AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం

US Israel attack Iran Live Updates : ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైల్ దాడులు చేశాయి. కౌంటర్‌గా ఇరాన్ 70 క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించగా, ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ మధ్యప్రాచ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న భారత పౌరులకు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.

US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
Middle East Conflict Iran Israel War
Anand T
|

Updated on: Feb 28, 2026 | 3:18 PM

Share

LIVE NEWS & UPDATES

  • 28 Feb 2026 03:20 PM (IST)

    ఇంటర్నేషనల్ ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్

    ప్రయాణికులకు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అడ్వైజర్ జారీ

    ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం

    ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వచ్చేముందే సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచన

  • 28 Feb 2026 03:13 PM (IST)

    ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు

    ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అనేక సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం కాసేపటి క్రితమే ప్రకటించింది. అలాగే ఇరాన్‌లోని ఇరాన్ పాలనకు చెందిన అనేక సైనిక లక్ష్యాలపై కూడా విస్తృత దాడి చేస్తున్నట్టు తెలిపింది.

  • 28 Feb 2026 03:05 PM (IST)

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు

    ఇరాన్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇజ్రాయెల్‌, అమెరికా

    ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ భవనంపై దాడులు

    ఇరాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేత

    భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని..

    అడ్వైజరీ జారీ చేసిన భారత ప్రభుత్వం

    హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం

    ఇరాన్‌లో నిలిచిపోయిన మొబైల్, ఇంటర్నెట్ సేవలు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ భీకరయుద్దం మొదలయ్యింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. కౌంటర్‌గా ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చేస్తునట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. . ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. 30 ప్రాంతాల్లో మిసైల్‌ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్‌ . – ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ అటాక్‌ చేసింది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఈ దాడులకు సింహగర్జన అని పేరు పెట్టింది.

ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల తరువాత ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. బంకర్‌ లోకి ఆయన వెళ్లిపోయారు. — ఇరాన్‌ డిఫెన్స్‌ సిస్టంపైనా ఇజ్రాయెల్‌ దాడులు చేసినట్లు తెలుస్తోంది. డిఫెన్స్‌ సిస్టమ్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌కు పదే పదే హెచ్చరికలు జారీచేస్తూ వచ్చాయి అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు. ఈ దాడుల తరువాత ఇరాన్‌ తన ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది.

ఇరాన్‌ అణ్వాయుధాలను అంతం చేసే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ సెన్యం వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్న నెంబర్‌వన్‌ దేశంగా ఇరాన్‌ మారిందన్నారు. ఇజ్రాయెల్‌, అమెరికా దాడులపై ఇరాన్‌ స్పందించింది. యుద్దం మీరు మొదలుపెట్టారు. ముగింపు మేము పలుకుతాం అంటూ స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది.

ఇరాన్‌పై దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ అప్రమత్తం అయింది. స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయ్. దేశ పౌరులను అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్ సైన్యం  దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. అంతేకాదు ఇజ్రాయెల్‌లోని ఇండియన్‌ ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఎక్కడ ఉన్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని హెచ్చరించింది భారత ఎంబసీ.

మరిన్ని అంతార్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published On - Feb 28,2026 3:04 PM

Follow Us