Vijay Thalapathy: మరీ ఇంత దరిద్రం ఏంటీ సామి.. విజయ్కు మరో సమస్య.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి టైమ్ అస్సలు బాలేదనే చెప్పాలి. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలని భావించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి సినిమాలకు రిటైర్మెంట్ సైతం ప్రకటించారు. ఇక ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వ్యక్తిగత జీవితం మొత్తం ఇప్పుడు వార్తలలో నిలిచింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మరో షాక్ తగిలింది. ఇదివరకే భార్య సంగీత విడాకులకు అప్లై చేయడం.. ఇటు కొడుకు జాసన్ సంజయ్ సైతం దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా జన నాయగన్ సినిమా విషయంలో విజయ్ కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే ఈ సినిమా చుట్టూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సెన్సార్ కారణాల వల్ల సంక్రాంతికి విడుదల కావాల్సిన మూవీ ఇంకా విడుదల కాలేదు. ఇదే విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది. తాజాగా ఈ సినిమాకు మరో షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను రూ.120 కోట్లకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ స్పష్టంగా లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలైసెన్స్ను రద్దు చేసిందని చెబుతున్నారు. అయితే, అమెజాన్ ప్రైమ్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. విడుదల తేదీ ఖరారు అయిన తర్వాత ఓటీటీ లైసెన్స్ ఒప్పందంపై మళ్లీ చర్చించే అవకాశం ఉంది.
ఎక్కువమంది చదివినవి : Dil Raju: హీరోయిన్కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..
రూ.500 కోట్లతో నిర్మించిన జన నాయగన్ చిత్రానికి విజయ్ ఏకంగా రూ.220 కోట్లు పారితోషికం తీసుకున్నారని టాక్. కానీ ఇప్పటివరకు సినిమా విడుదల కాలేదు. ఈ పరిస్థితిలో ఓటీటీ లైసెన్స్ రద్దు చేయబడింది. ఇదిలా ఉంటే.. సెన్సార్ కమిటీకి సిఫార్సు చేయడానికి సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టులో ఆశించిన తీర్పు రాకపోవడంతో, కేసును ఉపసంహరించుకుంటున్నట్లు వారు తెలిపారు. ఆ తర్వాత, సెన్సార్ బోర్డు సిఫార్సు చేసినట్లుగా, ఫిబ్రవరి 9న జనయాన చిత్రాన్ని రీ-సెన్సార్షిప్ కమిటీకి సమర్పించారు. ఈ సినిమా చూసిన కమిటీలో లేని 10 మందితో కొత్త కమిటీని ఏర్పాటు చేయడానికి రెండు వారాలు పట్టింది. దీని తర్వాత, మార్చి 9న జనయాన చిత్రాన్ని రీ-సెన్సార్షిప్ కమిటీ చూస్తుందని వారు చెప్పారు. సర్టిఫికెట్ త్వరలో వస్తుందనే ఆశతో చిత్ర బృందం వేచి ఉంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ప్రభాస్లతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీనే అల్లాడించిన గ్లామరస్ బ్యూటీ.. క్యాన్సర్ను జయించి ఇలా..
ఒకవేళ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పట్లో విడుదల కాదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన 7 రోజుల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రణాళిక. ప్రస్తుతం జన నాయగన్ సినిమా విడుదల విషయంలో మరింత జాప్యం జరగనుందని తెలుస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..
ఎక్కువమంది చదివినవి : Cinema : అరె ఏంట్రా ఇది.. 15 ఏళ్లైనా నాగార్జున సినిమాకు తగ్గని డిమాండ్.. ఇప్పుడు ఓటీటీని అల్లాడిస్తోన్న మూవీ..
