AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayanam: తాళ పత్రాలపై రామాయణం.. నేటి జనరేషన్ కోసం ఏడు కాండలను క్లుప్తంగా లిఖించిన భక్తుడు

తాళ పత్రాలపై రామాయణాన్ని రచించాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఎల్లయ్య ఏడాది క్రితం తానే స్వయంగా తాటి ఆకులను సేకరించుకుని వాటినీ రామాయణం రాసుకునే విధంగా సిద్దం చేసుకొని మూడు నెలల క్రితం తన లిఖింపు ప్రక్రియ ప్రారంభించారు. స్వయంగా రచయిత అయిన ఎల్లయ్య ఏడు ఖండాలు గల రామాయణాన్ని క్లుప్తంగా తక్కువ నిడివిలో తాటి ఆకులపై లిఖించారు.

Ramayanam: తాళ పత్రాలపై రామాయణం.. నేటి జనరేషన్ కోసం ఏడు కాండలను క్లుప్తంగా లిఖించిన భక్తుడు
Ramayanam
N Narayana Rao
| Edited By: Surya Kala|

Updated on: Jan 30, 2024 | 9:24 AM

Share

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి అయిన తరుణంలో తాళపత్రాల మీద మరోసారి రామాయణం లిఖించాడు ఓ భక్తుడు. వాల్మీకి ని మళ్లీ గుర్తుకు తెచ్చేలా తాళ పత్రాలపై రామాయణం రాసి ప్రత్యేకత చాటుకున్నారు. ఎంతో నియమనిష్ఠతో రామాయణంలోని ఏడు కాండలను తాళ పత్రాలపై లిఖించి హౌరా అనిపించుకుంటున్నారు తెలంగాణ కు చెందిన రామయ్య భక్తుడు బొమ్మరత ఎల్లయ్య.

వాల్మీకి లిఖించిన అది కావ్యం రామాయణం మనుగడలో ఉన్న గొప్ప కావ్యం. మనిషి జీవన శైలికి, కలియుగంలో మానవ ఆలోచనలకు దగ్గర ఉన్న రామాయణ ఘట్టాలు ఎంతో గొప్పవి. అంతటి గొప్ప కావ్యాన్ని తాళ పత్రాలపై లిఖించి తన భక్తిని చాటుకున్నారు మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య అనే భక్తుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య అనే రచయిత సింగరేణి కాలరీస్ లో విధులు నిర్వహించేవారు. నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తరువాత తన చిరకాల కోరిక అయిన రామాయణ రచనపై దృష్టి సారించారు.

తాళ పత్రాలపై రామాయణాన్ని రచించాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఎల్లయ్య ఏడాది క్రితం తానే స్వయంగా తాటి ఆకులను సేకరించుకుని వాటినీ రామాయణం రాసుకునే విధంగా సిద్దం చేసుకొని మూడు నెలల క్రితం తన లిఖింపు ప్రక్రియ ప్రారంభించారు. స్వయంగా రచయిత అయిన ఎల్లయ్య ఏడు ఖండాలు గల రామాయణాన్ని క్లుప్తంగా తక్కువ నిడివిలో తాటి ఆకులపై లిఖించారు.

ఇవి కూడా చదవండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రచయితగా మంచి పేరు ఉన్న యల్లయ్య తన రచనలు వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో నిష్ఠతో తాళ పత్రాలపై రామాయణాన్ని లిఖించి రాముడిపై తన భక్తిని చాటుకున్నారు. ఎప్పుడో క్రీస్తు పూర్వం వాల్మీకి రాసిన రామాయణాన్ని మళ్లీ తను అదే తాళ పత్రాలపై లిఖించడం.. ఇదే సమయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావడం తన అదృష్టమని..  తన జన్మ ధన్యం అయిందని ఏలయ్య భక్తి పారవశ్యంతో పరవశించి పోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే