ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Khammam: ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేస్తుండగా ఇలా అయింది ఏంటి..?
సారపాకలో వినాయక ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన సమయంలో అపశృతి చోటుచేసుకుంది. క్రేన్తో ప్రతిష్టిస్తున్న ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి పడడంతో ముగ్గురు గాయపడ్డారు. భక్తులు అప్రమత్తంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. భద్రతా లోపాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .. ..
- N Narayana Rao
- Updated on: Apr 26, 2026
- 8:30 pm
మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ.. మండే ఎండలకు ఈ శునకం ఏం చేసిందంటే!
వేసవి కాలం వచ్చిందంటే..పెద్దింటి వాళ్ళు సెంట్రల్ AC, AC లు, కూలర్లు తో చల్లని గాలి కి ఉపశమనం పొందుతారు. అదే పేదవాడు అయితే చెట్టు నీడ చూకుని సేద తీరుతారు. ఎండల తీవ్రతకు ప్రతి జీవి కూడా ఉపశమనం కోసం తహతహ లాడుతుంటాయి. మరి అలాంటి ఒక ఒక మూగ జీవి తాను ఎండకు తట్టుకోలేక విలవిలలాడుతుంది. తనతో పాటు తన బిడ్డ కూడా ఎండ తీవ్రతకు గురవుతుందని భావించిన ఆ మూగ జీవి తన బిడ్డ కు ఎండ తగలకుండా చేసిన ఉపాయం చూసి అందరూ షాక్ అయ్యారు.
- N Narayana Rao
- Updated on: Apr 26, 2026
- 5:57 pm
Telangana: సత్తుపల్లి అడవుల్లో ‘వైల్డ్’ లైఫ్ సందడి.. ట్రాప్ కెమెరాల్లో అద్భుత దృశ్యాలు..!
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అటవీ డివిజన్ పరిధిలో ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి విభాగం అధికారులను ఉత్సాహపరిచే అరుదైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కనకగిరి (పులిగుండాల) అడవుల్లో రెండు చిరుత పులులు స్వేచ్ఛగా సంచరిస్తూ కెమెరాకు చిక్కాయి.
- N Narayana Rao
- Updated on: Apr 26, 2026
- 12:59 pm
Telangana: ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు ఏం చేశారో చూడండి..
రోడ్డు ప్రమాదం జరిగితే రక్తం ఓడుతున్న ప్రాణాలను కాపాడటం మనిషి నైజం. కానీ అశ్వారావుపేటలో మాత్రం మానవత్వం సిగ్గుతో తలదించుకుంది. ఒకవైపు ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయి, ఘటనా స్థలం మృతదేహాలతో ఉంటే.. కొందరు కేటుగాళ్లు మాత్రం దొంగతనానికి తెగబడ్డారు. దెబ్బతిన్న బండి నుంచి డీజిల్ను మాయం చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
- N Narayana Rao
- Updated on: Apr 25, 2026
- 6:52 pm
Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా
తల్లిప్రేమకు ఈ లోకం ఏది సాటిరాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ మాటలకు అర్థాన్నే మార్చేస్తున్నారు కొందరు తల్లులు. నవమాసాలు మోసి కన్న బిడ్డలను పొతిళ్లలోనే కడతేర్చుతున్నారు. అభంశుభం తెలియని ఆ పసికందులను కళ్లు తెరవక ముందే చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. ముక్కపచ్చలారని 6 నెలల పిండాన్ని గుర్తతెలియని వ్యక్తులు శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది.
- N Narayana Rao
- Updated on: Apr 25, 2026
- 5:44 pm
వ్యాపారులు వినూత్న ఆఫర్.. లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
ఖమ్మం జిల్లాలో ఓ కూరగాయల వ్యాపారి విక్రయదారులను ఆకర్షించడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతి కొనుగోలుపై కూపన్లు ఇచ్చి, లక్కీ డ్రా ద్వారా విజేతలకు వారం రోజులు ఉచిత కూరగాయలు అందిస్తున్నారు. ఈ ఆఫర్ కారణంగా కస్టమర్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. తక్కువ ధర, నాణ్యతతో పాటు ఉచిత కూరగాయలు పొందే అవకాశం వినియోగదారులను ఆకర్షిస్తోంది.
