బీఆర్ఎస్

బీఆర్ఎస్

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇంకా చదవండి

Watch Video: ప్రధాని మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి? బండి సంజయ్‌పై వినోద్ ఫైర్

కరీంనగర్‌ అవసరాలు గురించి ఒక్కటంటే ఒక్కటి ప్రధాని మోదీ ముందు ప్రస్తావించలేని స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి రానున్న ఎన్నికల్లో ప్రజలెందుకు ఓటేయాలని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గర నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి బీజేపీ ఎంపీ పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు.

Telangana: ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష.. మెజార్టీ కోల్పోతే ఇక అంతే సంగతులు..

ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‎పై జెండా ఎగరువేయాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విశ్వప్రయత్నాలు‌ చేస్తున్నాయి. బీఆర్ఎస్ సైతం మేము రేసులోనే ఉన్నామంటూ దూసుకొస్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తుంటే.. ఇంచార్జ్ మంత్రి‌ సీతక్క వ్యూహరచనతో కాంగ్రెస్ సైతం సై అంటే సై అంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నిలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నిక సవాల్‎గా మారింది. కార్యకర్తలు కష్టపడుతున్నా.. అక్కడక్కడా వినిపిస్తున్న అసమ్మతి రాగంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి మూడు పార్టీల్లోను‌ కనిపిస్తోంది.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే తొలి ప్రాధాన్యత దేనికో చెప్పేసిన మంత్రి కోమటి రెడ్డి..

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ 10ఏళ్లు ఆదాని అంబానీలకు దోచి పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‎లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మాది డబుల్ RR కాదు.. మీది AA టాక్స్ ఆదాని, అంబానీ టాక్స్ అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‎కు 14, బిజేపికి 2 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్కటి గెలవదన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడటం సుద్దదండగ అన్నారు. అగ్గిపెట్టే రావు హరీష్, కేటీఆర్‎లను ఘాటుగా విమర్శించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 2:51 pm

PM Modi: ‘ఏడాదికో ప్రధాని’.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు.

ఎన్డీయే విజయం మొదటి మూడు విడతల్లోనే తేలిపోయిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 1:52 pm

PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్ RRR సినిమాను మించిపోయింది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

శివుడి సన్నిధిలో మోదీ నిప్పులు చెరిగారు. బీజేపీ వేములవాడ సభలో కాంగ్రెస్‌, BRSపై ప్రధాని మోదీ చెలరేగిపోయారు. తెలంగాణ గట్టు మీద తమ ప్రత్యర్థులిద్దరూ ఒక్కటేనని చాటడానికి ఉదాహరణలు, పంచ్‌లతో ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కలెక్షన్లలో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాని డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ మించిపోయిందని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.

KTR: బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేసీఆర్ రాజకీయాలను శాసించే రోజులు మళ్లీ వస్తాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూకుడు పెంచింది. ఓ వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాక్యలు చేశారు. పదేళ్ల నిజం కేసీఆర్, పదేళ్ల విషం బీజేపీ, వంద రోజుల అబద్ధం కాంగ్రెస్.. అంటూ విమర్శించారు.

ఆ ఇద్దరు మాజీ మంత్రులకు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకం.. గెలిస్తే వలసలు ఆగిపోతాయా..?

ఇద్దరు మాజీ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ లోక్ సభ స్థానంలో వారి ప్రభావం ఎంత మేర ఉండనుంది..? అధికారం కోల్పోయిన తరువాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.? నిన్న మొన్నటి వరకు రూలింగ్‎లో ఉన్న ఆ ప్రతినిధులు ఇద్దరూ కూడా తమకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న వారే కావడంతో ఈ ఎన్నికల్లో వీరు ఎంత మేర సక్సెస్ అవుతారన్న చర్చ సాగుతోంది.

’12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం’.. మాజీ మంత్రి కేటీఆర్..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. దీంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా హీటెక్కిస్తోంది. నేతల మధ్య హాట్ హాట్‌గా విమర్శలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ హామీలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 తమ అకౌంట్లో వేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 8:26 am

‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే’.. ప్రచారంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్. 48 గంటల తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ వీణవంకలో పర్యటించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుందని తెలిపారు. కేవలం నాలుగు అయిదు నెలల్లోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుది వరకు కొనసాగదన్నారు.

  • Srikar T
  • Updated on: May 5, 2024
  • 9:52 pm

Nizamabad politics: మండుటెండలో మరింత సెగలు పుట్టిస్తున్న నిజామాబాద్ పాలిటిక్స్.. త్రిముఖ పోరులో గెలిచేదెవరు?

నిజామాబాద్‌లో ఓ వైపు భానుడి ప్రతాపానికి ఊష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతుంటే, మరోవైపు పార్లమెంట్ పరిధిలో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది.. పార్టీల అభ్యర్దులు ఒకరిపై ఒకరు మాటాల తూటాలు పేలుస్తూ వేడి సెగలు పుట్టిస్తున్నారు. ప్రచారంలో స్పీడు పెంచిన నేతలు అదే స్దాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

Watch Video: సాయంకాలం.. సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు..

ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుండి భూంపల్లికి వెళుతున్న సమయంలో కారు ఆపారు హరీష్ రావు. అక్కడ పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్ద దిగి సామాన్యునిగా బాబు ఒక దోస వెయ్ అంటూ.. దోస వేయించుకొని తిన్నారు. అక్కడ ఉన్న ప్రజలు, యూత్ ని ఒక్కసారిగా అశ్చర్యానికి గురి చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును చూసిన జనం.. అగొ హరీష్ సార్ అంటూ ఫోన్‎లో టిఫిన్ చేస్తున్న ఫోటో క్లిక్ మనిపించారు.

  • Srikar T
  • Updated on: May 4, 2024
  • 7:54 pm

‘కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?’.. కాంగ్రెస్,‎ బీజేపీపై మాజీమంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు..

8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయని.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నాట్లు తెలిపారు.

  • Srikar T
  • Updated on: May 4, 2024
  • 5:29 pm

Watch Video: ‘ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక’.. మాజీ మంత్రి హరీష్ రావు..

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‎ను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవన్నారు. ఏన్నో ఏళ్లుగా ఢిల్లీలో పోరాడి, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గతాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మాదని, దీనిని మరికొన్ని రోజులు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారన్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 8:29 pm

KCR Tour: నిషేధం తర్వాత జనంలోకి కేసీఆర్… పద్దతిగా మారేనా? మరింతగా డోసు పెంచుతారా ?

48 గంటల నిషేధం తర్వాత ఇవాళ మళ్లీ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. అయితే ఇకపై పద్దతిగా మాట్లాడతారా? లేక మరింతగా మాటల డోసు పెంచుతారా ? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు కేసీఆర్‌ ప్రచారం చేయకుండా 48 గంటల బ్యాన్‌ విధించడం బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర అంటున్నారు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు

Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. కాంగ్రెస్ నుంచి పోటీలో కీలక నేత..

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9 వరకూ కొనసాగనుంది. ఈ నెల13 తేది వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా, ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.