బీఆర్ఎస్

బీఆర్ఎస్

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇంకా చదవండి

Telangana: జంప్‌ జిలానీలకు కొత్త టెన్షన్‌..! కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

బీఆర్ఎస్‌ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీకి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు.

Telangana Assembly: కులగణన సర్వేపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. తెలంగాణలో పొలిటికల్ హీట్..

కులగణన సర్వేపై చర్చ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది. కులగణన సర్వేపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంటే.. కేసీఆర్ హయాంలో చేపట్టిన సర్వేతోనే కారు పార్టీకి కౌంటర్ ఇవ్వాలని యోచిస్తోంది కాంగ్రెస్.

Budget 2025: తెలంగాణకు అన్యాయం.. బడ్జెట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైర్.. బీజేపీ కౌంటర్..

బడ్జెట్‌పై తెలంగాణలో మిశ్రమ స్పందన వచ్చింది. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు బీజేపీని కార్నర్ చేస్తూ విమర్శలు చేస్తుంటే.. వాటిని తిప్పి కొడుతున్నారు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ స్పందన ఏంటి..? కేంద్రమంత్రులు ఏమని కౌంటర్ ఇచ్చారు..? ఈ కథనంలో చూడండి..

KCR: గర్జించిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు

రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి.. మంచి నీళ్లకు కరువు వచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని విమర్శించారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటానికి రెడీ అవ్వాలని అధినేత క్యాడర్‌కు పిలుపునిచ్చారు.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరమా? షెడ్యూల్‌ విడుదలైనా కనిపించని హడావుడి!

ఓటమి ఓ అనుభవం.. రాబోయే విజయానికి సోపానం.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అనువుగా మలచుకుని ముందుకు సాగాలి. రాజకీయమైనా, మరెక్కడైనా..! ఇదేకదా అందరూ అనుకునేది. అదేంటో మరి, తెలంగాణలో పదేళ్లు అధికారం చలాయించిన ఆ పార్టీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఎన్నిక ఏదైనా ఎగిసిపడే ఉత్సాహంతో ముందుకొచ్చే ఆ పార్టీ... ఎందుకిలా వ్యవహరిస్తోంది? అన్నదీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జడ్జి ముందు కూర్చొని తేల్చుకుందాం.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

మాజీ మంత్రి కేటీఆర్‌ని ఏడుగంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫార్ములా-ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై కూపీ లాగింది. కానీ.. ఈడీ, ఏసీబీ ఒకేరకమైన ప్రశ్నలు అడిగాయని, అడిగిన సమాచారమంతా ఇచ్చేశానని చెప్పారు కేటీఆర్. ఇది రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అన్నారు కేటీఆర్. లై డిటెక్టర్ పరీక్షకు సిద్దమేనా అని సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్ విసిరారు.

BRS: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌

ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని.. సుప్రీం బీఆర్‌ఎస్ కోరింది. హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్‌కే వదిలేయడంతో.. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది బీఆర్‌ఎస్. దీంతో విచారణపై ఉత్కంఠ నెలుకుంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

KTR: సుప్రీంకోర్టులోనూ కేటీఆర్‌కి నో రిలీఫ్.. ఫార్ములా ఈ కేసులో పూర్తిస్థయి విచారణకు లైన్ క్లియర్..!

రేసు కేసులో మళ్లీ గేరు మారింది. తెలంగాణ రాజకీయాల్ని ఊపేస్తున్న ఫార్ములా ఈ కేసు మళ్లీ ఎడ్వాంటేజ్ కాంగ్రెస్ అంటోంది. కేటీఆర్ ఆర్గ్యుమెంట్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో గులాబీ దండు డిఫెన్స్‌లో పడ్డట్టయింది. కుంభకోణం లేదు లంబకోణం లేదు అని విర్రవీగినవాళ్లంతా ఇప్పుడేమంటారు అని నిలదీస్తోంది హస్తం పార్టీ. ఈ రగడ ఇక్కడితోనే ఆగే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. రేసు కేసులో రేపు, ఎల్లుండి రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్‌ ఇంకా ఇంకా రక్తి కట్టించే ఛాన్సుందట.

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు.. రిమాండ్ రిపోర్ట్ కొట్టివేసిన జడ్జి

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేశారు న్యాయమూర్తి. దీంతో పాటు 25 వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని కౌశిక్ రెడ్టి తరపు న్యాయవాది తమ వాదన వినిపించారు. దీంతో రిమాండ్ రిపోర్ట్ కొట్టివేసిన జడ్జి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Koushik Reddy: మరింత రాజుకున్న కౌశిక్‌రెడ్డి, సంజయ్‌ వివాదం.. కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులు నమోదు

కరీంగనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై నాలుగు కేసులు నమోదయ్యాయి. అటు అసెంబ్లీ స్పీకర్‌ని కలిసిన ఎమ్మెల్యే సంజయ్‌.. కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కౌశిక్‌రెడ్డి దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సంజయ్‌.