమళ్ల విజయ్ కుమార్ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన తల్లిదండ్రులు గొప్ప త్యాగం చేశారు. ఏపీ జీవన్దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ్ అవయవాలను ఐదుగురికి దానం చేశారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కార్నియాలను అమర్చడం ద్వారా ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అవయవదానం ఎందరికో ఆదర్శం.
- N Narayana Rao
- Updated on: Feb 15, 2026
- 1:17 pm