- N Narayana Rao
- Updated on: Apr 23, 2026
- 8:48 pm
తాగి దొరికితే లక్ష జరిమానా.. పథకాలు కట్! ఊరు బాగు కోసం గ్రామస్తుల ఉక్కు సంకల్పం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ధనియాలపాడు గ్రామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ గ్రామ పంచాయతీ తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాలు, నాటుసారా వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతుండటాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ సనప సావిత్రి, పాలకవర్గంతో కలిసి ఒక కీలక తీర్మానం చేశారు.
- N Narayana Rao
- Updated on: Apr 22, 2026
- 12:38 pm
Viral Video: పోలీస్ అధికారి ఇంట్లో పెళ్లి.. శుభలేఖ మామూలుగా లేదు.. చూశారంటే
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్నేహితులు, బంధువులు, దగ్గర ఆత్మీయులను తమ ఇంట్లో వివాహానికి ఆహ్వానిస్తుంటారు. శుభలేఖలు పంపి తప్పనిసరిగా రావాలని కోరుతుంటారు. కానీ, ఒక వెడ్డింగ్ వెరైటీగా ముద్రించబడి నెట్టింట షీకార్లు చేస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ తమ ఇంట్లో వివాహానికి ఆహ్వానిస్తూ వెరైటీగా ముద్రించిన వెడ్డింగ్ ఇప్పుడు అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. పోలీసు విధుల్లో బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా, తన ఇంట్లో జరిగే శుభకార్యం ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించేలా ఆయన వేసిన ముందడుగు అందరికీ ఆదర్శనీయంగా మారింది.
- N Narayana Rao
- Updated on: Apr 21, 2026
- 6:53 pm
Telangana: ఆ మైనర్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కట్ చేస్తే.. కొద్దిరోజులకు అబ్బాయి ఇంట్లో.!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పెద్దల అహంకారం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మైనర్ల ప్రేమ వ్యవహారంలో జరిగిన పంచాయితీ, చివరకు ఓ వృద్ధుడి ఆత్మహత్యకు దారితీసింది. తనను అందరి ముందు విచక్షణారహితంగా కొట్టడంతో.. ఆ అవమానాన్ని భరించలేక పొలిమేర వెంకటేశ్వరరావు(69) అనే వృద్ధుడు ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు.
- N Narayana Rao
- Updated on: Apr 17, 2026
- 12:44 pm
ప్రభుత్వ ఆసుపత్రిలో రచ్చ.. చెప్పుల కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు!
చెప్పులే కదా తీసి పారేయలేము.. వాటికి చాలా విలువ ఉంది.. అందుకే ఆలయాలు, ఆసుపత్రులు, మరెక్కడైనా బయట చెప్పులు విడిచి వెళతాము.. ఎవరైనా ఎత్తుకు పోతారని కొందరు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇపుడు ఆ చెప్పుల వ్యవహారం ఇద్దరు మహిళలు మధ్య గొడవ జరిగి.. చివరికి కొట్టుకునే వరకు దారితీసింది.
- N Narayana Rao
- Updated on: Apr 16, 2026
- 9:31 pm
కుటుంబాన్ని కలిపిన ఫేస్బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ నవ్వుల సందడి!
కుటుంబ సభ్యులు తిట్టారని మనసులో పెట్టుకొని.. ఉన్నపళంగా చదువు మానేసి.. ఎవరికి చెప్పకుండా.. ఇంటి నుంచి, హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు.. ఆ యువకుడు. తాజాగా ఫేస్ బుక్లో కుటుంబ సభ్యుల ఫొటో చూసి మనసు మార్చుకొని 25 సంవత్సరాల తర్వాత తిరిగి తన కుటుంబ సభ్యులను చూసేందుకూ వచ్చాడు..
- N Narayana Rao
- Updated on: Apr 15, 2026
- 2:37 pm
Video: మీ దుంపతెగ.. ఈ దొంగలు ఏం ఎత్తెకెళ్లారో తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో చూడండి..
దొంగలు పడితే బంగారం దోచుకుంటారు.. మహా అయితే నగదు ఎత్తుకెళ్తారు. కానీ ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ చోరీ స్టైలే వేరు.. దొంగలు బీరువాలోని నగలను దోచుకోవడమే కాకుండా వంటింట్లోకి వెళ్లి కందిపప్పు, ఉల్లిగడ్డలు, చివరకు గ్యాస్ సిలిండర్ను కూడా వదలకుండా తీసుకెళ్లారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటనలో అసలు ఏం జరిగిందంటే..?
- N Narayana Rao
- Updated on: Apr 10, 2026
- 12:52 pm