లోక్‌సభ ఎన్నికలు 2024

లోక్‌సభ ఎన్నికలు 2024

2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024తో యుగియనుంది. జూన్ 16లోపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో 17వ లోక్‌సభకు ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఏడు విడతల్లో ఓటింగ్ నిర్వహించి.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు. దాదాపు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. బీజేపీకి 37.36 శాతం, కాంగ్రెస్‌కు 19.49 శాతం ఓట్లు దక్కాయి.

దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, మెజారిటీకి 272 సీట్లు అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) త్వరలోనే ప్రకటించనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ 30కి పైగా పార్టీలతో పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఈ సారి కూడా ఏప్రిల్, మే నెలల్లో ఆరు నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 80 లోక్‌సభ స్థానాలు, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్‌లో 42, బీహార్ 42, తమిళనాడు 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

ఇంకా చదవండి

Lok Sabha Election: కాంగ్రెస్ – సీపీఎం మద్య కుదిరిన దోస్తీ.. ఆ నియోజకవర్గం మినహా అన్నిచోట్ల మద్దతు!

తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సీపీఎం నేతలతో చర్చించామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్యతోపాటు పలువురు కీలక నేతలు సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కోరినట్లు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి

YCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. చేసేది స్పష్టంగా ప్రజలకు చెప్పే అజెండాతో మేనిఫెస్టోః జగన్

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేయడం జరిగిందన్నారు జగన్.

Etela Rajendar: రేవంత్ రెడ్డికి ఈటెల సవాల్.. అలా అయితే రాజకీయాల నుండి తప్పుకుంటా..!

మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించిన ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌‌లో భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ రేవంత్‌ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు ఈటెల .

Nalgonda Politics: ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీ.. ఆసక్తికరంగా మారిన లోక్‌సభ ఎన్నికలు!

సాధారణంగా ఎన్నికల్లో పోటీ అంటేనే పార్టీల మధ్య ఉంటుంది. గెలుపు కోసం పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతారు. కానీ ఆ జిల్లాలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల వేళ ఇద్దరు మంత్రుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీగా ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఆ మంత్రులకు పార్లమెంటు ఎన్నికలు సవాల్ గా మారాయి.

Dr. Boora Narsaiah Humanity: మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ.. వ్యక్తిని కాపాడిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

భువనగిరి మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ స్వయానా ఒక డాక్టర్. రాజకీయ నాయకుడిగానే కాదు డాక్టర్‌గా ఎందరికో వైద్యం అందించారు. తాజాగా ఆయనలో మరోసారి డాక్టర్ బయటికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి ప్రాణం కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.

Manda Jagannadham: పార్టీలో చేరిన ప్రతీ నేతకు ఝలక్ ఇస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయవతి..!

పార్టీలో చేరిన ప్రతీ నేతకు ఝలక్ ఇస్తున్నారు బహుజన సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయవతి. మొన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. నిన్న మంద జగన్నాథం ఇద్దరూ బలై పోయారు. మరీ ముఖ్యంగా జగన్నాథం విషయంలో బీఫామ్‌.. వేరొకరికి ఇచ్చి షాక్‌ ఇచ్చారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ ఎంపీ, బీఎస్పీ నేత మంద జగన్నాథం పరిస్థితి ఎటుకాకుండా పోయింది.

BJP Phasewise War: దశలవారీగా కాంగ్రెస్‌పై బీజేపీ యుద్ధం.. ఒక్కో విడతలో ఒక్కో అస్త్రం ప్రయోగం

