నెట్టింట సీరియల్ బ్యూటీ గ్లామర్ రచ్చ.. అందంతో కట్టిపడేస్తున్న లాస్య

Rajitha Chanti

Pic credit - Instagram

08 February 2026

 ప్రస్తుతం హీరోహీరోయిన్లతోపాటు సీరియల్ తారలకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే నెట్టింట సీరియల్ ముద్దుగుమ్మలు రచ్చ చేస్తున్నారు.

 సీరియల్లో నటించే చాలా మంది బ్యూటీలు ఇప్పుడు హీరోయిన్లకు మించిన అందంతో కట్టిపడేస్తున్నారు. తాజాగా నటి లాస్య ఫోటోస్ వైరలవుతున్నాయి.

మల్లి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. స్మాల్ స్క్రీన్ పై పద్దతికి చీరకట్టులో లాస్య చాలా అందంగా కనిపిస్తుంది. కానీ నెట్టింట వేరు. 

 ఈ అమ్మడు మోడ్రన్ డ్రెస్సులలో అందంతోపాటు గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది.  ఈ బ్యూటీ ఫోటోస్ చూసి అడియన్స్ షాకవుతున్నారు.

తాజాగా ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేసింది. అదిరిపోయే డ్రెస్సులో వారెవ్వా అనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇన్ స్టాలో ఈ ముద్దుగుమ్మకు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది.

లాస్య మన తెలుగింటి పిల్ల. విశాఖపట్నంకు చెందిన ఈ అమ్మడు.. మొదటి సీరియల్ లోనే అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది .

మల్లి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలు దొచుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు లక్ష్మీ నివాసం సీరియల్లో జాను పాత్రలో నటిస్తుంది లాస్య.