బీఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది.
‘టీఆర్ఎస్’ పేరుపై కొత్త ట్విస్ట్.. అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్.. కవిత పార్టీకి బ్రేక్ పడుతుందా?
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి (BRS) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం (ECI) ఆమోదించడంపై పింక్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ అంశంపై వివిధ వ్యక్తులు, సంస్థలు, రాజకీయ వర్గాల నుంచి 600కుపైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 12, 2026
- 12:28 pm
తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనను బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పోల్చుతూ బహిరంగ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాల వంటి కీలక అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. 2028 ఎన్నికల లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 6, 2026
- 9:56 pm
‘కేటీఆర్తో లోకేష్ సరితూగలేరు.. నాయకుడిగా మరింత ఎదగాల్సి ఉంది’: కడియం
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏపీ రాజకీయాలు, తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నేతలపై స్పందిస్తూ.. నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కుమారుడిగానే ప్రొజెక్ట్ అవుతున్నారని, నాయకుడిగా ఆయన మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 6, 2026
- 9:44 pm
“రేవంత్ను తక్కువ అంచనా వేయొద్దు.. మళ్లీ గెలిచే సత్తా ఉంది”: క్రాస్ఫైర్లో కడియం కీలక వ్యాఖ్యలు!
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ రాజకీయాలు, పార్టీల భవిష్యత్తుపై ఆసక్తికర విశ్లేషణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 6, 2026
- 9:15 pm
“డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయా.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోయా”: కడియం
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు సంచలన విషయాలు బయటపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ, స్టేషన్ ఘన్పూర్కు ఏమీ చేయలేకపోయానని కడియం అంగీకరించారు.
- Balaraju Goud
- Updated on: Jun 6, 2026
- 9:10 pm
“సాంకేతికంగా నేను బీఆర్ఎస్సే.. కానీ..” టీవీ9 క్రాస్ఫైర్లో కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్ఫైర్’ ఇంటర్వ్యూలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పలు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. తా తాను సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్తో తనకు సంబంధం లేదని స్పీకర్కు అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 6, 2026
- 9:05 pm
కీలక పదవులు ఇచ్చిన పార్టీలను మోసం చేశారా? రాజకీయ చరమాంకంలో కడియం ఇబ్బందులు పడుతున్నారా ?
టీవీ9 'క్రాస్ ఫైర్' ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై కీలక విశ్లేషణ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు ఉన్నాయని, గత ప్రభుత్వ అప్పుల భారంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదని పేర్కొన్నారు. తానూ సాంకేతికంగా తాను బీఆర్ఎస్లోనే ఉన్నప్పటికీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలిసి పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 6, 2026
- 7:34 pm
అనుకున్న చోట ఆత్మగౌరవం తగ్గితే.. కటీఫ్ కొట్టి బైటికొస్తేనే.. కింగ్సైజ్ లైఫ్..!
నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది.. ఇది తెలుగునాట పవర్స్టార్ సినిమా డైలాగైతే కావొచ్చు. సేమ్టైమ్ తమిళనాట అన్నామలై మేనరిజమ్ కూడా అదే. శాలువాలు కప్పించుకోడానికో, ఏదో ఒక కుర్చీ కోసం కుస్తీ పట్టడానికో, ఎమ్మెల్యే ఎంపీ అని కారుకి స్టిక్కర్ అతికించుకోడానికో నేను రాజకీయాల్లోకి రాలేదు.. యంగ్ తమిళనాడును ఆవిష్కరించడానికి, ద్రవిడ బిడ్డలకు బెటర్ లైఫ్ ఇవ్వడానికే వచ్చా..! తనకు టిక్కెట్ నిరాకరించడంపై తన మీదొస్తున్న ఊహాగానాలకు జవాబిస్తూ ఆరునెలల కిందట అన్నామలై ఇచ్చిన ప్రకటన ఇది. పొలిటికల్గా ఎదగాలంటే ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడితే జనానికి దగ్గరౌతామన్న క్లారిటీ కూడా ఉంది. ఏ ఒక్క శక్తీ నన్ను, నా పొలిటికల్ మేనరిజాన్నీ మార్చలేరు అన్నప్పుడు అన్నామలై తెగింపును చూసి టోటల్ తమిళనాడుకే ముచ్చటేసింది. ఇప్పటికే గ్రౌండ్వర్క్ ప్రిపేర్ చేసుకున్నా.. కొత్త పార్టీ పెట్టుడు పక్కా, పోటీ చేయుడూ పక్కా.. పవర్లోకి వచ్చుడూ పక్కా అనే రేంజ్లో ఉంది అన్నామలై కటీఫ్ స్టేట్మెంట్. తన పొలిటికల్ ఫ్యూచర్పై దేశమంతా జరుగుతున్న డిబేట్లకు ఫుల్స్టాప్ పెట్టేశాడు అభినవ ఫైర్బ్రాండ్ అన్నామలై. కమలం పార్టీకి రామ్రామ్ చెప్పి, ఎర్రజెండా ఎగరేసిన ఈ చిచ్చరపిడుక్కి ఇన్స్పిరేషన్ ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా ధిక్కరించి ఏం చెయ్యదల్చుకున్నాడు? కొత్త కుంపటిని దిగ్విజయంగా వెలిగించుకునే సత్తా అన్నామలైకు ఉందా?
