AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఆర్ఎస్

బీఆర్ఎస్

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇంకా చదవండి

SIRపై తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు.. బీజేపీ కౌంటర్

ఓట్లపై బీజేపీ కుట్రలు.. ఆపండి మీ డ్రామాలు.. తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్పుడే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఇదంతా బీజేపీ కావాలనే చేస్తోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. ఈ ప్రక్రియ ఇప్పుడే కొత్తగా చేపడుతోంది కాదంటూ కౌంటర్ ఇస్తోంది కమలదళం.

KCR: కష్టపడే వారికే పదవులు.. వచ్చే రెండేళ్లు బీఆర్ఎస్‌కు చాలా కీలకం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

వచ్చే రెండేళ్లు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమని పార్టీ చీఫ్ కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. పనిచేసే వారికే పార్టీ పదవులు ఇవ్వాలని స్పష్టం చేసిన కేసీఆర్.. రైతులు, యువత, విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

కేసీఆర్‌కు ఇష్టమైన కమ్మటి కూర ఇదే.. ఇలా వండితే క్షణాల్లో గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందే

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇష్టమైన వంటకాల్లో పాలకూర పప్పు ఒకటి.. ఆయన ఎక్కువగా పాలకూర పప్పును ఇష్టపడతారని నేతలు చెబుతుంటారు. ఎన్నో పోషకాలు నిండిన పాలకూర పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఈ రుచికరమైన పప్పును ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. తెలంగాణ స్టైల్లో పాలకూర పప్పు తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకోండి.

TRS టు BRS.. కేసీఆర్ ఉద్యమ పార్టీకి పాతిక వసంతాలు..

తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన గులాబీ పార్టీ పాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. జలదృశ్యంలో 2001లో మొదలైన TRS పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ జనదృశ్యాన్ని సాక్షాత్కారం చేసింది. తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు BRSగా మారి పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుంది.

Telangana: రేవంత్‌, కేసీఆర్.. మధ్యలో బీజేపీ.. వార్‌ జోన్ షురూ అయినట్టేనా?

ముఖ్యంగా రేవంత్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్‌ని టార్గెట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పథకాల్ని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేశారు. ఒక్కో పథకాన్ని గుర్తు చేస్తూ పాయింట్‌ టూ పాయింట్ నిగ్గదీసే ప్రయత్నం చేశారు. జనం కూడా రేవంత్‌ ప్రభుత్వంపై మొహం మొత్తి, తన రీఎంట్రీని కోరుకుంటున్నారు అన్నట్టుగా సాగింది కేసీఆర్‌ స్పీచ్.

KCR Live: జగిత్యాల నుంచే జైత్రయాత్ర.. 100 శాతం మళ్లీ BRS ప్రభుత్వం వస్తుంది: కేసీఆర్

అప్పుడెప్పుడో BRS రజతోత్సవ సభలో దర్శనమిచ్చిన కేసీఆర్‌... అడపాదడపా అగుపించినా ప్రజాక్షేత్రంలోకి మాత్రం పూర్తిస్థాయిలో రాలేదు.. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో ఆయన మరోసారి... జనంలోకి వస్తుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని షేక్‌ చేస్తోంది. అందులోనూ... కాంగ్రెస్‌తో 40ఏళ్ల జర్నీకి పుల్‌స్టాప్‌ పెట్టేసి.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి BRSలో చేరుతున్న సందర్భంలో ఏర్పాటు చేస్తున్న భారీ చేరిక సభ ఇది. ఒకరకంగా చెప్పాలంటే.. ఉత్తర తెలంగాణలో కారు పార్టీకి ఊపు తీసుకొచ్చే మీటింగ్‌గా గులాబీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి.

కాకరేపుతోన్న కరీంనగర్ పాలిటిక్స్.. ఒకేరోజు ఇద్దరూ.. తూర్పున సీఎం రేవంత్.. పశ్చిమాన మాజీ సీఎం కేసీఆర్..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ తూర్పున రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే, పశ్చిమ దిశలో కేసీఆర్ సభ ఖరారైంది.

Special Parliament Session: డీలిమిటేషన్‌.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది..

మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న 'ఫార్ములా'నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.

బీఆర్ఎస్‌గా మారాక నష్టపోయాం.. మళ్లీ టీఆర్ఎస్‌గా ఉండాలనుకుంటున్నాంః కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయన సిద్ధం చేసిన కార్యాచరణను ఈ సందర్భంగా బయటపెట్టారు. పార్టీని తిరిగి 'టీఆర్ఎస్'గానే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఆ దేవుడే మీతో కలిసి పని చేయమని పంపాడంటూ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం!

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు పార్టీలో చేరబోతున్నారు. గులాబీ కండువ కప్పుకోనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసిన జీవన్ రెడ్డి.. శుక్రవారం (ఏప్రిల్ 10) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో కలిశారు. ఎర్రవల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పార్టీ నేతలు స్వాగతం పలికారు.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

శ్రీపరాభవ నామ సంవత్సరంలో పరాభవం జరగని పార్టీలోకి వెళ్తానన్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఇవ్వడం లేదని.. తన సీనియార్టీని గుర్తించడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. తాజా రాజకీయాలపై చర్చించారు.

దోమ.. చూడ్డానికి చిన్నజీవే.. దోమల దండయాత్రపై తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ..!

ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి తీసిన ఈగ సినిమాలో కంటే హైదరాబాద్ జనాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి దోమలు. గతంలో ఒక సీజన్‌కు మాత్రమే పరిమితమైన దోమలు.. ఇప్పుడు సంవత్సరంలో 365 రోజులు.. రోజుకు 24 గంటలూ కుట్టికుట్టి పగ తీర్చుకుంటున్నాయి. అటు ప్రతిపక్షం సైతం దోమల దండయాత్రపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.