ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
ఏడాదైనా.. కుక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న యజమాని.. చర్చిలో ఘనంగా సంవత్సరీకం!
ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక కుక్క అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. దీన్ని తట్టుకోలేని ఓ స్కూల్ టీచర్ దాని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాడు. అంతేకాదు దాని జ్ఞాపకాలను మరిచిపోకుండా, చనిపోయి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా చర్చిలో జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసిచ భోజనాలు పెట్టి తన కుక్కపై మమకారాన్ని చాటుకున్నాడు.
- N Narayana Rao
- Updated on: Mar 25, 2025
- 5:50 pm
Telangana: ఒరెయ్ పొలం నుంచి అవి ఎలా దొంగతనం చేశార్రా.. బిత్తరపోయిన రైతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో దొంగలు రూట్ మార్చారు. కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్లు మారారు కొందరు చోరులు. లోకల్ పుష్పాలుగా సినిమాని చూపిస్తున్నారు. ఇంతకీ వారేం దొంగతనం చేశారు..? ఎవరు బాధితులుగా మారారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....
- N Narayana Rao
- Updated on: Mar 24, 2025
- 6:39 pm
అయ్యో దేవుడా.. మాయదారి లిఫ్ట్ ప్రాణం తీసింది.. చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే..
ఖమ్మం నగరంలో ఉన్న ప్రసూన ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్ట్ జారి పడి సరోజనమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముదిగొండ మండలం వనవారి కృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళ గుండె సంబంధిత చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. లిఫ్ట్లో తీసుకుని వెళ్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడింది.
- N Narayana Rao
- Updated on: Mar 22, 2025
- 5:38 pm
Telangana: కన్న పేగు ప్రేమను అణచుకుని.. కొడుకుకు మరణ శాసనం రాసిన తల్లి..!
పెళ్లి అయిన తర్వాత కొడుకు ప్రవర్తనలో మార్పు రాలేదు. బాధ్యతగా వ్యవహరిస్తూ తల్లి , భార్య పిల్లలను పోషించాలి. కానీ ఏ మాత్రం కుటుంబం పట్ల బాధ్యత లేకుండా.. మద్యానికి బానిసయ్యాడు. బలాదూర్గా తిరగడం, తల్లి, భార్య సంపాదనపై ఆధారపడి వచ్చిన డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఆ మత్తులో తల్లి, భార్య బిడ్డలను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా.. అతని ప్రవర్తన లో మార్పు రావడం లేదు.
- N Narayana Rao
- Updated on: Mar 21, 2025
- 4:57 pm
Telangana: శ్మశానంలో పడుకుంటన్న వ్యక్తి.. ఆరా తీసిన పోలీసులు షాక్..!
ఇతను విచిత్ర కరడుగట్టిన అంతరాష్ట్ర దొంగ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 90 కి పైగా చోరీ కేసుల్లో నిందితుడు. మార్చి 10వ తేదీన కానిస్టేబుల్పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పరారైన ఓ అంతర్రాష్ట్ర క్రిమినల్ను పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. మూడు నెలలు వ్యవధిలో 43 నేరాలకు పాల్పడిన దొంగను పట్టుకుని పెద్ద మొత్తంలో నగదు, బంగారాన్ని రికవరీ చేశారు.
- N Narayana Rao
- Updated on: Mar 19, 2025
- 3:09 pm
కల్లంలో కాలిబూడిదైన మిర్చి.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలనాలు..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో మార్చి 10వ తేదీన జరిగిన మిర్చి దహనం కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. పినపాకలో సంచలనం సృష్టించిన ఈ కేసును వారం రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బాలకృష్ణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు వరుసకు మామ అల్లుళ్లు.
- N Narayana Rao
- Updated on: Mar 18, 2025
- 6:06 pm
Telangana: హోటల్లో దొంగతనానికి వచ్చిన దొంగలు.. కిచెన్లో మసాలా ప్యాకెట్లు చూడగా..
