AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఆర్ఎస్

బీఆర్ఎస్

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇంకా చదవండి

Telangana: వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవు.. MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం..

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన MLAల అంశంపై స్పీకర్‌ విచారణ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తున్న క్రమంలో ఇవాళ స్పీకర్‌ గడ్డం ప్రసాద్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఫిరాయింపు MLAల కేసులో తెలంగాణ స్పీకర్‌ కీలక తీర్పును వెలువరించారు.

రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. చిన్న చిన్న ఉద్రిక్తతల మధ్య ప్రశాంతం!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో విడతలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 14) జరిగిన రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి.ఎన్నికల్లో ఓ సర్పంచ్‌ అభ్యర్థి భర్త మిస్సింగ్ మిగతా అభ్యర్థులను టెన్షన్ పెట్టింది.

పంచాయతీ ఎన్నికల బరిలో 95 ఏళ్ల నవ యువకుడు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువగా యువకులు పోటీ చేస్తున్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి అని చాలా మంది చెబుతున్నారు కూడా.. కానీ 95 ఏళ్ల వ్యక్తి మాత్రం.. తాను యువతతో పాటు పోటీపడతా అంటూ సర్పంచ్ ఎన్నికల బరిలో నిల్చున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో యువతను ఢీ కొట్టేందుకు 95 ఏళ్ల నవ యువకుడు బరిలోకి దిగాడు. ఆ నవ యువకుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

KCR: మంచిరోజులు వస్తాయ్.. అధైర్యపడొద్దు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తనను కలిసిన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. అన్ని రోజులు మనవి కావని.. కష్టాలను చూసి అధైర్యపడొద్దని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

Telangana: ‘దిష్టి’చుక్క .. దీనికుందో లెక్క..! నిత్యం రగులుతూనే ఉన్న తెలంగాణ సెంటిమెంట్..

ఇంతకీ.. ఏం జరిగింది అక్కడ? తెలంగాణ టాపిక్ ఎందుకొచ్చింది? కోనసీమ అంటేనే కొబ్బరిచెట్లకు నెలవు. ఆ అందం అద్భుతం. కాని, క్రమంగా ఆ ఛాయలు తగ్గిపోతున్నాయి. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. కొబ్బరి చెట్టు పైభాగం రాలిపోయి ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. సముద్రపు ఆటుపోటులే..

Telangana: రక్తపాతాలు జరిగిన చోట వెల్లివిరిసిన సామరస్యం.. సర్పంచ్ పదవి ఏకగ్రీవం..

కత్తులు దూసిన ఆ గ్రామంలో అంతా ఒక్కతాటిపైకి రావడంతో శాంతి విరాజిల్లింది.. ఐక్యతా రాగంతో.. సర్పంచ్ పదవికి ఓ మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో.. ఆ గ్రామం చరిత్రలో నిలిచింది.. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని కలకోట గ్రామం.. ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. అనేలా.. గ్రామస్థులందరూ కలిసి రావడం గమనార్హం..

పల్లెల్లో ‘పంచాయతీ’ సందళ్లు.. ఊరుఊరంతా ఒకటే గుసగుస..! ఇంతకీ ఊరికి మొనగాడు ఎవరు?

సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు.. తమలో ఒకరిని 'ప్రెసిడెంట్'ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. స్వపరిపాలనకు అసలైన అర్ధం ఈ సర్పంచ్ ఎన్నికలు. బట్.. ఇప్పుడా పరిస్థితి లేదనుకోండి. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అవుతున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధుల కూడా రాజకీయ పార్టీల అండదండలు కోరుకుంటున్నారు. పార్టీల జోక్యం ఉంటోంది కాబట్టే ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. సో, ఊళ్లల్లో పైచేయి 'చేతి' గుర్తుదా, కారుదా, కమలమా, సుత్తికొడవలా, కంకి కొడవలా, పతంగినా.. ఎవరు బలపరిచిన అభ్యర్ధి గెలుస్తాడనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఇంతకీ.. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి ఎలా ఉంది?

జూబ్లీహిల్స్ కౌంటింగ్‌కు పగడ్బందీ ఏర్పాట్లు.. ఫైనల్ రిజల్ట్ వచ్చేదీ ఎప్పుడంటే..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలే సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బాక్స్‌లు ఓపెన్ కాబోతున్నాయి. కౌంటింగ్ కోసం ఈసీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇంతకీ.. ఎన్ని రౌండ్లలో కౌంటింగ్ ఉండబోతోంది? ఫైనల్ రిజల్ట్ రావడానికి ఎంత టైమ్ పట్టొచ్చు? భద్రతా ఏర్పాట్ల సంగతేంటి?

యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర హైటెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్

ఎన్నికల నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట‌్లు వేసేవారికి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నారంటూ మాగంటి సునిత వాగ్వివాదానికి దిగారు. పోలీసుల‌కు, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. చ‌నిపోయిన వ్యక్తుల పేరుతో కూడా ఓటేశారని, ఎన్నికల‌ క‌మిష‌న్ ఎలాంటి చ‌ర్యలు తీసుకోవ‌డం లేదని బీఆర్ఎస్ నేతలు మండిప‌డ్డారు.

ఆరోపణలు, విమర్శలతో ప్రశాంతంగా జూబ్లీహిల్స్ పోలింగ్.. ఈసీకి అధికార, విపక్షాల ఫిర్యాదు!

జూబ్లీహిల్స్ ఎన్నికను అటు అధికార పార్టీ.. ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల పార్టీల మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు దిగడంతో పాటు స్థానికేతరులను ప్రచారం కోసం తిప్పుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

Jubilee Hills By-Election: అన్ని పార్టీల అస్త్రం ఇదే.. జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో మార్క్‌ మేటర్స్‌..

హైదరాబాద్‌ అభివృద్ధిపై.. జూబ్లీహిల్స్‌ మే సవాల్‌ అంటున్నాయి కాంగ్రెస్‌, BRS, BJP. జూబ్లీహిల్స్‌ బైపోల్స్‌లో, డెవలప్‌మెంట్‌ మార్క్‌ మేటర్స్‌ అంటున్నాయి. మార్పు మార్కు చూసి ఓటెయ్యండి అని అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అభివృద్ధి చుట్టూనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌ రాజకీయం నడుస్తోంది.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ చౌరస్తాలో మార్మోగుతున్న అన్నగారి పేరు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహం మామూలుగా లేదుగా..

జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అన్నగారి పేరు పదేపదే ప్రస్తావిస్తున్నాయి. అసలు జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ పేరు ఎందుకు వచ్చింది..? అటు కాంగ్రెస్‌.. ఇటు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి..? అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో చర్చనీయాంశంగా మారింది.