AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

N Narayana Rao

N Narayana Rao

Reporter - TV9 Telugu

narayanarao.naidu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం! ప్రేమ పేరుతో ఒకడు, వీడియోలు ఉన్నాయంటూ ఇద్దరు..

బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం! ప్రేమ పేరుతో ఒకడు, వీడియోలు ఉన్నాయంటూ ఇద్దరు..

ప్రేమించానంటూ వెంట పడ్డాడు.. పెళ్లి పేరుతో వంచించాడు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయి, తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ఓ మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితులును కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ..! మనుషులకే కనువిప్పు

జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ..! మనుషులకే కనువిప్పు

స్నేహం చేయడానికి భాషతో గానీ, జాతితో గానీ పనిలేదు.. మనసులు కలిస్తే చాలని నిరూపిస్తున్నాయి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని రెండు మూగజీవాలు. పిల్లి, కుక్కల మధ్య జన్మతః ఉండే జాతి వైరాన్ని మరిచి, మేము ప్రాణ స్నేహితులమే అంటూ అల్లారుముద్దుగా జీవిస్తున్నాయి లియో, డాలీ. ఒకే కుటుంబంలో పెరగడమే కాకుండా, ఒకదానిని విడిచి మరొకటి క్షణం కూడా ఉండలేనంతగా ఇవి బంధాన్ని పెంచుకున్నాయి. ఆస్తుల కోసం గొడవపడే మనుషులకు కనువిప్పు కలిగిస్తూ, ఈ మూగజీవాలు పంచుతున్న అపారమైన ప్రేమ, మైత్రి గురించిన పూర్తి ఆసక్తికరమైన కథనం ఇప్పుడు చూద్దాం..

నాలుగు తరాల వంశం.. 100 ఏళ్ల బామ్మ కోసం ఒక్క చోటకు చేరిన 150 మంది కుటుంబ సభ్యులు..

నాలుగు తరాల వంశం.. 100 ఏళ్ల బామ్మ కోసం ఒక్క చోటకు చేరిన 150 మంది కుటుంబ సభ్యులు..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో కొరపోలు వంశానికి చెందిన నాలుగు తరాల కుటుంబ సభ్యులు ఒకేచోట చేరి ఆత్మీయంగా కలుసుకున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన 150 మంది వంశీయులు తమ మూలాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు.

Telangana: దమ్మపేటలో విచిత్ర దొంగతనం.. 10 కేజీలు చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు

Telangana: దమ్మపేటలో విచిత్ర దొంగతనం.. 10 కేజీలు చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో ఒక విచిత్ర దొంగతనం జరిగింది. దమ్మపేటలోని ఓ చికెన్ దుకాణం వద్దకు ఉదయం10 గంటల సమయంలో ఒక మహిళ తో పాటు మరో వ్యక్తి కలిసి వచ్చారని, రెండు కేజీల చికెన్ మాంసం కావాలని..

ఫోన్ మాట్లాడాలన్నా.. ఫొటో దిగాలన్నా.. చెట్లు ఎక్కాల్సిందే! సిగ్నల్ కోసం అగచాట్లు

ఫోన్ మాట్లాడాలన్నా.. ఫొటో దిగాలన్నా.. చెట్లు ఎక్కాల్సిందే! సిగ్నల్ కోసం అగచాట్లు

డిజిటల్ ఇండియా అంటూ దేశం సాంకేతిక రంగంలో ముందుకు దూసుకుపోతున్నా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారేకల్లు, కారేగట్టు గ్రామాల ప్రజలు మాత్రం ఇప్పటికీ మొబైల్ సిగ్నల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ మాట్లాడాలన్నా, కాల్స్ అందుకోవాలన్నా గ్రామస్థులు ముత్యాలమ్మబోడు అనే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు యూరియా బుకింగ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆన్‌లైన్ హాజరు నమోదు, అధికారులు జూమ్ సమావేశాల్లో పాల్గొనడం వంటి డిజిటల్ సేవలన్నీ అక్కడే నిర్వహిస్తున్నారు. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలన్నా ముందుగా సిగ్నల్ ఉన్న ప్రాంతానికి చేరుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ టవర్‌కు అనుమతి లభించినప్పటికీ, స్థల కేటాయింపులో జాప్యం కారణంగా పనులు నిలిచిపోయాయి..

Telangana: ఊరంతా కన్నీళ్లు.. మూగజీవితో ముడిపడిన బంధం.. ఈ వీడియో చూడండి..

Telangana: ఊరంతా కన్నీళ్లు.. మూగజీవితో ముడిపడిన బంధం.. ఈ వీడియో చూడండి..

