బీఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది.
Telangana Assembly: మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. సభా సమరం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు నడిచింది. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ పలు పశ్నలు సంధించారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 18, 2026
- 10:39 am
Telangana Assembly LIVE: ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ.. గవర్నర్ ప్రసంగం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందుగా.. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 16, 2026
- 12:23 pm
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెండు సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలో సరిపడ బలం లేకపోయినా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Mar 4, 2026
- 10:46 pm
ట్విస్ట్ల మీద ట్విస్ట్లు.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట.. ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..?
మాట ఇచ్చాం మడమతిప్పం అంటున్నారు లోకల్ కామ్రేడ్లు.. కాదు.. కాదు.. కాంగ్రెస్తో కలిసుంటేనే కలదు సుఖం అంటోంది కామ్రేడ్ అదిష్టానం. ఇంత జరిగాక వెనక్కి తగ్గితే ప్రజల్లో చులకన అవుతామంటున్నారు లోకల్ ఎర్రన్నలు. అలా కాదు మరోసారి ఆలోచించండి.. భవిష్యత్ అవసరాల కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదంటోంది ఆ పార్టీ అధినాయకత్వం.
- Naresh Gollana
- Updated on: Feb 20, 2026
- 5:03 pm
Errabelli Dayakar Rao: ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. వీడియో చూశారా..?
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా ముగిసింది. ఈ క్రమంలోనే.. ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. దీంతో మాజీమంత్రికి ఏమైంది. అన్న చర్చ టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. అసలు తొర్రూరులో గతంలో ఏం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతోంది. మీకు తెలియాలా? అయితే ఈ స్టోరీ చూసేయండి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 18, 2026
- 9:22 am
KCR Birthday: బర్త్డే స్పెషల్.. 10 వేల మందితో ఫోటో దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇదిగో వీడియో
పది కాదు ఇరువై కాదు.. ఏకంగా 10వేల మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఫోటో దిగారు మాజీ సీఎం కేసీఆర్. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వాళ్లతో ప్రేమగా మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
- Shaik Madar Saheb
- Updated on: Feb 17, 2026
- 9:22 pm
Telangana: ఇక ఉప్పు నిప్పుల్లేవ్..! మేయర్, ఛైర్మన్గిరి కోసం.. బద్ధ శత్రువుల మధ్య చిగురించిన ప్రేమలు!
ఇట్స్ మిరాకిల్. పొలిటికల్ సైన్స్లో ఇవో విచిత్రమైన సన్నివేశాలు. గతంలో చూసుంటారు.. బట్ అడపాదడపా. కాని, ఒకేసారి, ఒకేపూటలో ఇన్ని రాజకీయ వైచిత్రిలు చూడ్డం బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు.. వాళ్లని ఓడించండి, మాకే ఓటేయండని ప్రచారాల్లో సెగలు కక్కుకున్న పార్టీలు.. ఇలా కలిసిపోయి అధికారం పంచుకుంటాయని ఎవ్వరూ ఊహించరు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 16, 2026
- 9:49 pm
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. !
తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసి మూడు రోజులు అవుతున్నా పొలిటికల్ డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే.. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఐదు మున్సిపాలిటీలు.. హంగ్ పాలిటిక్స్తో హీట్ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య క్యాంప్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి.
- G Peddeesh Kumar
- Updated on: Feb 15, 2026
- 7:39 pm
Nizamabad Municipal Election Result: రెండోసారి కమలం చేజారిన ఇందూరు పీఠం.. మజ్లిస్తో కలిసి మేజిక్ ఫిగర్..!
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
- Diwakar P
- Updated on: Feb 15, 2026
- 4:16 pm
Nalgonda Municipal Election Result: సఫాయి కార్మికురాలుగా సేవ చేసిన చోటే.. నేడు కౌన్సిలర్గా ప్రజా సేవ..!
ఆమె ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా పని చేశారు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదేశాల మేరకు పనిచేసింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30ఏళ్లు తన సేవలు అందించింది. ఆమె ఇపుడు మరో రూపంలో తన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. తొలుత నేరేడుచర్ల గ్రామ పంచాయతీ, ఆ తర్వాత ఏర్పడిన మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలుగా 30 ఏళ్లుగా చేసింది.
- M Revan Reddy
- Updated on: Feb 14, 2026
- 11:09 am
Telangana Municipal Election Results: ఒక్క ఓటు మ్యాజిక్.. అభ్యర్థుల జీవితాలనే మార్చేసింది..!
పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్కట్గా ఉంది. రూలింగ్ పార్టీకే జైకొట్టింది. నంబర్ల విషయంలో నో కన్ఫ్యూజన్. కానీ, పట్టణ ఓటరు మాత్రం పెద్ద పజిలే పెట్టేశాడు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు, అలాగని ఏ పార్టీనీ నిరుత్సాహపర్చలేదు మున్సిపల్ ఫలితం. ఓవరాల్గా పురపోరు ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది.
- Balaraju Goud
- Updated on: Feb 14, 2026
- 8:16 am
కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో దుమ్మురేపిన కాంగ్రెస్.. చిట్యాలలో ప్రత్యేక విజయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026లో కాంగ్రెస్ పార్టీ 800 వార్డులు దాటి భారీ ఆధిక్యాన్ని సాధించింది. నల్గొండ జిల్లా చిట్యాలలో, ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థి కావేరి (సుధాకర్) వార్డు 1లో చారిత్రాత్మక విజయం సాధించారు, ఇది సమాజంలో మార్పునకు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన కౌంటింగ్లో కాంగ్రెస్ హవా కొనసాగింది.
- Jyothi Gadda
- Updated on: Feb 13, 2026
- 4:21 pm