AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayanam: తాళ పత్రాలపై రామాయణం.. నేటి జనరేషన్ కోసం ఏడు కాండలను క్లుప్తంగా లిఖించిన భక్తుడు

తాళ పత్రాలపై రామాయణాన్ని రచించాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఎల్లయ్య ఏడాది క్రితం తానే స్వయంగా తాటి ఆకులను సేకరించుకుని వాటినీ రామాయణం రాసుకునే విధంగా సిద్దం చేసుకొని మూడు నెలల క్రితం తన లిఖింపు ప్రక్రియ ప్రారంభించారు. స్వయంగా రచయిత అయిన ఎల్లయ్య ఏడు ఖండాలు గల రామాయణాన్ని క్లుప్తంగా తక్కువ నిడివిలో తాటి ఆకులపై లిఖించారు.

Ramayanam: తాళ పత్రాలపై రామాయణం.. నేటి జనరేషన్ కోసం ఏడు కాండలను క్లుప్తంగా లిఖించిన భక్తుడు
Ramayanam
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 30, 2024 | 9:24 AM

Share

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి అయిన తరుణంలో తాళపత్రాల మీద మరోసారి రామాయణం లిఖించాడు ఓ భక్తుడు. వాల్మీకి ని మళ్లీ గుర్తుకు తెచ్చేలా తాళ పత్రాలపై రామాయణం రాసి ప్రత్యేకత చాటుకున్నారు. ఎంతో నియమనిష్ఠతో రామాయణంలోని ఏడు కాండలను తాళ పత్రాలపై లిఖించి హౌరా అనిపించుకుంటున్నారు తెలంగాణ కు చెందిన రామయ్య భక్తుడు బొమ్మరత ఎల్లయ్య.

వాల్మీకి లిఖించిన అది కావ్యం రామాయణం మనుగడలో ఉన్న గొప్ప కావ్యం. మనిషి జీవన శైలికి, కలియుగంలో మానవ ఆలోచనలకు దగ్గర ఉన్న రామాయణ ఘట్టాలు ఎంతో గొప్పవి. అంతటి గొప్ప కావ్యాన్ని తాళ పత్రాలపై లిఖించి తన భక్తిని చాటుకున్నారు మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య అనే భక్తుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య అనే రచయిత సింగరేణి కాలరీస్ లో విధులు నిర్వహించేవారు. నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తరువాత తన చిరకాల కోరిక అయిన రామాయణ రచనపై దృష్టి సారించారు.

తాళ పత్రాలపై రామాయణాన్ని రచించాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఎల్లయ్య ఏడాది క్రితం తానే స్వయంగా తాటి ఆకులను సేకరించుకుని వాటినీ రామాయణం రాసుకునే విధంగా సిద్దం చేసుకొని మూడు నెలల క్రితం తన లిఖింపు ప్రక్రియ ప్రారంభించారు. స్వయంగా రచయిత అయిన ఎల్లయ్య ఏడు ఖండాలు గల రామాయణాన్ని క్లుప్తంగా తక్కువ నిడివిలో తాటి ఆకులపై లిఖించారు.

ఇవి కూడా చదవండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రచయితగా మంచి పేరు ఉన్న యల్లయ్య తన రచనలు వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో నిష్ఠతో తాళ పత్రాలపై రామాయణాన్ని లిఖించి రాముడిపై తన భక్తిని చాటుకున్నారు. ఎప్పుడో క్రీస్తు పూర్వం వాల్మీకి రాసిన రామాయణాన్ని మళ్లీ తను అదే తాళ పత్రాలపై లిఖించడం.. ఇదే సమయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావడం తన అదృష్టమని..  తన జన్మ ధన్యం అయిందని ఏలయ్య భక్తి పారవశ్యంతో పరవశించి పోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వివాహం నుంచి వ్యాపారం వరకు.. శుభ ముహూర్తం వెనుక దాగిన జ్యోతిష్య..
వివాహం నుంచి వ్యాపారం వరకు.. శుభ ముహూర్తం వెనుక దాగిన జ్యోతిష్య..
ఈ వాచ్ స్పృహ తప్పి పడిపోవడానికి 5 నిమిషాల ముందే హెచ్చరిస్తుంది!
ఈ వాచ్ స్పృహ తప్పి పడిపోవడానికి 5 నిమిషాల ముందే హెచ్చరిస్తుంది!
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష తొలి పోస్ట్ వైరల్
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష తొలి పోస్ట్ వైరల్
చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
పరీక్షకు 5 రోజుల ముందే NEET 2026 పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్!
పరీక్షకు 5 రోజుల ముందే NEET 2026 పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్!
దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
నల్లగా మారిన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేసే సూపర్ చిట్కా
నల్లగా మారిన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేసే సూపర్ చిట్కా
కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ?
కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ?
బిర్యానీ ఆకుతో డబ్బు, ఆరోగ్యం, అదృష్టం.. ఈ అద్భుతాలు నిజంగా..
బిర్యానీ ఆకుతో డబ్బు, ఆరోగ్యం, అదృష్టం.. ఈ అద్భుతాలు నిజంగా..
ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్