దొంగతనం అంటే నగదు, నగలు చోరీ చేస్తుంటారు. లేదా ఏదయినా విలువైన వస్తువులు దొంగతనం చేస్తుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం సితార అనే రెస్టారెంట్లో చోరీ జరిగింది. క్యాష్ కౌంటర్లో 40 వేల నగదు చోరి జరిగితే.. కిచెన్లో ఉన్న మసాల దినుసులు, అల్లం, వెల్లుల్లి, దొంగతనం చేశారు.
- N Narayana Rao
- Updated on: Mar 16, 2025
- 8:40 pm
Khammam: తండాల్లో హోలీ వేడుకలు వెరీ స్పెషల్.. ఊరు ఊరంతా పెద్ద పండగే..! అదేంటంటే..
గ్రామ గ్రామాలకు నడుమ గడియ దూరంలో ఉండే గిరిజన కుటుంబాలను ఒకే గూటికి చేర్చి సంబరాలు చేసే పండుగ హోలీ ...ఈ హోలీ ని గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ,యువకుల నుంచి వృద్దుల వరకు ఈ హోలీ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. ఇలాంటి సంబరాలకు కేరప్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని లోక్యాతండా. ఇక్కడ హెలీ స్పెషల్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. పూర్తి వివరాల్లోకి వెళితే..
- N Narayana Rao
- Updated on: Mar 14, 2025
- 11:12 am
Telangana: చావు ఇంటికి వచ్చి మద్యం తాగి అస్వస్థతకు గురైన వ్యక్తి.. ఆ తర్వాత బయడపడ్డ షాకింగ్ నిజం
బుట్టల నరేష్ తెచ్చుకున్న మద్యం సీసాలో మిగిలి ఉన్న సగం మందు.. దినకర్మల రోజు మృతుడికి వరసకు బావ అయిన వ్యక్తి సేవించి అతను కూడా వాంతులు అయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో బంధువులు అతన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. పరీక్షించిన వైద్యులు ఆ మందు సీసాలో పాయిజన్ కలిసిందని తెలపడంతో మృతుడి తల్లి చుట్టమ్మ పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- N Narayana Rao
- Updated on: Mar 13, 2025
- 11:54 am
Telangana: శభాష్ పోలీస్.. కానిస్టేబుల్ పై దొంగ కత్తితో దాడి.. రక్త మోడుతున్నా..దొంగను వదలని పోలీస్
శభాష్ పోలీస్.. కానిస్టేబుల్ పై పలువురు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒళ్ళంతా రక్తం కారుతున్నా.. విధి నిర్వహణలో తన బాధ్యత ను మరువలేదు ఆ కానిస్టేబుల్. రక్త మోడుతున్నా..దొంగను వదలేదు ఆ పోలీస్. ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ అంతర్ రాష్ట దొంగను పట్టుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
- N Narayana Rao
- Updated on: Mar 11, 2025
- 9:16 pm
Telangana: పైకి చూస్తే కస్టమర్లు అనుకునేరు.. తిప్పి చూస్తే.. పైట చాటున చెడుగుడు యవ్వారం.!
ఆ ముగ్గురు మహిళలు కస్టమర్లుగా స్వీట్ షాప్నకు వచ్చారు. షాప్ యజమాని ఎంతగానో సంబరపడ్డాడు. తీరా చూస్తే.. ఆ తర్వాత జరిగింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. మిగిలిన షాప్ యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- N Narayana Rao
- Updated on: Mar 10, 2025
- 6:36 pm
Telangana: ఏం పోయేకాలం వచ్చిందిరా.. రాశిగా పోసిన మిర్చికి మంట పెట్టారు..
ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. కళ్ల ముందే ఆహుతి అయ్యింది.. కన్న బిడ్డను కోల్పోతే...తండ్రి ఎలా కన్నీరు పెడతారో.. ఆ రైతు అలా కన్నీరు మున్నీరుగా విలపించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో దారుణం జరిగింది ..కళ్లంలో ఆరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. సుమారు 70 క్వింటాల మిర్చి మంటలకు దగ్ధం అయింది. పది లక్షల ఆస్తి నష్టం జరిగింది.
- N Narayana Rao
- Updated on: Mar 10, 2025
- 1:45 pm