బీఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు!
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు టాప్ గేర్లోకి వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే BRS మాజీ MLAలు జైపాల్యాదవ్, చిరుమర్తి లింగయ్యను విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి హరీష్రావుకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది.
- Anand T
- Updated on: Jan 19, 2026
- 8:57 pm
ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.. ఇదే చివరి అవకాశం.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సమయం ఇచ్చినా.. ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్కు మరో అవకాశం ఇచ్చింది..
- Balaraju Goud
- Updated on: Jan 16, 2026
- 12:33 pm
Telangana: వాళ్లిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే.. పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్ గడ్డం ప్రసాద్
పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టంచేశారు. ఇద్దరిని BRS ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు..
- Shaik Madar Saheb
- Updated on: Jan 15, 2026
- 3:43 pm
KCR: కష్టపడి చదవండి.. తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక భరోసా
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కాలేజ్ పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాలకు గాను ఆర్థికసాయం అందించి భరోసా కల్పించారు. వారికి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
- P Shivteja
- Updated on: Jan 9, 2026
- 12:24 pm
MLC Kavitha: ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ వేదికైంది.. మండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లు..
శాసనమండలిలో బీఆర్ఎస్పై కవిత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తన రాజీనామా ఆమోదానికి ముందు మండలిలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన కవిత.. భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను ఎమ్మెల్సీ కవిత సమగ్రంగా వివరించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 5, 2026
- 1:48 pm
Telangana Assembly Live: కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీ సమావేశాలు లైవ్
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. హిల్ట్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది.. అలాగే.. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా, గోదావరి జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 3, 2026
- 3:08 pm
కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య PPT వార్.. ఇవాళ పోటాపోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు
నీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వార్ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి.
- Balaraju Goud
- Updated on: Jan 3, 2026
- 8:51 am
మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ షురూ.. స్వయంగా 4బిల్లులు ప్రవేశ పెట్టబోతున్న సీఎం రేవంత్
మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ గెజిట్ నోటిఫికేషన్లు కూడా సభ ముందు ఉంచుతారని సమాచారం.
- Balaraju Goud
- Updated on: Jan 2, 2026
- 10:18 am
Telangana Assemly: దుమ్ముదుమారమే..! అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మంత్రి శ్రీధర్బాబు ఏమన్నారంటే..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్ట్లపై చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే హాట్టాపిక్గా మారాయి.. ఇందుకు కారణం అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం.. కేసీఆర్ అటెండ్ అవుతారా? లేదా?అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 29, 2025
- 7:25 am
వదలొద్దు.. ప్రతిమాటను తిప్పికొట్టండి.. మంత్రుల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వదలొద్దూ.. ప్రతిమాటను తిప్పికొట్టిండి.ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ZPTC, MPTC, GHMC ఎన్నికల్లో రిజల్ట్స్ అంతకు మించి వుండాలన్నారు. లడాయి మొదలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ జోరందుకుంది.
- Prabhakar M
- Updated on: Dec 23, 2025
- 8:13 am
KCR: చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్..
బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. చెక్డ్యామ్లు బాంబులు పెట్టి పేలుస్తారా అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పేల్చినోడు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారన్న కేసీఆర్.. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని నేతలకు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లిచ్చామన్న కేసీఆర్..90 శాతం పూర్తయిన పాలమూరును..ఇంకా ఎందుకు పూర్తి చేయలేదో ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు.
- Ram Naramaneni
- Updated on: Dec 21, 2025
- 5:52 pm
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కారెక్కనున్న కేసీఆర్.. తెలంగాణ భవన్కు గులాబీ బాస్..!
మళ్లీ యాక్టివ్ అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు ఒకే ఎత్తు ఇకనుంచి తెలంగాణ రాజకీయాల్లో మరో ఎత్తు అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వెరీ వెరీ స్పెషల్. ఆయన స్పీచ్కు లక్షల్లో వ్యూయర్స్ ఉంటారు. తెలంగాణ ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి హోదా వరకు అన్ని పదవుల్లోనూ ఆయన స్టైల్ వేరు. అలాంటి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండేళ్లుగా సైలెంట్గా ఉండిపోయారు.
- Rakesh Reddy Ch
- Updated on: Dec 19, 2025
- 9:05 pm