AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెక్నలాజియా.. మొక్కజొన్న చేను దగ్గర బీరు బాటిల్ కట్టిన రైతు.. ఎందుకో తెలుసా..?

శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. మొక్కజొన్న పంటను కాపాడేందుకు రైతులు పడుతున్న పాట్లలలో బీరు సీసా గంట ఒకటి.. వినటానికి బీరు సీసా గంటెంది అని విచిత్రంగా అనిపిస్తుంది. కానీ.. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్.. పక్షుల బెడదను నివారించేందుకు.. ఈ వినూత్న ఐడియా ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది..

టెక్నలాజియా.. మొక్కజొన్న చేను దగ్గర బీరు బాటిల్ కట్టిన రైతు.. ఎందుకో తెలుసా..?
Farmar
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 02, 2026 | 9:03 AM

Share

శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. మొక్కజొన్న పంటను కాపాడేందుకు రైతులు పడుతున్న పాట్లలలో బీరు సీసా గంట ఒకటి.. వినటానికి బీరు సీసా గంటెంది అని విచిత్రంగా అనిపిస్తుంది. కానీ.. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్.. పక్షుల బెడదను నివారించేందుకు.. ఈ వినూత్న ఐడియా ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.. బీరుసీసా కట్టి.. దాని పక్కనే ఇనుప కడ్డీని తాడుతో కట్టారు.. దానికి ఓ అట్ట ముక్క కింద వేలాడదీశారు.. ఈ క్రమంలో గాలికి అది అటు ఇటు ఊగుతూ.. దానికి టచ్ కాగానే.. టిక్ టిక్ అంటూ అది సౌండ్ చేస్తుంది.. దీంతో ఆ ప్రాంతంలోకి రావాలంటేనే పక్షులు జంకుతాయి.. రైతుకు సంబంధించిన వినూత్న ఘటన.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో చోటుచేసుకుంది..

మొక్క జొన్న పంటకు రామ చిలుకల బెడదను నివారించేందుకు రైతులు వినూత్నంగా బీరు సీసా గంటలను ఏర్పాటు చేశారు. గాజు సీసాను వేలాడదీసి.. ఆ సీసాకు తగిలేలా దారంతో ఇనుప బోల్డ్ ను కడతారు. ఆ బోల్టు గాలికి కదిలేందుకు బోల్టు నుంచి దారంతో అట్ట ముక్కను వేలాడదీస్తారు. గాలికి అట్టముక్క ఊగినప్పుడు దారానికి ఉన్న బోల్టు సీసాకు తగిలి.. గంట కొట్టిన శబ్దం వస్తుంది. దీంతో పక్షులు పారి పోతున్నాయి.

వీడియో చూడండి..

కందుకూరు, మర్లపాడు మధ్యలో సుమారు ఇలాంటివి 20కి పైగానే ఈ బీరు సీసాల గంటలు కనిపిస్తున్నాయి. మొక్క జొన్న పంటలపై రామచిలుకలను, పక్షులను నివారించడానికి రైతులు చేస్తున్న చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం పలువురిని ఆకర్షిస్తున్నాయి. ఎంతో కష్టపడి సాగు చేస్తున్న పంటలకు ఒకవైపు కోతుల బెడద నుంచి పశువులు సంచారం నుంచి కాపాడుకుంటూ.. రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే.. ఇక్కడ రైతులకు రామచిలుకలు, పక్షుల బెడద ఎక్కువ అయ్యింది. దీంతో కొత్త కొత్త వినూత్న ఐడియాలతో రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us