Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఆర్ఎస్

బీఆర్ఎస్

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇంకా చదవండి

కేసీఆర్‌ ఆరోగ్యంపై కీలక ప్రకటన.. హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన యశోద వైద్యులు

హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు చికిత్స కొనసాగుతుంది. KCR ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం KCR ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రకటించారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!

బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతోంది. ఈ అంశంపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పొలిటికల్‌ ఫైట్‌ కొనసాగుతున్నాయి. ఎవరికి వాళ్లు ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసే అంశంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడమే మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ ట్విస్ట్‌లు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రభాకర్ రావు విచారణ తరువాత ఈ కేసు విచారణలో వేగం పెరిగింది. ట్యాపింగ్‌కు బలైంది తామేనని కాంగ్రెస్ చెబుతుంటే.. వాళ్ల కంటే ఎక్కువగా తమ ఫోన్లనే ట్యాప్ చేశారని అంటోంది బీజేపీ..

Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం..

క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసుల రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కాజీపేట కోర్టు.. పాడి కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌ వ్యవహారం..అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రేపుతోంది. రేవంత్‌ సర్కార్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్న బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు.. అంతే ధీటుగా కౌంటర్‌ ఇస్తోంది హస్తంపార్టీ..

Etela Rajender: ఫామ్‌ హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారా..? టీవీ9 ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

కాళేశ్వరంపై విచారణ, బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతలతో తన రిలేషన్‌ గురించి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌- TV9 క్రాస్‌ ఫైర్‌లో ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఫామ్‌ హౌస్‌లో తాను హరీష్‌ రావును కలిశాననే ప్రచారం ఆవాస్తవమని ఈటల రాజేందర్ ఖండించారు. రాజకీయంగా కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉంటానంటూ ఈటల పేర్కొన్నారు.

ఉత్కంఠకు తెర.. కాళేశ్వరంపై కేసీఆర్‌ విచారణ పూర్తి.. కేసీఆర్‌ను కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్పు, NDSA రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్ని్ంచింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందుకు బీఆర్‌ఎస్‌ అధినేత రావడం ఒక్కరోజు హడావుడి కాదిది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి ఇదే చర్చ.. ఇదే రచ్చ..! ఆయనొస్తారా? రారా..? వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్‌ పెడుతూ.. ఎట్టకేలకే కమిషన్‌ ముందుకొచ్చారు కేసీఆర్‌.

KCR: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్.. ఆ భవన్‌కు వెళ్లింది ఇద్దరే.. కాళేశ్వరంపై ముగిసిన న్యాయ విచారణ..

కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను వన్‌ టు వన్‌ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్‌ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు కమిషన్‌ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

KCR: జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ముందుకు కేసీఆర్‌.. లైవ్ వీడియో

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కమిషన్ విచారించనుంది.. బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్కే) లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభంకానుంది. క్రాస్ ఎగ్జామిన్ లో కమిషన్ పలు కీలక వివరాలను అడిగి తెలుసుకోనుంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్.. ఏం చెప్పబోతున్నారు..?

కాళేశ్వరం కమిషన్ విచారణల క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది కమిషన్. బుధవారం(జూన్ 11) ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలందాయి. 5వ తేదీకి బదులు 11వ తేదీన విచారణకు కేసీఆర్ హాజరు అవుతానంటూ లేఖ రాశారు కేసీఆర్. కమిషన్‌కు సమాచారం ఇవ్వడంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది.

ప్రాంతీయం మొదలు.. జాతీయం వరకు.. అలర్ట్‌ అలర్ట్‌.. ఆపరేషన్‌ కోవర్ట్‌!

రాజకీయాల్లో గెలవాలన్నా.. గెలిచి నిలవాలన్నా... ఎత్తులకు పైఎత్తులు వేయడం వచ్చుండాలి. తమ బలాన్ని నమ్ముకోవడం ఒకెత్తయితే.. ఎదుటివారి బలహీనతల్ని పసిగట్టడం, అవతలివైపు లోగుట్టును ఎప్పటికప్పుడు తెలుసుకోవడం.. మరో బలమైన ఎత్తు. సమకాలీన రాజకీయాల్లో.. అన్ని రాజకీయ పార్టీలూ ఇప్పుడ రెండో ఎత్తుగడమీదే ఎక్కువ ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది.