ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Telangana: సరుకులు కావాలని షాప్కు వచ్చాడు.. ఫోన్పేలో డబ్బులు కొట్టాడు.. కట్చేస్తే.
పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే అదే టెక్నాలజీని వాడి కొందరు కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఫేక్ ఫోన్పే యాప్ను ఉపయోగించి ఓ కిరాణా షాపు వ్యాపారికి రూ.5వేల కుచ్చుటోపి పెట్టారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- N Narayana Rao
- Updated on: May 17, 2026
- 1:30 pm
ఆ రెండు పొట్టేళ్లను విడదీయడమే ఆయన చేసిన పాపమైంది.. అంతలోనే ఘోరం!
రెండు పొట్టేళ్ల మధ్య జరిగిన పోట్లాటను ఆపబోయిన ఓ గొర్రెల కాపరి దుర్మరణం పాలయ్యారు. పొట్టేళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం ఉప్పలచెలక గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- N Narayana Rao
- Updated on: May 16, 2026
- 6:09 pm
డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్రేలో చూడగా..
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకల్లో డీజే సాంగ్స్కు డాన్స్ చేస్తూ ఓ యువకుడు స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళంలో గడ్డకట్టడంతో అతడిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆపరేషన్కు భారీ ఖర్చు అవుతుండటంతో కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరుతున్నారు.
- N Narayana Rao
- Updated on: May 16, 2026
- 3:52 pm
Video: అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి ఆశ్చర్యపోయిన అర్చకులు.. వీడియో మీరూ చూడండి..
శివాలయం తలుపులు తీయగానే భారీ శబ్దాలు.. ఏంటా అని చూసిన అర్చకులకు ఊహించని సీన్ కనిపించింది. శివలింగం చెంతనే పడగ విప్పిన నాగుపాము దర్శనమిచ్చింది. భక్తుల పూజలు అందుకునేందుకు ఆ నాగేంద్రుడే దిగివచ్చాడా? అన్నట్లు ఈ సీన్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- N Narayana Rao
- Updated on: May 15, 2026
- 9:02 am
వీధిలో ఏదో వస్తువును పీక్కుతింటున్న కుక్కలు! దగ్గరికెళ్లి చూడగా..
మృత శిశువు తల కుక్కలు పీక్కు తింటున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుర్గంధం రావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పసికందు తల భాగం ఎక్కడి నుంచి వచ్చింది..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- N Narayana Rao
- Updated on: May 13, 2026
- 5:15 pm
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
భద్రాచలం ఏజెన్సీలోని గోత్తికోయ ఆదివాసీలు తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు DJ వాడకాన్ని నిషేధించారు. DJ వాడితే రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానించారు. డోలు వాయిద్యాలు, కొమ్ము నృత్యాలతో భూమి పండుగలు, వివాహాలు జరపాలని నిర్ణయించారు. మూల ఆదివాసీ సంక్షేమ సంఘం (మాస్) ఈ వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
- N Narayana Rao
- Updated on: May 12, 2026
- 1:37 pm
అయ్యో దేవుడా.. పాఠాలు చెబుతూనే కుప్పకూలిన టీచర్.. ధైర్యం ఉన్నోళ్లే చూడండి..
ఖమ్మంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లీష్ టీచర్ గారపాటి జయరాజు పాఠం చెబుతుండగా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. క్లాస్రూంలో కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. జయరాజు మృతితో కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అకస్మిక మరణాలపై ఆందోళన పెరుగుతోంది.
- N Narayana Rao
- Updated on: May 9, 2026
- 6:16 pm
మాతృత్వానికి అడ్డురాని జాతి వైరం.. పాలిచ్చి కుక్కపిల్లను సాకుతున్న వానరం..!
ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక అపురూప ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మానవత్వానికే ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. సహజంగా కోతికి, కుక్కకు మధ్య జాతి వైరం ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఒక వానరం ఆ వైరాన్ని మరచి, ఒక కుక్క పిల్లను తన సొంత బిడ్డలా సాకుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
- N Narayana Rao
- Updated on: May 8, 2026
- 5:43 pm
“నన్నే ఆపుతారా? నాకే టెస్టులు చేస్తారా..?” నడిరోడ్డులో పోలీసులకే చుక్కలు చూపించిన మందుబాబు!
మణుగూరులోని తోగ్గుడెం ప్రాంతంలో గల సమ్మక్క-సారక్క గుడి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న సోలెం నాగేశ్వరరావు అనే వ్యక్తిని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో అతనికి 80 పర్సంటేజ్ అని తేలింది. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని హెచ్చరించి ఇంటికి పంపించి వేశారు.
- N Narayana Rao
- Updated on: May 7, 2026
- 7:53 pm
బైక్పై వెళ్తుండగానే ఆగిన గుండె.. కూతురు కళ్ళెదుటే తండ్రి దుర్మరణం.. !
ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరిని కలచివేసింది. అప్పటి వరకు కళ్లముందే తిరుగుతూ, సరదాగా కబుర్లు చెప్పిన తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కూతురు కళ్లెదుటే తండ్రి గుండెపోటుతో బైక్పై నుంచి కుప్పకూలి ప్రాణాలు విడిచిన హృదయవిదారక ఘటన ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
- N Narayana Rao
- Updated on: May 7, 2026
- 4:19 pm
Telangana: ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్లో బిగ్ ట్విస్ట్..
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది. తెలంగాణలో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో ఉందా చెప్పాలంటూ అధికారులను నిలదీస్తున్నారు భద్రాచలం వాసులు. కేంద్రం జన గణనలో భాగంగా చేపట్టిన సెల్ఫ్ ఎమ్యూనరేషన్ వెబ్సైట్లో భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు చూయించడం కలకలం రేపింది.
- N Narayana Rao
- Updated on: May 1, 2026
- 10:34 pm
Telangana: ఒకరి తర్వాత ఒకరు రెండ్రోజుల్లోనే నలుగురు మృతి.. ఇంతకూ ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది!
మూడుముళ్లు వేసి, ఏడడుగులు నడిచి నూరెళ్లు కలిసుందామని ఒక్కటైన భార్యభర్తలు ఈ మధ్యకాలంలో చిన్నచిన్న విషయాలకే విడిపోతున్నారు. లేదా కట్టుకున్నవారిని కడతేర్చుతున్నారు. అదీ చాలదన్నట్టూ ఇద్దరూ కలిసి చనిపోతూ.. లోకం తెలియని పసివాళ్లను కూడా వారి కోపాలకు బలిచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. భార్యభర్తల మధ్యలో మొదలైన చిన్న గొడవలు ఫ్యామిలీ మొత్తం మరణాలకు కారణం అయింది. ఇంతకు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
- N Narayana Rao
- Updated on: May 1, 2026
- 7:53 pm