బీఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది.
KTR: గ్రేటర్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్.. ఫలితాలపై కీలక వ్యాఖ్యలు!
హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం తెలంగాణ భవన్లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
- Anand T
- Updated on: Feb 12, 2026
- 5:28 pm
Telangana Municipal Elections 2026 Live: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Telangana Municipal Corporation Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరుగింది. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100 శాతం వెబ్ కాస్టింగ్తో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 62.5 శాతం పోలింగ్ నమోదు అయింది. మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. కాగా సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాగా శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
- Balaraju Goud
- Updated on: Feb 11, 2026
- 6:38 pm
బీఆర్ఎస్ జాతిపిత కామెంట్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ రియాక్ట్.. ఏమన్నారంటే?
మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ మరింతగా హీటెక్కుతోంది. జాతిపిత కామెంట్ తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న జాతిపిత ప్రచారంపై సీఎం రేవంత్ తనదైన శైలిలో విరుచుపడ్డారు. అలాంటి పనులు చేసిన వాళ్లు జాతిపిత అవుతారా ? అంటూ మండిపడ్డారు. అయితే సీఎం కామెంట్స్కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కారు పార్టీ.
- Balaraju Goud
- Updated on: Feb 4, 2026
- 9:21 pm
Santosh Babu: ఎన్నికల బరిలో గాల్వాన్ హీరో కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి.. ఏ పార్టీ నుంచో తెలుసా..?
అతనో యుద్ధ వీరుడు. దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరుడు. దేశ రక్షణకు కుమారుడు శత్రుమూకలతో పోరాడి అమరుడైతే.. ప్రజలకు సేవ ఆ వీరమాత ఎన్నికల కదన రంగంలోకి దూకింది. మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిన ఆ వీరమాత ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Feb 1, 2026
- 4:24 pm
KCR: మాజీ సీఎంగా విచారణకు సిద్ధం.. కానీ.. సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్షన్ ఇదే..
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిట్ లేఖలో కోరింది. అయితే.. సిట్ నోటీసులపై కే. చంద్రశేఖర్ రావు స్పందించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 29, 2026
- 8:38 pm
Telangana Municipal Elections: పురపోరుకు నగారా..! పార్టీల బలాబలాలేంటి.. నేతల వ్యూహాలేంటి..
ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అవుతాయా? ఫలితాలు ఎలా వచ్చినా, ఎవరికి అనుకూలంగా ఉన్నా.. జరిగేది ఇదే. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ చెరిసగం సీట్లు పంచుకున్నాయి. ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్కు బీజేపీ షాక్ ఇచ్చింది. రెండు బైఎలక్షన్లలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కైవసం చేసుకుని పట్టణ ఓటర్లలోనూ కాంగ్రెస్కు బలం ఉందని నిరూపించుకుంది కాంగ్రెస్.
- Shaik Madar Saheb
- Updated on: Jan 27, 2026
- 9:49 pm
Phone Tapping Case: బీఆర్ఎస్ మాజీ ఎంపీకి సిట్ నోటీసులు.. సంతోష్ ఏమన్నారంటే.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) వేగవంతం చేసింది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది.. ఈ మేరకు సిట్ అధికారులు విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ సంతోష్రావుకు సోమవారం నోటీసులు ఇచ్చారు..
- Shaik Madar Saheb
- Updated on: Jan 26, 2026
- 8:25 pm
Phone Tapping Case: లీకులు.. సెటైర్లు.. లోపల ఏం జరుగుతోంది..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది..? ఎవరు ఎవర్ని ప్రశ్నిస్తున్నారు..? ఎవరిది టైమ్పాస్..? లోపల ఏం జరుగుతోంది.. లీకులిస్తోంది ఎవరు..తర్వాత వాటిని కవర్ చేస్తోంది ఎవరు..? గులాబీ దండులో ఇద్దరు అగ్రనేతలు, సేమ్ టోన్లో సిట్ విచారణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు..? ఇంతకూ ట్యాపింగ్ కేసులో సిట్ రైట్గా వెళ్తోందా..? రాంగ్ డైరెక్షన్లో పొలిటికల్ వెర్షన్ వినిపిస్తోందా..?
- Shaik Madar Saheb
- Updated on: Jan 24, 2026
- 7:28 am
అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి వేధించారు.. లీకులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారుః కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలిపారు. లీకులతో మాకు సంబంధం లేదని విషయాలను బయటపెట్టి బీఆర్ఎస్ నేతల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ టైమ్ పాస్ నడుపుతున్నారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
- Balaraju Goud
- Updated on: Jan 23, 2026
- 7:49 pm
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు!
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు టాప్ గేర్లోకి వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే BRS మాజీ MLAలు జైపాల్యాదవ్, చిరుమర్తి లింగయ్యను విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి హరీష్రావుకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది.
- Anand T
- Updated on: Jan 19, 2026
- 8:57 pm
ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.. ఇదే చివరి అవకాశం.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సమయం ఇచ్చినా.. ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్కు మరో అవకాశం ఇచ్చింది..
- Balaraju Goud
- Updated on: Jan 16, 2026
- 12:33 pm
Telangana: వాళ్లిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే.. పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్ గడ్డం ప్రసాద్
పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టంచేశారు. ఇద్దరిని BRS ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు..
- Shaik Madar Saheb
- Updated on: Jan 15, 2026
- 3:43 pm