బీఆర్ఎస్

బీఆర్ఎస్

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇంకా చదవండి

Congress – BRS: బీఆర్ఎస్‌ విలీనంపై కోమటిరెడ్డి కామెంట్స్‌ వెనుక ఉన్న అర్థం ఏంటి?

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..? కాంగ్రెస్ నేతల కామెంట్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేల జాయినింగ్స్‌తో బీఆర్ఎస్‌ఎల్ఎపీ.. కాంగ్రెస్‌లో విలీనం ఖాయమని చెప్తూనే.. మరోవైపు.. బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారుతోంది.

KCR: ఈ రంగాలపై ప్రభుత్వం పాలసీ ఏంటి.. బడ్జెట్‎పై కేసీఆర్ కౌంటర్..

తెలంగాణ బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. భట్టి పద్దు బడ్జెట్‌‌లాగా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్‎ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప వాస్తవం లేదన్నారు. రాష్ట్రం మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకశంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది అని కౌంటర్ ఇచ్చారు.

  • Srikar T
  • Updated on: Jul 25, 2024
  • 3:31 pm

Telangana Budget: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అయితే సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడామన్నారు.

BRS Project Tour: మరోసారి పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచే షురూ..!

కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశం అనంతరం బయల్దేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర హాట్‌ టాపిక్‌గా మారింది.

KTR: బర్త్ డే సందర్భంగా మానవత్వం చాటుకున్న కేటీఆర్.. ఏం చేశారంటే..

తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మరోసారి మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు, వారి పిల్లల విద్యా, భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు.

Telangana: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. బడ్జెట్ రోజు హాజరుపై వ్యూహం ఇదేనా.?

అసెంబ్లీకి కేసీఆర్ రావడం కొత్త కాదు కదా అని షాక్ అవుతున్నారా? ఆయన అసెంబ్లీకి కొత్తేమీ కాదు కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి అడుగుపెట్టడం మాత్రం మొదటిసారి. ఉద్యమ సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగాలను చాలామంది విన్నారు. ఆయన ప్రసంగాలు అన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉండేవి. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పదేళ్లపాటు అసెంబ్లీలో అనేక అంశాలపై కొన్ని వందల గంటలు మాట్లాడారు.

Telangana: ‘అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం’.. కేంద్ర బడ్జెట్‎పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. రేపు పార్లమెంటు‎లో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా? అని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం రేవంత్.. రాహుల్ గాంధీతో పార్లమెంటులో మాట్లాడించాలన్నారు. అలాగే ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు.

  • Srikar T
  • Updated on: Jul 23, 2024
  • 6:52 pm

KTR: తెలంగాణకు మరోసారి గుండు సున్నా.. చంద్రబాబు కేంద్రాన్ని శాసిస్తున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం చేసింది.. ఆర్థిక మంత్రి కనీసం తెలంగాణ పేరును కూడా పలకలేదు.. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకీ నిర్లక్ష్యం?.. పునర్విభజన చట్టం అంటే ఏపీ ఒక్కటే కాదు.. ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలి.. ఏపీకి నిధులిస్తే మాకేం బాధలేదు.. అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ కేటీఆర్‌ పేర్కొన్నారు.

Telangana: రేపే అసెంబ్లీ సమావేశాలు.. తొలిసారి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు..

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్‎ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.

  • Srikar T
  • Updated on: Jul 22, 2024
  • 10:08 pm

Watch Video: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వారికే అప్పగించాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉత్తంకుమార్ రెడ్డి.. గత ప్రభుత్వం ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాజెక్టులను గుర్తు చేశారు.

  • Srikar T
  • Updated on: Jul 20, 2024
  • 9:00 pm

Telangana: ఫిరాయింపులపై గవర్నర్‎కు కేటీఆర్ ఫిర్యాదు.. కాకరేపుతున్న రాజకీయం..

ఫిరాయింపులు ఔర్‌ ఫిర్యాదులతో తెలంగాణ రాజకీయం కాక రేపుతోంది. మాంచి వర్షాకాలంలో కూడా వేడి పుట్టిస్తోంది. ఇది పార్టీని కాపాడుకునే టైమ్‌.. కంప్లయింట్‌ టైమ్‌ అంటోంది బీఆర్‌ఎస్‌. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులకు గులాబీ పార్టీ దండు కట్టింది. చలో రాజ్‌భవన్‌ అంటూ కేటీఆర్‌ నేతృత్వంలో గవర్నర్‌ని కలిశారు నేతలు.

  • Srikar T
  • Updated on: Jul 20, 2024
  • 8:21 pm

Telangana: కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరుకు భారతీయ జనతా పార్టీ సన్నద్దమవుతోంది. వందరోజుల హామీలు 8 నెలలైన అమలు చేయకపోగా.. డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలను వంచించారంటూ టీబీజేపీ నిరసన సభలకు సన్నాహకాలు చేస్తోంది.

Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్.. ఈ అంశాలపై చర్చ అప్పుడే..

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ అధికారికంగా వెలువరించారు. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలుతో పాటూ పాలనపై కూడా ఫోకస్ పెట్టింది.

  • Srikar T
  • Updated on: Jul 18, 2024
  • 6:22 pm

Crop Loan Waiver Scheme: రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. ముందు రుణమాఫీ వాళ్లకే.. రేషన్ కార్డుపైనా ఫుల్ క్లారిటీ..

రూ.2లక్షల రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.. కొన్ని వివరణాత్మక అంశాలతో రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి.. నోడల్ అధికారి నేతృత్వంలో రూ. 2లక్షల రుణమాఫీ అర్హులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది.

Asaduddin Owaisi: బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారా..? బయటినుంచి మద్దతిస్తారా..? అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని, లేదంటే బీజేపీకి బీఆర్‌ఎస్‌ బయటనుంచి మద్దతిస్తుందని ప్రముఖ మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ వార్తలపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!