Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే…!

నకిలీ నోట్ల చలామణి విషయాన్ని కొందరు వ్యాపారులు రాచకొండ చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. చౌటుప్పల్ సంస్థ నారాయణపూర్ ప్రాంతాల్లో వ్యాపారులు సంత జరిగిన ప్రాంతాల్లో సిసి ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి నకిలీ కేటుగాళ్ళను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి సూచించారు.

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే...!
Fake Currency Notes
Follow us
M Revan Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 26, 2024 | 6:08 PM

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం రేపాయి. నకిలీ నోట్లు ముద్రించి కొందరు దుండగులు చెలామణి చేస్తున్నారు. సాధారణ కరెన్సీ నోట్లను పోలిన విధంగానే ఉండటంతో సామాన్యులు మోసపోతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో మూడు నాలుగు రోజులుగా పలు చోట్ల నకిలీ వంద, ఐదు వందల నోటు తీసుకుని మోసపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులకు నకిలీ 500 రూపాయల నోట్లు అంటగడుతున్నారు. చిరువ్యాపారులే లక్ష్యంగా నకిలీ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు.

చౌటుప్పల్ సంతలో చిరు వ్యాపారులే లక్ష్యంగా దుండగులు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. చౌటుప్పల్ సంతలో కిరాణా వ్యాపారి, పండ్ల దుకాణందారున్ని ఒకే రోజు గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేశారు.‌ నారాయణపూర్ లోని ఓ కిరాణా షాపు వ్యాపారికి కేటు గాడు నకిలీ 500 రూపాయల నోట్లు ఇచ్చి 50 రూపాయల సబ్బులు తీసుకుని 450 చిల్లర తీసుకుని పోయాడు. మూడు నాలుగు రోజులుగా చౌటుప్పల్ డివిజన్ లో దుండగులు నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నారు. కొందరు వ్యాపారులు నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించి.. తిరస్కరించారు. కొందరు వ్యాపారులు నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించలేక.. తీసుకొని లబోదిబోమంటున్నారు. నకిలీ నోట్ల చలామణి విషయాన్ని కొందరు వ్యాపారులు రాచకొండ చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

చౌటుప్పల్ సంస్థ నారాయణపూర్ ప్రాంతాల్లో వ్యాపారులు సొంత జరిగిన ప్రాంతాల్లో సిసి ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి నకిలీ కేటుగాళ్ళను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డుప్లెసిస్‌ ఎందుకు ఆడటం లేదు? కారణం ఇదే..!
డుప్లెసిస్‌ ఎందుకు ఆడటం లేదు? కారణం ఇదే..!
షార్క్ లేదా మనిషా.. ఈ చిత్రంలో మీరు మొదట చూసిందే మీ వ్యక్తిత్వం..
షార్క్ లేదా మనిషా.. ఈ చిత్రంలో మీరు మొదట చూసిందే మీ వ్యక్తిత్వం..
టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు టీవీ9 కన్నడ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025..
టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు టీవీ9 కన్నడ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025..
సమాజంలో విలువ పెరగాలంటే తప్పనిసరిగా ఇవి పాటించండి..!
సమాజంలో విలువ పెరగాలంటే తప్పనిసరిగా ఇవి పాటించండి..!
పాపకు దొరికిన ఆ రాయి సామాన్యమైనది కాదు.. ఓ అద్బుతం
పాపకు దొరికిన ఆ రాయి సామాన్యమైనది కాదు.. ఓ అద్బుతం
జీవితం చేజారిపోకముందే ఈ అలవాట్లు మొదలుపెట్టండి...
జీవితం చేజారిపోకముందే ఈ అలవాట్లు మొదలుపెట్టండి...
వాట్ ఫో ఆలయాన్నిసందర్శించిన మోడీ బుద్ధ విగ్రహం ప్రాముఖ్యత ఏమిటంటే
వాట్ ఫో ఆలయాన్నిసందర్శించిన మోడీ బుద్ధ విగ్రహం ప్రాముఖ్యత ఏమిటంటే
భారత మార్కెట్‌లో ఈవీ కార్ల క్యూ.. త్వరలో లాంచ్ కార్లు ఇవే..!
భారత మార్కెట్‌లో ఈవీ కార్ల క్యూ.. త్వరలో లాంచ్ కార్లు ఇవే..!
గ్లామర్‎తో చంపేస్తున్న బాలయ్యబ్యూటీ.. బ్యూటిఫుల్ ఫొటోస్
గ్లామర్‎తో చంపేస్తున్న బాలయ్యబ్యూటీ.. బ్యూటిఫుల్ ఫొటోస్
చీరలో శ్రీదేవి.. ఈ జాబిలిని చూస్తే ఆ జాబిల్లే చిన్నబోతుందేమో..
చీరలో శ్రీదేవి.. ఈ జాబిలిని చూస్తే ఆ జాబిల్లే చిన్నబోతుందేమో..