దేశంలో 7 దశల వారీగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దశలవారీగా కాంగ్రెస్‌పై ఎన్నికల యుద్ధం చేస్తోంది. ఒక్కో ఫేజులో ఒక్కో అస్త్రంతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అయ్యో రామా..! దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఓటు కోసం కోటి తిప్పలు. అందుకే.. ఓట్ల ఆటలో కొత్తకొత్త వెర్షన్స్‌ పుట్టుకొస్తున్నాయి. అందితే జుట్టు పట్టుకోవడం.. పొట్టుపొట్టు తిట్టుకోవడం.. అందకపోతే దారి మార్చి.. గుళ్లో దూరి దేవుడి కాళ్లు పట్టుకోవడం.. అవసరాన్ని బట్టి దేవుడి మీదే ఒట్టేసి జనం సెంటిమెంట్‌తోనే గేమ్స్ ఆడుకోవడం. ప్రస్తుతానికి దేవుడి చుట్టూనే చక్కర్లు కొడుతోంది తెలుగు రాజకీయం. దీనికి పరాకాష్ట ఏంటంటే.. దేవుడినే అంపైర్‌గా పెట్టి జరుగుతున్న పొలిటికల్ ఫీట్లు.

  • Srikar T
  • Updated on: Apr 26, 2024
  • 9:54 pm

Telangana: లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..

గన్‌పార్క్‌ రాజకీయం మళ్లీ మొదలైంది. తెలంగాణలో సవాళ్ల పర్వం.. రాజీనామాల వరకు దారితీస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న అప్పర్‌ హ్యాండ్‌ పాలిటిక్స్‌ రోజు రోజుకు పీక్స్‌కు చేరుతున్నాయి. హరీష్‌రావు, రేవంత్‌ మధ్య మాటల యుద్ధం చేతలకు దారితీస్తుండడంతో.. ఈ హైడ్రామా ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గన్‌ పార్కు మరోసారి రాజకీయ వేదికగా మారింది.

  • Srikar T
  • Updated on: Apr 26, 2024
  • 9:23 pm

Lok Sabha Elections 2024: రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి సిద్దమవుతున్న నేతలు..

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్‌ ముగించారు.

  • Srikar T
  • Updated on: Apr 26, 2024
  • 8:56 pm

Watch Video: ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ఇటలీ నేషనల్‌ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఆరోపించారు. బీజేపీ పక్కా లోకల్ పార్టీ అని.. కాంగ్రెస్ పక్కా ఇటలీ పార్టీ అని కామెంట్ చేశారు. బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

  • Srikar T
  • Updated on: Apr 26, 2024
  • 8:33 pm

Watch Video: ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల.. ఎన్నికల వేళ తెరపైకి ఛార్జిషీట్ల అంశం..

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై కేసులు.. సీబీఐ ఛార్జిషీట్ల విషయంలో షర్మిల చేసిన ఆరోపణలపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల తన మీద నిరాధార ఆరోపణలు చేశారన్నారు పొన్నవోలు సుధాకర్. రాజకీయ లబ్ధి కోసం షర్మిల పచ్చి అబద్ధాలు ఆడారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉందన్నారు.

  • Srikar T
  • Updated on: Apr 26, 2024
  • 7:50 pm

Telangana: దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం..

మాటకు మాట.. విమర్శకు ప్రతివిమర్శ.. ఎత్తుకు పైఎత్తుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తు అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతులవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Babu Mohan: కేఏ పాల్‌కు బాబూ మోహన్ ఝలక్.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్

వరంగల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బబూ మెహన్ నామినేషన్ వేశారు. ప్రజాశాంతి పార్టీ నుంచి ఆయన బరిలో ఉంటారని అంతా భావించగా.. ఆయన ఆ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Lok Sabha Election: అస్సలు తగ్గేదే లే..! పార్టీకి, బరిలో ఉన్న అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న నేత!

అన్నీ పార్టీల నేతలంతా ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎర్రని ‌ఎండలో గడపకు గడపకు తిరుగుతుంటే, ఆ పార్టీ‌నేతలు మాత్రం ఆ నేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చి అలక మానిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నారట. కానీ ఏం లాభం ఆ నేత మాత్రం అస్సలు తగ్గేదే లే.. నా రూటే సపరేట్ అంటూ పార్టీకి, బరిలో ఉన్న పార్టీ అభ్యర్థికి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నాడట.