AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ.. ఆ ఓట్లే కీలకం..

శాసనమండలి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌, ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడి కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బిజెపి నుండి ప్రేమేందర్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ.. ఆ ఓట్లే కీలకం..
Mlc Elections
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 07, 2024 | 6:33 AM

Share

శాసనమండలి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌, ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడి కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బిజెపి నుండి ప్రేమేందర్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి గత నెల 27వ తేదీన పోలింగ్ జరిగింది. పట్టభద్రుల నియోజక వర్గంలో మొత్తం 4.63లక్షల ఓట్లు ఉండగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో ఐదో తేదీన కౌంటింగ్‌ కొనసాగుతోంది. రెండు రోజుల పాటు సాగిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో 50శాతం +1 ఓటు అంటే 1,55,095 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ (గెలుపు కోటా) గా నిర్ణయించారు.

కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓటు..

మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థిలేవరూ గెలుపు కోటాను చేరుకోలేకపోయారు. దీంతో రెండవ ప్రాధాన్యమే కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే‌ష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి మధ్య బలమైన పోటీ నడిచింది. ఎలిమినేట్‌ అయ్యే అభ్యర్థులకు వచ్చే ద్వితీయ ప్రాధాన్య ఓట్లే కీలకమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోటా 1,55,095 చేరుకోవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు రావాల్సివుంది. బీఆర్ఎస్ గెలవాలంటే రెండవ ప్రాధాన్యత ఓట్లలో 50,847 ఓట్లు రావాలి. ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Follow Us
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్