AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Prasadam: ఆస్తమా పేషెంట్స్​కు అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు

మృగశిరకార్తె వస్తుందంటే చాలు ఆస్తమా బాధితులు చేప మందు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.  ఇప్పటికే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు సూచనలు చేశారు బత్తిన సోదరులు.  

Fish Prasadam: ఆస్తమా పేషెంట్స్​కు అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు
Fish Prasadam
Surya Kala
|

Updated on: Jun 07, 2024 | 12:34 PM

Share

హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం మృగశిరకార్తె ప్రారంభంలో ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చేప మందు చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు బత్తిన కుటుంబీకులు. ఈ నెల 8, 9న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆస్తమాతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలిరానున్నారు. చేప ప్రసాదం కోసం ఇప్పటికే మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కి చేరుకున్నారు ప్రజలు. చేప ప్రసాదానికి భారీగా డిమాండ్ ఉండంతో నిర్వాహకులు స్థానికులకు పలు సూచనలు చేశారు.

చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని బత్తిన కుటుంబీకులు చెప్పారు. చేప మందు కోసం వచ్చే ప్రజల కోసం టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. రెండు రోజుల పాటు.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ మార్గంలో.. 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?