AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బ్యాలెట్‎పై పిచ్చి గీతలు.. మారిన ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతలు..

వాళ్లంతా విద్యావంతులే.. డిగ్రీ, పీజీ చదివిన ఉన్నత విద్యావంతులు. పట్టభద్రులందరికీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుందని భావిస్తుంటారు. కానీ, ఓ విషయంలో వాళ్ళందరూ ఫెయిలయ్యారు. ఫెయిల్ అయ్యారంటే చదువులో కాదు.. ఓటు వేసే విషయంలో వీళ్లంతా ఫెయిల్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును సక్రమంగా వేయలేకపోవడంతో చెల్లని ఓట్లుగా పోలయ్యాయి. ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు అనేక రకాలుగా అవగాహన కల్పించారు.

Telangana: బ్యాలెట్‎పై పిచ్చి గీతలు.. మారిన ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతలు..
Telangana Mlc Elections
M Revan Reddy
| Edited By: Srikar T|

Updated on: Jun 07, 2024 | 10:16 AM

Share

వాళ్లంతా విద్యావంతులే.. డిగ్రీ, పీజీ చదివిన ఉన్నత విద్యావంతులు. పట్టభద్రులందరికీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుందని భావిస్తుంటారు. కానీ, ఓ విషయంలో వాళ్ళందరూ ఫెయిలయ్యారు. ఫెయిల్ అయ్యారంటే చదువులో కాదు.. ఓటు వేసే విషయంలో వీళ్లంతా ఫెయిల్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును సక్రమంగా వేయలేకపోవడంతో చెల్లని ఓట్లుగా పోలయ్యాయి. ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు అనేక రకాలుగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓటు వేసే విషయంలో ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పట్టభద్రులు సరిగా ఓటువేయలేకపోయారు. గ్రాడ్యుయేట్లు ఓట్లు ఎలా వేయాలనే అంశంపై అటు ఎన్నికల కమిషన్ అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. పోటీచేసిన అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు.

ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు..

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఏకంగా 25,877 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన అభ్యర్థులతో సమానంగా చెల్లని ఓట్లే ఐదో స్థానంలో ఉన్నాయి. పట్టభద్రులకు ఓటు వేయడంలో ఫెయిల్ కావడంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థుల గెలుపు అవకాశాలకు దూరమయ్యారు.

గెలుపు అవకాశాలను దూరం చేసిన చెల్లని ఓట్లు..

ఈ నియోజకవర్గంలో 46,300 పట్టభద్రుల ఓట్లు ఉండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఏకంగా 25,877 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) 1,22,813 ఓట్లు, రాకేశ్ రెడ్డి(బీఆర్ఎస్) 1,04,248 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ) 43,313 ఓట్లు, అశోక్ కుమార్ (స్వతంత్ర) 29,697 ఓట్లు రాగా ఐదో స్థానంలో 25,877 చెల్లని ఓట్లు వచ్చాయి. ప్రధాన అభ్యర్థులైన ప్రేమేందర్ రెడ్డి, అశోక్ కుమార్‎కు వచ్చిన ఓట్లతో సమానంగా చెల్లని ఓట్లు బయట పడటం ఎన్నికల అధికారులను విస్మయానికి గురిచేసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు వచ్చిన మెజారిటీ 18,565 ఓట్లు ఉండగా, అంతకంటే ఎక్కువ సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండడంతో ప్రధాన అభ్యర్థులకు మొదటి ప్రయారిటీ ఓట్ల ద్వారా విజయావకాశాలు దూరమయ్యాయి.

ఇవి కూడా చదవండి

పట్టభద్రుల అవగాహన రాహిత్యం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బ్యాలట్ పేపర్లపై పిచ్చి రాతలు రాశారు. విద్యావంతులైన పట్టభద్రుల ఓటర్లు.. పొరపాట్లు, అవగాహన రాహిత్యంతో వేలాది ఓట్లు చెల్లకుండా పోయాయి. చాలామంది పట్టబద్రులు బ్యాలెట్ పేపర్‎పై అంకెలు వేయాల్సింది పోయి.. × గుర్తు పెట్టడం, క్రాస్ గుర్తులు, టిక్ మార్కులు పెట్టడం, జై కాంగ్రెస్, జై కేసీఆర్, ఎమ్మెల్సీలుగా ఈ అభ్యర్థులు పనికిరారంటూ రాయడం వంటివి చేశారు. ఇంకొందరు బ్యాలెట్ పేపర్లపై కొందరైతే లవ్ గుర్తులు, బ్యాలెట్ పేపర్ వెనకాల ఫోన్ నంబర్లు వేయడంతో చెల్లుబాటు కాకుండా పోయాయి. మరికొందరైతే తమ సంతకాలను పెట్టారు. నేతలు, అభ్యర్థులపై అభిమానం ఉంటే ఓటు వేయాలి కానీ ఇలా గుర్తులు, రాతలతో చెల్లని ఓటుగా చేయడం పట్ల అధికారులు, రాజకీయ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ల అజ్ఞానం వల్ల తాము నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు అవకాశాలను దూరం చేశారని, చెల్లని ఓట్ల వల్ల సెకండ్ ప్రయారిటీ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..