- Balaraju Goud
- Updated on: Jun 5, 2026
- 9:52 pm
పొలం గట్టుపై పొలిటికల్ వార్.. పిచ్చెక్కిస్తున్న పార్టీల లడాయి.. తెలంగాణలో ‘రైతే రాజు’కీయం!
జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి 12వ పుట్టినరోజు. ఆవిర్భావ వేడుకలు ఊరూవాడా అట్టహాసంగా ముగిశాయి. రాజకీయ పార్టీలైతే సంబరాలతో పాటు పనిలో పనిగా చిచ్చుబుడ్లు కూడా వెలిగించుకున్నాయి. పాత చిచ్చులను కొత్తగా వెలిగించుకుని, ఆ మంటల నుంచి చలి కాచుకుంటున్నాయి. ఒక పార్టీపై మరొకటి, ఇష్యూ బేస్డ్గా చురకలంటించుకుని, చిత్తశుద్ధిని లెక్కలేసుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు మూడు పార్టీల మధ్య దూరాన్ని బాగా పెంచేశాయి. విచిత్రం ఏంటంటే, ఆ మూడూ రైతుకు సంబంధించిన టాపిక్లే. నాగలి పట్టకపోయినా, దుక్కి దున్నకపోయినా, సాగు చెయ్యకపోయినా, పార్టీ కండువాలేసుకుని రైతు సంక్షేమం కోసం వీళ్లు పడే పాట్లు చూస్తే, ఔరా అనిపిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 3, 2026
- 9:50 pm
బద్దలైన అస్తిత్వ అగ్నిపర్వతం.. రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైనమైట్లు!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని అగ్గి రాజుకుంది. పదేళ్ల ఆవిర్భావ వేడుకల వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ అస్తిత్వ రాజకీయాల తేనెతుట్టె ఒక్కసారిగా కదిలింది. అస్తిత్వ అగ్నిపర్వతం భళ్లున బద్దలై, రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలేలా చేస్తోంది. తెలంగాణ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే హక్కు ఎవరికి ఉంది? అనే యక్ష ప్రశ్నలతో 'తెంగాణం' మరోసారి భగభగా మండుతోంది.
- Balaraju Goud
- Updated on: Jun 2, 2026
- 9:49 pm
తెలంగాణ భవన్లో హైడ్రామా.. పోలీసులకు లొంగిపోయిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్!
హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ శనివారం (మే 30) తీవ్ర ఉద్రిక్తతలకు, హైడ్రామాకు వేదికైంది. సింగరేణి సంస్థకు సంబంధించిన వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం, ఆయన తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయారు.
- Balaraju Goud
- Updated on: May 30, 2026
- 2:04 pm
SIRపై తెలంగాణలో సరికొత్త పొలిటికల్ వార్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు.. బీజేపీ కౌంటర్
ఓట్లపై బీజేపీ కుట్రలు.. ఆపండి మీ డ్రామాలు.. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్పుడే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఇదంతా బీజేపీ కావాలనే చేస్తోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. ఈ ప్రక్రియ ఇప్పుడే కొత్తగా చేపడుతోంది కాదంటూ కౌంటర్ ఇస్తోంది కమలదళం.
- Shaik Madar Saheb
- Updated on: May 17, 2026
- 9:40 pm