AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI సమ్మిట్‌లోకి దూసుకువచ్చిన యువజన కాంగ్రెస్ నేతలు.. టీ-షర్టులు విప్పి నిరసన..!

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. అయితే ఏకంగా భారత్ మండపంలోకి భారత యువజన కాంగ్రెస్ నాయకులు ప్రవేశించారు. ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. AI సమ్మిట్‌లో ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

AI సమ్మిట్‌లోకి దూసుకువచ్చిన యువజన కాంగ్రెస్ నేతలు.. టీ-షర్టులు విప్పి నిరసన..!
Youth Congress Protest
Balaraju Goud
|

Updated on: Feb 20, 2026 | 3:04 PM

Share

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. అయితే ఏకంగా భారత్ మండపంలోకి భారత యువజన కాంగ్రెస్ నాయకులు ప్రవేశించారు. ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. AI సమ్మిట్‌లో ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ నిరసనకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

భారత్ మండపం వద్ద యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. దాదాపు 10 మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వారిలో చాలా మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారందరూ QR కోడ్‌ల ద్వారా భారత్ మండపంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వారందరినీ తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఢిల్లీలోని భారత్ మండపంలో భారత యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన నిరసన కార్యక్రమంపై బీజేపీ తీవ్రంగా ఖండించింది. జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా మాట్లాడుతూ, “కాంగ్రెస్ వారికి AI అంటే ఆశయం కలిగిన భారతదేశం, కృత్రిమ మేధస్సు, ఆకాంక్షాత్మక భారతదేశం కాదని మరోసారి నిరూపించింది. వారికి AI భారతదేశ వ్యతిరేకం. ఇది ఇండియన్ కాంగ్రెస్ కాదు, ఇది ANC అంటే జాతీయ వ్యతిరేక కాంగ్రెస్. AI సమ్మిట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించడం కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదు” అని అన్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నుండి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి వరకు, అగ్రశ్రేణి టెక్ కంపెనీ అధినేతల వరకు, సామ్ ఆల్ట్మాన్ నుండి సుందర్ పిచాయ్ వరకు, అందరూ దీనిని ప్రశంసిస్తున్నారు. శశి థరూర్ కూడా AI సమ్మిట్ అద్భుతంగా ఉందని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆదేశం మేరకు నిరసన వ్యక్తం చేస్తోందని బీజేపే నేతలు మండిపడ్డారు. ఇది వ్యక్తిత్వం లేని, మెదడు లేని, భావోద్వేగం లేని నిరసన అని షాజాద్ పూనావాలా అన్నారు. ఇది బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కాదు, ఇది ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిరసన కాదు, ఇది భారతదేశం సాధించిన విజయాలకు వ్యతిరేకంగా నిరసన అని ఆయన ధ్వజమెత్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us