మనుషులతో మమకారం పెంచుకుని, అందరితో ఆప్యాయంగా తిరిగిన ఆ ఆంబోతు అనారోగ్యంతో కన్నుమూయడంతో ఊరంతా కన్నీరుమున్నీరైంది. తమ ఇంట్లో మనిషే చనిపోయాడన్నంత ఆవేదనతో.. బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్ల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా.. సేమ్‌ సీన్.. ఆ ఊర్లో ఏం జరుగుతుంది?

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా.. సేమ్‌ సీన్.. ఆ ఊర్లో ఏం జరుగుతుంది?

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గత కొద్ది రోజులుగా ఒక వింత సమస్య స్థానికులను వేధిస్తోంది. అర్ధరాత్రి కాగానే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాలనీలోని వీధి లైట్ల కనెక్షన్లను కట్ చేస్తూ జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇక దీంతో దుండగులను పట్టుకునేందుకు గ్రామంలోని యూత్‌ అంతా కలిసి ఓ ప్లాన్ వేశారు. రాత్రుళ్లు గస్తీ కాస్తు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

TGSRTC బస్సులో మహిళకు అస్వస్థత.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే డ్రైవర్‌కు సలామ్ చేయాల్సిందే..

TGSRTC బస్సులో మహిళకు అస్వస్థత.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే డ్రైవర్‌కు సలామ్ చేయాల్సిందే..

కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రద్దీ కారణంగా ఓ మహిళ స్పృహ కోల్పోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నేరుగా నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో సకాలంలో చికిత్స అందించి మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. డ్రైవర్ సమయస్ఫూర్తిని ప్రయాణికులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.

డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది..! మాట వినలేదంటే రూ. 2 లక్షల జరిమానా.. ఎక్కడో కాదండోయ్..

డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది..! మాట వినలేదంటే రూ. 2 లక్షల జరిమానా.. ఎక్కడో కాదండోయ్..

ప్రపంచం ఎంత సాంకేతికంగా ముందుకు వెళ్తున్నా, పాశ్చాత్య సంస్కృతి ఎన్ని ప్రభావాలు చూపుతున్నా ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని, మూలాలను ప్రాణప్రదంగా కాపాడుకుంటారు. తమ ఆచారాలు, ఆహార అలవాట్లు, జీవన విధానంతో సమాజానికి సరికొత్త స్ఫూర్తిని అందిస్తారు. తాజాగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో తమ ప్రాచీన సంస్కృతి, కళలు కనుమరుగు కాకుండా ఉండేందుకు మూల ఆదివాసీల సంక్షేమ సంఘం ఒక చారిత్రాత్మకమైన, కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది.

Telangana: ఆదర్శ పౌరుడు.. పెళ్లి పీటలపైనే ఓటరు నమోదు పూర్తి.. ఆ జిల్లాలో వినూత్న ఘటన!

Telangana: ఆదర్శ పౌరుడు.. పెళ్లి పీటలపైనే ఓటరు నమోదు పూర్తి.. ఆ జిల్లాలో వినూత్న ఘటన!

సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా.. బాధ్యత ముఖ్యం అని నిరూపించారు ఆ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్న వేళ, భద్రాద్రి జిల్లాలో ఒక అరుదైన దృశ్యం ఆకట్టుకుంది. పెళ్లి పీటలపై ముహూర్తం వేళ.. నూతన వధూవరుల చేత ఓటరు ఫామ్‌ను పూర్తి చేయించి, ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పారు ఎన్నికల సిబ్బంది. ఇది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇద్దరు కలిసి మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రికొడుకులు.. ఇంతలోనే ఊహించని షాక్..!

ఇద్దరు కలిసి మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రికొడుకులు.. ఇంతలోనే ఊహించని షాక్..!

ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో శుక్రవారం (జూలై 03) అర్ధరాత్రి కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. కన్న తండ్రే కొడుకును కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, అంబేద్కర్ నగర్‌కు చెందిన కొత్తపల్లి సీతారాములు తన కుమారుడు కిరణ్ కుమార్ (35)తో కలిసి శుక్రవారం సాయంత్రం వైన్ షాపులో మద్యం సేవించారు. అనంతరం ఇద్దరూ మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నారు.

Telangana: సినిమా స్టైల్‌లో దోపిడీ.. వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచేశారు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..

Telangana: సినిమా స్టైల్‌లో దోపిడీ.. వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచేశారు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..

బ్యాగులో రూ.10 లక్షల నగదు.. అంతలోనే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. రైడ్ జరిగిందనే భయంతో బాధితులు పరుగులు.. సీన్ కట్ చేస్తే ఆ వచ్చింది ఒరిజినల్ పోలీసులు కాదు, నకిలీ ఖాకీల ముసుగులో ఉన్న కిలాడీ దొంగలు.. వీళ్ల వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే పోలీసులకే దిమ్మతిరిగిపోయింది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..