బీఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది.
ఇంకా చదవండినదీ జలాలపై మళ్లీ రాజకీయం..! మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. ఆగస్టు 18న ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గోదావరి జలాల వివాదం మరోసారి వేడెక్కింది. ఆగస్టు 18న జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం చుట్టూ రెండు రాష్ట్రాల్లో రాజకీయ హీట్ పెరిగింది. తెలంగాణలోని ఏడు సాగునీటి ప్రాజెక్టులపై పునస్సమీక్ష, కాళేశ్వరం నీటి సామర్థ్యం, సమ్మక్కసాగర్ అనుమతులు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వంటి అంశాలపై ఏపీ లేవనెత్తిన డిమాండ్లు చర్చకు రానున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Aug 13, 2026
- 9:48 pm
KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ ప్రకటించిన రూ.2.25 కోట్ల ఆర్థిక సాయంలో భాగంగా కుమారుడు, కుమార్తెకు చెరో రూ.కోటి, తల్లిదండ్రులకు రూ.25 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందించారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 9, 2026
- 7:52 pm
పాదయాత్రల నుంచి పబ్లిక్ సర్వీస్ వరకు… మారుతున్న రాజకీయాల కొత్త ఫార్ములా!
ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజల మనసు గెలవాలంటే పాదయాత్రే ప్రధాన ఆయుధంగా ఉండేది. వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ద్వారా నాయకులు తమ రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకునేవారు. కానీ కాలం మారుతోంది... రాజకీయ కమ్యూనికేషన్ కూడా మారుతోంది. ఇప్పుడు జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, మహిళా సమావేశాలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావడం వంటి కొత్త పద్ధతులు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. మరి నిజంగానే పాదయాత్రల యుగానికి ప్రత్యామ్నాయం వచ్చిందా?
- Siva Nagaraju
- Updated on: Aug 2, 2026
- 7:53 am
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు!
బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చింది. ఆయనకు గుండెపోటు రావడంతో ఆదివారం (జూలై 26) తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2026
- 11:27 am
తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ.. జీరో ఫోబియా.. ఏ పార్టీలకు..?
మొదటి నుంచీ తెలంగాణ రైజింగ్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ, డెవలప్మెంట్ సబ్జెక్ట్లో భిన్నాభిప్రాయాలుంటే ఉండొచ్చు. పొలిటికల్గా మాత్రం తెలంగాణ రైజింగే..! దీంతో టాప్గేర్లోకి వచ్చాయి మూడు పార్టీలు. ఎవరి బ్యాటింగ్ వాళ్లు ఆడుతూ, స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. మూడు పార్టీల మధ్య ఒక నంబర్గేమ్ కూడా మొదలైంది. దంగల్ 2028.. కాదు.. కాదు.. తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ అయ్యింది. డీటెయిల్డ్గా చూద్దాం..
- Balaraju Goud
- Updated on: Jul 17, 2026
- 10:46 pm
ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్పోర్ట్కు ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ చారిత్రక నగరం, ఐటీ - పారిశ్రామిక హబ్గా వేగంగా ఎదుగుతున్న ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ శంషాబాద్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగిన మామునూరు ఎయిర్పోర్ట్ పునఃప్రారంభ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది.
- Balaraju Goud
- Updated on: Jul 16, 2026
- 12:01 am
Telangana: జెండాకో ఇరిగేషన్ ఎజెండా..! ఈసారి చిచ్చు పేరు కన్నెపల్లి మోటార్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ను కేంద్రంగా చేసుకుని తెలంగాణలో సాగునీటి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. పంపులను వెంటనే ఆన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, డ్యామ్ భద్రతా కారణాల వల్ల ఇప్పుడే నీటి ఎత్తిపోతలు సాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ వివాదంలో బీజేపీ కూడా రంగంలోకి దిగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 6, 2026
- 9:50 pm
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. పోలీసుల అదుపులో హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు!
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పీక్స్కు తీసుకెళ్లాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని రూ. 7 లక్షల కోట్ల అప్పులపై చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్కు.. కేటీఆర్, హరీశ్రావు ఇద్దరూ కలిసి గన్పార్క్కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, గురుకులాల విద్యాశాఖలో జరిగిన అవినీతి, కొనుగోళ్లపై కాంగ్రెస్ మంత్రులు చర్చకు సిద్ధమవడంతో హైదరాబాద్ ఒక్కసారిగా అట్టుడికిపోయింది.
- Balaraju Goud
- Updated on: Jul 2, 2026
- 11:53 am
తెలంగాణ పాలిటిక్స్లో ‘11 AM’ హైటెన్షన్: ఒకే ముహూర్తం.. మూడు వేదికలు.. ‘సై’ అంటే ‘సై’ అంటున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్!
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పీక్స్కు తీసుకెళ్లాయి. నిన్నటివరకు కేవలం ప్రెస్ మీట్లు, ట్వీట్లకే పరిమితమైన విమర్శల పర్వం.. ఇప్పుడు "ఇవాళ ఉదయం 11 గంటల" డెడ్లైన్కు చేరింది. ముహూర్తం ఒక్కటే అయినప్పటికీ, నేతలు కొట్లాడేందుకు ఎంచుకున్న వేదికలు మాత్రం మూడు కావడం విశేషం. అటు తెలంగాణ భవన్, ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మరోవైపు గన్ ఫౌండ్రీ అమరవీరుల స్థూపం.. ఎక్కడ చూసినా 11 గంటల సమయం చుట్టూనే ఉత్కంఠ తిరుగుతోంది.
- Balaraju Goud
- Updated on: Jul 2, 2026
- 10:49 am
Telangana Politics: రేవంత్ అండ్ కిషన్..! మధ్యలో మెట్రో రైల్.. ఎవరి ఎత్తుగడలు వాళ్లవే
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కలిసి మెట్రో ప్రాజెక్టుపై చర్చించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్-బీజేపీ మధ్య అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నామని ఇరు పార్టీలు చెబుతున్నాయి. మెట్రో నుంచి సింగరేణి వరకు వివిధ అంశాలపై మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 24, 2026
- 9:50 pm
‘టీఆర్ఎస్’ పేరుపై కొత్త ట్విస్ట్.. అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్.. కవిత పార్టీకి బ్రేక్ పడుతుందా?
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి (BRS) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం (ECI) ఆమోదించడంపై పింక్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ అంశంపై వివిధ వ్యక్తులు, సంస్థలు, రాజకీయ వర్గాల నుంచి 600కుపైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 12, 2026
- 12:28 pm
తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనను బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పోల్చుతూ బహిరంగ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాల వంటి కీలక అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. 2028 ఎన్నికల లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 6, 2026
- 9:56 pm