మహారాష్ట్రలోని సోనేవాడి పంచాయతీ గ్రామసభ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. భర్తను కోల్పోయిన మహిళలకు వితంతు పింఛన్లు ఉన్నట్లే, భార్యను కోల్పోయి ఆర్థికంగా బలహీనపడిన పురుషులకు కూడా సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని కోరుతూ గ్రామసభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సమానత్వం కోరుతూ చేసిన వినూత్న ప్రయత్నం.