AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఆర్ఎస్

బీఆర్ఎస్

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇంకా చదవండి

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట.. ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..?

మాట ఇచ్చాం మడమతిప్పం అంటున్నారు లోకల్ కామ్రేడ్‌లు.. కాదు.. కాదు.. కాంగ్రెస్‌తో కలిసుంటేనే కలదు సుఖం అంటోంది కామ్రేడ్ అదిష్టానం. ఇంత జరిగాక వెనక్కి తగ్గితే ప్రజల్లో చులకన అవుతామంటున్నారు లోకల్ ఎర్రన్నలు. అలా కాదు మరోసారి ఆలోచించండి.. భవిష్యత్ అవసరాల కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదంటోంది ఆ పార్టీ అధినాయకత్వం.

Errabelli Dayakar Rao: ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. వీడియో చూశారా..?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా ముగిసింది. ఈ క్రమంలోనే.. ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. దీంతో మాజీమంత్రికి ఏమైంది. అన్న చర్చ టాక్‌ ఆఫ్‌ ది తెలంగాణగా మారింది. అసలు తొర్రూరులో గతంలో ఏం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతోంది. మీకు తెలియాలా? అయితే ఈ స్టోరీ చూసేయండి..

KCR Birthday: బర్త్‌డే స్పెషల్.. 10 వేల మందితో ఫోటో దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇదిగో వీడియో

పది కాదు ఇరువై కాదు.. ఏకంగా 10వేల మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఫోటో దిగారు మాజీ సీఎం కేసీఆర్. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వాళ్లతో ప్రేమగా మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ 72వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

Telangana: ఇక ఉప్పు నిప్పుల్లేవ్..! మేయర్, ఛైర్మన్‌గిరి కోసం.. బద్ధ శత్రువుల మధ్య చిగురించిన ప్రేమలు!

ఇట్స్ మిరాకిల్. పొలిటికల్ సైన్స్‌లో ఇవో విచిత్రమైన సన్నివేశాలు. గతంలో చూసుంటారు.. బట్ అడపాదడపా. కాని, ఒకేసారి, ఒకేపూటలో ఇన్ని రాజకీయ వైచిత్రిలు చూడ్డం బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు.. వాళ్లని ఓడించండి, మాకే ఓటేయండని ప్రచారాల్లో సెగలు కక్కుకున్న పార్టీలు.. ఇలా కలిసిపోయి అధికారం పంచుకుంటాయని ఎవ్వరూ ఊహించరు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. !

తెలంగాణలో మున్సిపల్‌ పోరు ముగిసి మూడు రోజులు అవుతున్నా పొలిటికల్ డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఐదు మున్సిపాలిటీలు.. హంగ్ పాలిటిక్స్‌తో హీట్‌ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ మధ్య క్యాంప్‌ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి.

Nizamabad Municipal Election Result: రెండోసారి కమలం చేజారిన ఇందూరు పీఠం.. మజ్లిస్‌తో కలిసి మేజిక్ ఫిగర్..!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

Nalgonda Municipal Election Result: సఫాయి కార్మికురాలుగా సేవ చేసిన చోటే.. నేడు కౌన్సిలర్‌గా ప్రజా సేవ..!

ఆమె ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా పని చేశారు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదేశాల మేరకు పనిచేసింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30ఏళ్లు తన సేవలు అందించింది. ఆమె ఇపుడు మరో రూపంలో తన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. తొలుత నేరేడుచర్ల గ్రామ పంచాయతీ, ఆ తర్వాత ఏర్పడిన మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలుగా 30 ఏళ్లుగా చేసింది.

Telangana Municipal Election Results: ఒక్క ఓటు మ్యాజిక్‌.. అభ్యర్థుల జీవితాలనే మార్చేసింది..!

పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్‌కట్‌గా ఉంది. రూలింగ్ పార్టీకే జైకొట్టింది. నంబర్ల విషయంలో నో కన్‌ఫ్యూజన్. కానీ, పట్టణ ఓటరు మాత్రం పెద్ద పజిలే పెట్టేశాడు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు, అలాగని ఏ పార్టీనీ నిరుత్సాహపర్చలేదు మున్సిపల్ ఫలితం. ఓవరాల్‌గా పురపోరు ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది.

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో దుమ్మురేపిన కాంగ్రెస్.. చిట్యాలలో ప్రత్యేక విజయం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026లో కాంగ్రెస్ పార్టీ 800 వార్డులు దాటి భారీ ఆధిక్యాన్ని సాధించింది. నల్గొండ జిల్లా చిట్యాలలో, ట్రాన్స్‌జెండర్ స్వతంత్ర అభ్యర్థి కావేరి (సుధాకర్) వార్డు 1లో చారిత్రాత్మక విజయం సాధించారు, ఇది సమాజంలో మార్పునకు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ హవా కొనసాగింది.

Karimnagar Municipal Corporation Election Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉత్తర తెలంగాణలో హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు అందించిన లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. మొదటి రౌండ్ ముగిసే వరకు మొత్తం 66 డివిజన్లలో 36 స్థానాల్లో బీజేపీ అధిక్యత కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 12 డివిజన్లు, బీఆర్ఎస్ - 03, ఎంఐఎం 2 డివిజన్లతో సత్తా చాటాయి.

Telangana Municipal Election Final Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. లైవ్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం.. ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Telangana Municipal Election Results: పెరిగిన పోలింగ్ శాతం.. కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్న పార్టీలు

Telangana Municipal Poll Results 2026: ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం కూడా కౌంటింగ్‌పై ఆసక్తి పెరగడానికి మరో కారణం. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 70.26 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఇప్పుడు 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది.